Friday, May 29, 2026

Lord Dattatreya on Thursday - గురువారం దత్తాత్రేయ స్వామి

గురువారం దత్తాత్రేయ స్వామి

త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర వచనం.

గురువారం రోజును గురుగ్రహానికి, దైవ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా పూజించబడతారు. అందుకే గురువారం ఆయనను భక్తితో ఆరాధిస్తే జ్ఞానం, గురుకటాక్షం, మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తాయని విశ్వాసం.

దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు.దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు. దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు.

గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.

ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లి స్వామికి పసుపు రంగు పూలను సమర్పించాలి. అలాగే స్వామికి నైవేద్యంగా పసుపు రంగు పండ్లను సమర్పించాలి. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని దత్తాత్రేయ స్వామి చరిత్ర అయిన గురు చరిత్రను పారాయణ చేయాలి.

దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి.

No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...