Monday, April 27, 2026

Dushkarmalu Narakayatanalu - దుష్కర్మలు - నరకయాతనలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - దుష్కర్మలు - నరకయాతనలు

నారదు డిట్లనెను: ఓ సనాతనమునీ! ఏయే కర్మభేదములు నరకయాతనలు గల్గించునో యాయా కర్మభేదము లెన్ని విధములో నాకు తెలుపుము.

శ్రీనారాయణుడిట్లనెను: ఏ దుష్ఠుడు పరుల భార్యను-ధనమును-సంతతిని హరించునో యా దుష్టుడు యమదూతల బారి జిక్కును. వాడతి భీకరమైన యముని కాలపాశములచే బద్దుడై యాతనలు గల్గించు తామిస్రనరకమున త్రోయబడును. అచ్చడ యమభటులు పాశములు చేతబూని వానిని పట్టి కొట్టి తిట్టి భయపెట్టి పలు ఇక్కట్టులు పెట్టుదురు. 

బ్రహ్మపుత్రా! అపుడా నారకుడు వివశుడై మూర్చిను. ఒక విటుడింకొక పురుషుని మోసగించి వాడింటలేని తఱి వాని పెండ్లమును ధనాదులను విడువ కనుభవించును. అట్టివాడు యమకింకరులచేత నంధ తామిస్రమను నరకాంధ్యమున నెట్టబడును. అటవాడు ఘోర యమ యాతనలు పడును. వాడు మతి-చూపులు చెడిన వాడై మొదలంట నఱుకబడిన చెట్టువలె గూలును. 

అందువలన దాని నంధతామిస్రమని పెద్దలందురు. ''నేను'' ''ఇది నాది'' యును నహంకృతితో నొకడు ప్రాణులకు ద్రోహము తలపెట్టును. అతడు ప్రతిదినమును కార్యమగ్నుడై స్వార్దముతో తన కుటుంబమును మాత్రమే పోషించుకొనును. అట్టివాడు తన వన్నియు నిచ్చటనే వదలిపెట్టి తన కర్మఫలము పొందును. అతడెల్లరకును భితి గొల్పునటి రౌరవనరకము గూలును. 

ఈ లోకమునంగొకడు ప్రాణుల నెల్ల హింసించును. అట్టి హింసకునిచే హింస బొందినవారు నరకములో రురులైవానిని బాధపెట్టుదురు. అందువలన రౌరవమను నరకము పేరేర్పడెనని పండితులు వచింతురు. ఈ రురువనుజంతువు కర్పముకన్న మిక్కిలి క్రూరమైనది. అందుచే నగి మహారౌరవమని పెద్దలచే పేర్కొనబడినది. ఇతరులను బాధించి పీడించువాడీ రౌరవమునపడును. అందువాడు మాంసము తిను రురు జంతువుల చేత తినబడును.

అతిక్రూరముగ కోపముతో పశుపక్షులను బంధించు మూడుని యమదూతలు పట్టి కట్ట కొట్టుదురు. నారదా! వాడుతాను హింసించిన పశు-పక్షుల కెని రోమములు గలవో యన్ని వేలేండ్లు కుంభీపాకనరకమం దుండును. వాని పై సలసలమను వేడినూనెపోయుదురు. 

తనతల్లిదండ్రులకును విప్రులకునుబ్రాహ్మణులకును ద్రోహముబూనువాడు''కాలసూత్ర'' నరకమున పడవేయబడి సూర్యాగ్నుల మంటలచే తపింపచేయబడును. వాని శరీరములోన బైట నాకలి-దప్పుల పెనుమంటలు చెలరేగను. వాడా నరకమందే తిరుగును కూర్చుండును పరుగెత్తును విదురించును. 

దేవఋషీ! ఎవుడు తన వైదికమార్గమును వదలి పాషండమతమును నిరాటంకముగ చేపట్టునో యమభటులు వానిని నరకమున ద్రోతురు. అది అసిపత్రవన మనునరకము. అందు వానిని కొరడాలతో కొట్టుదురు. వాడందు కత్తికి రెండు వైపుల పదునున్న '' యసిపత్ర'' ములచేత చీల్చబడుచు నిటునటు పరుగులు దీయును. అట్లు తన యంగము లన్నియును ఛేదింపబడుచుండగా నయ్యోఏ చచ్చితి! చచ్చితి! ననివాడు మహావేదనపడి మూర్చిల్లి యడుగడుగునకు క్రింద పడిపోవును. అల్పబుద్దిగలవాడు తన ధర్మానుసారముగ పాషండమతఫల మనుభవించును. 

ఒక రాజుగాని రాజపురుషుడుగాని యధర్మముగ నితరులను దండించును. అతడు బ్రాహ్మణులను దండించినచో పాప ఫలముద సూకర ముఖ మనబడు నరకమున యమభటులసచేత త్రోయబడును. అతడచట విసరు తాతిలోని పిండివలె నుగ్గునుగ్గయిన యవయువముల బాధతో నార్తితో కేకలు పెట్టుచు మూర్చిల్లును. 

అతడటుల భాధింపబడి పెక్కురీతుల వేదనలు పొందును. ఎవడితరుల బాధ గుర్తింపలేడో యెవడు నీచకర్మ చేయునో-ఏవా డీశ్వర కల్పితములగు నల్లులు మున్నగు వాని కూడా భాధించునో యా ద్రోహమునకు వా డం ద కూపనరకముందు గూలును.

అతడచట పశు-మృగ-పక్షులచేత పాములచే - తేళ్లచే దోమలచే నల్లులచే పీడింపబడును. అతడా పెంజీకట దోమలు దందశూకములు మున్నగువాని చేత భాదింపబడును. ఇట్టి దురవస్ధ నీచ తనువుగల జంతువు కిచటనే కల్గును. 

ఎవ్వడు తన యన్నమును ధనమును మన్త్రవిహితములైన పంచయజ్ఞములతో దేవతల దేయక కాకివలె తాలొక్కడే యనుభవించునో ఆ పాపి కృమిభోజనమను నరకమునందు క్రూర యమభటులచేత గూల్చబడును. వాడచ్చోట లక్ష యోజనముల వైశాల్యముగల కృమికుండమున బడి తానొక పురుగై యందలి పురుగులచే తినబడును. 

అతిధులకు పెట్టక తానే కుడి చినవాడు నిదే నరకమున గూలును. ఎవ్వడు బంగారముగాని రత్నము గాని దొంగలించునో ఆ వస్తువులు బ్రాహ్ణునివిగాని యితరులవిగాని వచ్చును. నారదా! అట్టిదొంగను యమకింకరులు బాధింతురు. అట్టి దొంగ నచట భగభగమను నయః పిండముల వంటి రోకళ్లతో కసబిస ద్రోక్కుదురు. 

ఎవ్వడైన మదమెక్కి పొందరాని యువతిని తగుల్కొనునో యే రేగిన మదవతియైన తనకు తగనివానితో రుసరుసలాడుచు తమకము దీర్చుకొనునో వారిర్వురిని యమభటులు వాడి కొరడాలతో గొట్టుదురు. మఱి భగ్గున మండు నినుప యువతినిచేసి యాయువకునితోదానిని కౌగిలింపింతురు. 

అ మదవతిని గూడ యినుప యువకునితో కౌగిలింపచేతురు. ఒక్కొక్క పాపాత్ముడు పెక్కురు స్త్రీలను గూడును. యమభటులు వాని నినుము వంటి వజ్రకంటకములు గలశాల్మలీనరకమున పడవేసి బాధింతురు. తమ క్షాత్రము విడనాడి పాఖండమచము పట్టిన రాడపురుషులను స్వధర్మము విడనాడిన నరులు చ్చి దుఃఖము లందుదురు. నారాదా! అట్టి పాపులు మర్యాదలు లేనివారు. వారు పాపదుర్గములప్రక్కనేయున్న యగడ్తల నదులనుబోలు లోతైన వైతరణీతప్తజలములం దుక్కిరిబిక్కిరియగుచుందురు.

నారదా| అందు పెక్కు జలజంతువులు వానిని తినుచున్నను ప్రాణములు వాని శరీరమును వదలిపెట్టవు. వాడిటునటు తిరుగుచుండును. పాపులు తామ చేసికొన్న పాపాలు పండుట వలన మలమూతమ్రలు నెత్రుమాంసములు గోళ్ళ వెండ్రుకలు నెముకలు మేదస్సు మజ్జలతో నిండిన నదిలో వారు మునుగుదురు. 

