పద్మనాభుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద గల కూరిమితో ఇలా చెప్పాడు. ఒకరోజు యదురాజు దగ్గరకు ఎక్కడనుండో ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక అన్ని దిక్కులూ తిరిగేవాడు. ఎప్పుడూ సంతృప్తితో ఉంటాడు. ఈశ్వరుడివేషం ధరించి ఉన్నాడు. యదురాజు ఆ యోగిని ఎక్కడనుండి వచ్చావని అడిగాడు. అందుకా యోగి స్పష్టంగా ఇలా అన్నాడు.
అవధూత ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నేర్పరులైన యోగ్యులు ఇరవైనాలుగుమంది నాకు గురువులు అయినారు. వారివల్ల నేను విజ్ఞానినైనాను”.
(అవధూత - వర్ణాశ్రమధర్మాలను వదిలిపెట్టి, శీతోష్ణపరిస్థితులను తట్టుకొంటూ, దేహసంస్కారాలు లేకుండా కేవలం బ్రహ్మనిష్ఠతో మెలిగేవాడు అవధూత).
అంత యాదవరాజు లోభం మోహం మొదలైన వాటిని వదిలిపెట్టి శరీరి ఏ రకంగా విష్ణువును చేరవచ్చునో తెలుపుమనగా అవధూత ఇలా అన్నాడు.
సత్ప్రవర్తనగల ఓ రాజా! పరుల సొమ్మును, పరుల భార్యలను కోరకుండా; ఇతరులను నిందించకుండా, ఇతరుల వస్తువులమీద అభిలాష లేకుండా; ముసలితనంవల్ల రోగాలు రాకముందే; శరీరం వణకకముందే; కంఠంలో కఫం చేరకముందే; శక్తియుక్తులు సన్నగిల్లకముందే; దృఢమైన భక్తిభావంతో దానవాంతకుడైన శ్రీకృష్ణునిపాదపద్మాలను భజిస్తూ తరగని ఆనందాన్ని ప్రతిరోజూ ఎవడు పొందుతాడో అలాంటివాడు భవబంధాలనుండి విముక్తుడు అవుతాడు.
భార్యాపుత్రధన ధాన్యాదులలో పెక్కువిధాల మక్కువను పెంచుకొన్న మనుష్యుడు మిక్కిలి భయంకరమైన వియోగం వల్ల కలిగిన దుఃఖంతో తెలివిని పోగొట్టుకొని చిక్కువడి, నీతి వివేకాలు లేక మానసిక భారంతో నశించి మగపావురం వలె నిజంగా పోతాడు (మరణిస్తాడు).
దీనికొక ఇతిహాసం(కథ) ఉంది. విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక గూడు నిర్మించుకొని పరస్పర మోహంతో ఉన్నది. కొంతకాలానికి ఆ పావురందంపతులకు సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలు అపరిమితంగా అటూఇటూ తిరుగుతూ ఉండగా సంతోషంతో, భోగానుభవంతో కొన్ని నెలలు గడిచాయి.
ఇలా ఉండగా కాలగతి వలన ఒక బోయవాడు వచ్చి వలలు వేశాడు. ఆ వలలలో ఆడపావురం, పిల్లలూ తగుల్కొన్నాయి. మగపావురం ధైర్యం కోల్పోయి భార్యాబిడ్డలమీద గల ప్రేమాతిశయంతో తానుకూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించిపోయింది.
కాబట్టి దేనియందూ ఎక్కువ మోహం పనికిరాదు. కనుక యోగీంద్రులైనవారు ఎప్పుడూ విష్ణువును ధ్యానిస్తూ భూమి, గాలి, ఆకాశం, నీళ్లు, అగ్ని చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, చేప, ముంగిస, లకుముకిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలుచేసేవాడు, సాలెపురుగు, కందిరీగ మొదలైన వాటి గుణగణాలు తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు.
భూమి మొదలుగా శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ 'నాకు తెలియాలి. నిర్మలమైన బుద్ధితో వీటినిగురించి తెలియజేయ'మని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినయవంతుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు వెంటనే చెప్పాడు.
ఈ విధంగా భూమివల్ల సహనం, వాయువు(గాలి) వల్ల గొప్పపరోపకారం, ఆకాశంవల్ల కాలం సృజించిన గుణాలతో సాంగత్యం లేకపోవడం. నీటివల్ల ఎప్పుడూ శుచిగా ఉండడం. అగ్నివల్ల నిర్మలంగా ఉండడం, చంద్ర సూర్యులవల్ల వృద్ధి క్షయాలందు సమభావం కల్గి ఉండడం, పావురంవల్ల భార్యాబిడ్డల మీద ప్రేమ, కొండచిలువవల్ల ఇష్టంగా తిరుగుతూ అందిన ఆహారాన్నిమాత్రమే గ్రహించడం, సముద్రంవల్ల ఉత్సాహరోషాలు, మిడుతవల్ల యథాశక్తి అనుకూలకర్మలను ఆచరించడం, తుమ్మెదవల్ల సారంమాత్రమే గ్రహించడం, ఏనుగువల్ల స్త్రీ విముఖత, తేనెటీగవల్ల కూడబెట్టుకొనే గుణం, లేడివల్ల విచారపరత్వం, చేపవల్ల జిహ్వాచపలత, ముంగిసవల్ల దొరికినదానితో తృప్తిపడడం, లకుముకిపిట్టవల్ల మోహత్యాగం, బాలునివల్ల విచారం విడిచి పెట్టడం. బాలికవల్ల సాంగత్యం విడిచిపెట్టడం, బాణాలుచేసేవాడివల్ల ఏకాగ్రత, పామువల్ల పరుల ఇంట నివసించడం, సాలెపురుగువల్ల సంసారబంధంలో చిక్కకుండడం, కందిరీగవల్ల లక్ష్యజ్ఞానం విడువకుండా ఉండడం అనే వీటి గుణాలను తెలుసుకోవాలి.
