Thursday, May 21, 2026

Shanidevuniki Tailabhishekam - శనిదేవునికి తైలాభిషేకం

శనిదేవునికి తైలాభిషేకం

పురాణ గాథల ప్రకారం రామ రావణ యుద్ధ సమయంలో శనిదేవుడు రావణుడికి బంధీగా ఉంటాడు. హనుమంతుడు ఆయన్ని విడిపించినప్పుడు, శని తన ప్రభావం హనుమంతునిపై చూపేందుకు ప్రయత్నిస్తాడు.

హనుమంతుడి శక్తిని తట్టుకోలేక శనిదేవుడు తీవ్రంగా గాయపడి, ఒళ్లంతా నొప్పులతో బాగా అలసిపోతాడు.

శనిదేవుడి బాధను చూసి చలించిన ఆంజనేయుడు, ఆయన శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి ఉపశమనం కలిగిస్తాడు.

ఆ నూనె వల్ల కలిగిన ప్రశాంతతకు ముగ్ధుడైన శనిదేవుడు "ఎవరైతే భక్తితో నాకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో, వారికి నా వల్ల కలిగే బాధలు తక్కువవుతాయి" అని వరం ఇస్తాడు.

నూనె శనిదేవుడి గాయాలను మాన్పి శక్తిని ఇచ్చింది కాబట్టి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి తైలాభిషేకం అత్యంత శ్రేష్ఠమైన మార్గం.

అందుకే శని జయంతి రోజున నువ్వుల నూనెతో చేసే అభిషేకం శని దోషాలను మంచులా కరిగించేస్తుంది.


No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...