వృషలీపతులు భ్రష్టాచారులు సిగ్గుమాలినవారును సదాచరనియమములు పాటించని పశువర్తనులునునల మూత్రములు శ్లేష్మరక్తములును శ్లేష్మమలములు నిండిన నదిలోగూలుదురు. ఆ దురాగ్రహులగుయమసేవకు లాపురుల నోళ్లలో మలమూత్రమును నెట్టుదురు.ఏద్విజాతుల వారు గాడిద కుక్క మున్నగు జంతువులను పెంచుదురో-వేటతమకమున మృగములను వేటాడుదురో-ఆ దుర్మార్గులు చచ్చిన మీదట యమభటులువాడిములుకులకుగురి యగుదురు. 

ఏనరాధముల-డాంబికులనుగువారు దంభయాగముతో పశువులను హింసింతురో వారు చచ్చిన పిమ్మటయమ భటులచేత''విశసన'' నరకమున గూల్చబడుదురు. అచట యమభటులు వారిని బెట్టిదంపు కొరడాలతో గొట్టుదురు. ఏ ద్విజు డగ్గలమైన మేహాతిరేక మాపుకోలేక తనసజాతి స్త్రినోటితో రేతస్సు త్రాగించునో ఆమూఢుని భటులు రేతః కుండమున పవడేసి వానిచే రేతస్సు త్రాపుదురు. 

దొంగలు నిప్పంటించు వారు విషము పెట్టువారు గ్రామాలను వర్తకులనుగంపులను దోచువారుఅగు రాజులను రాజులను రాజపురుషులను వీరందఱిని చచ్చిన యమదూతలు ''శ్వానకదన'' మను నరకమున గూల్తురు. ఆ నరకము నందేడు వందల ఇరువదికి పైగా చితవిచిత్రములగు విచిత్రములగు కుక్కలు గబగబ ప్రాణులను పీకి పాకము పట్టను. 

మునీశా| ఈ సారమేయాదన నరకమతి దారుణమైనది సుమా| ఇక మీదట ''అవీచి'' మున్నగు నరకములను గూర్చి వివరుంతును.

శ్రీనారాయణ డిట్లనెను: ఓ దేవమునీ! ఏ పాపులు లేచినది మొదలబద్దము లాడుదురో డబ్బిచ్చి పుచ్చుకొనుటలో నసత్యము లాడుదురో వారు చచ్చిన పిదప దారుణమైన''యవీచి'' నరకమున పడుదురు. అచట వారిని యమ దూతలు నూఱు యోజనముల యెత్తైన పర్వతము నుండి క్రిందకి పడవైతురు. వారాకాశము నుండి క్రింద పడునపుడలలు లేని నేలపై నీటి కెరటాలున్నట్లు దోచును. 

నారదా! అందులకే దానిని''అవీచి'' యందురు. అందు పడినవారు చిత్తు చిత్తుగ క్షీణించినను చావరు. మఱల క్రొత్త తనువులు దాల్తురు. బ్రహ్మపుత్రా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నెవడైనను సోమపానము చేసి పిదప సురాపానము చేయునో అతడును నరకమున గూలును. యమ భటులతనికి వేడి లోహద్రవము త్రాపుదురు. ఆ ద్రవ మెల్లప్పుడు నిప్పు మంటలతో సలసల క్రాగును. 

ఏ నరాధముడు తనకు గౌరవ పాత్రుడైనవానిని గౌరవింపడో తన కంటె విద్య-జన్మ-తపస్సు-వర్ణము-ఆశ్రమము- ఆచారము లందు శ్రేష్టుడైన వాని నెవడు గౌరవింపడో వారు క్షారకర్దమ నరకమందు యమభటులచేత పడవేయబడును. వాడచట తల క్రిందుగనుండి ఘోరయాతనల ననుభవించును. మునిపుంగవా! ఏ నరుడు గాని నారి గాని నరమేధముతో నేదేని దేవతను గొల్చునో నరపశువు మాంసము తినునో- ఆ చనిపోయిన నర పశువులు తిరిగి యమ లోకము నందు తన్ను చంపి తిన్న వానిని వాడి కత్తితో కోసి తినును. వాని నెత్తురు క్రోలి పెక్కు రీతుల నటించును పాడును. భూమిపై మాంసము తినువారు ప్రవర్తించు రీతిగ యమలోకమందును ప్రవర్తించును. 

నారదా! ఏ నేరములు చేయక మోసములు చేయక వనము లందు గాన గ్రామము లందు గాని సాధు జీవనము గడుపు పుణ్యాత్ముల నెవరు మోసగింతురో ఎవరా సాధులును శూల-కంటక-సూత్రములచే బాధించి వినో దింతురోవారు చచ్చి యమభటులచేత శూల పాత నరకమ మందు పడవేయబడుదురు. వారచ్చట వాడి శూలముల చేత గ్రుచ్చబడుదురు.అఱ్ఱాట క తీరని దప్పిచే వారు పీడితులగుదురు. వాడి ముక్కు కొనలు గల కొంగలు కంకములు మున్నగు పక్షుల చేత చీల్చబడుదురు. 

ఆ పాపులు తమ చేసిన పాపములు తలపోసికొందురు. మఱికొందఱు పాపులు తీవ్ర ప్రవర్తనతో నితరుల నుద్రేక పఱతురు. కొందఱితరులను భయపెట్టుదురు. అట్టివారలు దంద శూకమను నరకమున గూలుదురు. అందు పెక్కు దందశూకము లుండును. వానికైదు గాని యేడు గాని ముఖములుండును. పాము కన్నములోని యెలుకను పట్టి మ్రింగును. అట్లే కొందఱు దుష్ఠులు కటికి చీకటి బావులలో గాని గాదెలలో గాని గుహలలోగాని ప్రాణులను బంధింతురు. అట్టి పాపులను యమ కింకరులు బాధలు పెట్టుదురు. దట్టమైన పొగ మంటలు విషపు మంటలు నిండిన చోట్ల యమ భటులట్టి పాపుల నుక్కిరి బిక్కిరి యగునట్టు లడ్డగింతురు.

నారదా! పాపాత్ములు నరకాలకు పోయినట్టే ధర్మాతులు సుఖప్రదాలయిన లోకాలకు వెడతారు. మహామునీ! సారాంశంగా ఒక్కమాట చెబుతాను, ఆలకించు. దేవీపూజనం దేవి ఆరాధనం - ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమ ధర్మం. దీనిని అనుష్టించిన ప్రాణికి మరింక చింతలేదు. నరకం దరిదాపులకైనా పోవలసిన అవసరం ఉండదు. సంసార సాగరంనుంచి ఉద్ధరించగలిగినది శ్రీమన్మహదేవి మాత్రమే.

నారాయణ మహర్షీ సారాంశం గ్రహించాను. ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన రూపమైన ఆ ధర్మం ఎటువంటిది? ఎలా ఆరాధిస్తే ప్రసన్నురాలు అవుతుంది? ఆరాధన విధానం ఎమిటి? లోగడ ఎవరు ఎపుడు ఎలా ఆరాధించి తరించారు? ఏయే కష్టాలను అతిగమించారు?, విశేషాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.



శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Tala Tala Lokamu - తలాతల లోకము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - తలాతల లోకము

శ్రీనారాయణు ఇట్లు పలికెను: సుతలమునకు క్రింద తలాతలమను లోకము గలదు. అందు గొప్ప దానవపతి త్రిపురాధినాధుడు మయుడనువాడుండును. శివుడు త్రిపురములు గాల్చుతఱి దేవదేవుని దయవలన నితడు రక్షింపబడి రాజ్య సుఖములు పడసెను. 

మయుడు గొప్పమాయావి! మాయావులకు మాయావి! పెక్కురు రక్కసులతనిని తమ కార్యసిద్దికొఱకు సేవించుచుందురు. సుతలమునకు క్రింద మహాక్రోధవశులును కద్రూతనయులునగు నాగరాజులు నివసించు ప్రసిద్ద మహాతలము గలదు. 

నారదా! వీరికి పెక్కుతలలుండును. వీరిలో ముఖ్యులను గీర్తింతును; వినుము. కుహకుడు, తక్షుకుడు సుషేణుడు కాళియుడు. వీరుపెద్ద పడగలుగల్గి మహాబలముగల్గి క్రూరస్వభావముగల క్రూర జాతులు. వీరందఱను గరుత్మంతునికి జంకుదురు. వీరు తమ తమ భార్యాపుత్ర-మిత్ర-కుటుంబముతో గూడి పెక్కుక్రీడలందారితేరి మదించి ప్రవర్తింతురు. 