ఈ గుణాలు గ్రహించి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలనే ఆరుశత్రువులను జయించి; ముసలితనం, మరణం రాకుండా వాయువును(గాలిని) వశంచేసుకొని శరీరం పవిత్రంగా ఉండడానికి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలనే ఆరు కర్మలమీద ఆసక్తి గలవాడై పట్టణాలను, గ్రామాలను, నగరాలను వదలి; కొండలయందు, అడవులయందు తిరుగుతూ; దేహం నిలవడానికి కావలసిన కొద్దిపాటి ఆహారం గ్రహిస్తూ సంతోషం, దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్ని మోహాన్ని వదిలిపెట్టి; ఇంద్రియాలను జయించి; నేను తప్ప మరొకటి తెలియక ఆత్మనిష్ఠతో పవిత్రమైన మనస్సు కలిగిన యోగి నాలో కలుస్తాడు కాబట్టి...
మోహవశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకొని క్రౌర్యానికి వశుడైన మనుష్యుడు ఎప్పుడూ దైన్యంతో దేహాన్ని శ్రమకు గురిచేస్తాడు.
దీనికి నిదర్శనంగా ఒక ప్రాచీనమైన కథ ఉంది. శ్రద్ధతో విను. మిథిలానగరంలో పింగళ అనే ఒక వేశ్యారత్నం ఉంది. ఆమెవలన నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. అది ఎలాగంటే - ఆమె డబ్బుమీద ఆశతో తన భర్తను మోసగించి ధనమిచ్చే మరొకనిని చేరదీసింది. వాడిని తన ఇంటిలోనికి తీసుకొనిపోయి రాత్రంతా నిద్రలేకుండా గడిపింది. పట్టణంలోనూ, బజారులలోనూ తిరుగుతూ నిద్రలేకపోవడంవల్ల నీరసపడింది. ధనవ్యామోహంలో పడి తిరిగి తిరిగి బడలిక చెందింది.
భూమి మొదలుగా శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ 'నాకు తెలియాలి. నిర్మలమైన బుద్ధితో వీటినిగురించి తెలియజేయ'మని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినయవంతుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు వెంటనే చెప్పాడు.
ఈ విధంగా భూమివల్ల సహనం, వాయువు(గాలి) వల్ల గొప్పపరోపకారం, ఆకాశంవల్ల కాలం సృజించిన గుణాలతో సాంగత్యం లేకపోవడం. నీటివల్ల ఎప్పుడూ శుచిగా ఉండడం. అగ్నివల్ల నిర్మలంగా ఉండడం, చంద్ర సూర్యులవల్ల వృద్ధి క్షయాలందు సమభావం కల్గి ఉండడం, పావురంవల్ల భార్యాబిడ్డల మీద ప్రేమ, కొండచిలువవల్ల ఇష్టంగా తిరుగుతూ అందిన ఆహారాన్నిమాత్రమే గ్రహించడం, సముద్రంవల్ల ఉత్సాహరోషాలు, మిడుతవల్ల యథాశక్తి అనుకూలకర్మలను ఆచరించడం, తుమ్మెదవల్ల సారంమాత్రమే గ్రహించడం, ఏనుగువల్ల స్త్రీ విముఖత, తేనెటీగవల్ల కూడబెట్టుకొనే గుణం, లేడివల్ల విచారపరత్వం, చేపవల్ల జిహ్వాచపలత, ముంగిసవల్ల దొరికినదానితో తృప్తిపడడం, లకుముకిపిట్టవల్ల మోహత్యాగం, బాలునివల్ల విచారం విడిచి పెట్టడం. బాలికవల్ల సాంగత్యం విడిచిపెట్టడం, బాణాలుచేసేవాడివల్ల ఏకాగ్రత, పామువల్ల పరుల ఇంట నివసించడం, సాలెపురుగువల్ల సంసారబంధంలో చిక్కకుండడం, కందిరీగవల్ల లక్ష్యజ్ఞానం విడువకుండా ఉండడం అనే వీటి గుణాలను తెలుసుకోవాలి.
ఈ గుణాలు గ్రహించి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలనే ఆరుశత్రువులను జయించి; ముసలితనం, మరణం రాకుండా వాయువును(గాలిని) వశంచేసుకొని శరీరం పవిత్రంగా ఉండడానికి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలనే ఆరు కర్మలమీద ఆసక్తి గలవాడై పట్టణాలను, గ్రామాలను, నగరాలను వదలి; కొండలయందు, అడవులయందు తిరుగుతూ; దేహం నిలవడానికి కావలసిన కొద్దిపాటి ఆహారం గ్రహిస్తూ సంతోషం, దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్ని మోహాన్ని వదిలిపెట్టి; ఇంద్రియాలను జయించి; నేను తప్ప మరొకటి తెలియక ఆత్మనిష్ఠతో పవిత్రమైన మనస్సు కలిగిన యోగి నాలో కలుస్తాడు కాబట్టి...
మోహవశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకొని క్రౌర్యానికి వశుడైన మనుష్యుడు ఎప్పుడూ దైన్యంతో దేహాన్ని శ్రమకు గురిచేస్తాడు.
దీనికి నిదర్శనంగా ఒక ప్రాచీనమైన కథ ఉంది. శ్రద్ధతో విను. మిథిలానగరంలో పింగళ అనే ఒక వేశ్యారత్నం ఉంది. ఆమెవలన నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. అది ఎలాగంటే - ఆమె డబ్బుమీద ఆశతో తన భర్తను మోసగించి ధనమిచ్చే మరొకనిని చేరదీసింది. వాడిని తన ఇంటిలోనికి తీసుకొనిపోయి రాత్రంతా నిద్రలేకుండా గడిపింది. పట్టణంలోనూ, బజారులలోనూ తిరుగుతూ నిద్రలేకపోవడంవల్ల నీరసపడింది. ధనవ్యామోహంలో పడి తిరిగి తిరిగి బడలిక చెందింది.
కడకు తనను సుఖపెట్టువాడే భర్త అని ఆలోచించింది. శ్రీమన్నారాయణుని గురించి ఇలా చింతిస్తే ఆయన మోక్షం ప్రసాదిస్తాడుగదా అని భావించింది. తన శయనాగారం, ఇతర సంపదలు త్యజించింది. వెంటనే వాసుదేవుని పాదపద్మాలకు నమస్కరించాలనే కోరిక కలదై శరీరం మెరుపువలె చంచలమైనదని, అశాశ్వతమైనదని నిశ్చయించుకొని పరతత్త్వంపై మనస్సును లగ్నంచేసి మోక్షం పొందింది. అని తెలిపి
పాపరహితుడా! శరీరం స్థిరమైనదికాదని, మోహాన్ని విడిచి మానవుడు సిద్ధిపొందిన మునివలె ప్రవర్తిస్తూ, ఇల్లువిడిచి మోక్షసంపదను పొందుతాడు.
ఇంకా ఒక ప్రత్యేకతగల పురాతనపుణ్యకథ చెపుతాను విను. “కనకావతీపురంలో ఒక బ్రాహ్మణుని కూతురైన కన్యకారత్నం ఉంది. ఆమె మణిమయకంకణాలు ధరించి ఆనందంతో చుట్టాలకు అన్నం వండడానికి వరిధాన్యం దంచుతన్నది. దంచేటప్పుడు రోకలి బరువుతో చేతులలోని కంకణాలు ధ్వనిస్తూ మోగుతున్నాయి. ఆ ధ్వనిని అసహ్యించుకొని ఆ పరమపతివ్రత ఆ కంకణాలనన్నింటిని తీసివేసి ఒక్క కంకణాన్ని మాత్రమే ఉంచుకొన్నది.
పాపరహితుడా! శరీరం స్థిరమైనదికాదని, మోహాన్ని విడిచి మానవుడు సిద్ధిపొందిన మునివలె ప్రవర్తిస్తూ, ఇల్లువిడిచి మోక్షసంపదను పొందుతాడు.
ఇంకా ఒక ప్రత్యేకతగల పురాతనపుణ్యకథ చెపుతాను విను. “కనకావతీపురంలో ఒక బ్రాహ్మణుని కూతురైన కన్యకారత్నం ఉంది. ఆమె మణిమయకంకణాలు ధరించి ఆనందంతో చుట్టాలకు అన్నం వండడానికి వరిధాన్యం దంచుతన్నది. దంచేటప్పుడు రోకలి బరువుతో చేతులలోని కంకణాలు ధ్వనిస్తూ మోగుతున్నాయి. ఆ ధ్వనిని అసహ్యించుకొని ఆ పరమపతివ్రత ఆ కంకణాలనన్నింటిని తీసివేసి ఒక్క కంకణాన్ని మాత్రమే ఉంచుకొన్నది.
అందుచేత తొందరపడక భగవత్పరమైన, అనన్య మనస్సుతో నిర్మలమనస్కులై నరులు మోక్షం పొందుతారు. కాబట్టి అజ్ఞానం, జ్డానం నేను కల్పించిన మాయ అని తెలిసి, పశువులు వెళ్లే మార్గంలో పోకుండా ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, సిరి, వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరులవలె సుఖం కోరకుండా ఉండేవాళ్లు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయగా తెలుసుకో” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు.
అప్పుడతడు “దేవా! నీ రూపాన్ని ఎలా దర్శించవచ్చు” నని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడిలా అన్నాడు. “భక్తి భావనాపరుడై, దయాపరుడై, మితంగా మాట్లాడుతూ, అబద్దాలాడకుండా, చేసే కర్మలన్నీ నాకు అర్పించేవాడు భాగవతుడు అనబడతాడు.
నా కథలు, నా జననం, నా పనులూ వింటూ నా దాసులైన భాగవతులను ఇంటికి తీసుకొని వెళ్లి, వాళ్లను స్నానం, పూజ, భోజనం, శయనం, ఆసనం మొదలైన సపర్యలచేత సంతోషింపజేసిన వాడయినా భాగవతుడు అనబడతాడు. ఇలా ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం ఇదేవిధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో ఉంటాడు.
