నారదా! సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారంకోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణువేడారు. బ్రాహ్మణక్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్దానాలు వీరికి అందడంలేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యానమగ్నుడై శ్రీకృష్ణపరమాత్మను శరణు శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతిరూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్తమయ్యింది. వరం కోరుకోమంది.
జగన్మాతా! దయచేసి నువ్వు అగ్నికి దాహకశక్తిగా ఆవతరించు. నువ్వులేనిదే అగ్ని దేనినీ దహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వేల్చేటప్పుడు ప్రతిమంత్రానికీ చివర నీపేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నిశక్తితో అగ్నిదగ్దమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్నతల్లివి. అగ్నికి ఇల్లాలివై శోభ - శక్తి కలిగించు.
చతుర్వదనా! నేను శ్రీకృష్ణపరమాత్మను కోరి తపన్సు చేస్తున్నమాట నీకు తెలుసుగదా! మరి ఈ అభ్యర్థన ఎమిటి? నువ్వూ నేనూ శివుడూ ఆదిశేషుడూ ధర్ముడూ గణేశుడూ అందరం మన విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే అది అంతా ఆ పరాత్పరుడి ఆజ్ఞయేకదా! ఆంతటివాడికి ఇల్లాలిని కాదలిచి ఇప్పుడు దేవతలకోసమని అగ్నికి పరిచర్యలు చెయ్యనా! ఎలాగ? ఆ కృష్ణపరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలాఉంటే అలా చేస్తాను - అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపన్సు కొనసాగించింది. ఒంటికాలిమీద నిలిచి లక్షసంవత్సరాలు చేసింది. శ్రీ కృష్ణపరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహరరూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశయై మూర్చపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలిసిపోయిన ఆ కృశాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు.
ప్రకృతీ! నగ్నజిత్తు కూతురుగా నాగ్నజితి పేరుతో నువ్వు నాకు ఇల్లాలివవుతావు. ఆప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కళాంశగా వారాహివవుదువుగాని. అప్పుడూ నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహికశక్తివై స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు. నీతో ఆనందిస్తాడు - అని చెప్పేసి అంతర్ధానం చెందాడు.
ఆంతలోకీ వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదోక్తంగా జగదంబికను ఆ ప్రకృతిదేవిని ధ్యానించాడు. పూజించాడు. స్తుతించాడు. మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు.
ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో నూరేళ్ళపాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. పన్నెండు దివ్యసంవత్సరాలు మోసి దక్తిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని అని ముగ్గురు పుత్రులను ప్రసవించింది.
ఋషులూ మునులూ బ్రాహ్మణులూ క్షత్రియులూ స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి హవిర్ధనాలు చేశారు. స్వాహా శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం వేదహీనుడైన విప్రుడు పతిసేవా విహీనయైన స్త్రీ విద్యావిహీనుడైన పురుషుడు ఫలశాఖా విహీనమైన వృక్షం ఎలా నింద్యాలూ నిష్ప్రయోజనాలో అలాగ స్వాహాశబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది భుక్తి ముక్తిప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారదా! ఇంకా ఏమి కావాలో అడుగు. అని నారాయణమహర్షి విరమించాడు.
మహర్షీ! అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావుకదా! వాటిని మరికాస్త వివరంగా తెలియజేసి పుణ్యంకట్టుకో - అన్నాడు నారదుడు.
బ్రహ్మపుత్రా! సావధానంగా ఆలకించు. ఏ యజ్ఞం చెయ్యాలన్నా మున్ముందుగా స్వాహాదేవిని, సాలగ్రామంలోగానీ కలశంలోగానీ ఆవాహనచేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞమంత్రాలకు ప్రధానాంగం మంత్రసిద్ధిస్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు. సఫలం కాదు.
ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలూ చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది. అభీష్టాలు తీరుస్తుంది.
స్వాహా వహ్నిప్రియా వహ్నిజాయా సంతోషకారిణీ ।
శక్తిః క్రియా కాలదాత్రీ పరిపాకకరీ ధ్రువా ॥ 01 ॥
గతిః స్పదా వరాణాం చ దాహికా దహనక్షమా ।
సంసారసారరూపా చ ఘోరసంసారతారిణీ ॥ 02 ॥
దేవజీవవరూపా చ దేవపోషణకారిణీ ।
ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలూ చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది. అభీష్టాలు తీరుస్తుంది.
స్వాహా వహ్నిప్రియా వహ్నిజాయా సంతోషకారిణీ ।
శక్తిః క్రియా కాలదాత్రీ పరిపాకకరీ ధ్రువా ॥ 01 ॥
గతిః స్పదా వరాణాం చ దాహికా దహనక్షమా ।
సంసారసారరూపా చ ఘోరసంసారతారిణీ ॥ 02 ॥
దేవజీవవరూపా చ దేవపోషణకారిణీ ।
షోడశైతాని నామాని యః పఠేద్భక్తిసంయుతః ॥ 3 ॥
సర్వసిద్ధిర్భవేత్తస్య ఇహ లోకే పరత్ర చ ॥ 04 ॥
నారదా! ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశనామావళి. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియాకౌశలం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులవుతారు. భార్యాదూరుడు భార్యా సహితుడవుతాడు. దంపతులు సుఖసంతోషాలతో వర్థిల్లుతారు.
No comments:
Post a Comment