మహ తలమునకు క్రింద రసాతలమను మహా లోకము గలదు. ఇందు పెద్దఫణములు గల్గిన దైత్యదానవులు వసింతురు. ఇందు సురవైరులు హిరణ్యపురవాసులు కాలేయులనబడు నివాతకవచాది రాక్షసులు వసింతురు. వీరు పుట్టునప్పట్టి నుండియే వీరులు-శూరులు. వీరు శ్రీహరితేజమున మాత్రము నిర్నీర్యులగుదురు. వీరెల్లప్పుడును బిలేశయులవ పగిది వినరమందే వసింతురు. సరమ శక్ర దూతిక. ఈమెమంత్ర వర్ణములుగల వాక్కులకు రసాతలవాసులు గడగడ లాడుదురు. రసాతలము క్రింద నాగలోకపతులు వసించు పాతాళము గలదు.

వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ మహశంఖ ధృతరాష్ట్ర శంఖచూడ కంబల అశ్వతర దేవోపదత్తక నామములుగల నాగులు ప్రముఖులు. వీరు కోపావేశమున విషములు గ్రక్కుచుందురు. వీరులో నొక కొందరైదుతలలు నేడుతలలు పదితలలు నూఱు పడగలు వేయితలలు గల్గి తమ తమ ఫణా మణి కాంతిరేఖలలతో ఫాతాళమందలి చిమ్మచీకట్లు పారద్రోలుచుందురు. 

నారదా! వీరెల్లరును కోపాటోపముతో బుసలు గొట్టుచుందురు. దీనికి మూలమున ముప్పదివేల యోజనముల వైశాల్యమున నొక భగవత్కళ గలదు. అది తామసకళ. అనంత నామనున నెల్ల దేవతలచేత పూజింపబడుచుండును. అభిమానమునకు లక్షణ మహంకార మందురు. ద్రష్టృ-దృశ్యముల యైక్యమును సంకర్షణ మందురు. అనంతుడనంతమూర్తి; అదిశేషుడు. అతని వేయితలలపై భూమండల మంతయును నిల్చియున్నది. అతని తలలపై నీభూమండల మొక కమలమువలె నొప్పును. లయకాలుడగు రుద్రుడీ చరాచరములను సంహరింపదలచును. 

అపుడతని కన్బొమల నుండి సంకర్షణులను పేర్లగల పదునొకండు ప్యూహముల రుద్రులు ద్బవింతురు. అపుడు ముక్కంటి త్రిశూలము చేబూని మహాభూత భయంకరముగ దోచును. అంత రుద్రుని పదపద్మకాంతులచే కెంపెక్కిన కాలిగోళ్ల కాంతులు పాపఱడుల తలల మణి బింబములపై చెన్నలరును.

అత్తఱి సజ్జను లనన్య భక్తియోగమున తలలు వంచి దోయిలించి మ్రొక్కుచు తమ మొగములు చూచుకొందురు. వారిచెన్నొందు కుండలకాంతులు నిగ్గుటద్దములవంటి చెక్కిళ్లను మఱింత కాంతిమంతముగ జేయును. నాగరాజకన్యకల విలాసములు వంపుసోంపు లందాలు మిక్కిలి యచ్చమైన తళతళ కాంతులు విరజిమ్ముచుందురు. 

వారు తమ నునువెచ్చని భుజదండములకు చందనాగురు కస్తూరి సువాసనలు పూసికొని యలంకరించుకొందురు. వారు పురుషుల యంగములుతాకినంతన కామపరవశలై వలపులేనవ్వులు గురియుచు తలలు వంచి ప్రక్కచూపుల గాంతురు. అనురాగము గల్గినపుడు కమ్మని మైకము మత్తెక్కించుటచే నెఱుపెక్కిన వారి కన్నులు మత్తుగ తిరుగును. 

దయ చూపదలచి నపుడా కన్నులే యాశీస్సులు కురియును. అనంత భగవాను డనంతసత్త్వుడు. అనంత సుగుణవారిధి ఆది దేవుడు మహాద్యుతిమంతుడు. మహాభోగి అతడు సర్వలోకహితముగోరి క్రోధముడిగ సురగణపూజితుడై యచ్చోట విలసిల్లుచుండును. అతనిని ముప్ప్రొద్దులు సురాసులు సిద్దవిద్యాధరగంధర్వలు మునులు నాగులు ధ్యానించుచుందురు. 

అచటి దేవుడనారతము మదించి వ్యాకులత్వ మొందు కన్నులతో నొప్పిన తల వచనామృతముచే తన పార్షదగణములను విబుధులను తనుపును. ఆ దేవుడేనాటికిని వాడని నవనవమగు తులసీదళముల వైజయంతీమాలికను దాల్చి రాణ కెక్కును. ఆ భగవానుడు మత్తెక్కిన గండుతుమ్మెదల శోభను తిరస్కరించు పట్టుపుట్టముగట్టి యొకే కుండలము దాల్చి శోభిల్లును. 

ఆదేవుడు హలముపైతన లావు బూజముమోపి యింద్రునైరావతము పగిది శోభిల్లుచుండును. ఆ దేవేశు డుదారశీలుడని తత్త్వవేత్త లభినుతింతురు.


శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

World of Sutala - సుతల లోకము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - సుతల లోకము

శ్రీనారాయణ డిట్లనెను: వితలము క్రింద సుతలమును లోకము గలదు. అందు విరోచనుని కొడుకు పుణ్యశ్లోకుడునునగు బలి వసించును. మహేంద్రునకు ప్రియము గూర్చు తలంపుతో త్రివిక్రమ భగవానుడు బలిని సుతలమునకు గొని వచ్చెను.

ఇంద్రాదులకు నలవిగాని ముల్లోకముల సంపద నంతయును బలి తన వశము చేసికొనెను. సుతలపతి భయముడిగి భక్తిమీర దేవదేవేశుడగు వామనుని ఆరాధించుచుండును. నారదా! ఇదంతయు నఖిలేశ్వరుడు పాత్రుడు నగు భగవానునకిచ్చిన భూదాన ఫలితమే యని మహాత్ములు వర్ణింతురు.

విప్రవర్యా! పురుషార్థుప్రదుడు వాసుదేవ భగవానుడునకు దేవున కింత గొప్ప దాన మిచ్చుటనవసరము. ఏలయనగా నీ దేవదేవుని యొక్క నామ ముచ్చరించినంత మాత్రమున పలికిన వాని కర్మ బంధములు విషయాలు వెనువెంటనే తునాతునుక లగును. సాంఖ్యు లెల్ల క్లేశబంధములు పాయుటకు నిత్యము నిఖిలేశ్వరు భగవాను నారాదింతురు.

భగవానుడు భక్తులపై దయబూని మాయామయములగు భోగభాగ్యములను భవింపజేయును. కావున నాత్మవిస్మరణ మెల్లక్లేశములకు మూలము. సకల మాయోపాయము లెఱిగిన శ్రీవిష్ణు భగవానుడే సర్వము హరించెను.

హరి యాచించు నెపముతో దేహము తప్ప సర్వస్వము మపహిరించెను. ఇతరోపాయమి లేనందున హరి బలిని వరుణపాశములతో బంధించెను. అట్లు బంధించి హరి బలి నీ గిరిగుహలందు పడవైచెను. అపుడు

బలి యిట్లనెను: ''గురుడు మంత్రిగగల యింద్రు డెంతేనియు మూఢుడు. అట్టి యింద్రు నెడ ప్రసన్నుడై విష్ణవు ముల్లోకముల తుచ్చసంపద నంతయు నమ్మని చేయి చాచెను.. మూఢు డెప్పుడైన కల్యాణస్వరూపుడగు భగవంతుని వదలి లోకసంపదలనే కోరుకొనును గదా!

నా పితామహుడు ప్రహ్లాదుడు. పరమ భాగవతోత్తముడు. ప్రహ్లాదుడు సకల లోకోపకారకుడు. కనుకనే విష్ణువతని తండ్రి సంపద నంతయు నిత్తునన్నను గ్రహింపక విష్ణుదాస్యమునే కోరుకొనెను. వీరుడగు తన తండ్రి మరణించినప్పుటికిని ప్రహ్లాదుడతని సంపదలు కోరుకొనలేదు. ఈ లోకము లన్నియును భగవానున కూపాధిభూతములు.

అతడు సకలలోకహితకరుడు. అట్టి భగవంతుని మహామహిమమును నావంటి యల్పమతిగల దోషయుతు డెన్నటికి నెఱుగజాలడు.'' అని దైత్యపతియు పరమపూజితుడునైన బలి పలికెను. ఆ బలి సుతలమున వసించెను. శ్రీహరి స్వయముగ బలికి ద్వారపాలకుడుగ నుండెను.