అదీగాక శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులూ, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైన భాగవతులూ శాస్త్రాచారాలు ప్రేరేపించడంచేతనే కాకుండా విశేషించిన భక్తితో, ఏమరపాటు రాకుండా లక్ష్మీసమేతుడను, శంఖ చక్ర గదా శార్ఙ్గాదులతో కూడినవాడను అయిన నన్ను గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ఎప్పుడూ ధ్యానిస్తూ తెలుసుకొన్నారు.
అదీగాక శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులూ, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైన భాగవతులూ శాస్త్రాచారాలు ప్రేరేపించడంచేతనే కాకుండా విశేషించిన భక్తితో, ఏమరపాటు రాకుండా లక్ష్మీసమేతుడను, శంఖ చక్ర గదా శార్ఙ్గాదులతో కూడినవాడను అయిన నన్ను గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ఎప్పుడూ ధ్యానిస్తూ తెలుసుకొన్నారు.
మధురాపురానికి బలరామునితో కలసి నేను వెళ్లినప్పుడు గోపికలు ఓపిక లేకే (విరహాన్ని భరించలేక) భక్తియోగంతో నన్నే ధ్యానించి ముక్తి పొందారు. ఇదే భక్తియోగ పద్ధతి అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. చెప్పగా -
భూపతివైన శ్రీకృష్ణా! ఉదాత్తచరిత్రా! ధ్యానం ఎలా నిలుస్తుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? దాని విషయమంతా వివరంగా నాకు తెలియజేయుమయ్యా!
అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. కొయ్యనడుమ అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా అన్ని శరీరాల్లోనూ ఛేదింప వీలుకాని, దహింప వీలుకాని, ఎండింప వీలుకాని జీవుడు నివసిస్తూ ఉంటాడు.
భూపతివైన శ్రీకృష్ణా! ఉదాత్తచరిత్రా! ధ్యానం ఎలా నిలుస్తుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? దాని విషయమంతా వివరంగా నాకు తెలియజేయుమయ్యా!
అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. కొయ్యనడుమ అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా అన్ని శరీరాల్లోనూ ఛేదింప వీలుకాని, దహింప వీలుకాని, ఎండింప వీలుకాని జీవుడు నివసిస్తూ ఉంటాడు.
ఆ మాట విన్న ఉద్ధవుడు హరితో ఇలా అన్నాడు. 'సనకుడు, సనందుడు మొదలైన యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిది?' చెప్పుమని కోరగా శ్రీకృష్ణుడిలా అన్నాడు.
'సనకాదులు మొదట ఈ విషయం బ్రహ్మను అడిగారు. బ్రహ్మ తనకు కూడా తెలియదన్నాడు. దానికి వాళ్లు ఆశ్చర్యపడుతుంటే నేనా సమయంలో హంసరూపం ధరించి వాళ్లకు చెప్పిన విధం వినుము.
పంచేంద్రియాలకు కనిపించే పదార్ధం అనిత్యం(అశాశ్వతం) నిత్యమైంది బ్రహ్మం మాత్రమే. జీవుడు తన కర్మల వల్ల పొందిన శరీరంతో సంసారంలో మమకారాన్ని వదిలిపెట్టి నిశ్చలమైన జ్ఞానంతో నా లోకమైన వైకుంఠం చేరుతాడు. కలలో దొరికే పదార్ధం నిజం కానట్లుగా కర్మానుభవం అయినంతవరకు శరీరం ఉంటుంది. అని సాంఖ్యయోగంలో సనకాదులకు తెలిపితే విని బ్రహ్మ మొదలైన దేవతలు తెలుసుకొన్నారు.
అది వాళ్ల వల్ల భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి నీవు కూడా దానిని తెలుసుకొని పుణ్యాశ్రమాలకు వెళ్లు. నాయందు భక్తి కలవాడు, ఆసక్తి కలవాడు అయిన వాని పాదధూళిని తన శరీరానికి తాకించుకొనేవాడు; శంఖచక్రాదిముద్రలు ధరించిన వాళ్లకు, శ్రీ హరిదివ్యనామాలను (ఊర్ధ్వపుండ్రాలను) ధరించినవాళ్లకు అన్నమూ, నీళ్లూ ఇచ్చేవాడు; వాసుదేవునిభక్తులను చూచి సంతోషించేవాడు భాగవతుడు.
అన్ని సాంగత్యాలను వదిలిపెట్టి అన్యం తెలియక నన్నే తలచే మానవుడికి భుక్తినీ, ముక్తినీ ఇస్తాను” అని ఆనతీయగా ఉద్ధవుడు ధ్యానమార్గస్వరూపాన్ని తెలుపుమన్నాడు.
శ్రీహరి ఇలా చెప్పాడు. ఏకాగ్రచిత్తులై కరకమలాలు రెండు తొడలపై పెట్టి ముక్కుకొనపై దృష్టి నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయగతుని గావించి, పదునెనిమిది విధాలైన ధారణా యోగసిద్దులను తెలిసికొని, వాటిలో అణిమ మున్నగు వాటిని ముఖ్యసిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలోచేర్చి, ఆత్మను ఆత్మతో లగ్నంచేసి బ్రహ్మపదాన్ని పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్ను పొందుతారు.
