ఈ విధంగా దేవకీదేవి విన్నవించుకోగా శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా! పూర్వం నీవు స్వాయంభువ మనువుకాలంలో పృశ్ని అనుపేరుగల పరమపతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరు సృష్ట్యాదియందు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఇంద్రియాలను నిగ్రహించి, తెగించి, ఎండకు, వానకు, గాలికి, మంచుకు ఓర్చుకొని, ఒంటరిగా, ఆకులలములను భక్షిస్తూ పండ్రెండువేల దివ్యసంవత్సరాలు కఠోరతపస్సు చేశారు. మీ దేహాలు తేజస్సుతో ప్రకాశించాయి. నా జపంచేసి, నా మీద మనస్సు నిలిపి, నన్నే పూజించారు. నేను ప్రత్యక్షమై స్థిరమైన వరాలు కోరుకొమ్మంటే నా మాయవలన, బిడ్డలు లేరనే బాధతో, అతికష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకోకుండా, నాకు సాటిరాగల కొడుకు నిమ్మని కోరుకొన్నారు. నేను మెచ్చి, ఆ వరమిచ్చి, పృశ్నిగర్భుడనే పేరుతో మీ కిప్పుడు జన్మించాను. అంతే కాదు
(లోకంలో ధర్మపాలనకొరకు బ్రహ్మ మనువులను సృజించినవాడు. మనువులు పద్నాలుగుమంది. అందులో మొదటివాడు స్వాయంభువుడు.
అదితి కశ్యపులనే పేర్లతో ప్రసిద్ధులైన మీకు పొట్టివాడి రూపంలో వామనుడనే పేరుతో ఇంద్రుడితమ్ముడిగా మీకు పుట్టాను. అదినా రెండవజన్మ.
మీ కిచ్చిన వరం తప్పకుండ ఇప్పుడు ఈ మూడవజన్మలో మీకిద్దరికి కుమారుణ్ణి అయ్యాను. జరిగిన పూర్వవృత్తాంతమంతా మీకు చెప్పాను. ఇకపై మీ యందు నాకు జన్మ లేదు.
మీరు నన్ను కుమారుడిగా, బ్రహ్మానందస్వరూపుడనైన పరబ్రహ్మంగా భావిస్తూ, నా మీది ప్రేమవల్ల పునర్జన్మ లేని పరమపదాన్ని పొందుతారు. అనీ ఈ విధంగా చెప్పి, జగత్రభువైన శ్రీమహావిష్ణువు శంఖచక్రగదాఖడ్గాదులను ధరించిన చతుర్చాహు స్వరూపాన్ని వదలి
ఓ పరీక్షిన్మహారాజా! తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు రెప్ప లార్పకుండ అట్టె తనను చూస్తూ ఉండగా; మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు. కాలు సేతులు కదలించడం, కన్నులు మూసి తెరవడం, కేవు కేవు మని ఏడవడం మొదలైన వేడుకలను చేశాడు (చూపాడు).
తరువాత వసుదేవుడు సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునివల్ల తాను ఆ బాలునికి చేయవలసిన పనులను తెలిసికొన్నాడు కాబట్టి
ఓ పరీక్షిన్మహారాజా! వసుదేవుడు ఆ బిడ్డను పురిటి ఇంటినుంచి దాటించి తీసుకొని పారిపోవాలని నిశ్చయించుకోగా అక్కడ గోకులంలో నందునిభార్య యశోదాదేవికి, యోగమాయాశక్తి కూతురై జన్మించింది.
అదే సమయంలోనే, వసుదేవుడు చంటి బీడ్డడైన శ్రీకృష్ణుని చేతులతో ఎత్తుకొని, ఎదకు అడ్డంగా అదిమిపట్టుకొని, శబ్దం కాకుండ మెల్లగా అడుగులు వేసుకొంటూ, ఒక్క ఊపున కావలివాళ్ల అడ్డుపాటును జాగ్రత్తగా దాటుకొని, పురిటి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు.
అంత, ఆ స్థలంలో నందునిభార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియని మైకం వ్రేపల్లె ప్రజలనూ, పురిటింటికి కావలియున్న భటులనూ ఆవరించింది.
అప్పుడు వసుదేవుడు పురిటి బిడ్డడైన శ్రీకృష్ణుణ్లి ఎత్తుకొని శబ్దం కాకుండ, అడుగులను నేలమీద ఆనీ ఆననట్లుగా మోపుతూ బయలుదేరాడు. ఆయనకు సంకెళ్ళుగా ఉన్న ఇనుప గొలుసుల మెలికలు వాటి అంతట అవే ఊడిపోయాయి. మహాపురుషుడైన బాలకృష్ణునికి అడ్డుగా ఉండే తాళాలు వాటి అంతట అవే ఊడిపడగా, తలుపులు వాటి అంతట అవే తెరుచుకొని, మార్గాన్ని సుగమం చేశాయి. వసుదేవుడు తలవాకిటిని, చావళ్ళను దాటగానే, ఆదిశేషుడు తన పడగలను ఆ బాలుడికి పైన ఆచ్చాదనంగా కప్పి కాపాడుకొంటూ వెంటరాగా, ఆయన నడువసాగాడు. ఆ సమయంలో
పూర్వం శ్రీరామునికి సముద్రం త్రోవ ఇచ్చినట్లుగానే, స్పష్టంగా కన్పిస్తూ, మిక్కిలి పొడవైన అలలతో నేలను, దిక్కులను, నింగిని ఆక్రమించిన యమునానది ఆ వసుదేవునికి మార్గమిచ్చింది.
ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటివెళ్ళి, నందుని వ్రేపల్లేలో ప్రవేశించి, గాఢనిద్రలో ఉన్న ఆ పల్లెవాసులైన గొల్లల్ని మేల్కొల్పుటకు ఇష్టపడక, ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవిపడకమీద నల్లని ఈ చిన్నబాలుణ్ణి పడుకో పెట్టాడు. త్వర త్వరగా యశోదాదేవికూతురిని ఎత్తుకొని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన యింటికి వచ్చాడు. ఆ పాపను దేవకీదేవి ప్రక్కన పడుకోపెట్టాడు.
(వసుదేవుడు తనయింటికి తిరిగి రావటం అంటే, మధురలో కంసుడు అతణ్ణి బంధించిన కారాగారానికి తిరిగి రావటమే.)
శూరసుతుడైన వసుదేవుడు కాళ్ళకు ఇదివరకున్నట్లుగానే సంకెళ్ళను తగించుకొని, మనస్సులో కలతపడుతూ ఏమీ తెలియనివానివలె భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ముడుచుకొని కూర్చున్నాడు.
ఓ పరీక్షిన్మహారాజా! పద్మంవంటి కన్నులుగల యశోదాదేవి, వసుదేవుడు తన దగ్గరికి బాలకృష్ణుణ్ణి తేవడం గానీ, తన బిడ్డను తీసుకొని పోవడంగానీ తెలియక గాఢనిద్రలో మైమరచి ఉండింది.
తరువాత ఆ బాలిక ఆవుర మని ఏడ్చింది. ఆ శబ్దం విని చెరసాల కావలివారు నిద్రలేచారు. అటు ఇటు తిరిగి చూచారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తరువాత సరాసరి కంసునిదగ్గరకు వెళ్లారు. దేవకీదేవి ప్రసవించింది వెంటనే రండని అన్నారు. కంసుడు తొట్రుపాటుతో పడకమీది నుండి లేచాడు. భయంతో కంపింపసాగాడు. ముడిచిన అతని వెండ్రుకలు చెదరిపోయాయి. పైనున్న ఉత్తరీయం జారిపోయింది. ధైర్యం సడలిపోయింది. కోపాగ్ని ఎగసిపడి మిక్కిలి వైరంతో కంసుడు దేవకీదేవి ప్రసవించిన ఇంటికి వచ్చి ఆ ఆడబిడ్డను చంపాలని దగ్గరకి వచ్చేసరికి
అంతటిలోనే దేవకిదేవి కంసునికి అడ్డంగా వస్తూ ఇలా పలికింది.
అన్నా! శాంతించు మన్నా! వీడు నీ మేనల్లుడు కాడు. నీ మేనకోడలు. ఆడపిల్ల. దీన్ని ఆదరించు. స్త్రీని చంపటం రాజధర్మం కాదు. మంచిపేరు తెచ్చుకో. మహాత్ములు నడిచే మార్గంలో నడువు. నేను నీ తోడబుట్టినదాన్ని కదా. నిన్ను శరణు వేడుతున్నానన్నా!