మున్నొకనాడు లోకరావణుడగు రావణుడు దిగ్విజయమునకు తరలెను. రావణుడు సుతలము చేరినంతనే భక్తానుగ్రహకారి శ్రీహరి తన కాలిబొటనవ్రేలి గోటికొనతో నతనిని పదివేల యోజనములంత దూరమునంతకు జిమ్మి వేసెను. ఈ పగిదిని దేవ దేవుని ప్రసాదమువలన సుతలరాజు భూతభావనుడు నగుబలి యెల్ల సుఖము లనుభవించుచు సుతలమున నుండును.

తలాతల లోకము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Description of Atholoka - అథోలోకాల వర్ణన

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - అథోలోకాల వర్ణన

నారాయణు డిట్లనెను: విబుధఋషీ! భూమికి క్రిందిదెసనేడు పెద్ద వివరములు గలవు. వానిలో ప్రతిది పదివేలయోజనములు పొడవు గలది. ప్రతిదియునంతియే వెడల్పుగలదు. ప్రతిది యెల్లఋతువులందును సుఖముగూర్చును. అవి అతల - వితల - సుతల - తలాతల - మహాతల -
రసాతల - పాతాళాలు ఈ యేడును మహావివరము లనబరగును. 

ఓ విప్రా! వీనియందు స్వర్గమునకన్న మిన్నయగు సంపదలుచెన్నొందు చుండును. అచ్చోటగల రమ్యహర్మయములందు నుద్యానవనములందును కామభోగములు నిత్యసుఖసంపదలు పెక్కులుగలవు. అందుభుజశాలురైన కద్రూతనయులును దైత్యదానవులును నిత్యము తమతమ యాలుబిడ్డలతోబందుగులతో మోద-ప్రయోదము లనుభవింతురు. 

వారుతమ నెచ్చెలులను తమ యాశ్రితులను గూడి గృహముల సుఖింతురు. వారికోర్కెలు మొక్కపోనివి. వారుమాయావులు. అచటి వారెల్ల ఋతువులందును సుఖ సంతోషములతో నుందురు. మాయలకు విభుడగు మయుడు వానిని అట్లు నిర్మించెను. వారి పురములందలి భవనాల చిత్రవిచిత్రములైన అట్లాలకములగోపురములు మున్నగునవి జాతిమణుల-మేలిముత్యాల కాంతులీనుచుండును. 

అచ్చోటి కొలువుకూటములు ముంగిళ్ళు విహారస్థలులును కాంతులు వెద జల్లుచు స్వర్గమును దలదన్ను చండును. ఆచటి నాగాసురుల జంటలు పావురముల గోరువంకల జంటలును-రమ్యమగు కృత్రిమస్థానములు నెతైన మంచిమేడలు తీర్చిదిద్దిన కనుల పండువగు తోటలు ముచ్చటలు గొల్పుచుండును. అచటి చెట్లు పూలు పండ్లు విదుల్చుచు నెమ్మదికి నెమ్మి కమ్మందనము గ్రుమ్మరించును. 

అచటి లలనామణుల కొంగ్రొత్తతళు కుబెళుకుగలిగి తగిన తావులు పెక్కు గలవు. అచ్చోపెల్లుగ కలకలారావములు చేయు పక్షులతో నిండిన కొలంకులందు చేపలు గలవు. అచ్చట జలచరములచే గలతజెందిన పెక్కులు నీలారుణ కమలములును కలువలు నుత్పలములును కహ్లారములును గలవు. 

అవి యచ్చట తమతమ తావు లేర్పరచుకొని సొగసారుచున్నవి. ఆ కొలంకుల పెక్కుగతులగు స్వరములింద్రియములును తనుపును. వేయేల? ఆ చోటి కలుము లమరసంపదల నతిశయించును. కాలాంగములగు దివారాత్రములవలని భయ మెంతమాత్ర మునులేదు. అచటినాగరాజుల తలలందలి మణిగణముల నిత్యకాంతులవలన నట చీకట్లు తొంగియైన చూడలేవు. 

ఆచోటి దివ్యౌ షధుల రసాయనములం గూడిన రసాన్న పానములు స్నానములు నచట వసించువారి కాధి వ్యాధులు గల్గింపవు. మేనులు ముడు తలుపడి కృశించుట పాలిపోవుట ముసలితనము వెండ్రుకలు నెఱయుట నిరుత్సాహము మున్నగు మార్పు లచటివారి కేనాటికిని లేవు. వారి కెల్లవేళల మేలు దొంతరలు గల్గును. చావుభీతి లేదు. కానా వారు చక్రహస్తుని చక్రతేజమునకు వెఱతురు నారదా! అందు శ్రీహరి తేజము ప్రవేశింపగనే యతని చక్రభీతివలన దైత్యకాంతల గర్బములు స్రవించిపోవును.

శ్రీనారాయణ డిట్లనెను: ఓ నారదా! మొదటి అతల సుందరలోకమందున పుబలగర్వములు ఖండించునట్టి మయ పుత్రుడగు బలుడనువాడు గలడు. అతడు సర్వార్థములు సాధింపగల తొంబదియారు మాయావిద్య లేర్పఱచెను. వాని నెఱింగినవాడు గొప్ప మాయావి గాగలడు. బలశాలియగు బలుడావులించినంతనే ముజ్జగములను మోహపఱచునట్టి మోహినులు పెక్కురు పుట్టుదురు. 

ఆస్త్రీలు-పుంశ్చలీ-కామిమీ-స్వైరిణులు. వారు తమ ప్రియమైన వివరమునందు జొచ్చిన పురుష వర్యు నొంటరిగ చేజిక్కించుకొందురు. వారు ప్రయత్నించి హాటకరసముతో వారిని తమవారిగ వశీకరించుకొందురు. వారు తమ పదునైన కడగంటి చూపులతో వలపుతో కౌగిళ్లతో చిర్ననగవులతో నర్మమర్మ గర్భితమైన పలుకులతో తమిదీఱవారితో రమింతురు. అతడు తన్నొక సిద్దునిగ నాగాయుతబలునిగ నీశ్వరునిగ నోటమి నెఱుగనివానిగ దలచుకొని మదాంధు డగును. 

ఓనారదా! ఇంతవఱకు నీకతలము సంగతి తేల్పితిని. ఇంక రెండవ వివరమగు వితలము గుఱించి వినుము. ఈ భూమికి క్రింద వితలమను వివరమునందు శివభగవానుడు హాట కేశ్వర నామమున ప్రసిద్దుడై తన పార్షదగణములతో గూడి సేవలందుకొనుచుండును. అతడచట ప్రజాపతి రచితమైన సృష్టిక్రమమును పెంపొందించుటకు భవానీ సహితముగ విరాజిల్లుచుండును. 

శివుని మహావీర్యమునుండి హాటకమను నది ప్రవహించును. అగ్ని దానిని తన తేజముతో త్రాగును.
అగ్ని వెడలగ్రక్కిన హాటకమను బంగారము దైత్యులకు ప్రియమైనది. దైత్యకాంతలు దానిని సొమ్ములుగ నుపయోగింతురు.

సుతల లోకము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Antara Jyothichakram - ఆంతరజ్యోతిశ్చక్రం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - ఆంతరజ్యోతిశ్చక్రం

నారాయణు డిట్లనెను: సప్తర్షి మండలమునకు పదుమూడు లక్షల యోజనములపైని పరమ వైష్ణవ పదము తేజరిల్లు చుండును. ఆపరమధామమునందు పరమ భాదవతోత్తముడు లోకవందితుడునైన యుత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు ప్రకాశించుచుండును, అత డింద్రాగ్ని కశ్యపులను గూడియుండును. 

నక్షత్రములను చూచువారు ముఖ్యముగ నెక్కువగ ధ్రువుని గౌరవింతురు. కల్పజీవులగువారు భగవంతు నుపాసించుచుందురు. జ్యోతిశ్చక్రములోని గ్రహనక్షత్రాదుల నన్నిటిని భగవానుడు త్రిప్పుచుండును. ఇటు లవ్యక్తగతితో గ్రహాదులను ద్రిప్పుచు నీశ్వరుడు ధ్రువుని మాత్రము స్థాణువువలె కదల కుండునట్టు లుంచెను. 

ఈ విధముగ పరమేశ్వరుడు నిజతేజముతో నెల్లరిని ప్రకాశింపచేయుచు దేవపూజితుడై యొప్పును. పశువులు మేఢిస్తంభమునకు బంధింపబడి దానిచుట్టు తిరుగును. ఇట్లు గ్రహాదులు లోనబైట నను విభాగముతో కాలచక్రము నందు గూర్చబడి ధ్రువు నాధారము చేసికోని వాయుప్రేరణచే తిరుగును. 