పూర్వం పాండురాజు కొడుకైన అర్జునుడు యుద్ధరంగంలో విషణ్ణుడై ఇలాగే అడిగితే అతనికి నేను చెప్పిన విధం నీకు తెలియజేస్తాను. చరాచరాత్మకమైన లోకమంతా నారూపంగా భావించి, భూతాలలో ఆధారభూతం; సూక్ష్మాలలో జీవుడు; జయింపరాని వాటిలో మనస్సు; దేవతలలో బ్రహ్మ వసువులలో అగ్ని, ఆదిత్యులలో(దేవతలలో) విష్ణువు; రుద్రులలో శివుడు; బ్రహ్మలలో భృగువు; ఋషులలో నారదుడు; ఆవులలో కామధేనువు; సిద్ధులలో కపిలుడు; రాక్షసులలో ప్రహ్లాదుడు; గ్రహాలలో(నక్షత్రాలలో) చంద్రుడు; ఏనుగులలో ఐరావతం; గుర్రాలలో ఉచ్చైశ్శ్రవం; సర్పాలలో వాసుకి; జంతువులలో సింహం; ఆశ్రమాలలో గృహస్థాశ్రమం; అక్షరాలలో ఓంకారం; నదులలో గంగ; సముద్రాలలో పాలసముద్రం; ఆయుధాలలో విల్లు; కొండలలో మేరుపర్వతం; చెట్లలో అశ్వత్థం(రావిచెట్టు); మూలికలలో యవలు; యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం; వ్రతాలలో అహింసావ్రతం; యోగాలలో ఆత్మయోగం; స్త్రీలలో శతరూప; వాక్కులలో సత్యవాక్కు, ఋతువులలో వసంత ఋతువు; మాసాలలో మార్గశిరం; నక్షత్రాలలో అభిజిత్తు; యుగాలలో కృతయుగం; భగవంతుని రూపాలలో వాసుదేవుడు; యక్షులలో కుబేరుడు; కోతులలో ఆంజనేయుడు; రత్నాలలో పద్మరాగం, దానాలలో అన్నదానం; తిథులలో ఏకాదశి; నరులలో వైష్ణవుడై భాగవతుడిలా ప్రవర్తించేవాడు ఇవన్నీ నా విభూతులుగా తెలుసుకో' అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా మళ్లీ ఉద్ధవుడిలా అన్నాడు.
పద్మనాభా! కమలనయనా! వర్ణాలు, ఆశ్రమాలు, వాటిధర్మాలు నిర్ణయించి, చెవులకు ఇంపుగా ఆనతిస్తే నేడు వింటాను.
అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడు నాలుగువర్ణాల పుట్టుకా, నాలుగు ఆశ్రమాలకు తగిన పనులూ, నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలూ, ప్రవర్తించడానికి, నివర్తించడానికి కారణాలైన పురాణాలూ, ఇతిహాసాలూ, శాస్త్రాలూ, వైరాగ్యానికి సంబంధించిన విజ్ఞానాలూ మొదలైనవన్నీ తెలిపాడు.
పద్మనాభా! కమలనయనా! వర్ణాలు, ఆశ్రమాలు, వాటిధర్మాలు నిర్ణయించి, చెవులకు ఇంపుగా ఆనతిస్తే నేడు వింటాను.
అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడు నాలుగువర్ణాల పుట్టుకా, నాలుగు ఆశ్రమాలకు తగిన పనులూ, నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలూ, ప్రవర్తించడానికి, నివర్తించడానికి కారణాలైన పురాణాలూ, ఇతిహాసాలూ, శాస్త్రాలూ, వైరాగ్యానికి సంబంధించిన విజ్ఞానాలూ మొదలైనవన్నీ తెలిపాడు.
'అన్నిధర్మాలను వదిలిపెట్టి నన్నొక్కడినే శరణుపొందు' అనే ఉపనిషత్తుల్యమైన భగవద్గీతావచనం చొప్పున నాయందు మనస్సు పెట్టి ఉండేవాడు నేనే నని చెప్పబడుతాడు. పలురకాల వాదాలెందుకు? దేనిమీదా మనస్సు లగ్నం కానీక నా మీదనే మనస్సు కలిగి నడచుకో అని చెప్పగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.
(వచనంలో ఈ ప్రతిపాదింపబడిన అతి సులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతి ముక్తికి హేతువులుగా చెప్పబడడంవల్ల పాండిత్యం లేనివారు, గొప్పశాస్త్రాలు చదువలేనివారు కూడా ముక్తికోసం దిగులు చెందవలసిన అవసరంలేదని, నిర్మలమైన దైవభక్తి ఉంటే చాలునని తెలుస్తుంది.)
బ్రహ్మకు తండ్రియైనవాడా! భక్తులు నమస్కరించే పాదద్వంద్వం కలవాడా! శ్రీకృష్ణా! నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పావు. ఇంకా తెలుసుకోవలసిన వాటినిగురించి చెప్పు. ఉపాయంతో ప్రవర్తిస్తాను.
అని ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. ఉద్ధవా! నీ ప్రశ్నలు క్లిష్టమైనవి. అయినా చెపుతాను విను. నియమాలూ, శమదమాలూ మొదలైనవి ఏవి? తపమనగా నేమి? సుఖదుఃఖాలూ, స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు ఎట్టివాడు? ఈశ్వరుడంటే ఎవరు? అని నీవు నన్నడిగిన విషయాలన్నిటినీ వేరువేరుగా వివరిస్తాను.
మౌనవ్రతమూ, ఓర్పూ, జపమూ, తపమూ, అతిథులను సత్కరించడమూ, పరహితమూ, దొంగతనమూ మొదలైనవి లేకుండుట అనే ఇలాంటివి నియమాలు అనబడతాయి.