(అన్నా! ఆకాశవాణి మాటప్రకారం అష్టమసంతానం, కొడుకైతే నీకు ప్రమాదకారి అవుతాడేమో కాని, ఇది ఆడపిల్ల! నిన్నేమి చేయగలదు - అందువల్ల చంపవద్దు అని దేవకీదేవి ప్రార్ధన.)
అన్నా! ఆరుగురు కొడుకులను చంపావు. ఇది ఆడుబీడ్డ. నీకు మేనకోడలు. తప్పనిసరి అన్నట్లు ఈ పాపనుకూడా చంపాల్నా! అన్నా! నీవు కఠినాత్ముడివి. అన్నా! నీవు దయచూపరాదా!
నా కొడుకు గదా, నీ ప్రాణానికి శత్రువని ఆకాశవాణివల్ల విన్నావు. అందువల్ల పుట్టింది కొడుకైతే నీవు చంపవచ్చు. కాని, ఇప్పుడు పుట్టింది ఆడుబిడ్డ. నేను కొడుకులకు నోచుకోలేదు. ఈ కూతురినైనా నాకు దానంగా ఇచ్చి పుణ్యం కట్టుకో.
దేవకీదేవి ఆ విధంగ పలికి, పైటను సవరించుకొని, ఏదేదో మాట్లాడుతూ భ్రాంతికి లోనై తన కూతురిని త్వరత్వరగ ఎత్తుకొని ఎదకు ఒత్తుకొంటూ, తన చెక్కిలిని ఆ పాప చెక్కిలికి ఆనించి భయంతో కంపిస్తూ తటాలున తన పైటచెరగుతో ఆ బిడ్డను కప్పివేసింది. బావురుమని ఏడ్చింది. అప్పుడు కంసుడు అతిశయించిన కోపంతో ఔచిత్యాన్ని వదలి, తోబుట్టువని కూడా చూడకుండా దేవకీదేవిని తిట్టి, కెవ్వుమని ఏడుస్తున్న ఆ పసిపాపకాళ్ళు రెండూ ఎగసి పట్టుకొని లాగి నేలమీద ఎత్తి కొట్టాడు. కాని, ఆ పాప నేలమీద పడలేదు. అవలీలగా పై కగిరింది. దేవలోక పుష్పమాలల పరిమళాలతో, కిరీటంతో, మణిహారాలతో, దివ్యాంబరాలతో అలంకృత అయి మనోహరంగా అగుపించింది. గద, శంఖ, చక్ర, పద్మ, బాణ, ధనుస్సు, ఖడ్గ, శూలాల్ని ధరించి, ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాదిదేవగణాలూ, విమానసంచారులూ కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తుండగా, అప్సరసల ఆటపాటలను మెచ్చుకొంటూ, ఆకాశంలో అగుపించి, కంసునితో కసిగా ఇలా పలికింది.
ఓ దుర్శార్డుడా! పెద్ద తెగింపుతో వెంట వెంటనే దేవకీదేవి బిడ్డల్ని పసిపిల్లల్ని చంపావు. ఇకనైనా శాంతించకుండా, నన్ను బండమీద కొట్టి చంపాలనుకొన్నావు. ఛీ! ఛీ! ఇది కూడా శూరత్వమా? నిన్ను చంపటానికి నాతోపాటు పుట్టిన వీరుడు ఒకచోట కీర్తింపబడుతూ పెరుగుతున్నాడు.
అని అంటూ, ఇంకా ఆ యోగమాయాదేవి మహనీయగుణాలు కలిగి, భక్తులకు శుభాలను కల్గిస్తూ, సకలజనులు పూజిస్తుండగా, వివిధ ప్రదేశాల్లో, వివిధనామాలతో దర్శనమిస్తూంది.
ఆ యోగమాయ పలికిన ముచ్చటైన మాటలు ములుకులవలె తన చెవిని సోకగా, కంసుడు అదరిపడి, బెదరిన మనస్సుతో మిక్కిలి ఆశ్చర్యపడి, బాధపడ్డాడు. పిదప దుఃఖీస్తున్న దేవకీ వసుదేవులను రప్పించి, ఆదరంగా, గౌరవంగా వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు.
సాధుజనులైన దేవకీవసుదేవులారా! నేను పాపాత్ముణ్ణి; పసిపాపల చంపినవాణ్ణి; బంధువుల మీద ప్రేమ లేనివాణ్ణి; చెడుబుద్ధి కలవాణ్ణి; కోపస్వభావం ఉండేవాణ్ణి; బతికికూడా చచ్చినవాడితో సమానమైనవాణ్ణి. బ్రహ్మహత్య చేసినవానివలె మీ బిడ్డలను చంపాను. ఆకాశవాణిమాటలు నమ్మాను. నా పాపాలు ఏకరువుపెట్టక నన్ను దయతో చూడండి. శాంతించండి
జీవులంతా తాము చేసిన కర్మల ననుసరించి, ఒక్కొక్కరు ఒక్కొక విధమైన శరీరంతో జన్మించి, ఒక్కొక్క మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. కష్టాలు అనుభవిస్తుంటారు. ఏ జన్మ స్నేహ సంబంధాలను ఆ జన్మతో వదలుకోరు. ఆలాంటప్పుడు నేను మీ బిడ్డల్ని చంపడం ఏమిటి? వాళ్ళు నాచేత చావడం ఏమిటి? మీరు నన్ను నిందించడం దేనికి?
అజ్ఞాని తాను శత్రువులను నశింపచేశానని, లేదా శత్రువులచేత నాశనమయ్యానని అనుకొంటాడు. కాని, ఆత్మకు మిత్రత్వ శత్రుత్వాలు లేవు. మిత్రత్వ శత్రుత్వాల సంబంధం కర్మబంధంతో ముడివడి ఉంటుంది సుమా!
అని చెప్పి, కంసుడు కన్నీరు కార్చి, దుఃఖించి, భయపడుతూ దేవకీవసుదేవుల పాదాలకు నమస్కరించి, సంకెళ్ళు విప్పించి, ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి పశ్చాత్తప్తుడైన ఆ కంసుణ్ణి చూచి, దేవకీ వసుదేవులు తమ కోపాన్ని విడనాడారు. తరువాత వసుదేవుడు తనబావ కంసునితో ఇలా అన్నాడు.
బావా! కంసా! నీవు చెప్పినమాట నిజం. అజ్ఞానానికి, భ్రమకు లోనై, ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేక - నీవూ, నేనూ అనే భేదభావంతో; లోభ, మోహ, మద, భయ, శత్రుత్వభావాలకు, సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకొంటున్నారు. (ఇది జ్ఞాని లక్షణంకాదు. జ్ఞాని సర్వత్ర సమదర్శనుడు,)
అని ఆ విధంగా ప్రశాంతచిత్తులైన దేవకీవసుదేవుల అనుమతిని పొంది, కంసుడు తన అంతఃపురానికి వెళ్ళి, ఆ రాత్రిగడపి, మరునాటి ఉదయం తనకు పూర్తిగా విధేయులైన మంత్రుల్ని వెంటనే రప్పించి, యోగమాయాదేవివల్ల తాను విన్న వృత్తాంతమంతా ఏకాంతంలో వారికి చెప్పాడు. అది విన్న మంత్రులు కంసునితో ఇలా అన్నారు.
ఓ కంసరాజా! యోగమాయాశక్తి చెప్పింది నిజమైతే, ఆలస్యం చేయటం ఎందుకు? వెంటనే మమ్మల్ని పంపండి. పట్టణాల్లో, పల్లెల్లో, గొల్లపల్లెల్లో పుట్టే పిల్లల్ని పెరిగే పిల్లల్ని పట్టి వధిస్తాము.
ప్రభూ! భయంకరంగా ప్రకాశించే మీ చేతి ధనుస్సులో వెలుగుతున్న బాణాల దెబ్బలు తిని దేవతాధిపతులు ఏమై పోయారో? ఎక్కడ తల దాచుకొన్నారో? (కైలాసంలో) శివుణ్ణి శరణు జొచ్చారో! (సత్యలోకంలో) బ్రహ్మను ఆశ్రయించారో! (వైకుంఠంలో); విష్ణుమూర్తిని సేవిస్తున్నారో! అదీ కాకపోతే మునివృత్తిని స్వీకరించి, అడవుల నడుమ ఉన్నారో! మనం వెంటనే వాళ్లందర్నీ వెదకడం మంచిది.
శత్రువులు దెబ్బతిన్నారులే అని విచ్చలవిడిగా తిరుగ కూడదు. వాళ్ళు అనేకరూపాల్లో మోసగించి దండెత్తి వస్తారు. అందువల్ల శత్రువులు చచ్చేదాకా రాజు వాళ్ళఉనికిని మరువ కూడదు.