గ్రహాదులు కల్పాంతము వఱకు నిట్లు పరిభ్రమించును. వాయువు కర్మసారథి-చోదకుడు. డేగ మున్నగు పక్షులు నింగిపై వాయువశమున నెగురునేకాని క్రింద పడవు. అదే తీరున నక్షత్రగ్రహాదు లన్నియును ప్రకృతి పురుషుల సంయోగమున ననుగ్రహింపబడి వాయువశమున నేలపై పడక తిరుగుచుండును.

కొందఱీ జ్యోతిశ్చక్రమును భగవానుని యోగధారణ కుపయోగపడు శింశుమార స్వరూపముగ భావింతురు. ఓ మునీశా! ఈ కుండలీభూత శరీరుని తల క్రిందివై పుండును. దాని తోకచివర నుత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు నెలకొని యుండును. తోక భాగమునందు పాపరహితులగు ప్రజాపతి ధర్ముడు ఇంద్రాగ్నులును దేవపూజితులై ప్రకాశించుచుందురు. 

దాని తోక కొట్టకొన ధాతృవిధాతలును నెన్నడుమునందు సప్తర్షులును వెలుగుచుందురు. ఈ శింశుమారము దక్షిణమునకు తిరిగిన పడగతో చుట్టలు చుట్టుకొని వెల్గుచుండును. దానికి కుడివైపున నుత్తరాయణ నక్షత్రములు (అభిజిత్తునుండి పునర్వసు వఱకు 14 తారలు) తనరును. 

ఎడమవైపున దక్షిణాయన నక్షత్రములు కుండల రూపమననున్న శరీరమున కిరుప్రక్కలనున్న యవయవములు సమానముగ నుండును. దాని వీపు భాగమున 'అజవీథి' గలదు. ఉదరమున నాకాశగంగ గలదు. పునర్వసు పుష్యములు కుడియెడమప్రక్కల గలవు. ఆర్ద్రాదీశ్లేలు దానివెనుక కాళ్లకు కుడియెడమ వైపుల గలవు. 

అభిజిత్తు ఉత్తరాషాఢయు దాని కుడియెడమప్ర ముక్కుల నొప్పును. ఓయి నారదా! శ్రవణము పూర్వాషాఢయును దాని కుడుయెడమ నేత్ర ములం దనరారును. దాని కుడియెడమ చెవులందు వరుసగ ధనిష్ఠామూలా నక్షత్రములును మఘాదిగ నెనిమిది నక్షత్రములు దక్షిణ భాగమున ప్రకాశించును.

ఇవి యెడమభాగమందలి యెముకలందుండును. మృగశిరాదులు ఇత్తరదిగ్బా భగమున నుండును. ఇవి కుడివైపుననున్న యెముకలందున్నటు లూహింపబడెను. దానికుడి యెడమ భుజములందు శతభిషక్‌ జ్యేష్ఠలను భావింపవలయును. 

ఆగస్త్యు డుత్తరపుపైదౌడయందును యముడు క్రింది దౌడయందును ఆంగారకుడు ముఖమందును శని యుపస్థ మందును విలసిల్లు చుందురు. దాని మూపున గురుడు ఱొమ్మునందు గ్రహపతియగు సూర్యుడును హృదయకమలమందున శ్రీమన్నారాణుండును 

మనస్సున చంద్రుడు నుందురు. అశ్వినిదేవతలు దాని స్తనములందును శుక్రుడు నాభియందును బుధుడు ప్రాణాపానములందును రాహుకేతువులు గళమందు నుందురు. దానియెల్ల యంగములందు రోమములందును నిఖిలకారాగణములు ప్రకాశములు విర జిమ్ము చుండును. 

ఇది అంతయును శ్రీవిష్ణుభగవానుని సర్వదేవ మయమైన దివ్యస్వరూప వర్ణనామృతము ఈ శింశుమార స్తోత్త్రమును ప్రతిసంధ్యయందును మౌనముగ నియతితో ధ్యానింపవలయును. నవనవోన్మేష ప్రజ్ఞాశాలియగు వాడు ప్రొద్దున దీనిని చదువుచు మేల్కాంచ వలయును. 

శ్రీజ్యోతిః స్వరూపుడు మహాకాలుడు దేవపతి పురుషోత్తముడునగు భగవానుని దోసి లొగ్గి ధ్యానించుచున్నానని సకలగ్రహ నక్షత్రతారా మయుడు పాపనాశకుడు ఆధియజ్ఞుడు నగువానిని త్రికాలములందీ మంత్రము సంస్మరించుచు నమస్కరించువాని పాపరాసులప్పటికప్పుడే పటాపంచలగును.

శ్రీనారాయణుడిట్లనెను : సూర్యునకు పదివేల యోజనముల మీదుగ (ఈరాహువు నక్షత్రము అనదగిన యోగ్యత కలవాడు కాడు. అయినను నక్షత్రము వలెనే సంచరించుచుండును.) రాహుమండలము శోభిల్లును. ఈ సింహికాసుతుడు సూర్య చంద్రులను మర్దించువాడు. ఇతడు శ్రీవిష్ణుననుగ్రహమున నమరత్వమును గ్రహత్వమును బడసెను. 

పదివేలయోజనముల వఱకును తపించు రవిమండలము నితడు గప్పివేయును. ఇతనిని రాక్షసునిగ నెఱుగవలయును. చంద్రమండలము పండ్రెండు వేల యోజనములుగలది. రాహువు పదుమూడు వేలయోజనముల విస్తారము కలవాడగును. ఇతడు పగవట్టి పర్వములందే సూర్యచంద్రుల నాచ్ఛాదించును. సూర్యచంద్రులల్లంత దూరమునందున్నను నితడువారిని గప్పివేయును. 

ఈ సంగతి శ్రీ మహావిష్ణునకు తెలియును. ఆదిచూచి అతడు వెంటనే యగ్ని జ్వాలలు చెలరేగు భిష ణమగు తన సుదర్శన చక్రమును ప్రేరించును. చక్రము యొక్క దుస్సహమైన తేజమును రాహువు సహింపలేకుండును, అతడు కలగుండు చెంది యొక్క ముహూర్త మాత్రముననే దూరము ముండియే తొలగిపోవును. ఇదే ఉపరాగము-గ్రహణము. ఇట్లు గ్రహణము లోకమున చెప్పబడెను. దేవర్షీ: చక్కగ వినుము. దీనికి క్రిందుగ పరమ పావనమైన లోకములు గలవు. అవి సిద్ధ-చారణ-విద్యాధరుల పుణ్య లోకములు. అవి పదివేల యోజనములంత విస్తారమున నొప్పిదమై యున్నవి. ఓయిసురమునీ! వీనికి క్రిందుగ యక్ష-రాక్షస భూత-ప్రేత పిశాచముల విహారస్ధానములు నెక్కొని యున్నవి. ఎందాక మేఘములు క్రమ్ముకొని యుండునో యెందాక వాయువులు వీచునో యందాక నంతరిక్షము గలదని జానకోవీదులు వాక్రుత్తురు.

ఓ ద్విజవర్యా! దానికి నూఱుయోజనములు క్రిందుగ సస్యశ్యామలయగు భూమి తిరముగనున్నది. దానిపై గరుడ పక్షులు డేగలు సారసములు హంసలు మున్నగు నేలపై బుట్టిన ప్రాణులెగురు చుండును. భూసంబంధమైన విషయము నీకు తెల్పితిని.

అథోలోకాల వర్ణన

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Surya Chandradi Grahalu - Gatibhedalu - సూర్యచంద్రాది గ్రహాలు - గతిభేదాలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - సూర్యచంద్రాది గ్రహాలు - గతిభేదాలు

నారదా! ఈ పర్వతమునకు పైని సిద్ధయోగులు సంచరింతురందరు. ఈ భూమ్యాకాశముల నడుమ సూర్యడు సంచరించుచుండును. సూర్యునకు భూమికి నడుమ దూర మిరువదైదుకోట్ల యోజనము లుండును. మృతప్రాయమైన యండమునం దాత్మరూపమున ప్రవేశించుట వలన సూర్యుడు మార్తాండుడనబరగును. 

పెద్ద బంగారుగ్రుడ్డునుండి యుద్బవించుట వలన సూర్యడు హిరణ్యగర్బుడని పిల్వబడును. సూర్యునివలన నింగి నేల దిశలు స్వర్గము అపవర్గము నరకము రసస్థానములు సుర-నర-జంతువులు ప్రాకునవి వృక్షలతలు ఈ సకల జీవకోటి కంతటికిని సూర్యడే యాత్మ. సూర్యడే చక్షురధిదేవత. ఇతడే భూమండల మంతట నిండి విరాజిల్లుచున్నాడు.