(వచనంలో ఈ ప్రతిపాదింపబడిన అతి సులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతి ముక్తికి హేతువులుగా చెప్పబడడంవల్ల పాండిత్యం లేనివారు, గొప్పశాస్త్రాలు చదువలేనివారు కూడా ముక్తికోసం దిగులు చెందవలసిన అవసరంలేదని, నిర్మలమైన దైవభక్తి ఉంటే చాలునని తెలుస్తుంది.)
బ్రహ్మకు తండ్రియైనవాడా! భక్తులు నమస్కరించే పాదద్వంద్వం కలవాడా! శ్రీకృష్ణా! నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పావు. ఇంకా తెలుసుకోవలసిన వాటినిగురించి చెప్పు. ఉపాయంతో ప్రవర్తిస్తాను.
అని ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. ఉద్ధవా! నీ ప్రశ్నలు క్లిష్టమైనవి. అయినా చెపుతాను విను. నియమాలూ, శమదమాలూ మొదలైనవి ఏవి? తపమనగా నేమి? సుఖదుఃఖాలూ, స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు ఎట్టివాడు? ఈశ్వరుడంటే ఎవరు? అని నీవు నన్నడిగిన విషయాలన్నిటినీ వేరువేరుగా వివరిస్తాను.
మౌనవ్రతమూ, ఓర్పూ, జపమూ, తపమూ, అతిథులను సత్కరించడమూ, పరహితమూ, దొంగతనమూ మొదలైనవి లేకుండుట అనే ఇలాంటివి నియమాలు అనబడతాయి.
ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, శత్రుమిత్రుల యెడల సమానంగా ఉండడం 'శమ' మని చెప్పబడుతుంది.
అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేయడం, కోరికలను వదిలి పెట్టడం, సమదర్శనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం అనేవి కల్గి ఉండడం విద్యగా చెప్పబడతాయి.
శమదమాది గుణాలు లేని వాడుగావడం, నాయందు భక్తి లేనివాడు గావడం 'అవిద్య' అనబడుతుంది.
చిత్తశుద్ది గలిగి ఎప్పుడూ తృప్తిచెందినవాడుగా ఉండడం 'దమ' మని చెప్పబడుతుంది.
ఇటువంటి నియమాలూ, గుణాలూ కలిగి నాయందు భక్తి కలిగి ఉండడమే 'సుఖం'. నన్ను తెలుసుకోలేక తమోగుణంతో ఉండడమే 'దుఃఖం'.
బంధువుల, గురువుల యెడల భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను నిగ్రహించినవాడూ, త్రిగుణ సాంగత్యం లేనివాడు అయినవాడే ఐశ్వర్యవంతుడు.
నాయందు మనస్సు నిలిపి కర్మయోగమందూ, జ్ఞానయోగమందూ ఇష్టం కలిగిన వాళ్లై జనకరాజు మొదలైనవాళ్లు మోక్షాన్ని పొందారు. భక్తియోగం చేత బలి, ప్రహ్లాదుడు, ముచికుందుడు మొదలైనవాళ్లు పరమపదాన్ని పొందారు.
కనుక ఈ విషయాన్ని తెలుసుకొని నిరంతరం నీ మనస్సులో భక్తియోగాన్ని నిలుపుకో. మట్టికుండకు రంధ్రం పడితే నీళ్లు కారిపోయే విధంగా రోజురోజుకు ఆయువు తరిగిపోతూ, చావు దగ్గరపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొని ఎప్పుడూ ఏమరకుండా నన్నే తలుస్తూ ఉండేవాడు నాకు ఇష్టుడు.
పాపరహితుడైన ఉద్ధవా! జీవుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి (జ్ఞానం) సంపూర్ణంగా ఉంటుంది. అతడు పుట్టిన పిమ్మట (కడుపులోనుండి భూమిమీద పడగానే) లోపల ఉండిన ఆ జ్ఞానమంతా పోతుంది (నశిస్తుంది).
'అందుచేత మానవుడు బాల్యం, పిన్నతనం, యువకత్వం అనే వయోదశల తరువాతగాని, పెద్దవాడైన తరువాతగాని నన్ను తెలుసుకొంటే కృతార్ధుడవుతాడు. సంపద కలిగించే గర్వంవల్ల గుడ్డివాడయితే చీకటి అనే బావిలో పడతాడు.
పాపరహితుడైన ఉద్ధవా! జీవుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి (జ్ఞానం) సంపూర్ణంగా ఉంటుంది. అతడు పుట్టిన పిమ్మట (కడుపులోనుండి భూమిమీద పడగానే) లోపల ఉండిన ఆ జ్ఞానమంతా పోతుంది (నశిస్తుంది).
'అందుచేత మానవుడు బాల్యం, పిన్నతనం, యువకత్వం అనే వయోదశల తరువాతగాని, పెద్దవాడైన తరువాతగాని నన్ను తెలుసుకొంటే కృతార్ధుడవుతాడు. సంపద కలిగించే గర్వంవల్ల గుడ్డివాడయితే చీకటి అనే బావిలో పడతాడు.
అలాంటి వాడిని దరిద్రుడుగా చేస్తే జ్ఞానోదయమై నా పాదపద్మాలకు నమస్కరించాలనే తలంపుకలిగి మోక్షం పొందుతాడు. అందువల్ల శరీరాభిమానం వదిలిపెట్టి, ఇహలోకపరలోక సౌఖ్యాలను కోరకుండా, మనస్సును నిగ్రహించుకొని ఎప్పుడూ నన్ను స్మరించేవాడు వైకుంఠపదాన్ని పొందుతాడు. నేను కూడా అతనిని విడువలేక అతని వెంటనే వెళుతూ ఉంటాను. నారదాది మునులు భక్తిభావంవల్ల నా రూపం పొందారు'. అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడింకా ఇలా అన్నాడు.
అయ్యా! దేవా! శ్రీకృష్ణా! సర్వజ్ఞనిధీ! సృష్టికర్తయైన బ్రహ్మను ఎవడు నేర్పుతో నడుపుతాడో వెంటనే చెప్పవయ్యా!
అనగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు 'ఆ విధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక గుడ్డు(అండం) గా ఏర్పడ్డాయి. ఆ గుడ్డునుండి నేను పుట్టాను. అంతనా బొడ్డు రంధ్రం నుండి బ్రహ్మ పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదాలు మొదలైన జగాన్నంతా అతనిచేత నేనే నిర్మింపజేశాను.
ఆ బ్రహ్మకు నూరేండ్లు నిండిన తరువాత భూమి గంధంలో అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ నీరు రసంలో లీనమవుతుంది. ఆ రసం తేజోరూపాన్ని ధరిస్తుంది. ఆ తేజస్సు రూపంలో సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువు (గాలి) లో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగుణంతో గ్రహింపబడి ఆకాశంలో లయిస్తుంది. ఆ ఆకాశం శబ్దమనే తన్మాత్రచే లోగొనబడినట్లయితే ఇంద్రియాలు మనోవికారాలతో కూడి ఈశ్వరుని పొంది ఈశ్వరత్వం పొందుతుంది.
నేను రజస్సు, సత్త్వం, తమస్సు అనే మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికీ కారణుడనై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమ పవిత్రుడవు, పరమ భక్తిసహితుడవు కమ్ము' అని చెప్పాడు. అంత
(మహత్ - సాంఖ్యుల పంచవింశతితత్త్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుండి వచ్చిన భూమిక. ఈ తత్త్వాలను కొందరు తొమ్మిదిగా చెపుతారు. పురుషుడు, ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, పృథివి అనేవి తొమ్మది తత్త్వాలు.
నేను రజస్సు, సత్త్వం, తమస్సు అనే మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికీ కారణుడనై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమ పవిత్రుడవు, పరమ భక్తిసహితుడవు కమ్ము' అని చెప్పాడు. అంత
(మహత్ - సాంఖ్యుల పంచవింశతితత్త్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుండి వచ్చిన భూమిక. ఈ తత్త్వాలను కొందరు తొమ్మిదిగా చెపుతారు. పురుషుడు, ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, పృథివి అనేవి తొమ్మది తత్త్వాలు.
జీవుడు, పరమాత్మ అనే ఇద్దరిని కలిపి పురుషుడు అన్నారు. మహదాదిగుణాలు కలసి 'అండం' ఉద్భవించిందని, దానినుండి భగవానుడు ఉద్భవించాడని భాగవతం చెపుతున్నది. 'అండపిండ బ్రహ్మాండంబు' అంటూ ఉంటారు. వీటిలో అండం అంటే గుడ్డు, పిండం అంటే దేహధారణ చేస్తున్న దశలోని రూపం. బ్రహ్మాండమంటే విశ్వం. పారమార్థికంగా అండం అంటే పంచమహాభూతాలతో కూడిన సృష్టి.
శ్రీమన్నారాయణుడే త్రిమూర్తులను ధరించి సృష్టి స్థితి లయలనే కార్యాలను నిర్వహిస్తాడని భాగవతం చెపుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిమూర్తులు. త్రిమూర్తత్వం ఒకే తత్త్వం. వివిధ కార్యాల నిర్వహణకోసం అది మూడు తత్త్వాలుగా రూపొందింది. మొదటిది బ్రహ్మతత్త్వం. ఈ తత్త్వం సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి రజోగుణ సంయుక్తంగా ఉంటుంది. రెండవది విష్ణుతత్త్వం. ఈ తత్వం స్థితికి సంబంధించింది. కాబట్టి సత్వగుణసంయుక్తంగా ఉంటుంది. మూడవది మహేశ్వరతత్త్వం. ఈ తత్త్వం అప్పటివరకు పోషింపబడిన విశ్వాన్ని లయింపజేస్తుంది.
శ్రీమన్నారాయణుడే త్రిమూర్తులను ధరించి సృష్టి స్థితి లయలనే కార్యాలను నిర్వహిస్తాడని భాగవతం చెపుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిమూర్తులు. త్రిమూర్తత్వం ఒకే తత్త్వం. వివిధ కార్యాల నిర్వహణకోసం అది మూడు తత్త్వాలుగా రూపొందింది. మొదటిది బ్రహ్మతత్త్వం. ఈ తత్త్వం సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి రజోగుణ సంయుక్తంగా ఉంటుంది. రెండవది విష్ణుతత్త్వం. ఈ తత్వం స్థితికి సంబంధించింది. కాబట్టి సత్వగుణసంయుక్తంగా ఉంటుంది. మూడవది మహేశ్వరతత్త్వం. ఈ తత్త్వం అప్పటివరకు పోషింపబడిన విశ్వాన్ని లయింపజేస్తుంది.