విజృంభించిన రోగాల్నీ శత్రువుల్నీ, ఇంద్రియాల్నీ బలపడ నీయకూడదు. అవి పుట్టినపుడే వాటిని అణచి వేయాలి గాని, మెతకదనం వహించకూడదు. ఆ తరువాత వాటిని జయించటం సాధ్యం కాదు.
దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీమహావిష్ణువే ముఖ్యుడు. ఆ విష్ణువు ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు. ఆవులు, బ్రాహ్మణులు, ఓర్పు, వేదాలు, దయ, సత్యం, యాగాలు, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శ్రద్ధ, శాంతి - ఇవి విష్ణుస్వరూపాలు. వీటి నన్నింటినీ సంహరిస్తే ఆ విష్ణుమూర్తి అంతమౌతాడు.
కనుక, ఓ కంసరాజా! దేవతల్ని హతమార్చ మంటావా? మహర్షుల్ని బెదరింపులతో, అరపులతో యమధర్మరాజు దగ్గరికి పంప మంటావా? దూడలతో కూడా ఆవుల్ని చంప మంటావా? బ్రాహ్మణుల్ని తరిమి వేయమంటావా? వేదాలను ధ్వంసం చేయ మంటావా? భూమిని అణచివేయ మంటావా? ఆజ్ఞాపించి, మమ్మల్ని పంపండి.
కంసుడు ఆ విధంగా చెపుతున్నమంత్రులఆలోచనలకు లొంగినవాడై, బ్రాహ్మణుల్ని హింసించడం మంచిది కాదని యెంచక, కాలమనే పాశానికి బద్దుడై బ్రాహ్మణులు మొదలైన సజ్జనుల నందరిని చంపటానికి రాక్షసుల్ని పంపించి, తన అంతఃపురానికి వెళ్ళాడు. తరువాత ఆ రాక్షసులు క్రూరంగా మాట్లాడుతూ సజ్జనుల్ని వెంటాడి, బెదిరించి, గర్జించి, వేయించి, అనేక దుష్టచేష్టలతోవాళ్ళను హింసించడంలో విజయం సాధించారు. పాపాలు మూటగట్టుకొన్నారు.
రాక్షసవీరులు వెదకి వెదకి సజ్జనుల్ని అణచివేయగా, ఆ రాక్షసుల శక్తులుకూడా అణగిపోయాయి. సాధువుల్ని బాధిస్తే కీర్తి సంపద, ధర్మం, ఆయుస్సు, క్షేమం అన్నీ నశిస్తాయి కదా!
తరువాత వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకొని, మహానందభరితుడై సమర్ధులైన వేదపండితుల్ని రావించి, తాను స్నానంచేసి పరిశుద్దుడై, చక్కగా అలంకరించుకొని, స్వస్తివాచక పుణ్యాహవచన మంత్రాలను చదివించి, వేదవిహితజాతకర్మలు చేయించి, పితృదేవతలను పూజించి, అలంకరించిన రెండులక్షల పాడిఆవుల్ని దూడలతోకూడ బ్రాహ్మణుల కిచ్చాడు. అంతేకాదు - బంగారుకలశాల్నీ మణుల్నీ వస్త్రాల్నీ కొండలవంటి ఏడునువ్వల రాసుల్నీ బ్రాహ్మణులకు దానం చేయగా
పుట్టిన బిడ్డకు నందుడు జాతకర్మాది వైదిక కార్యక్రమాలు జరిపించి, బ్రాహ్మణులకు ఎక్కువగా దానాలిచ్చిన తరువాత, ఆ బ్రాహ్మణులందరూ, ఈ నందగోపుని కుమారుడు ఐశ్వర్యవంతుడు, శత్రువీరులను జయించేవాడు, పూర్ణాయువు కలిగినవాడు అవుతాడని ఆశీర్వదించారు.
నగారాలు మ్రోగాయి. గాయకులు పాడారు. సూతులు, వందిజనులు కీర్తించారు. మంగళకరాలైన బాకాల ధ్వనులు ముమ్మరంగా వినిపించాయి.
యాదవనాయకుల ఇళ్ళవాకిళ్ళన్నీ చిగురుటాకుల తోరణాలతో, అందమైన తీవలతో, ఎత్తెన జెండాలతో, పరిమళ ధూపాల సువాసనలతో చూడముచ్చటగా ప్రకాశించాయి.
ఓ పరీక్షిన్మహారాజా! మందల్లోని ఆవులకు పసుపు, కుంకుమ, నూనె పూయగా అవి మెరుగైన కాంతితో బంగారు నెమళ్ళ పింఛాల కాంతివంటి కాంతిగల పసిమిరంగుతో ప్రకాశిస్తూ తిరుగాడాయి.
బాలకృష్ణుడు పుట్టగానే లేగదూడలు చెంగు చెంగున గంతులేశాయి. మదించిన వృషభాలు రంకెలు వేశాయి. ఆవులు పొదుగులనుండి పాలు వర్షించాయి. (అనగా వ్రేపల్లెలో పశువులు కూడా ఆనందంతో పరవశించాయి.)
నందరాజు పుత్రుడు పుట్టినాడనే ఆనందంతో వేదమంత్రాలు, పురాణాలు చదివే బ్రాహ్మణులకు, స్తోత్రాలు చేసే వందిమాగధులకు, ఇంద్రజాలాలు, గారడీలు, పగటివేషాలు మొదలైన విద్యలతో బ్రతికేవారికి, దారిద్యంతో బాధపడేవారికి, వాళ్ళు కోరకముందే గోవులను, ధనరాసులను దానమిచ్చాడు.
శ్రీకృష్ణుడు పుట్టిన ఆ వేళలో, గోపకులందరు అంగీలు తొడుగుకొని, తలపాగాలు చుట్టుకొని, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించి ప్రకాశిస్తూ, మంచి పదార్థాలు కానుకలుగా తీసుకొని బాలకృష్ణుణ్ణి చూడడానికై వచ్చారు.
వ్రేపల్లెలోని గొల్లలంతా వచ్చి, బాలకృష్ణుని చూచి, సంతోషంతో చెలరేగి, సరసాలాడుకొంటూ నేతులతో, పెరుగులతో, పాలతో, నీళ్ళతో, వెన్నతో ప్రియమార వసంతా లాడుకొన్నారు.
ఆ తర్వాత, ఓ అమ్మలారా! ఏ నోము నోచిన ఫలమో గాని ఇప్పుడు ఒక శుభవార్త విన్నాం. మన యశోదమ్మ ఒక చిన్ని మగబిడ్డను కనిందట! వెళ్ళి చూచి వస్తా రండి.
ఆ విధంగా గోపికలు అనుకొని, ఒకరినొకరు పిలుచుకొని చిన్ని కృష్ణుని చూడాలనే తహ తహ త్వర పెట్టగా, లెస్సగా అలంకరించుకొని తమ యిండ్ల నుండి బయలుదేరి
మెల్లని నడకలతో, పెద్దపిరుదులతో, సన్ననినడుములతో, లావుగ, బిగువుగా ఉన్న చన్నులతో; విశాలమైన నేత్రాలతో; లక్ష్మీకూడా తడబడే కళలతో కూడుకొన్న ముఖాలతో; తుమ్మెదలవంటి నల్లని వెంట్రుకల కొప్పులతో ఒప్పుగా
గోపస్త్రీలందరు సంతోషంతో వడివడిగా తమ కొప్పులముడులు వీడగా, రొమ్ములమీది హారాలవరుసలు అటూ ఇటూ ఊగిసలాడగా, చెక్కిళ్ళమీది బంగారుమకరికాపత్రాలకాంతులు వేడుక చేయగా, పైటకొంగులు కదలాడగా - అందరు ఒకటిగా చేరి, యశోదయింటికి వెళ్లి జయశీలుడు, సర్వవ్యాపకుడు అయిన చిన్నికృష్ణుణ్ణి వరుసగా చూచారు.
గోపికలు చిన్ని కృష్ణుని చూచి, ఎంతో సంతోషించి, తాము తెచ్చిన కానుకలు ఇచ్చి
ఆ గోపస్త్రీలందరు బాలకృష్ణుడికి నూనెతో తల అంటి, శరీరానికి పసుపు పూసి, స్నానం చేయించారు, శ్రీహరి నీకు రక్షపో! అని అంటూ చుట్టూరా కొన్ని నీళ్లు పడునట్లు చల్లి, రక్ష పెట్టి, ఉయ్యాలలో పడుకో పెట్టి, ఆశీర్వదిస్తూ జోలపాటలు పాడారు.
జో!జో! తామరరేకువంటి కన్నులు కల ఓ కృష్ణా నిద్రపోవయ్యా! సింహం నడుంవంటి నడుంగల కృష్ణయ్యా జో జో! చిగురుటాకులవల మృదువైన చేతులు, పాదాలు వున్న కన్నయ్యా జో జో! నిండు చందురునివలె నిండైన ముఖంతోవున్న కృష్ణా జో జో అంటూ జోకొడతాము నిద్రించవయ్యా కృష్ణా!
('జో' అంటే - పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మెల్లగా అరచేతితో వీపుమీద తడుతూ చెప్పే పదం - నిద్రించు అని తాత్పర్యం. 'జో, జో' అనేది 'జో' శబ్దంయొక్క ఆమ్రేడితం (రెండుమార్లు వచ్చిన పదం,)
అంటూ ఇలా జోలపాట పాడుతుండగా, పెక్కుమార్లు ప్రళయకాల సముద్రజలాల్లో ముంచి, ప్రకాశించే ఆ బహురూపధారి, కృష్ణుడు ఇప్పుడు గోపస్త్రీల చేతుల నుండి పోసే నీళ్ళలో సంతోషంగా తడుస్తున్నాడు (స్నానం చేస్తున్నాడు).
(ప్రళయకాలంలో “వట పత్రశాయి” అయిన ఈ తోయగాడు, ఒకప్పుడు మహామత్స్యంగా, మరొకప్పుడు కూర్మంగాను, ఇంకొకప్పుడు ఆదివరాహంగాను ఇలా వివిధరూపాల్లో జలాల్లో సంచరించిన వీడు, ప్రస్తుతం గోపికలు నీళ్లు పోస్తుండగా కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నాడట - చిన్ని కృష్ణుడు. అంటే నీళ్ళలో (నారములు) తిరుగాడడం, మునగడం 'ఈ తోయగాడికి కొత్తేమీ కాదు'. అని విశేషాంశం.)
లోకాలన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుతూ, తానుమాత్రం మెలకువగా ఉండే అందగాడు, గోపికలు జోకొట్టుతూ ఉంటే నిద్రపోయిన వానివలె కళ్ళు మూసికొని కదలకుండా పడుకున్నాడు.
పుట్టుకే లేని పరమాత్మ ఇప్పుడొక గొల్లయింట్లో పుట్టాడు. ఏ కర్మలూ ఎరుగనిఒంటరికి ఇప్పుడు జాతకర్మలు జరిగాయి. ఏ తల్లి చనుబాలూ త్రావని గడుసరి ఇప్పుడు యశోదచనుబాలరుచి మరిగాడు. ఏ హాని వృద్ధులు లేని పరమాత్మ ఇప్పుడు యశోదపొత్తిళ్ళలో వృద్ధి పొందుతున్నాడు. ఏ తపస్సులకూ పండనిపంట ఇప్పుడు గోపకాంతుల వీథిలో పండాడు. ఏ విద్యలవల్లా ఇట్టిదిట్టిదని చెప్పసాధ్యం కాని అర్ధం, ఇప్పుడు ఈ బాలకృష్ణునిఅందమైన అవయవాల్లో అగుపిస్తూ ఉంది.
(పరమాత్మకు ఏ రూప, గుణ, వికారాలుగాని, కర్మలు గాని, సంబంధ బాంధవ్యాలు గాని ఉండవు. కానీ ఒక కార్యార్థమై అవతరించినపుడు రూపగుణాలు ఏర్పడతాయి.)
చిన్నికృష్ణుడు బాల్యచేష్టలు చేసేటప్పుడు బ్రహ్మవలె, సంతోషం నిండినచూపులతో నవ్వేటప్పుడు విష్ణుమూర్తివలె; రోషంతో ఉన్నప్పుడు రుద్రునివలె, ఆనందతన్మయత్వంలో ఉన్నప్పుడు పరబ్రహ్మవలె కన్పిస్తున్నాడు.
(పరమాత్మ మనం అనుకొనే బ్రహ్మ కాదు; విష్ణువు కాదు; శివుడు కాదు. ఆయన ఈ త్రిమూర్తులకు అతీతుడైన తేజోమయుడు; విశ్వచైతన్యస్వరూపుడు.)
ఇలా ఉండే ఆ సమయంలో, నందుడు తనకు కొడుకు పుట్టాడన్న సంతోషాతిశయంలో రోహిణీదేవిని పిలిపించి, ఆమె తృప్తి చెందేటట్లు రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు.
శ్రీకృష్ణుడు జన్మించింది మొదలు ఆలమందలు పొదుగులనిండ పాలతో కనువిందు చేశాయి. నందుడు వ్రేపల్లె రక్షణకు దక్షులైన పెక్కుమంది గోపకులను నియమించాడు. తరువాత మథురకు వెళ్ళి ప్రతిసంవత్సరం కట్టవలసిన కప్పాన్ని కంసునికి అర్పించి, అతని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి, తగురీతిగ వసుదేవుని దర్శించి,
వసుదేవుడు నందుణ్ణి చూడగానే ప్రాణంలేని శరీరానికి ప్రాణం వచ్చినట్లు ఉత్సాహవంతుడై, ఆనందబాష్పాలు కనుకొలకులు నిండగా, చేతులు చాచి కౌగిలించుకొన్నాడు.
వసుదేవుడు మరొకసారి నందుజణ్ణి కౌగిలించుకొని, సుఖంగా అతణ్ణి కూర్చుండపెట్టి, తన కుమారుడైన బాలకృష్ణుని మీది ప్రేమ ప్రకటమయ్యేటట్టుగా ఆయనతో ఇలా అన్నాడు.
సంతానం లేదని ఇదివరలో ఎంతో చింతిస్తూ, ముసలితనం మీదపడిన ఇప్పుడు నీకు సంతతి కలగడం చాల అదృష్టం. సంతానం లేనివారికి సుఖాలు ఉండవు కదా.
ఓ నందుడా! నిన్ను చూచాను కనుక బ్రతికాను. ఇకమీద నాకు కష్టాలుండవు. చేసే పనులలో ఏవిధమైన అరమరికలు లేని ఒక మంచిమిత్రుణ్ణి చూడటం, చచ్చి, మళ్ళీ పుట్టడమే కదా!
జీవితంలో అనేకవిధాలైన కష్టాలుపడే మానవులంతా ఈ నేలమీద ఒకేచోట ఉండటం వీలు పడుతుందా? నదీప్రవాహాల్లో పడి కలిసి వెళ్ళే మ్రాకులు విడివడకుండా ఉంటాయా? వేర్వేరు మార్గాల్లో వెళ్ళకుండా ఉంటాయా?
'నందరాజా! గోవులు వివిధరోగాలకు గురి కాకుండా ఉన్నాయి కదా? పాడిఆవులు పుష్కలంగా పాలు ఇస్తున్నాయి కదా? గుంటల్లో, వాగుల్లో నీళ్ళు నిండి ఉన్నాయి కదా? ఆలమందలు ఉండే ప్రదేశాల్లో పులులు, దుప్పులు తిరుగాడటం లేదు కదా? గొల్లపల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి గదా? ఆ పల్లెల ప్రక్కనున్న అడవుల్లో పచ్చగడ్డి మెండుగా ఉందికదా? అని వసుదేవుడు అనేక కుశల ప్రశ్నలడిగాడు.
తన కొడుకులను, స్నేహితులను, తనకు ముఖ్యులైనవారిని తృప్తిపరచకుండా, వారిబాగోగులు చూడకుండా, వారు అంతకంతకు క్షీణించి నశిస్తుంటే-తాను బాగా బ్రతుకుతూ గృహస్థాశ్రమంలో ఉండేవాడికి ఏ విధమైన సంతోషమైనా ఉంటుందా?
నందా! నీవు, నీ భార్య ప్రేమతో చూస్తుండగా, నిన్ను తండ్రిగా చూస్తూ, వ్రేపల్లెలో నా కొడుకు ఆనందంగా ఉన్నాడు కదా?
అని వసుదేవుడు పలుకగా, దానికి నందుడు ఇట్లన్నాడు.
ఇదివరలో నీకూ, దేవకీదేవికీ పుట్టిన కొడుకులందరినీ, వెంటవెంటనే కంసుడు వధించాడు. చివరకు మీ కుమార్తెను కూడా చంపబోగా, ఆ బాలిక అతని చేతినుండి తప్పించుకొని, ఆకాశాని కెగిరిపోయింది. విధివశాన ఆపద ఏర్పడినపుడు వివేకవంతుడు దుఃఖించ వచ్చునా? వసుదేవా! ఊరట చెందు. నా కొడుకునే నీ కొడుకని అనుకో.
అని పలికిన నందమహారాజుతో, వసుదేవుడు మళ్లీ ఈ విధంగా అన్నాడు.
ఓ నందరాజా! కంసునికి కప్పం కట్టావు. మమ్మల్ని చూడటానికి వచ్చావు. మేముకూడా మిమ్మల్ని చూచాం. చాల సంతోషం. వ్రేపల్లెలో ఉపద్రవాలు కలిగే సూచనలు కన్పిస్తున్నాయి. వాటిల్ని ముందు జాగ్రత్తతో ఎదుర్కోవాలి. నీ విక వెళ్ళు.
కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
అదితి కశ్యపులనే పేర్లతో ప్రసిద్ధులైన మీకు పొట్టివాడి రూపంలో వామనుడనే పేరుతో ఇంద్రుడితమ్ముడిగా మీకు పుట్టాను. అదినా రెండవజన్మ.
మీ కిచ్చిన వరం తప్పకుండ ఇప్పుడు ఈ మూడవజన్మలో మీకిద్దరికి కుమారుణ్ణి అయ్యాను. జరిగిన పూర్వవృత్తాంతమంతా మీకు చెప్పాను. ఇకపై మీ యందు నాకు జన్మ లేదు.
మీరు నన్ను కుమారుడిగా, బ్రహ్మానందస్వరూపుడనైన పరబ్రహ్మంగా భావిస్తూ, నా మీది ప్రేమవల్ల పునర్జన్మ లేని పరమపదాన్ని పొందుతారు. అనీ ఈ విధంగా చెప్పి, జగత్రభువైన శ్రీమహావిష్ణువు శంఖచక్రగదాఖడ్గాదులను ధరించిన చతుర్చాహు స్వరూపాన్ని వదలి
ఓ పరీక్షిన్మహారాజా! తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు రెప్ప లార్పకుండ అట్టె తనను చూస్తూ ఉండగా; మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు. కాలు సేతులు కదలించడం, కన్నులు మూసి తెరవడం, కేవు కేవు మని ఏడవడం మొదలైన వేడుకలను చేశాడు (చూపాడు).
తరువాత వసుదేవుడు సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునివల్ల తాను ఆ బాలునికి చేయవలసిన పనులను తెలిసికొన్నాడు కాబట్టి
ఓ పరీక్షిన్మహారాజా! వసుదేవుడు ఆ బిడ్డను పురిటి ఇంటినుంచి దాటించి తీసుకొని పారిపోవాలని నిశ్చయించుకోగా అక్కడ గోకులంలో నందునిభార్య యశోదాదేవికి, యోగమాయాశక్తి కూతురై జన్మించింది.
అదే సమయంలోనే, వసుదేవుడు చంటి బీడ్డడైన శ్రీకృష్ణుని చేతులతో ఎత్తుకొని, ఎదకు అడ్డంగా అదిమిపట్టుకొని, శబ్దం కాకుండ మెల్లగా అడుగులు వేసుకొంటూ, ఒక్క ఊపున కావలివాళ్ల అడ్డుపాటును జాగ్రత్తగా దాటుకొని, పురిటి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు.
అంత, ఆ స్థలంలో నందునిభార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియని మైకం వ్రేపల్లె ప్రజలనూ, పురిటింటికి కావలియున్న భటులనూ ఆవరించింది.
అప్పుడు వసుదేవుడు పురిటి బిడ్డడైన శ్రీకృష్ణుణ్లి ఎత్తుకొని శబ్దం కాకుండ, అడుగులను నేలమీద ఆనీ ఆననట్లుగా మోపుతూ బయలుదేరాడు. ఆయనకు సంకెళ్ళుగా ఉన్న ఇనుప గొలుసుల మెలికలు వాటి అంతట అవే ఊడిపోయాయి. మహాపురుషుడైన బాలకృష్ణునికి అడ్డుగా ఉండే తాళాలు వాటి అంతట అవే ఊడిపడగా, తలుపులు వాటి అంతట అవే తెరుచుకొని, మార్గాన్ని సుగమం చేశాయి. వసుదేవుడు తలవాకిటిని, చావళ్ళను దాటగానే, ఆదిశేషుడు తన పడగలను ఆ బాలుడికి పైన ఆచ్చాదనంగా కప్పి కాపాడుకొంటూ వెంటరాగా, ఆయన నడువసాగాడు. ఆ సమయంలో
పూర్వం శ్రీరామునికి సముద్రం త్రోవ ఇచ్చినట్లుగానే, స్పష్టంగా కన్పిస్తూ, మిక్కిలి పొడవైన అలలతో నేలను, దిక్కులను, నింగిని ఆక్రమించిన యమునానది ఆ వసుదేవునికి మార్గమిచ్చింది.
ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటివెళ్ళి, నందుని వ్రేపల్లేలో ప్రవేశించి, గాఢనిద్రలో ఉన్న ఆ పల్లెవాసులైన గొల్లల్ని మేల్కొల్పుటకు ఇష్టపడక, ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవిపడకమీద నల్లని ఈ చిన్నబాలుణ్ణి పడుకో పెట్టాడు. త్వర త్వరగా యశోదాదేవికూతురిని ఎత్తుకొని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన యింటికి వచ్చాడు. ఆ పాపను దేవకీదేవి ప్రక్కన పడుకోపెట్టాడు.
(వసుదేవుడు తనయింటికి తిరిగి రావటం అంటే, మధురలో కంసుడు అతణ్ణి బంధించిన కారాగారానికి తిరిగి రావటమే.)
శూరసుతుడైన వసుదేవుడు కాళ్ళకు ఇదివరకున్నట్లుగానే సంకెళ్ళను తగించుకొని, మనస్సులో కలతపడుతూ ఏమీ తెలియనివానివలె భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ముడుచుకొని కూర్చున్నాడు.
ఓ పరీక్షిన్మహారాజా! పద్మంవంటి కన్నులుగల యశోదాదేవి, వసుదేవుడు తన దగ్గరికి బాలకృష్ణుణ్ణి తేవడం గానీ, తన బిడ్డను తీసుకొని పోవడంగానీ తెలియక గాఢనిద్రలో మైమరచి ఉండింది.
తరువాత ఆ బాలిక ఆవుర మని ఏడ్చింది. ఆ శబ్దం విని చెరసాల కావలివారు నిద్రలేచారు. అటు ఇటు తిరిగి చూచారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తరువాత సరాసరి కంసునిదగ్గరకు వెళ్లారు. దేవకీదేవి ప్రసవించింది వెంటనే రండని అన్నారు. కంసుడు తొట్రుపాటుతో పడకమీది నుండి లేచాడు. భయంతో కంపింపసాగాడు. ముడిచిన అతని వెండ్రుకలు చెదరిపోయాయి. పైనున్న ఉత్తరీయం జారిపోయింది. ధైర్యం సడలిపోయింది. కోపాగ్ని ఎగసిపడి మిక్కిలి వైరంతో కంసుడు దేవకీదేవి ప్రసవించిన ఇంటికి వచ్చి ఆ ఆడబిడ్డను చంపాలని దగ్గరకి వచ్చేసరికి
అంతటిలోనే దేవకిదేవి కంసునికి అడ్డంగా వస్తూ ఇలా పలికింది.
అన్నా! శాంతించు మన్నా! వీడు నీ మేనల్లుడు కాడు. నీ మేనకోడలు. ఆడపిల్ల. దీన్ని ఆదరించు. స్త్రీని చంపటం రాజధర్మం కాదు. మంచిపేరు తెచ్చుకో. మహాత్ములు నడిచే మార్గంలో నడువు. నేను నీ తోడబుట్టినదాన్ని కదా. నిన్ను శరణు వేడుతున్నానన్నా!
(అన్నా! ఆకాశవాణి మాటప్రకారం అష్టమసంతానం, కొడుకైతే నీకు ప్రమాదకారి అవుతాడేమో కాని, ఇది ఆడపిల్ల! నిన్నేమి చేయగలదు - అందువల్ల చంపవద్దు అని దేవకీదేవి ప్రార్ధన.)
అన్నా! ఆరుగురు కొడుకులను చంపావు. ఇది ఆడుబీడ్డ. నీకు మేనకోడలు. తప్పనిసరి అన్నట్లు ఈ పాపనుకూడా చంపాల్నా! అన్నా! నీవు కఠినాత్ముడివి. అన్నా! నీవు దయచూపరాదా!
నా కొడుకు గదా, నీ ప్రాణానికి శత్రువని ఆకాశవాణివల్ల విన్నావు. అందువల్ల పుట్టింది కొడుకైతే నీవు చంపవచ్చు. కాని, ఇప్పుడు పుట్టింది ఆడుబిడ్డ. నేను కొడుకులకు నోచుకోలేదు. ఈ కూతురినైనా నాకు దానంగా ఇచ్చి పుణ్యం కట్టుకో.
దేవకీదేవి ఆ విధంగ పలికి, పైటను సవరించుకొని, ఏదేదో మాట్లాడుతూ భ్రాంతికి లోనై తన కూతురిని త్వరత్వరగ ఎత్తుకొని ఎదకు ఒత్తుకొంటూ, తన చెక్కిలిని ఆ పాప చెక్కిలికి ఆనించి భయంతో కంపిస్తూ తటాలున తన పైటచెరగుతో ఆ బిడ్డను కప్పివేసింది. బావురుమని ఏడ్చింది. అప్పుడు కంసుడు అతిశయించిన కోపంతో ఔచిత్యాన్ని వదలి, తోబుట్టువని కూడా చూడకుండా దేవకీదేవిని తిట్టి, కెవ్వుమని ఏడుస్తున్న ఆ పసిపాపకాళ్ళు రెండూ ఎగసి పట్టుకొని లాగి నేలమీద ఎత్తి కొట్టాడు. కాని, ఆ పాప నేలమీద పడలేదు. అవలీలగా పై కగిరింది. దేవలోక పుష్పమాలల పరిమళాలతో, కిరీటంతో, మణిహారాలతో, దివ్యాంబరాలతో అలంకృత అయి మనోహరంగా అగుపించింది. గద, శంఖ, చక్ర, పద్మ, బాణ, ధనుస్సు, ఖడ్గ, శూలాల్ని ధరించి, ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాదిదేవగణాలూ, విమానసంచారులూ కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తుండగా, అప్సరసల ఆటపాటలను మెచ్చుకొంటూ, ఆకాశంలో అగుపించి, కంసునితో కసిగా ఇలా పలికింది.
ఓ దుర్శార్డుడా! పెద్ద తెగింపుతో వెంట వెంటనే దేవకీదేవి బిడ్డల్ని పసిపిల్లల్ని చంపావు. ఇకనైనా శాంతించకుండా, నన్ను బండమీద కొట్టి చంపాలనుకొన్నావు. ఛీ! ఛీ! ఇది కూడా శూరత్వమా? నిన్ను చంపటానికి నాతోపాటు పుట్టిన వీరుడు ఒకచోట కీర్తింపబడుతూ పెరుగుతున్నాడు.
అని అంటూ, ఇంకా ఆ యోగమాయాదేవి మహనీయగుణాలు కలిగి, భక్తులకు శుభాలను కల్గిస్తూ, సకలజనులు పూజిస్తుండగా, వివిధ ప్రదేశాల్లో, వివిధనామాలతో దర్శనమిస్తూంది.
ఆ యోగమాయ పలికిన ముచ్చటైన మాటలు ములుకులవలె తన చెవిని సోకగా, కంసుడు అదరిపడి, బెదరిన మనస్సుతో మిక్కిలి ఆశ్చర్యపడి, బాధపడ్డాడు. పిదప దుఃఖీస్తున్న దేవకీ వసుదేవులను రప్పించి, ఆదరంగా, గౌరవంగా వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు.
సాధుజనులైన దేవకీవసుదేవులారా! నేను పాపాత్ముణ్ణి; పసిపాపల చంపినవాణ్ణి; బంధువుల మీద ప్రేమ లేనివాణ్ణి; చెడుబుద్ధి కలవాణ్ణి; కోపస్వభావం ఉండేవాణ్ణి; బతికికూడా చచ్చినవాడితో సమానమైనవాణ్ణి. బ్రహ్మహత్య చేసినవానివలె మీ బిడ్డలను చంపాను. ఆకాశవాణిమాటలు నమ్మాను. నా పాపాలు ఏకరువుపెట్టక నన్ను దయతో చూడండి. శాంతించండి
జీవులంతా తాము చేసిన కర్మల ననుసరించి, ఒక్కొక్కరు ఒక్కొక విధమైన శరీరంతో జన్మించి, ఒక్కొక్క మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. కష్టాలు అనుభవిస్తుంటారు. ఏ జన్మ స్నేహ సంబంధాలను ఆ జన్మతో వదలుకోరు. ఆలాంటప్పుడు నేను మీ బిడ్డల్ని చంపడం ఏమిటి? వాళ్ళు నాచేత చావడం ఏమిటి? మీరు నన్ను నిందించడం దేనికి?
అజ్ఞాని తాను శత్రువులను నశింపచేశానని, లేదా శత్రువులచేత నాశనమయ్యానని అనుకొంటాడు. కాని, ఆత్మకు మిత్రత్వ శత్రుత్వాలు లేవు. మిత్రత్వ శత్రుత్వాల సంబంధం కర్మబంధంతో ముడివడి ఉంటుంది సుమా!
అని చెప్పి, కంసుడు కన్నీరు కార్చి, దుఃఖించి, భయపడుతూ దేవకీవసుదేవుల పాదాలకు నమస్కరించి, సంకెళ్ళు విప్పించి, ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి పశ్చాత్తప్తుడైన ఆ కంసుణ్ణి చూచి, దేవకీ వసుదేవులు తమ కోపాన్ని విడనాడారు. తరువాత వసుదేవుడు తనబావ కంసునితో ఇలా అన్నాడు.
బావా! కంసా! నీవు చెప్పినమాట నిజం. అజ్ఞానానికి, భ్రమకు లోనై, ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేక - నీవూ, నేనూ అనే భేదభావంతో; లోభ, మోహ, మద, భయ, శత్రుత్వభావాలకు, సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకొంటున్నారు. (ఇది జ్ఞాని లక్షణంకాదు. జ్ఞాని సర్వత్ర సమదర్శనుడు,)
అని ఆ విధంగా ప్రశాంతచిత్తులైన దేవకీవసుదేవుల అనుమతిని పొంది, కంసుడు తన అంతఃపురానికి వెళ్ళి, ఆ రాత్రిగడపి, మరునాటి ఉదయం తనకు పూర్తిగా విధేయులైన మంత్రుల్ని వెంటనే రప్పించి, యోగమాయాదేవివల్ల తాను విన్న వృత్తాంతమంతా ఏకాంతంలో వారికి చెప్పాడు. అది విన్న మంత్రులు కంసునితో ఇలా అన్నారు.
ఓ కంసరాజా! యోగమాయాశక్తి చెప్పింది నిజమైతే, ఆలస్యం చేయటం ఎందుకు? వెంటనే మమ్మల్ని పంపండి. పట్టణాల్లో, పల్లెల్లో, గొల్లపల్లెల్లో పుట్టే పిల్లల్ని పెరిగే పిల్లల్ని పట్టి వధిస్తాము.
ప్రభూ! భయంకరంగా ప్రకాశించే మీ చేతి ధనుస్సులో వెలుగుతున్న బాణాల దెబ్బలు తిని దేవతాధిపతులు ఏమై పోయారో? ఎక్కడ తల దాచుకొన్నారో? (కైలాసంలో) శివుణ్ణి శరణు జొచ్చారో! (సత్యలోకంలో) బ్రహ్మను ఆశ్రయించారో! (వైకుంఠంలో); విష్ణుమూర్తిని సేవిస్తున్నారో! అదీ కాకపోతే మునివృత్తిని స్వీకరించి, అడవుల నడుమ ఉన్నారో! మనం వెంటనే వాళ్లందర్నీ వెదకడం మంచిది.
శత్రువులు దెబ్బతిన్నారులే అని విచ్చలవిడిగా తిరుగ కూడదు. వాళ్ళు అనేకరూపాల్లో మోసగించి దండెత్తి వస్తారు. అందువల్ల శత్రువులు చచ్చేదాకా రాజు వాళ్ళఉనికిని మరువ కూడదు.
విజృంభించిన రోగాల్నీ శత్రువుల్నీ, ఇంద్రియాల్నీ బలపడ నీయకూడదు. అవి పుట్టినపుడే వాటిని అణచి వేయాలి గాని, మెతకదనం వహించకూడదు. ఆ తరువాత వాటిని జయించటం సాధ్యం కాదు.
దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీమహావిష్ణువే ముఖ్యుడు. ఆ విష్ణువు ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు. ఆవులు, బ్రాహ్మణులు, ఓర్పు, వేదాలు, దయ, సత్యం, యాగాలు, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శ్రద్ధ, శాంతి - ఇవి విష్ణుస్వరూపాలు. వీటి నన్నింటినీ సంహరిస్తే ఆ విష్ణుమూర్తి అంతమౌతాడు.