సూర్యునివలననే పండితులు ద్యుపరిమాణమును తెల్పుదురు. ఎట్లన రెండు సమభాగములలో నొకటి తెలిసిన రెండవది తెలిసినటులే కదా ! తపించువారిలో శ్రేష్ఠుడగు సూర్యభగవానుడు దివిభువుల మధ్య తన వెల్గులు విరజిమ్ముచుండును. సూర్యుడు ఉత్తరాయనమును ఆశ్రయించియుండి తన నడకలో మాంద్యమును కలిగించుకొనును. ఏలయన ఉత్తరాయన గమనము అతనికి ఆరోహణ (పైకి ఎక్కుచు నడవవలసిన)స్థానము. 

కనుక అతడు దీనిని చేరియుండి. పగటి పరిమాణమును దీర్ఘముగా చేయును. దక్షిణాయనము అతనికి అవరోహణ(ఎత్తునుండి క్రిందికి దిగు) స్థానము. అందుచే అతడు దీనిని చేరి తన నడకను శ్రీఘ్రతరముచేయును. అందుచే అతడు దీనియందు ఉన్నపుడు పగళ్లపరిమాణమును హ్రస్వతరము (చాలపోట్టిదానినిగా) చేయును. విషువత్‌ అను స్థానము - ఒక అయనమునుండి మఱియెక అయనమునకు మారెడి ఒక దినము మాత్రము. ఇది సమస్థానము. 

దీని నాశ్రయించి సూర్యుడు పగటి పరామాణమును రాత్రి పరిమాణమును సమముగా చేయును (ఇది సాధారణుగా మార్చి-సెప్టెంబరు తేదీలకు ఇంచుమించుగా అగును.) ఇది సూర్యడు మేషము నందును తులయందును. చరించు కాలము అగును. అపుడు వేదత్రయమూర్తియగు రవి అహోరాత్రములను సమాన పరిమాణము కలవిగా చేయును. 

వృషభ-మిథున-కర్కట-సింహ-కన్యారాసులలో సూర్యుడున్నపుడు క్రమముగా పగళ్ల పరిమాణ మధికమగుచు రాత్రులు పరిమాణము తగ్గుచు పోవును. వృశ్చికధనుర్‌ - మకర- కుంభ-మీనరాసులందు సూర్యుడుండగా రాత్రుల పరిమాణము పెరుగుచు పగళ్ల పరిమాణము తగ్గుచు పోవును.

శ్రీ నారాయణు ఈవిధముగా పలికెను : ఇకమీదట ఇంకను మిగులను విస్తరరూపమున రవి గమనమును వివరింతును. రవియొక్క గమనము-మాత్రమే కాదు. ఇతర గ్రహముల గమనము కూడ-శీఘ్రము-మందము-సమము-అని మూడు విధములుగ నుండును.

ఓ దేవమునిశ్రేష్ఠా! నారదా! వినుము : రవికే కాదు-సర్వగ్రహములకును స్థానములుమూడు-మధ్యస్థానము-ఉత్తరస్థానము-దక్షిణస్థానము-అని వీనికి వరుసగ-1. జారద్గవము 2. ఐరవతము 3. వైశ్వానరము అనియు పేరులు కలవు. వీనిలో నొక్కొక్కటి మూడు ఉపభేదములతో నుండును.

ఎట్లనగా! ఉత్తర దక్షిణ ధ్రువ నక్షత్రములు రెండు కొనలందుండునట్లు. అంతరిక్షములో అమరియున్న జ్యోతిశ్చక్రము నట్టనడుమ గ్రహములు సంచరించు బాటగా ఇరువది ఏడు నక్షత్రములతో ఏర్పడిన క్రాంతివృత్తము అను చక్రపు అమరిక ఉన్నది. వీనిలో అశ్విని భరణి కృత్తికలు నాగవీథి; రోహిణి మృగశిర ఆర్దృలు-గజవీథి; పునర్వసు-పుష్యమి-ఆశ్లేషలు-ఐరావతవీథి; ఈమూడు విథులను కలిసి ఐరావతవీథియగును. (నాగ-గజ-ఐరావత-మూడును గజములే.) ఈ మూడు వీథులును కలిసి ఉత్తర మార్గము అనబడును.

ముఖ-పూర్వఫల్గుని-ఉత్తరఫల్గుని-అర్షభీవీథి;హస్త-చిత్త-స్వాతి-గోవీథి; విశాఖ-అనూరాధ-జ్యేష్ఠ-జారద్గవ వీథి; ఈ మూడు వీథులును కలిసి జారద్గవవీధి అనబడును. ఈ మూడు వీథులను కలిసి మధ్యమమార్గము. అగును. (ఋషభ-గో-జరద్గు-శతభిషము-మార్గవీథి; పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-వైశ్వానరవీథి; ఈ మూడు వీథులును కలిసి దక్షిణమార్గము అనబడును. 

సూర్యుడు ఉత్తరాయనమును చేరినప్పుడు అతని రథపు కాడి కొనలయందు ఇమిడ్చి వాయువుచే కట్టబడిన పాశములను లాగుట జరుగును. అది అతని నడకలో ఆరోహణము అనబడుచున్నది. అప్పుడు అభ్యంతర భాగమునందలి అంతరిక్ష మండలమున రవి రథ గమనము జరుగును. దానిచే అతని గతిలో మాంద్యము-నెమ్మదితనము-పగళ్ల పరిమాణముల వృద్ది-జరుగును. రాత్రుల పరిమాణము తగ్గును. ఇది సౌమ్యా(ఉత్తరా) యనక్రమము. 

దక్షిణాయనమున ఇవే పాశములు ప్రేరితములై - అనగా ముందునకు సడలించబడి వదలబడిన-అవరోహణము జరుగును. బహిర్మండలమున రవి రథము ప్రవేశించినడుచును. అందుచే అతని రథగతిలో శీఘ్రత్వము వచ్చును. అప్పుడు పగళ్ల పరిమాణము తగ్గి రాత్రుల పరిమాణము పెరుగును. విషువకాలమునందు(ఇది లోగడ చెప్పబడినది.) పాశముల బిగువు సమావస్థలో ఉండుట చేత రాత్రిందినముల పరిమాణములు సమములుగనుండును. 

ఈ నడకలో రవి రథగమనము మధ్యమండలమున జరుగును. రవిరథపు కాడికొనలయందు బిగింపబడిన పాశములు ధ్రువుడు అధిష్టాతగానున్న అంతరిక్షమునందలి వాయువులచే అకర్షింప-లాగ-బడునపుడు సూర్యడు అభ్యంతర మండలమున నెమ్మది నడకతో తిరుగును. 

ధ్రువుడు తన అధీనమునమండు అంతరిక్షవాయు ద్వారమున పాశములను మరల వదిలినపుడు రవి బాహ్యమంజలమున తిరుగును. (పాశముల వదులుటగాని తన దగ్గరకు లాగికొనుటగాని ధ్రువుడు చేయప్పుడు మధ్యమండలమున రవి రథము సంచరించును.)

మేరుపునకు తూర్పుదెసయందు ఇంద్రుని నగరమగు దేవధాని- అమరావతి దక్షిణపు దెస యముని సంయమనీపురి పడమట వరుణుని మహాపురి యగునివ్లూెచని- ఉత్తరమున సౌమ్య- ఉత్తర దిక్కుననుండు కుబేరుని నగరియగు విభావరి- కలవు. (భోగోళముపై ప్రదేశములందు ఉన్నజనుల స్థితినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ దిగ్వ్యవస్థ ఏర్పడును. 

ఏలయన ఎవరికి ఎటనుండి సూర్యుడుదయించు చున్నట్లు కనబడునో అచటివారి కదియే తూర్పు- అందరకును మేరువు మాత్రము ఉత్తరముననే యున్నది. అని ముందు చెప్పబడును.) రవి ఉదయించుచోటు అమరావతి- అతడు అంతరిక్ష మధ్యమునకు చేరి మధ్యాహ్నమును ఏర్పరచు స్థానము సంయమని- అస్తమించు స్థానము నివ్లూెచని- విభావరియును కుబేరపురి అర్ధరాత్రి స్థానము అని వ్యవస్థ. 

ప్రాణుల జీవన ప్రవృత్తులకు మూలము కాలము. దానివ్యవస్థకు మూలము రవి గమనము. దానినిబట్టి ఏర్పడియు రవి రథగతి గుర్తించుటకు సాధనము దిక్కులవ్యవస్థ. మేరువును ఆధారముగా తీసికొని దానికి నాలుగు వైపుల ఈ వ్యవస్థ అంతయు నీకు తెలిపితిని. 