అందువల్ల ఈ తత్త్వం తమోగుణ ప్రధానంగా ఉంటుంది. గుణ ప్రాధాన్యాన్ని బట్టి, నిర్వహించే పనులను బట్టి త్రిమూర్తులు రజస్సు, సత్త్వం, తమస్సు అనే గుణాలకు ప్రతినిధులుగా గుర్తింపబడినారు.)
రూపంలేని నీకు యోగులు రూపం కల్పించి నిన్ను మహాభక్తితో సేవిస్తూ ఉంటారు. నీవు వాళ్ల కోరికలను ఎలా తీరుస్తావు. నాకు తెలియజెయ్యి.
ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఇలా అన్నాడు. నేను అన్ని వర్ణాలవాళ్లకు సమమైన పూజాపద్ధతిని చెపుతాను. రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరు పెట్టి కొందరు పూజిస్తారు.
రూపంలేని నీకు యోగులు రూపం కల్పించి నిన్ను మహాభక్తితో సేవిస్తూ ఉంటారు. నీవు వాళ్ల కోరికలను ఎలా తీరుస్తావు. నాకు తెలియజెయ్యి.
ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఇలా అన్నాడు. నేను అన్ని వర్ణాలవాళ్లకు సమమైన పూజాపద్ధతిని చెపుతాను. రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరు పెట్టి కొందరు పూజిస్తారు.
కంచుతోగాని, సీసంతోగాని, వెండితోగాని, బంగారుతోగాని చేసిన విగ్రహరూపాలు శ్రేష్ఠమైనవి. ఈ విధంగా నా విగ్రహరూపాలలో నా భావాన్ని భావించి కొలిచిన వారికి నేను ప్రసన్నుడనవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు. దేవతాప్రతిమలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అందమైనవి సారవంతాలైనవి మనస్సును ఆకట్టుకొనేవి అయిన రూపాలలో నేను ప్రసన్నమనస్కుడనై ఉంటాను.
కావున నన్ను పాలకడలిలో పవళించిన వాడినిగా ఎంచి శుభ్రమైన వస్త్రాలు, భూషణాలు, పూలదండలు, మైపూతలు అర్పించి, దివ్యాలైన అన్ని పాఠాలతో, పదహారు విధాలైన రాజోపచారాలతో బాహ్యమైన పూజలు చేసి, నాకు ఇష్టమైన పదార్దాలను సమర్పించి, నిత్యం మనః పూజావిధానాలతో సంతోషింపబజేసి, దివ్యాలైన వస్త్రభూషణాలతో, పూలదండలతో ప్రకాశిస్తూ శంఖ చక్ర కిరీటాదులతో అలంకృతుడనైన దివ్యమంగళ విగ్రహునిగా భావించి ధ్యానపరవశుడైన నా భక్తుడు నాలో చేరుకొంటాడు.
ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రమైన యోగనిష్ఠతో బదరికాశ్రమంచేరి, నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని కలియుగాంతం వరకు ఉండుమని శ్రీకృష్ణుడు చెప్పగా ఉద్ధవుడు ఆనందంతో నిండిన మనస్సు గలవాడై శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్లాడు. అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పగా
(సర్వవర్ణాలు - బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులే సర్వవర్ణాలవాళ్లు. ఏ వర్ణం వారికైనా పూజావిధానం ఒకటే అనడానికి భాగవతం ఆ విధంగా చెప్పింది. దేవతాప్రతిమలను రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని చేసి పూజించవచ్చు.
ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రమైన యోగనిష్ఠతో బదరికాశ్రమంచేరి, నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని కలియుగాంతం వరకు ఉండుమని శ్రీకృష్ణుడు చెప్పగా ఉద్ధవుడు ఆనందంతో నిండిన మనస్సు గలవాడై శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్లాడు. అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పగా
(సర్వవర్ణాలు - బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులే సర్వవర్ణాలవాళ్లు. ఏ వర్ణం వారికైనా పూజావిధానం ఒకటే అనడానికి భాగవతం ఆ విధంగా చెప్పింది. దేవతాప్రతిమలను రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని చేసి పూజించవచ్చు.
ఇలాంటి విగ్రహాలకంటె లోహంతో చేసిన విగ్రహాలు శ్రేష్ఠమైనవి. విగ్రహపూజ బాహ్యపూజ.
మనస్సులోనే ఒక మూర్తిని కల్పించుకొని ఆరాధించవచ్చు. అది ఆభ్యంతర పూజ.
దేవతా విగ్రహాలు ఒకచోట నుండి మరొక చోటికి మార్చదగినవి, ఒకేచోట స్థిరంగా ఉండేవి అని రెండు రకాలు. అలాంటి విగ్రహాలలో మంత్రశక్తితో ప్రాణప్రతిష్టచేస్తే అవి సజీవమై భగవంతునికి వాసస్థానాలవుతాయి.
శుకమహర్షి మాటలు విన్న పరీక్షిత్తు మునిచంద్రా! శ్రీకృష్ణుని కథలను యోగులు మెచ్చేవిధంగా, ఆశ్చర్యం కలిగేవిధంగా, నేర్పుగా చెప్పినప్పటికి నా మనస్సు తృప్తి పడడంలేదు.
తరువాత కృష్ణుడేమైనాడు? యాదవులు ఎలా ప్రవర్తించారు? ద్వారకానగరం ఎలా ఉండింది? తాపసోత్తమా! సంతోషంతో నాకు స్పష్టమయ్యేటట్లు చెప్పు.
No comments:
Post a Comment