Sunday, April 19, 2026

Rohit's escape - Harishchandra's waterlogging - రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం

రాజు సంతోషముతో తన కార్యములు తానొనరించుచుండెను. వరుణు డిట్లు మాటిమాటికి వచ్చుట గని తెలివిగల రాకొమరుడు యాగసమయము దాపగు టెఱిగి చింతాక్రాంతుడయ్యెను. రాజకుమారుడు తన తండ్రి శోక కారణము వారి-వీరి- వలన నెఱింగి తనకు చావు మూడుట తెలుసుకొని యచ్చోటు వదలిపెట్ట నిశ్చయించుకొనెను. అతడు తన తోడి మంత్రికుమారులతోడ చక్కగ నాలోచించి వెళ్ళుటకు నిర్ణయించుకొని నగరు వెదలి వనముల కేగెను.

అట్లు రాకొమరుడు వెళ్లుటవలన రాజు దుఃఖితుడై తనకొడుకును వెదుకదలచి భటుల నంపెను. కొంతకాలము గడిచిన మీదట వరుణుడు మరల రాజభవనమునకు వచ్చి శోకతప్తుడగు రాజుతో యాగము చేయుమనెను. 

అంత రాజతనికి మ్రొక్కి యిట్లనెను: ఓ దేవదేవా! నా కుమారుడు భయాకులుడై యెచటికో పారిపోయెను. పోయినజాడ తెలియుటలేదు. ఇపుడేమి చేతును? వరుణదేవా! అంతట గిరిదుర్గములందు నా దూతల నంపి వెదకించితిని. కాని నా కొడుకు కనబడలేదు. 

మహారాజా! సర్వజ్ఞా! నా కొడుకు వెళ్ళిపోయెను. ఇపుడు నేనేమి చేయవలయునో నన్నాజ్ఞాపింపుము. అంతయు నా దురదృష్టము. రాజు మాటలువిని వరుణుడు మహాకోపముతో నన్ను నీ వెన్నియోసారులు వంచించి తివి. 

రాజా! నీవు మాట నిలువబెట్టుకొనలేక నన్ను మోసగింతివి. కనుక నీకు జలోదరమను దారుణవ్యాధి సంక్రమించు గాక! అని శపించెను. వరుణుడు రాజును శపింపగ రాజపుడు దుఃఖము గలిగించు వ్యాధిచే నెంతయో పీడితుడయ్యెను. 

ఇట్లు వరుణుడు రాజును శపించి తన చోటి కేగెను. రాజు మహారోగ పీడితుడై మిక్కిలి దుఃఖించెను.

వ్యాసుడిట్లనెను: వరుణుడు వెళ్ళిన పిదప రాజు మిక్కిలి రోగపీడితుడయ్యెను. అతడు దుర్బర దుఃఖమును నెక్కువ క్లేశముననుభవించెను. తనతండ్రి రోగపీడితుడైన విషయము వనమందున్న రాకుమారుడు వినెను. అతడు పితృ భక్తి గలవాడై తన తండ్రి సన్నిధి కేగదంచెను. 

ఒక యేడాది గడిచిన పిమ్మటరోహితుడు తన తండ్రిని చూచుటకు వెళ్లదలచుట యెఱిగి యింద్రుడతని చెంతకేగెను. ఇంద్రుడు విప్ర వేషమున వచ్చి తన తండ్రిని జేరబోవుచున్న కుమారు నుపాయముతో నిలిపి వేసెను. 

ఇంద్రుడిట్లనెను : ఓ రాజపుత్త్రా! నీవు దుర్లభమైన రాజనీతి నెఱుగవు. అందులకే నీవు మూఢుడవై నీ తండ్రి చెంతకేగదలచితివి. నీవక్కడకేగినచో నీ తండ్రి వేదపారగులగు విప్రులచేత నిన్ను మండెడు నగ్నిలో హోమము చేయించును. ఎల్ల ప్రాణల కాత్మ ప్రియమైనది గదా! 

భార్యా-పుత్రులు-ధనము సర్వమాత్మ కొఱకే ప్రియమగుచున్నది. తన రోగ నివారణకు దేహ రక్షణకు నీ తండ్రి ప్రియుసుతుడవగు నిన్ను తప్పక హోమము చేయగలడు. 

కనుక రాచపట్టీ! నీ విపుడు నీ తండ్రి చెంతకరుగవలదు. నీ తండ్రి మరణించిన పిమ్మట నపుడు రాజ్యమునకుతప్పక వెళ్ళవచ్చును. ఇట్లులింద్రుడు రాకుమారు నడ్డగింపగ నతడు మఱిమొక యేడువఱ కడవిలోనే యుండెను. ఆ పిదప హరిశ్చంద్రుడు చాల దుఃఖితుడగుట విని రోహీతుడు చావుదీనకు తెగించి తన తండ్రిని జేర నిశ్చయించుకొనెను. 

అజీగర్తుడి ధనలోభం

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య  స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...