మేరువునందు ఉన్నవారికి ఎప్పుడును అంతరిక్ష మధ్యమున నున్నట్లే సూర్యుడు కనబడును. అతడు ఆ మేరువునకు సవ్య-ఎడమ-దక్షిణ-కుడి-వైపులుగ నడుచుటయే అచ్చటి వారికి ఉదయాస్త మయములు. ఆయాదేశముల యందు విదిశల-మూలల-యందు రవి కనబడుటయే ఆయాకాలవ్యవస్థకు ఆధారము. 

ఎవరికి ఎచ్చట నున్నట్లు రవి కనబడునో వారికి అచ్చట ఉదయము-ఎచ్చట అతడు మరుగుపడినట్లు కనబడునో అచ్చటివారికి అస్తమనము వాస్తవమున సూర్యునకు ఉదయముకాని అస్తమయము కాని ఎప్పుడునులేవు. రవి దర్శనమునకు అందుట అందక పోవుటలే అతని ఉదయాస్తమయములు.

ఇంద్రుడు మున్నగువారి పట్టణములందున్నపుడు రవి మూడు పట్టణములను అనగ నింద్రపురి నున్నప్పు డింద్ర యమ సోమపురములను తాకును. ఆగ్నేయకోణమున నుండగ ఈశాన-ఆగ్నేయనైఋతి కోణములను నింద్ర యమపురములను తాకును. ఎల్ల వర్షద్వీపములకును మేరుపర్వత ముత్తరముగ చెన్ను మీరును. 

ఎవ్వరు భానూదయ మెచ్చట గందురో వారి కది తూరుపగును. వారి కందఱికిని మేరు వుత్తరమున నుండునని మునుల నిశ్చయము. సూర్యు డింద్రపురమునుండి పదునైదు గడియలు పయనించి యమపురిని జేరును. అంతలో రెండుకోట్ల ముప్పది ఏడు లక్షల డెబ్బదియైదువేల యోజనముల దూరము రవి పయనించును. ఇట్లు కాలమును దెల్పు కాలచక్రాత్మకుడైన రవి ప్రయాణించును. 

ఇదే వేగముతో భాస్కరుడు వరుణ సోమేంద్రపురములను దాటును. ఇటుల కాలజ్ఞానమునకు హేతుభూతుడై రవి తిరుగుచుండును. చంద్రాదులగు ఇతర గ్రహములును సూర్యునివలెనే తిరుగుచు ఇతర గ్రహములు సైతము తమ తమ స్థానములగు నక్షత్రములంగూడి యుదయించి యస్తమించుచుండును. 

రవి రథమొక్క ముహూర్తకాలములో ముప్పదినాల్గు లక్షల యెనిమిదివందల యోజనములు ప్రయాణము సాగించును. వేదమయుడగు భానుడు నలుదెసలందున్న పురములను జేరును. ప్రవహమను వాయువువలన రవి రథ మిట్లు తిరుగును. ఈ కాలచక్రాత్మకుని యరదమునకు సంవత్సరమున నొకే చక్రము- మూడు చాతుర్మాస్యములను నాభి పండ్రెండు మాసములనెడి ఆకులు- కలది-కలదు.

ఆరు ఋతువు లనెడు నిరుసు గలదు. ఇట్టి రథమును కవులు సంవత్సరాత్మక మందురు. మేరువుపైని గల మానసోత్తరగిరియందు దీని యొక యక్షము గలదు. మానసోత్తరపర్వతపు పొడవు. 1,57,50,000. ఈ చక్రముయొక్క యితర భాగములవలన కలా-కాష్ఠా ముహూర్తాది విభాగములు చేయబడెను. ఇట్ట చక్రమును రవితైలకారుని యంత్రమువలె (నూనె గానుగవలె) త్రిప్పుచుండును. ఇటుల రథము మానసోత్తరిగిరిని ప్రదక్షిణించును. 

ఆ గిరిపై నున్న యక్షము కాక మఱియొకటి ధ్రువునం దుంచబడెను. ఈ అక్షపు పొడవు మానసోత్తర పర్వతపు పొడవులో నాల్గవవంతు. ఇవి తైల యంత్రముయొక్క యక్షములను బోలియుండును. దీనికిపై నున్న దంతయును లోకపతియగు రవి యుండు భాగము. రథముపై సూర్యుడుండు స్థలము వెడల్పు ముప్పదియారు లక్షల యోజనములంత గలదు. ఇంతియ పరిమాణమున ఎత్తుగల గుఱ్ఱములను గూర్చును. 

గుఱ్ఱములు లోకకల్యాణముకొఱకు భానుని యోయుచుండును. సవితృదేవునికి ముందు సూతుడగు నరుణుడు పడమటి మొగమై యుండును. గరుడుని సోదరు డిట్లు సూతకార్యమునకు నియోగింపబడెను. వాలఖిల్యాది మహర్షు లంగుష్ఠ మాత్రులు. వారు లెక్క కరువదివేల మందిగలరు. వారు రవిమ్రోలచేరి శుభకరములగు వేదసూక్తములతో ఆయనను ప్రస్తుతింతురు. 

అదే విధముగ నితర ఋషులు దేవతలు గంధర్వులు నచ్చరలు నాగులు గ్రామణులు యాతుధానులు నెల్లరును భానుని ప్రస్తుతింతురు. వారు రవిని నెలల కొలది వారముల కొలదిగసేవింతురు. భూమండలమునకు చుట్టు రవి పయనించు కక్ష్య చుట్టు కొలత తొమ్మిదికోట్ల యెకలక్ష యేబదిరెండువేల యోజనములు-ఒక గప్యూతి. ఇంత దీర్ఘ దూరమును భాను డొక్క క్షణమాత్రమున దాటి పోవును. అతడు విశ్వవ్యాపి-దేవదేవేశుడు.

శ్రీ నారాయణు డిట్లనెను : ఇపుడు నరులకు శుభాశుభములు గూర్చునట్టి చంద్రాది గ్రహముల గమనములగూర్చి వినుము. అది మిగుల ఆశ్చర్యకరమైనది. కుమ్మరి సారెపై నున్న కీటకాదులు సారెతోపాటు తిరుగును. అటులే కాలచక్రాత్మకమగు రాశిచక్రముతో బాటుగ గ్రహము లన్నియును మేరునగమునకు ప్రదక్షిణ మొనర్చుచు తమ అక్షమును వదల కుండును. 

భానుడు మొదలగు గ్రహముల గమనము విలక్షణ విధముగ దోచును. గ్రహములు తమ తమకు అధిపత్యము కల నక్షత్రములలో తిరుగుచు నితర గ్రహముల స్థానములను నక్షత్రములందును దిరుగును. ఈ రెండు విధములగు గమనములు పరస్పరము విరోధము లేనివి. భగవాను డాదిపురుషుడు లోకభావనుడు అగునట్టి శ్రీమన్నారాయణుడే స్వయముగ జగముల మేలుకోరి యిట్టుల జ్యోతీరూపమున తిరుగుచుండును. 

అతడే కర్మశుద్ధి కారణముగ త్రయీమము డనబరగును. అతడే సూర్యరూపమున పండ్రెండు భేదములుగ నయ్యెనని తత్త్యవేత్తలందురు. ఆ సూర్యుడే వసంతము మున్నగు నారు ఋతువులను క్రమముగ ననుభవించును. అతడు వానిలో నాయాఋతుధర్మములు నెలకొల్పును. అట్టి యాదిత్య పురుషు నెల్లరును త్రయీవిద్యతో నుపాసింతురు. 

మానవులు తమ వర్ణాశ్రమధర్మములతో వైదిక కర్మలతో కొద్ది గొప్ప క్రియలతో శ్రద్ధాయోగములతో రవినిసేవింతురు. ప్రజలు తమ తమ కోర్కె లీడేరుటకు సతతము భాస్కరునిగూర్చి వేల్తురు. నమస్కరింతురు. దేవగణ స్వరూపములతో తేజరిల్లుచు తిరుగుచు పండ్రెండు మాసము లనుభవించును. మాసమనగ రాత్రిపగలు కలిసిన రెండు పక్షములు. లేక రవి రెండుంబావు నక్షత్రములం దిరుగు కాలము మాసము. ఇట్లు రవి రెండురాసు లనుభవించు కాలమును ఋతు వందురు.