కనుక, ఓ కంసరాజా! దేవతల్ని హతమార్చ మంటావా? మహర్షుల్ని బెదరింపులతో, అరపులతో యమధర్మరాజు దగ్గరికి పంప మంటావా? దూడలతో కూడా ఆవుల్ని చంప మంటావా? బ్రాహ్మణుల్ని తరిమి వేయమంటావా? వేదాలను ధ్వంసం చేయ మంటావా? భూమిని అణచివేయ మంటావా? ఆజ్ఞాపించి, మమ్మల్ని పంపండి.
కంసుడు ఆ విధంగా చెపుతున్నమంత్రులఆలోచనలకు లొంగినవాడై, బ్రాహ్మణుల్ని హింసించడం మంచిది కాదని యెంచక, కాలమనే పాశానికి బద్దుడై బ్రాహ్మణులు మొదలైన సజ్జనుల నందరిని చంపటానికి రాక్షసుల్ని పంపించి, తన అంతఃపురానికి వెళ్ళాడు. తరువాత ఆ రాక్షసులు క్రూరంగా మాట్లాడుతూ సజ్జనుల్ని వెంటాడి, బెదిరించి, గర్జించి, వేయించి, అనేక దుష్టచేష్టలతోవాళ్ళను హింసించడంలో విజయం సాధించారు. పాపాలు మూటగట్టుకొన్నారు.
రాక్షసవీరులు వెదకి వెదకి సజ్జనుల్ని అణచివేయగా, ఆ రాక్షసుల శక్తులుకూడా అణగిపోయాయి. సాధువుల్ని బాధిస్తే కీర్తి సంపద, ధర్మం, ఆయుస్సు, క్షేమం అన్నీ నశిస్తాయి కదా!
తరువాత వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకొని, మహానందభరితుడై సమర్ధులైన వేదపండితుల్ని రావించి, తాను స్నానంచేసి పరిశుద్దుడై, చక్కగా అలంకరించుకొని, స్వస్తివాచక పుణ్యాహవచన మంత్రాలను చదివించి, వేదవిహితజాతకర్మలు చేయించి, పితృదేవతలను పూజించి, అలంకరించిన రెండులక్షల పాడిఆవుల్ని దూడలతోకూడ బ్రాహ్మణుల కిచ్చాడు. అంతేకాదు - బంగారుకలశాల్నీ మణుల్నీ వస్త్రాల్నీ కొండలవంటి ఏడునువ్వల రాసుల్నీ బ్రాహ్మణులకు దానం చేయగా
పుట్టిన బిడ్డకు నందుడు జాతకర్మాది వైదిక కార్యక్రమాలు జరిపించి, బ్రాహ్మణులకు ఎక్కువగా దానాలిచ్చిన తరువాత, ఆ బ్రాహ్మణులందరూ, ఈ నందగోపుని కుమారుడు ఐశ్వర్యవంతుడు, శత్రువీరులను జయించేవాడు, పూర్ణాయువు కలిగినవాడు అవుతాడని ఆశీర్వదించారు.
నగారాలు మ్రోగాయి. గాయకులు పాడారు. సూతులు, వందిజనులు కీర్తించారు. మంగళకరాలైన బాకాల ధ్వనులు ముమ్మరంగా వినిపించాయి.
యాదవనాయకుల ఇళ్ళవాకిళ్ళన్నీ చిగురుటాకుల తోరణాలతో, అందమైన తీవలతో, ఎత్తెన జెండాలతో, పరిమళ ధూపాల సువాసనలతో చూడముచ్చటగా ప్రకాశించాయి.
ఓ పరీక్షిన్మహారాజా! మందల్లోని ఆవులకు పసుపు, కుంకుమ, నూనె పూయగా అవి మెరుగైన కాంతితో బంగారు నెమళ్ళ పింఛాల కాంతివంటి కాంతిగల పసిమిరంగుతో ప్రకాశిస్తూ తిరుగాడాయి.
బాలకృష్ణుడు పుట్టగానే లేగదూడలు చెంగు చెంగున గంతులేశాయి. మదించిన వృషభాలు రంకెలు వేశాయి. ఆవులు పొదుగులనుండి పాలు వర్షించాయి. (అనగా వ్రేపల్లెలో పశువులు కూడా ఆనందంతో పరవశించాయి.)
నందరాజు పుత్రుడు పుట్టినాడనే ఆనందంతో వేదమంత్రాలు, పురాణాలు చదివే బ్రాహ్మణులకు, స్తోత్రాలు చేసే వందిమాగధులకు, ఇంద్రజాలాలు, గారడీలు, పగటివేషాలు మొదలైన విద్యలతో బ్రతికేవారికి, దారిద్యంతో బాధపడేవారికి, వాళ్ళు కోరకముందే గోవులను, ధనరాసులను దానమిచ్చాడు.
శ్రీకృష్ణుడు పుట్టిన ఆ వేళలో, గోపకులందరు అంగీలు తొడుగుకొని, తలపాగాలు చుట్టుకొని, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించి ప్రకాశిస్తూ, మంచి పదార్థాలు కానుకలుగా తీసుకొని బాలకృష్ణుణ్ణి చూడడానికై వచ్చారు.
వ్రేపల్లెలోని గొల్లలంతా వచ్చి, బాలకృష్ణుని చూచి, సంతోషంతో చెలరేగి, సరసాలాడుకొంటూ నేతులతో, పెరుగులతో, పాలతో, నీళ్ళతో, వెన్నతో ప్రియమార వసంతా లాడుకొన్నారు.
ఆ తర్వాత, ఓ అమ్మలారా! ఏ నోము నోచిన ఫలమో గాని ఇప్పుడు ఒక శుభవార్త విన్నాం. మన యశోదమ్మ ఒక చిన్ని మగబిడ్డను కనిందట! వెళ్ళి చూచి వస్తా రండి.
ఆ విధంగా గోపికలు అనుకొని, ఒకరినొకరు పిలుచుకొని చిన్ని కృష్ణుని చూడాలనే తహ తహ త్వర పెట్టగా, లెస్సగా అలంకరించుకొని తమ యిండ్ల నుండి బయలుదేరి
మెల్లని నడకలతో, పెద్దపిరుదులతో, సన్ననినడుములతో, లావుగ, బిగువుగా ఉన్న చన్నులతో; విశాలమైన నేత్రాలతో; లక్ష్మీకూడా తడబడే కళలతో కూడుకొన్న ముఖాలతో; తుమ్మెదలవంటి నల్లని వెంట్రుకల కొప్పులతో ఒప్పుగా
గోపస్త్రీలందరు సంతోషంతో వడివడిగా తమ కొప్పులముడులు వీడగా, రొమ్ములమీది హారాలవరుసలు అటూ ఇటూ ఊగిసలాడగా, చెక్కిళ్ళమీది బంగారుమకరికాపత్రాలకాంతులు వేడుక చేయగా, పైటకొంగులు కదలాడగా - అందరు ఒకటిగా చేరి, యశోదయింటికి వెళ్లి జయశీలుడు, సర్వవ్యాపకుడు అయిన చిన్నికృష్ణుణ్ణి వరుసగా చూచారు.
గోపికలు చిన్ని కృష్ణుని చూచి, ఎంతో సంతోషించి, తాము తెచ్చిన కానుకలు ఇచ్చి
ఆ గోపస్త్రీలందరు బాలకృష్ణుడికి నూనెతో తల అంటి, శరీరానికి పసుపు పూసి, స్నానం చేయించారు, శ్రీహరి నీకు రక్షపో! అని అంటూ చుట్టూరా కొన్ని నీళ్లు పడునట్లు చల్లి, రక్ష పెట్టి, ఉయ్యాలలో పడుకో పెట్టి, ఆశీర్వదిస్తూ జోలపాటలు పాడారు.
జో!జో! తామరరేకువంటి కన్నులు కల ఓ కృష్ణా నిద్రపోవయ్యా! సింహం నడుంవంటి నడుంగల కృష్ణయ్యా జో జో! చిగురుటాకులవల మృదువైన చేతులు, పాదాలు వున్న కన్నయ్యా జో జో! నిండు చందురునివలె నిండైన ముఖంతోవున్న కృష్ణా జో జో అంటూ జోకొడతాము నిద్రించవయ్యా కృష్ణా!
('జో' అంటే - పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మెల్లగా అరచేతితో వీపుమీద తడుతూ చెప్పే పదం - నిద్రించు అని తాత్పర్యం. 'జో, జో' అనేది 'జో' శబ్దంయొక్క ఆమ్రేడితం (రెండుమార్లు వచ్చిన పదం,)
అంటూ ఇలా జోలపాట పాడుతుండగా, పెక్కుమార్లు ప్రళయకాల సముద్రజలాల్లో ముంచి, ప్రకాశించే ఆ బహురూపధారి, కృష్ణుడు ఇప్పుడు గోపస్త్రీల చేతుల నుండి పోసే నీళ్ళలో సంతోషంగా తడుస్తున్నాడు (స్నానం చేస్తున్నాడు).
(ప్రళయకాలంలో “వట పత్రశాయి” అయిన ఈ తోయగాడు, ఒకప్పుడు మహామత్స్యంగా, మరొకప్పుడు కూర్మంగాను, ఇంకొకప్పుడు ఆదివరాహంగాను ఇలా వివిధరూపాల్లో జలాల్లో సంచరించిన వీడు, ప్రస్తుతం గోపికలు నీళ్లు పోస్తుండగా కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నాడట - చిన్ని కృష్ణుడు. అంటే నీళ్ళలో (నారములు) తిరుగాడడం, మునగడం 'ఈ తోయగాడికి కొత్తేమీ కాదు'. అని విశేషాంశం.)
లోకాలన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుతూ, తానుమాత్రం మెలకువగా ఉండే అందగాడు, గోపికలు జోకొట్టుతూ ఉంటే నిద్రపోయిన వానివలె కళ్ళు మూసికొని కదలకుండా పడుకున్నాడు.
పుట్టుకే లేని పరమాత్మ ఇప్పుడొక గొల్లయింట్లో పుట్టాడు. ఏ కర్మలూ ఎరుగనిఒంటరికి ఇప్పుడు జాతకర్మలు జరిగాయి. ఏ తల్లి చనుబాలూ త్రావని గడుసరి ఇప్పుడు యశోదచనుబాలరుచి మరిగాడు. ఏ హాని వృద్ధులు లేని పరమాత్మ ఇప్పుడు యశోదపొత్తిళ్ళలో వృద్ధి పొందుతున్నాడు. ఏ తపస్సులకూ పండనిపంట ఇప్పుడు గోపకాంతుల వీథిలో పండాడు. ఏ విద్యలవల్లా ఇట్టిదిట్టిదని చెప్పసాధ్యం కాని అర్ధం, ఇప్పుడు ఈ బాలకృష్ణునిఅందమైన అవయవాల్లో అగుపిస్తూ ఉంది.
(పరమాత్మకు ఏ రూప, గుణ, వికారాలుగాని, కర్మలు గాని, సంబంధ బాంధవ్యాలు గాని ఉండవు. కానీ ఒక కార్యార్థమై అవతరించినపుడు రూపగుణాలు ఏర్పడతాయి.)
చిన్నికృష్ణుడు బాల్యచేష్టలు చేసేటప్పుడు బ్రహ్మవలె, సంతోషం నిండినచూపులతో నవ్వేటప్పుడు విష్ణుమూర్తివలె; రోషంతో ఉన్నప్పుడు రుద్రునివలె, ఆనందతన్మయత్వంలో ఉన్నప్పుడు పరబ్రహ్మవలె కన్పిస్తున్నాడు.
(పరమాత్మ మనం అనుకొనే బ్రహ్మ కాదు; విష్ణువు కాదు; శివుడు కాదు. ఆయన ఈ త్రిమూర్తులకు అతీతుడైన తేజోమయుడు; విశ్వచైతన్యస్వరూపుడు.)
ఇలా ఉండే ఆ సమయంలో, నందుడు తనకు కొడుకు పుట్టాడన్న సంతోషాతిశయంలో రోహిణీదేవిని పిలిపించి, ఆమె తృప్తి చెందేటట్లు రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు.
శ్రీకృష్ణుడు జన్మించింది మొదలు ఆలమందలు పొదుగులనిండ పాలతో కనువిందు చేశాయి. నందుడు వ్రేపల్లె రక్షణకు దక్షులైన పెక్కుమంది గోపకులను నియమించాడు. తరువాత మథురకు వెళ్ళి ప్రతిసంవత్సరం కట్టవలసిన కప్పాన్ని కంసునికి అర్పించి, అతని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి, తగురీతిగ వసుదేవుని దర్శించి,
వసుదేవుడు నందుణ్ణి చూడగానే ప్రాణంలేని శరీరానికి ప్రాణం వచ్చినట్లు ఉత్సాహవంతుడై, ఆనందబాష్పాలు కనుకొలకులు నిండగా, చేతులు చాచి కౌగిలించుకొన్నాడు.
వసుదేవుడు మరొకసారి నందుజణ్ణి కౌగిలించుకొని, సుఖంగా అతణ్ణి కూర్చుండపెట్టి, తన కుమారుడైన బాలకృష్ణుని మీది ప్రేమ ప్రకటమయ్యేటట్టుగా ఆయనతో ఇలా అన్నాడు.
సంతానం లేదని ఇదివరలో ఎంతో చింతిస్తూ, ముసలితనం మీదపడిన ఇప్పుడు నీకు సంతతి కలగడం చాల అదృష్టం. సంతానం లేనివారికి సుఖాలు ఉండవు కదా.
ఓ నందుడా! నిన్ను చూచాను కనుక బ్రతికాను. ఇకమీద నాకు కష్టాలుండవు. చేసే పనులలో ఏవిధమైన అరమరికలు లేని ఒక మంచిమిత్రుణ్ణి చూడటం, చచ్చి, మళ్ళీ పుట్టడమే కదా!
జీవితంలో అనేకవిధాలైన కష్టాలుపడే మానవులంతా ఈ నేలమీద ఒకేచోట ఉండటం వీలు పడుతుందా? నదీప్రవాహాల్లో పడి కలిసి వెళ్ళే మ్రాకులు విడివడకుండా ఉంటాయా? వేర్వేరు మార్గాల్లో వెళ్ళకుండా ఉంటాయా?
'నందరాజా! గోవులు వివిధరోగాలకు గురి కాకుండా ఉన్నాయి కదా? పాడిఆవులు పుష్కలంగా పాలు ఇస్తున్నాయి కదా? గుంటల్లో, వాగుల్లో నీళ్ళు నిండి ఉన్నాయి కదా? ఆలమందలు ఉండే ప్రదేశాల్లో పులులు, దుప్పులు తిరుగాడటం లేదు కదా? గొల్లపల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి గదా? ఆ పల్లెల ప్రక్కనున్న అడవుల్లో పచ్చగడ్డి మెండుగా ఉందికదా? అని వసుదేవుడు అనేక కుశల ప్రశ్నలడిగాడు.
తన కొడుకులను, స్నేహితులను, తనకు ముఖ్యులైనవారిని తృప్తిపరచకుండా, వారిబాగోగులు చూడకుండా, వారు అంతకంతకు క్షీణించి నశిస్తుంటే-తాను బాగా బ్రతుకుతూ గృహస్థాశ్రమంలో ఉండేవాడికి ఏ విధమైన సంతోషమైనా ఉంటుందా?
నందా! నీవు, నీ భార్య ప్రేమతో చూస్తుండగా, నిన్ను తండ్రిగా చూస్తూ, వ్రేపల్లెలో నా కొడుకు ఆనందంగా ఉన్నాడు కదా?
అని వసుదేవుడు పలుకగా, దానికి నందుడు ఇట్లన్నాడు.
ఇదివరలో నీకూ, దేవకీదేవికీ పుట్టిన కొడుకులందరినీ, వెంటవెంటనే కంసుడు వధించాడు. చివరకు మీ కుమార్తెను కూడా చంపబోగా, ఆ బాలిక అతని చేతినుండి తప్పించుకొని, ఆకాశాని కెగిరిపోయింది. విధివశాన ఆపద ఏర్పడినపుడు వివేకవంతుడు దుఃఖించ వచ్చునా? వసుదేవా! ఊరట చెందు. నా కొడుకునే నీ కొడుకని అనుకో.
అని పలికిన నందమహారాజుతో, వసుదేవుడు మళ్లీ ఈ విధంగా అన్నాడు.
ఓ నందరాజా! కంసునికి కప్పం కట్టావు. మమ్మల్ని చూడటానికి వచ్చావు. మేముకూడా మిమ్మల్ని చూచాం. చాల సంతోషం. వ్రేపల్లెలో ఉపద్రవాలు కలిగే సూచనలు కన్పిస్తున్నాయి. వాటిల్ని ముందు జాగ్రత్తతో ఎదుర్కోవాలి. నీ విక వెళ్ళు.
కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
No comments:
Post a Comment