ఈ ప్రకారముగ సంవత్సరము యొక్క యవయవములను తత్త్వవేత్త లభివర్ణించిరి. భానుడు మూడు ఋతువులలో నింగినెంతకాలములో తిరుగునో ఆ కాల పరిమాణమును పెద్దలయనమని వచింతురు. ఇట్లు రవి పండ్రెండు రాసులందును పూర్తిగ తిరుగును. ఇట్లు పండ్రెండు నెల లనుభవించు కాలము నొక సంవత్సర మందురు. సంవత్సరము-పరివత్సరము-ఇడావత్సరము-అనువత్సరము-ఇద్వత్సరము నని సంవత్సర మయిదు విధములు. రవికి మంద-మధ్య-శీఘ్ర గతులు మూడు గలవని కాలవిదులు వాక్రుత్తురు. 
ఈ విధముగ సూర్యగతి గుఱించి తెల్పితిని.

ఇక చంద్రాదులగతి గూర్చి వినుము. చంద్రుడు సూర్యనకు లక్ష యోజనములదూరముననుండి వెన్నెలలు గాయుచుండును. ఓషధులపతి వెన్నెలఱేడు సూర్యుడు సంవత్సరములో నడుచు మార్గమును చంద్రుడు రెండు పక్షములలో పూర్తి చేయును. సూర్యుడు నెల నడచు మార్గమును చంద్రుడు రెండుంబావు నాళ్లలలో (నొకరాశి) ననుభవించును. ఇటు త్వరితగతితో చంద్రుడెల్ల నక్షత్రముల ననుభవించును. 

కళానాథుడగు చంద్రుడు షోడశకళలతో నిండి దేవలతలకును తగ్గిన కళలతో పితృదేవతలకును మోదము చేకూర్చును. ఇతడు పూర్వము-అపరమునను పేర్లతో దివారాత్రులు గల్గించును. చంద్రు డెల్ల జీవకోటికి ప్రాణము-అమృతము. చంద్రుడు సనాతనుడు ఉత్తమపురుషుడు షోడశకళాత్మకుడు; ఇతడు ముప్పది ముహూర్తములలో నొక్కొక్క నక్షత్రము వంతున ననుభవించును. 

చంద్రుడు-మనోమయుడు-సుధాకరుడు-అన్నమయుడు-అమృతధాముడు-శృంగార కళానిధి-ఎల్ల దేవ -పితృ -నర -జంతు -వృక్ష గణములకు తృప్తికురుడు. ఎల్ల ప్రాణులకు ప్రీతికరుడు. కనుక చంద్రుని సర్వమయు డందురు. చంద్రునకు మూడు లక్షల యోజనములమీద నక్షత్ర చక్రము తిరుగుచుండును. ఇవన్నియును భగవంతునిచేత నియోగింపబడి మేరువునకు ప్రదక్షిణము చేయుచుండును.

అభిజిత్తునుగూడి నక్షత్రములు మొత్త మిరువదెనిమిదిగ లెక్కింపబడినవి. వీనికి రెండు లక్షల యోజనముల దూరాన శుక్రుడు ప్రకాశించుచు రవికి ముందువెనుకల సమముగ తిరుగుచుండును. శుక్రునకును శీఘ్ర-సమ-మందగతులు గలవు. ఇతడు లోకుల కనుకూలుడు-మేలు గూర్చువాడు. ఇతడు వర్షము నాపు గ్రహములను శాంత పరచి ప్రాణులకు సుఖము చేకూర్చును. ఇతనికి రెండు లక్షల యోజనముల దూరమున బుధు డొప్పారుచుండును. 

శుక్రునకు వలె బుధునకును శీఘ్ర-సమ-మందగతులు గలవు. ఒక్కొక్కసారి బుధుడు సూర్యునకు చాల దూరముగ నుండును. అపుడు పెనుగాలులు మేఘపాతములు అనావృష్ఠుల భయము సూచింపబడును. 

ఇతనికి పైని రెండు లక్షల యోజనముల దూరమున కుజుడు చెన్నొందుచుండును. కుజుడు వక్రుడు గానిచో మూడు పక్షముల కొక రాశి ననుభవించును. ఇటులే పండ్రెండు రాసు లనుభవించును. ఇతడు పాపగ్రహములలో చేరినవాడు. తఱచుగ నశుభము చేయువాడు. 

ఇతనికి రెండు లక్షల యోజనముల మీద గురుడు విరాజిల్లుచుండును, గురుడు ప్రతీరాశి నొక్క యేడాది యనుభవించును. ఇతడు వక్రించనిచో బ్రహ్మవాదులకు శుభము గల్గును. 

ఇతనికి రెండులక్షల యోజనముల పైని సూర్యసుతుడు క్రూరుడునగు శని గలడు. ఇతడొక్కొక రాశిని ముప్పదినెల లనుభవించును. ఈ విధముగ గ్రహము లన్నియు నొక్కొక్క రాశి చొప్పున నెల్ల రాసులు దిరుగుచుండును. కాలజ్ఞులు శని యెల్లరికినికీడు గల్గించువా డందురు. ఇతనికి మీద నుత్తరముగ పడునొకండు లక్షల యోజనములపైని సప్తర్షి మండలము శోభిల్లు చుండును, ఈ యేడుగురు మునులును లోకహితము చేకూర్చు తలంపుతో విష్ణుపదస్దానమునకు ప్రదక్షిణము చేతురు.

ఆంతరజ్యోతిశ్చక్రం






Lokaloka Parvathamu - లోకాలోక పర్వతము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - లోకాలోక పర్వతము

నారాయణుడిట్లనెను : దానికిపైని లోకాలోకమను పర్వతము గలదు. ఆ పర్వత మధ్యభాగమున సూర్యప్రకాశము పడుచుండును. ఈ పర్వతముపై మేలిమి బంగరు నేల గలదు. అది మానసోత్తరము నుండి మేరువువర కెంత పొడవంత పొడవు గలదు. ఆ బంగారు భూమి నిగ్గుటద్దమువలె నిగ్గులుదేరి యుండును. అందు వేల్పులు తిరుగుచుందురు. అందే వస్తువు పడినను స్వర్ణమయమగును. 

ఓ నారదా ! అందువలన నందే ప్రాణియు నుండదు. ప్రజల కగమ్యమైన దగుటచేత నది లోకాలోకమని వ్యాఖ్యానించబడెను. ఈ సువర్ణస్థలము లోకాలోక పర్వతము మధ్యభాగమున సొంపారుచుండును. భగవంతు డీలోకాలోకమును ముల్లోకముల నట్టనడుమ నుండునట్టు లేర్పఱచెను. సూర్యునినుండి ధ్రవతారవఱకుండు కిరణములన్ని యును లోకాలోక పర్వతమునకు వశమై యవి మూడు లోకములను దాటి పోజాలకున్నవి. 

దేవఋషీ! ఈ పర్వతరాజమెంతెంతయో యెత్తుగ విశాలముగ నుండుటచేత సూర్యకిరణములు దీనిని దాటి యావలికి పోజాలవు. ఈ పర్వతములోకము లన్నింటికిని మానదండముగ నున్నది. ఇది యేబదికోట్ల యోజనములంత విస్తారముగ గలదని కవులందురు. 

ఓయి మునీ ! ఈ లోకాలోకాచలముమొత్తము భూగోళములో నాల్గవవంతు గలదు. స్వయంభువుడగు బ్రహ్మదానికి నలుదెసల నాల్గుస్థానము లేర్పఱచెను. అతడు గిరికి నాల్గు వైపుల దిగ్గజముల నుంచెను. వాని పేర్లు వినుము. ఋషభము, పుష్పచూడము వామనము అపరాజిత మనునవి పేర్లు.

ఎల్లలోకములయునికీ దిగ్గజములు జీవనాడులవంటివందురు. భగవానుడు వానిలోని సంపదలను వీర్యములను పెంపోందింపజేయును. అతడు దాని విశుద్ద సత్త్వమును పెన్నిధుల నినుమడింపచేయును. ఇట్లు భగవానుడగు హరి యచట నెనిమిది సిద్దులను విష్వక్యేనాదులను గూడి విలసిల్లుచుండును. పరమేశ్వరుడెల్లలోకముల మేలుగోరి తన దివ్యాయుధములు దాల్చి యందు వెలుగొందుచుండును. 

సనాతనుడగు శ్రీమహావిష్ణువు తన మాయారచితమగు దీనిని కల్పాంతమువఱకు గాపాడు చుండును. వీని లోపలి వైశాల్యమును బట్టి యాలోక పరిమాణము తెల్పబడెను. దానికి బయట లోకాలోక పర్వతము గలదని చెప్పబడెను. 






Madhuvanam - మధువనం

రామాయణం సుందరకాండ 61వ సర్గ - మధువనం అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు. మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు...