Saturday, August 29, 2026

Sruti Geethalu - శ్రుతి గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - శ్రుతి గీతలు

జనక శ్రుతదేవులకథ ముగించిన శుకునితో శ్రోత అయిన పరీక్షిత్తు మళ్లీ ప్రశ్నించాడు. “అయ్యా! ఘటపటాది వస్తు జాతానికి ఎలా ఉంటాయో అలా బ్రహ్మతత్త్వానికి సత్త్వరజస్తమోగుణాలు, రూపం, కార్యకారణబంధం ఉండదుగదా! అలాంటి వస్తుజాతతత్త్వాన్ని వర్ణించే స
త్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు భగవత్తత్వాన్ని ఎలా నిర్వచించగలవు?” ఈ సందేహాన్ని నివృత్తి చేయుము అన్నాడు. 

అపుడు పరీక్షిత్తుతో శుకుడు ఇలా చెప్పాడు. "చేతనపదార్దాలు, చైతన్యరహిత వస్తువులు అన్నిటిలో ఉన్న ఈశ్వరుడు 'సర్వ' అనే శబ్దంతో సంబోధించబడతాడు. అన్ని ప్రాణుల్లో ప్రాణాలు, ఆత్మ, శరీరం, వాటి అంగాలు, హృదయం, మనస్సు వీటిల్ని సృష్టించి జీవులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. 

కాబట్టి, వేదాలు భగవంతుని రూపగుణవైభవాల్ని ప్రతిపాదించేవే. అవి ముఖ్యసాధనాలు. వేదాల్లో భగవంతుణ్ణి వర్ణించే స్తోత్రాలన్నీ ఉపనిషత్తులంత గొప్పవి. వీటిని ఋషుల పరంపరచే పొంది ఎవడు శ్రద్ధాసక్తులతో అనుసంధించుకొనునో వానికి మోక్షం తథ్యం. 

నారాయణునిపేరుమీదుగాగల ఒక ఉపాఖ్యానం ఈ విధానాన్ని వివరిస్తుంది. భగవద్భక్తుడైన నారదుడు ఒకనాడు కలాపగ్రామంలోని నారాయణాశ్రమానికి వెళ్లి, ఋషులతో ఉన్న నారాయణుడనే ఋషిని, నువ్వు నన్ను అడిగినట్టే అడిగినాడు. ఆయన గతంలో ఇలాగే శ్వేతద్వీపవాసులైన సనకసనందనాదులు అడిగిన ఇదే సందేహానికి సనందనుడు చెప్పిన జవాబును నీకు (నారదునికి) తెలుపుతాను. అని చెప్పసాగాడు. 

ఒక చక్రవర్తి నిద్రించినపుడు అతని గుణగణాలు, శౌర్యము, దక్షతలను వందిమాగధులు ఎలా స్తోత్రం చేస్తారో అలాగే యోగనిద్రా పరవశుడైన భగవంతుణ్ణి, వేదాలు స్తోత్రంచేస్తున్నాయి. ఈ స్తోత్ర భాగాలైన వేదాలు అలాంటి సత్యాన్ని ప్రవచిస్తున్నాయి. అని నారదునికి చెప్పినాడు. 

ఆ 'నారాయణాఖ్యమైనగాథను' నారదునికి చెప్పిన దాన్ని విస్తారంగా శ్రుతిగీతాల రూపంలో శుకుడు మళ్ళీ చెప్పసాగాడు.

ఓ విష్ణూ! నీకు జయం. జయం. అన్ని జంతువులకు జ్ఞానం నీవల్లనే కలుగుతోంది. కనుక ఆ జ్ఞానంతో వారుచేసే దోషాల్ని సుగుణాలుగా భావించి, షడ్గుణపరిపూర్ణుల్నిచేసి, ఆత్మలలో తిరుగాడుతూ, కార్యమూ కారణమూ నీవే అయి ప్రవర్తిస్తున్న నీయందే వేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలతో కూడిన స్వభావంనుండి మాకున్న బంధం తెంపు. యోగుల హృదయాల్లో నిరంతరం ఉండేవాడా! నీకు జయం.

అంతేగాక, యోగులు ఈ భౌతిక సృష్టిని, దీనిలోని ప్రతివస్తువును బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. ప్రళయకాలంలో సర్వప్రకృతీ నశించినా నీవొక్కడవే మిగిలిపోతావు. సృష్టి, లయాలలో ఈ సర్వప్రపంచం నీలోనే పుటుతూంది. కుండలు మొ॥ మట్టితో చేసిన వస్తువులు - మట్టిలోనే కలిసినట్లు బుద్ధి వాక్‌ కర్మలు నీలోనే లీనమవుతున్నాయి.

జ్ఞానులు భూమి పైపుట్టి జీవితంలో 'అనివార్యమైన కర్మలు' చేస్తూ, తద్ద్వారా పాపాదులు, ఆపై తిరిగి జన్మలు ఎత్తడం కాక, నీపై శ్రద్ధపెట్టి సేవిస్తూ కృతార్థులు అవుతూరు.

పురాణపురుషా! కాల, లయాదిక స్వరూపమైన ఈ సృష్టిలోని ప్రాపంచికులు, సర్వపాపవినాశకరమైన నీ అమృత కథలతో తరిస్తూ

నిండు వేసవిఎండకు తీవ్రంగా మాడుతున్న బాటసారి ఒక్కసారి చల్లనినీటిస్నానంచేస్తే ఎలా ఆనందిస్తాడో, సంసారమనే తాపాన్ని భరించలేక నిన్ను సేవించే మహానుభావులు దాన్ని పోగొట్టుకుంటారు. ఇక ముసలితనం, మరణం, మనోవాంఛలు వీటినుండి నీ భక్తులు విముక్తులు అవుతారని ప్రత్యేకించి చెప్పేపనేముంది?

అంతేగాక, దేహి శాశ్వతం, దేహం అశాశ్వతం (దేహి = జీవుడు, దేహం = శరీరం)అనే అంశాలతో కూడిన పంచకోశాలు అభివృద్ది చెందుతాయి; అందులోని పంచమకోశం అయిన ఆనందమయుడివి నీవే! నీవు స్వయం ప్రకాశకుడవు. నీవు అధీనంలో ఉంచుకోవడంవల్లే ప్రకృతి, మహత్తు, అహంకారరూప ఆత్మ, పంచతన్మాత్రలు, పంచభూతాలు, వాటి తత్త్వంతో కూడిన సృష్టిలక్షణాలు, విశ్వకార్యాలు, తత్‌సాధన కారణాలు అన్నీ సర్వసమర్థంగా, నియమబద్ధంగా జరుగుతున్నాయి.

(పంచకోశవ్యవస్థ: 1. అన్నమయకోశం 2. ప్రాణమయకోశం 3. మనోమయకోశం 4. విజానమయకోశం 5. ఆనందమయకోశం. ఇందులో మొదటిది ప్రాథమికం. అట్టడుగుపొర, దానిమీదిపొర ప్రాణమయం, దానిపై పొర మనోమయం. దానిపై ఉన్నది విజ్ఞానమయం. అన్నిటికన్న పైన ఉన్నతస్థానంలో ఉండేది ఆనందమయకోశం. ఒక త్రికోణాకారంగా ఈ పంచకోశాలను సంభావిస్తే త్రికోణంలోని శిఖరాగ్రభాగమే ఆనందమయకోశం. తిరుమల శ్రీవారి దేవాలయంలో స్వామి గర్భగుడిపైగల విమానం పేరు 'ఆనందనిలయ విమానం'. ఇదే ఏడవ కొండపై స్వామి గర్భగ్భహంలో నిలబడిన అధిష్టానం, మూలవిరాట్‌ విగ్రహం. స్వామి ఆనందమయుడని దీని అంతరార్థం!)

ధీరజనులని పేరొందిన కొందరు శరీరధారులు నిన్ను సేవించి, ఇహపరసౌాఖ్యాలు పొందుతారు. (వీరుడు వేరు. ధీరుడు వేరు. వీరుడంటే యుద్ధవీరుడు. ధీరులంటే నిశ్చయాత్మమైన బుద్ది శక్తితో ప్రకాశించే, ఆధ్యాత్మికసాధకులు. వీరు సాధన చేస్తూ పోగా ఒకనాటికి ధీరజనోత్తములవుతారు.).

భగవంతుణ్ణి సేవింపనేరని దుష్టులు తమదేహాల్ని ఉచ్చ్వాసనిశ్శ్వాసాలతో నింపుతూ, తోలుతిత్తులై మారి తిరుగుతూ, దేహాన్నే ప్రేమిస్తూ, అదే తమ జీవిత సర్వస్వంగా భావిస్తుంటారు.

దేవా! సూక్ష్మదర్శనులైన మహానుభావులు కొందరు నిన్ను జఠరాగ్ని స్వరూపుడివి అని భావిస్తారు. ఆరుణులనే ఋషులు నిన్ను సుషుమ్ననాడీద్వారంలో సంచరిస్తూ హృదయస్థ సూక్ష్మరూపిగా నిన్ను భావిస్తారు. హృదయపద్మంనుండి వెడలి, బ్రహ్మరంధ్రానిచేరి పరమకాంతిరూపుడిగా నిన్ను ధ్యానించి నీలో లీనమై మోక్షంపొంది, జన్మరహితులు అవుతారు. 

(ఉదరస్థుడైనవహ్ని - వహ్ని అండే అగ్ని. ఇది వైదికమైన త్రేతాగ్నులకంటే వేరైంది. ఉదరస్థమైన అగ్ని - జఠరాగ్ని (వైశ్వానరాగ్ని)

ఈ 'జఠరాగ్ని'యే మానవులు తినే వివిధాలైన ఆహారపదార్థాలను జీర్ణంచేసి శరీరానికి శక్తినిచ్చేవిధంగా పనిచేసే అగ్ని. ఆకలికావడానికి కూడా ఈ అగ్నియే మూలకారణం. జఠరాగ్నికే 'వైశ్వానరాగ్ని' అని కూడా పేరు. సృష్టిలో ప్రతి ప్రాణి ఉదరంలో జఠరాగ్నిరూపంగా ఉండేవాడే 'వైశ్వానరాగ్ని'.)

దేవా! కట్టెల్లో ఉండే అంతర్గతుడైన అగ్నిదేవుడు, కర్రలలోని దోషాలకు అతీతంతా పరిశుద్ధంగా ఎలా ఉంటాడో అలా నీ సంకల్పంచేత సృష్టించబడ్డ ఈ జీవరాశుల్లో వాటి లోపాలతో సంబంధంలేక అంతర్యామిగా (జీవాత్మల్లో) నెలకొని, వాటి వాటి జన్మాదికాల సమయంలో గర్భంలోని రోతల్ని అంటకుండా ఉంటూ, సకల జీవరాశి ఆత్మలపట్ల సముడవైన బ్రహ్మగా నిన్ను గుర్తించి, ఇహపరాల్లోని ఫలాలతో నిమిత్తంలేక రజోగుణ భిన్నులై ఉంటూ నిన్ను సేవించేవారు కొందరు. నీ సంకల్పానికి అధీనంగా ఉండే శరీరాల్లో జీవకోటిని నీ మహద్భూతాంశగా భావించి నీ చరణారవిందాల్ని కొలిచి జన్మమృత్యు బంధచక్రాన్ని తప్పించుకొని, కృతార్ణులయ్యేవారు మరికొందరు.

పరమాత్మా! నీ లక్షణము సులభంగా అర్ధంకాదు. అర్ధం కావడం కోసం రామ, కృష్ణాది అవతారాల్ని సేవిస్తుంటారు. ఆ అవతారగాథల కథామృతంలో ఓలలాడిన ప్రశాంత చిత్తులు వేరే మోక్షంకోరరు. మరికొందరు పుణ్యాత్ములైన యోగులు ఆచరించినట్టు నీ పాదపద్మాలపై మనసులగ్నంచేసి భక్తుల్ని ఆరాధిస్తారు గాని మోక్షం కోరరు.

(భగవత్కథామృతం, భాగవతులసేవనం మోక్షంకంటె శ్రేష్ఠాలని తాత్పర్యం.)

నిత్యుడవైన ఓ స్వామీ! ఈ భూమిపై కొందరు గొప్ప భక్తిచే తమదేహాలు నీకు అర్పణచేసి, నీ పాదాలు అర్చిస్తూ, పరమానందంతో జీవిస్తారు. మరికొందరుమాత్రం, నిన్ను పూజించక, వ్యర్థంగా జీవిస్తూ అనేక జన్మలు పొంది, అనేక దేహాలతో బాధలు అనుభవిస్తూ ఉంటారు.

జితేంద్రియులు, యోగులు ఐన ముని శ్రేష్ఠులూ; విరోధభావంతో నిత్యం స్మరించే శిశుపాలాది శత్రువులూ; పాముల పడగలవంటి లేత చేతులతో నిన్ను నిత్యం కాగిలించుకొసి ప్రేమలు కురిపించే గోపికలూ; మేమూ, అందరం నీ కృపకు పాత్రులమేగదా! (జపం, తపం, యోగం, భక్తి వైరం, ప్రేమ - ఏ రూపంలోలైనా నిన్ను ఆరాధిస్తే నీ కృప లభిస్తుంది.)

ఓ పద్మాక్షా! నీ సహజస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడడం ఎవ్వరికీ సాధ్యంకాదు. శాస్త్రాలు వివేచించి, విశ్లేషించి, సమన్వయించి నీ గుణగణ ప్రవర్తనాదుల్ని కొంత తెలిసేట్టుగా చేస్తున్నాయి. ఈ సృష్టి పుట్టకముందే నీవొక రూపాన్ని ధరించగా బ్రహ్మాది దేవతలందరూ అందుండి జన్మించారు. ఆ సృష్టికి పూర్వం నువ్వెలా ఉండేవాడివో, ఏ కొంతైనా నీ విశేష రూపరేఖావిలాసాదులేవో మేము ఊహించగలమా? మేము చ్యుతులం. నీవు చ్యుతిలేనివాడివి. నీ రూపస్థితి వాక్కులకూ, మనస్సుకూ అతీతమైనది. అది ఆత్మకుమాత్రమే గోచరిస్తూంది.

సకలచరాచర జగత్స్వరూపుడవైన నిన్ను అర్ధం చేసుకోక, ఈ సృష్టికి (నీవుకాక) పరమాణువులే కారణమని చెప్పే కణ్వ, గౌతమాది పరమాణు సిద్ధాంతకారులూ, ప్రకృతియే తనకుతానుగా పుట్టిందని, దానినుండే సృష్టి అంతా పుట్టిందనీ భావించే కపిలాది సాంఖ్యసిద్ధాంతకారులూ, దేహమేతప్ప పరమాత్మ, పరలోకాదులూ ఉండవనే బౌద్ధులూ మొదలైన వారు తప్పుడు వాదనలతో తమసిద్ధాంతాల్ని సమర్థించుకొంటూ, నిన్ను తెలియలేరు. అదృష్టవంతులైన యోగులుమాత్రమే నిన్ను దర్శించగల్గుతున్నారు. వారికినీవు ప్రత్యక్షం అవుతావు కనుక పైవారి సిద్ధాంతాలు అబద్దాలు అని తేలుతున్నాయి. సకల చరాచరవస్తుజాతంలో అంతర్యామిగా నీవు ఉన్నావని తెలియక కొన్ని శాశ్వతాలు, కొన్ని అశాశ్వతాలు అని విపదీత బుద్ధితో యోచించే కొందరు నీ దివ్యతత్త్వాన్ని అర్థంచేసుకోలేరు. జగత్తే శరీరంగా ఉండీ; నిన్ను గూర్చి - కడియాలు, కిరీటాలు, కుండలాలు అంటూ వివిధ రూపాలుగా ఉన్నాా వాటిలో అన్నిటా బంగారమే ఉన్నట్టు - నీవు కూడా జగత్తులోని ప్రాణులన్నిటిలో అవి హేయంగా ఉన్నాా శత్రుభావంతో ఉన్నా శుభంకరంగా ఉన్నా అన్నిటా నీవే ఉన్నావని భగవతత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానులు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు.

ఓ కృష్ణా! నీ పాదపద్మారాధనతో నిరంతర సేవకులైన భక్తులు మృత్యువును తిరస్కరించి, సంసారమహాసముద్రాన్ని దాటి, పవిత్రులై లోకాలన్నీ పవిత్రంచేసే ప్రవర్తనలతో నిత్యశోభనకరమైన మోక్షాన్ని పొందుతారు.

(మృత్యువును తిరస్కరించి, సంసారసాగరాన్ని దాటి, పవిత్ర జీవనంతో లోకాన్ని పునీతం చేస్తూ ఏకొందరో పుణ్యాత్ములు నిత్యశోభనమైన ముక్తిని గొప్ప వైభవంతో పొందుతున్నారట! వారు భగవత్పదయుగ నిరంతర సేవాసక్తులు! ఇటువంటివారే జీవన్ముక్తులు.)

నిన్ను తిరస్కరించి, పూజించని హీనమతులను - జంతువుల్ని తాళ్లతో బంధించినట్లు - భవబంధాలరూపంలో బంధించి, అనేక నామాలు, దేహాలు (జన్మలు) ఇచ్చి దాటశక్యంగాని సంసారసముద్రంలో పడవేస్తావు.

క్రియాకర్మాదులు, తదంగాలు లేకున్నా అశరీరుడవైనా నీవు స్వతంత్రమూర్తివి. బ్రహ్మాదులు నీ అధీనులు. చరాచరరూపాలకుగల ప్రాణికోటిని నీవు నియంత్రించే అధిపతివి. నీ దయగలవారికి ముక్తి కరతలామలకం. నీ దయలేనివారికి నరకాది దుర్గతులే! వారు వివిధ జాతులలో పుట్టి, అణురూపంలో దేహాల్లో ఉంటారు. వారిలోకూడా నీవు అంతరాత్మవై ఉంటావు.

(అంతరాత్మ : భగవంతుడు సర్వ ప్రాణికోటిలో ప్రవేశించి హృదయస్థానంలో కూర్చొని అన్నింటికీ సాక్షియై గమనిస్తుంటాడు.)

ఆలోచిస్తే - భూమ్మీద నీటిబుడగలు పుట్టి నశిస్తున్నట్టు తాత్కాలికజీవితాలుగా, దేవ మనుష్య తిర్యగాదిదేహాలు అంటిపెట్టుకొని ఉండే ఈ ఆత్మలన్నింటినీ

కృష్ణా! రాక్షససంహారీ! భక్తపారిజాతా! భవబంధవిమోచనా! కమలనాభా! ప్రాణికోటిలోని ఆత్మలన్నింటినీ తిరిగి నీవు ప్రళయకాలంలో నీలో లయింపచేసికొంటావు సృష్టి అంతటికీ నీవే కారణభూతుడవు.

ఓ పరమేశ్వరా! ఇంద్రియాల్ని జయించామని అనుకొంటూన్నా - స్ధిత ప్రజ్ఞులు కానంతవరకూ-మనస్సు కోరికలతో చలిస్తూనే ఉంటుంది. కనుక స్వతంత్రంగా తిరుగుతూండే గుర్రాన్ని నూలిత్రాడుతో బంధించడం - ఎలా సాధ్యంకాదో అట్లే ఈ చంచలమైన మనస్సును వివేకంతో బంధించి, అధీనంలోకి తెచ్చుకోవాలి, అలా తెచ్చుకోలేకపోతే - మోక్షసాధనకు సరైన ఉపాయం (మార్గం) లభించక మానసికంగా దుఃభిస్తూనే ఉంటారు.

“చపల స్వభావంతో ఉండేదీ, నిలుకడలేనిదీ, అయిన మనస్సు ఏయే విషయాలపై సంచరిస్తుందో ఆయాచోట్లనుండి దాన్ని మరలించి ఆత్మలోనే స్థాపితం చేయాలి. అంటే ఆత్మకు అధీనంగా చేయాలి” అన్నాడు గీతా ప్రవక్త.

పద్మాక్షా! నీవు పరిపూర్ణుడవై ఉండగా, శ్రేష్ఠములైన నీ పాదపద్మాల్ని కొలువనివారు, చోదకుడులేని పడవనెక్కిన వ్యాపారివలె భవసాగరంలో మునిగిపోతారు సుమా!

నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా పొలం అంటూ వాటిమీద మమకారం పెంచుకొని, జీవించేవాడు ఈ భవసాగరంనుండి ఎన్నటికీ బయటకు రాలేడు.

శ్రేష్ఠులైన భాగవతులు (భక్తులు) అనేకాలైన పవిత్ర తీర్ధాలవలె సేవింపదగినవారు. వారి ఉనికి పవిత్ర తీర్ధరాజం. తమ పుణ్యప్రవర్తనలచే ఇతరులకు ఆదర్శమైనవారూ. ఈర్షాదులులేనివారూ, నిన్ను ఆరాధించి భవబంధాలు తొలగినవారూ, ప్రాణికోటిపట్ల సమబుద్ధి కల్గినవారూ, ప్రాప్తించింది అతిహీనమైనా (ఉముక అయినా) బంగారంవలె స్వీకరించి తృప్తిపడేవారూ, కోపతాపాలు లేనివారూ, తమ పాదజలాలు తీర్ధంగా గ్రహింపదగిన పుణ్యపాదులు. అటువంటి యోగివరులే సదాసేవ్యులు. వారిని సేవించినవారికి మోక్షపదవి లభిస్తుంది.

సత్యమైన ప్రకృతివలన పుట్టిన ఈ ప్రపంచం అంతా సత్యం కావాలి. బంగారంతో చేసిన ఆభరణాల్లో బంగారమే ఉంటుందిగదా! అని సాంఖ్యులు వాదిస్తారు. సృష్టించబడనిది సత్యం కాదు. వ్యతిరేకవ్యాప్తి నియమం ప్రకారం ఇది కుదరదు. నిత్యసత్యబ్రహ్మంలో తర్కం కుప్పకూలుతుంది. ప్రపంచం మిథ్య, సత్యంకాదని అద్వైతులు పైసాంఖ్యవాదాన్ని ఖండిన్తారు. ఈ జగత్తంతా బ్రహ్మవిరచితం అయితే కార్యకారణ సిద్ధాంతం ప్రకారం కారణుడైన భగవంతుడున్నపుడు, కార్యమైన జగత్తు ఉన్నట్టేకదా! అపుడు జగత్తు మిథ్య ఎలా అవుతుంది? అని తిరిగి సాంఖ్యులు ఖండిస్తారు. బహుగ్రంథప్రతిపాదితమైన జగన్మిథ్యావాదం అబద్ధం ఎలా అవుతుంది అని అద్వైతులు వాదిస్తారు. కర్మవశులైన జడులు అవిద్యవల్ల చెడ్డ వాదనలతో కుతర్కం సాయంతో అంధులు పరంపరగా స్వీకరించే అజ్ఞానంవలె ఒక గ్రంథంనుండి మరోగ్రంథానికి అద్వైతభావనను అందించుకుంటారు. అంతేగాని, పుస్తకాల్లో ఉందని జగన్మథ్య అనడం కుదరదని, సాంఖ్యులు మొదలైనవారు అద్వైతాన్ని ఖండిస్తారు.

కారణ రూపమైన భగవంతుని రచనగా ఈ సృష్టి సూక్ష్మరూపంలో ఉంటుంది. స్థూలంగా అంతా మిథ్యే. జగత్తు బాధాకారకం. (ముక్తి ఆనందకారకం,) కాబట్టి, ఓ భగవంతుడా! ఈ సృష్టి నీకు శేషభాగమే. జీవుల ఆత్మలలో అంతర్వామివైన నీకు దేహిచేసే కర్మలవల్ల లభించే పాపపుణ్యాలు అంటవు. వాటిని అనుభవించవలసిన దేహికి సాక్ష్యంగా మాత్రం నిలుస్తావు. అలాంటి నిన్ను ప్రాణులు జ్ఞానశూన్యులై గుర్తించలేరు. కంఠానికి అతికినట్టుండే ఆభరణంలోని మణి నిత్యం ప్రకాశిస్తున్నా అది మెడలో వేసుకున్నవాడికి కనపడనట్టు వారి హృదయపద్మాల్లో ప్రకాశించే నిన్ను వాళ్లు దర్శించలేరు. బ్రహ్మాండానికి అధినాయకుడవైన నిన్నే వేదార్థాలు వివరిస్తాయని శ్రుతులు మహావిష్ణువును అభినందించిన విధాన్ని సనందన ఋషి మహర్షులకు చెప్పాడని నారాయణుడనే ఋషి నారదునికి చెప్పాడు. నారదుడు వేదవ్యాసునికి దాన్ని చెప్పగా మాతండ్రి వ్యాసుడు నాకు చెప్పినదాన్ని పరీక్షిన్మహారాజా! నీకు చెప్పాను. ఇది వేద, శాస్త్ర పురాణేతిహాససారం. ఉపనిషత్తులతో సమానమైన రహస్యం. దీన్ని విన్నవారికీ, పఠించినవారికీ సకలశుభాలు కల్గుతాయని, పాపాలు నశిస్తాయనని శుకమహర్షి చెప్పాడు. అది విని పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు.

పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యంబు సెప్పుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishnudu Rushisamethudayi Mithilanagaramunaku Bovuta - శ్రీకృష్ణుడు ఋషిసమేతుడయి మిథిలానగరమునకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు ఋషిసమేతుడయి మిథిలానగరమునకు బోవుట

ఓ మహారాజా! వినవయ్యా! లోకప్రఖ్యాతమైన విదేహ రాజ్యంలో భూదేవికి ముఖదర్పణంవంటి మిథిల అనే నగరం ఉంది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణు డున్నాడు. అతడు విష్ణుభక్తుడు. రాగద్వేషాదివికారాలు వదిలినవాడు. స్వచ్చమైన నడవడిక గలవాడు. కోపంలేనివాడు. శాంతస్వభావుడు. వేదార్థనిర్ణయంలో పండితుడైన శ్రుతదేవుడు సార్థకనామధేయుడు. అతడు అయాచితంగా ప్రాప్తమైంది లేశమైనా మేరుపర్వతంగా భావించేవాడు. గృహస్థధర్మం ఆచరిస్తూ ఉచిత కర్మాచరణంకావిస్తూ ఉంటున్నాడు.

ఆ మిథిలానగరాన్ని ఏలుతున్న ప్రసిద్దుడైనరాజు బహుళాశ్వుడు. తన నగరంలోని శ్రుతదేవుడు (బ్రాహ్మణుని) వలెనే నిష్కల్మషుడై, ధర్మబద్దుడై, ప్రవర్తిల్లుతున్నాడు. వారిపై కృష్ణునికి దయకలిగింది.

శ్రీకృష్ణుడు మిథిలానగరంలోని ఆదర్శమూర్తులైన బహుళాశ్వరాజును, శ్రుతదేవుణ్ణి చూచే ఉత్సాహంతో, తనరథమెక్కి అక్కడికి బయల్దేరాడు. నారద శుకాది మహర్షులు వెంటవచ్చారు. మార్గమధ్యంలో వంగ, మత్స్య, పాంచాలాది రాజ్యాలు దాటుతూ, ఆయాదేశాలరాజులు, కృష్ణుణ్ణి వివిధ మర్యాదలతో సేవించగా, వారిపట్ల ఆదరంతో, చిరునవ్వులతో, దయాదృప్టితో, సాదరభాషణాలతో, యోగక్షేమ ప్రశ్నలతో పలకరిస్తూ, మధ్యమధ్య మజిలీలు (విశ్రాంతి)చేస్తూ, మిథిలను చేరినాడు. మాధవుని రాకవిని, రాజు, బ్రాహ్మణసమేతంగా వచ్చి, శ్రీకృష్ణునికి ఎదురువచ్చి తరువాత

మీథిలకు చెందినరాజు, బ్రాహ్మణుడు ఇద్దరూ శ్రీకృష్ణుని వెంబడివచ్చిన మునులకు ముందుగా వినయంగా మొక్కారు. పద్మనేత్రుడు, ఉదారుడు, పాపాలను పారదోలేవాడు, భక్తులకు శుభాలిచ్చేవాడూ, అయిన శ్రీకృష్ణుని పాదాలంటి వినయంగా నమస్కరించారు.

ఆ ఇద్దరూ చేతులు జోడించి, కృష్ణుణ్ణి "ఓ కరుణాసముద్రుడా! నీవూ ఈ మునులు మా ఇంటికి వచ్చి, మాపై అనుగ్రహం ఉంచి, మా ఉపచారాలు, సేవలు స్వీకరించాలని వేడుకొని శ్రీకృష్ణుడు వారిభక్తి వినయాలకు ఎంతో సంతోషిస్తూ

శ్రీకృష్ణుడు వారికోరికమేరకు, ఒకరికి తెలియకుండ మరొకరి ఇంటికి తనవెంబడి ఉన్న మునులసమూహంతో ఏకకాలంలో వెళ్లినాడు. రాజు వీరిని బంగారుఆసనాలమీద

శ్రీకృష్ణుణ్ణి, మునిసంఘాల్నీ కూర్చోబెట్టి, అందమైన వెండిబంగారుచెంబులతో నీళ్లుపోసి కాళ్లు కడిగి, ఆ పవిత్ర జలాన్ని భక్తిభావంతో తనపై, భార్యాబంధువులందరి పై చల్లాడు. విధియుక్తంగా పూజలు చేశాడు. ఆభరణాలు, వస్త్రాలు, మాలలు, చందనం, ధూపం, హారతులు భక్తితో ఇచ్చాడు. పలురకాలైన అన్నవిశేషాలు, పాయసం, పిండివంటలు, పండ్లు మొదలైన వాటితో కడుపునిండా భోజనాలుపెట్టి, చక్కగా కర్పూరతాంబూలాలు ప్రేమతో ఇచ్చాడు.

శ్రీకృష్ణునికి, మునిగణానికి ఆతిథ్యం ఇచ్చి, పూజాదులు నిర్వహించి, బాగా సంతోషించి

కృష్ణుని పాదపద్మాల్ని ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ, ఓ పురుషోత్తమా! సకల ప్రాణికోటిలో నీవు వారి ఆత్మలందు స్థిరంగా ఉండి; వారి కర్మలకు సాక్షివై ప్రకాశిస్తున్నాను. శివుడూ బ్రహ్మ కూడా నీ పదారాధకులైన భక్తులతో సాటిరా రని నీవంటూ ఉంటావుకదా!

అలాంటి ప్రసిద్దికి తగినట్లు, నేను ఎప్పుడోగాని మీ పాదాలను కొలవని హీనుడనైన భక్తుడనైనప్పటికీ, నీ మనసులో ఎంతో ఆదరించి, నా ఇంటికి వచ్చావు. నీవు భక్తవత్సలుడివి. నీ పాదసేవలో రుచి తెలిసిన మహాత్ములు దాన్ని వదలలేరు. శాంతులూ, నిర్ధనులూ, యోగీంద్రులైనవారూ, నిన్ను సేవించేవారూ కోరితే, నిన్నుకూడా సమర్పించుకొంటావు అంటూ ఇంకా ఇలా అన్నాడు.

పరమాత్మవైన ఓ కృష్ణా! యదుకులంలో దేవకీ గర్భంలో జన్మంచినవాడా! సుజనులచే నుతించబడే వాడా! వేదాలలో వర్ణింపబడినవాడా! నారాయణా! నాశంలేనివాడా! సంతోషస్వరూపా! పరమపురుషా! భక్తపోషకా! అని స్తుతించినాడు.

పురుషోత్తమా! యదుసింహకిశోరా! భక్తరక్షకా! నీవు, నీ తోడి ఈ మునులు ఇంకా కొన్నాళ్లు ఇక్కడే ఉండరాదా! నీ పాద ధూళి నామందిరం సోకితే నేను కృతార్థుడినవుతాను.

బహుళాశ్వుడనే మారుపేరుగల ఆ మిథిలేశుడు జనకుడు ఈ విధంగా భక్తితో ప్రార్ధించగా నిమికుల శ్రేష్ఠుడైన ఆ ప్రభువును, ఆ నగర పౌరుల్ని అనుగ్రహించి, కొన్నిరోజులు శ్రీకృష్ణుడు ఆ రాజుకు అతిథిగా ఉన్నాడు.

(మిథిలనేలిన సుప్రసిద్ధ ప్రభువు ఇక్ష్వాకుని కుమారుడు నిమి. నిమి వంశంలోనివాడు జనకుడు. ఈ జనకుడు వైరాగ్య జనకుడు. ఇక్ష్వాకు వంశానికి కోడలైన సీత తండ్రి జనకుడు వేరు. అతడు త్రేతాయుగంలో ఇదే మిధిలను ఏలాడు. ఈ జనకుని (బహుళాశ్వుని) కాలం ద్వాపరయుగం. ఈ వంశంలోని రాజులందర్నీ జనకులనే పిలుస్తారు.

జనకునిలాగే శ్రుతదేవుడుకూడా ఎంతో సంతోషంగా శ్రీకృష్ణుణ్ణి, మునులల్నీ తన ఇంటికి తీసుకొనివెళ్లి, దర్బాసనాలపై కూర్చోబెట్టి, సతీసమేతంగా పాదప్రక్షాళనచేసి ఆ జలాల్ని శిరస్సులపై చల్లుకొన్నాడు. తులసీమాలలు, దర్భలు, పూలు, కమలాలతో చేసిన మాలికలు ధరింపచేశాడు. శ్రుతదేవుడు సంసారకూపంలోపడ్డ నావంటి వానివద్దకు శ్రీకృష్ణభగవానుడు తనంత తానుగా రావడానికి నేను తపస్సు పూర్వజన్మలో చేశానోగదా అని సంతోషిస్తూ

శ్రీకృష్ణుని పాదతీర్జాన్ని తన ఇల్లంతా (పవిత్రత కొరకు) చల్లించినాడు. ఫల, పత్ర, పుష్పాదులతో అర్చించి, తన హృదయంలో నిలుపుకొని

(శ్రీకృష్ణుని పాదతీర్థం మందిరంలో చల్లించాడనడం అపూర్వం, విష్ణువుకు 'తీర్ధపాదు'డనే పేరు ప్రసిద్ధిగా ఉంది. సామాన్య గృహస్థుల ఇండ్లల్లో చల్లే దానికి లభించే తీర్ధం గోపంచితం. ఇక్కడ విష్ణువైన శ్రీకృష్ణుని, విశేషించి, గోవిందుని పాదాలు కడిగిన తీర్ధమే లభించడం అపూర్వం, అద్భుతం.)

విశ్వవిభుడు నా ఇంట్లో భోజనం చేశాడు. తనకోరిక ఈడేరింది అంటూ ఆనందం పట్టలేక పై పంచె ఎగురవేస్తూ నృత్యం చేశాడు.

తన కుటుంబంతోపాటు తానూ కృష్ణుణ్ణి సేవించి, పూజించి, ఆతని పాదాలు తన ఒడిలో పెట్టుకొని ఒత్తుతూ “స్వామీ! శివుడు, బ్రహ్మ కూడా తెలుసుకోలేని నిన్ను భక్తితో పొందాను. నా భాగ్య మెట్టిదోకదా!” అని స్తుతించాడు.

ఓ సర్వాంతర్యామీ! తపోయోగాలద్వారా మునులు యోగులుమాత్రమే తమ హృదయకమలాల్లో దర్శింపగల్గే నీ దివ్యరూపం నా కన్నులనిండా చూడగలిగానుకదా!

వాసుదేవా! నీ దివ్యచరిత్రలు చెవులకింపుగా వింటూ, పూజలుచేస్తూ, నీ పాదాలకు నమస్కారాలర్పిస్తూ, నీ దివ్యనామం కీర్తిస్తూ, తన తనువంతా నీకర్పించే నిర్మలభక్తులహృదయాలనే దర్పణాల్లో కనబడతావు. కర్మిష్ఠులైన వ్యక్తుల హృదయాలకు దూరమవుతావు అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ కృష్ణస్వామీ! నీకు దండాలు. వేదాంతవేద్యుడా! లోకాల్ని రక్షించేవాడా! భక్తులకోరికలు తీర్చవాడా! నీ పాదసేవకునికి ఏమి ఆజ్ఞ? చెప్పు, చేస్తాను అని అనగా కృష్ణుడు చిరునవ్వుతో ఆతనిచేతిని ఆత్మీయంగా తనచేతిలోనికి తీసుకొని, తపోధనులైన ఈ మునులు తమపాదధూళితో సమస్తలోకాలు తిరిగి పునీతం చేస్తారు. నాతో కలిసిఉండి, నా వెంబడి వస్తారు. నీ అదృష్టంకొద్దీ నేడు నీ ఇంటికి

పవిత్రక్షేత్రాల్ని స్పర్శనంతో, దేవతల్ని దర్శనంతో, విప్రుల్ని అర్చనంతో గనుక ఆరాధిస్తే సమస్తప్రాణికోటి పాపాలు తొలగిపోతాయి. బ్రాహ్మణుడు (బ్రహ్మజ్ఞాని) పుట్టుకతోనే జీవకోటిలో శ్రేష్ఠుడుగా ఉంటాడు. నిత్యమూ జపం, తపం, వేదాధ్యయనం, ఆత్మజ్ఞాన శోధనంచేసేవాడైనా అంశను ఆశ్రయిస్తే మరింత శ్రేష్ఠుడవుతాడు. అట్టివాణ్ణి గూర్చి వేరే చెప్పనవసరం లేదు, అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ ప్రసిద్ధచరిత్రా! నా మనసులో బ్రాహ్మణుల పైగల ప్రేమ నిజానికి నాకు నా శరీరంపై కూడాలేదు. బ్రాహ్మణులు పూజ్యులు కనుక ఈ మునుల్ని చక్కగా పూజించు.

నాకదే ఇష్టం. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేలవిధాలుగా పూజించినట్టు భావించి ఆనందిస్తాను. కనుక బ్రాహ్మణుల్ని శ్రద్ధతో పూజించు.

సమస్తలోకాధీశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం శ్రుతదేవుడు ఆ మునులందరికీ భక్తితో పూజలు చేశాడు.

ఓ మహారాజా! కృష్ణుడు వారిద్దరినీ వీడ్కొని, వారికి దయతో సకల భాగ్యాలు ప్రసాదించి, రథమెక్కి మునులతోపాటు ద్వారకకు తిరిగి వచ్చాడు.

శ్రుతి గీతలు

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

subhadra parinayamu - సుభద్రా పరిణయము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - సుభద్రా పరిణయము

మహార్షీ! అర్జునుడు కృష్ణుని సోదరి ఐన సుభద్రను ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు? ఆ వివరాలు నాకు చెప్పు. అని పరీక్షిత్తు అడగగా శుకమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇంద్రకుమారుడు అర్జునుడు పూర్వం తీర్థయాత్రల మీది ఉత్సాహంతో తిరుగుతూ ప్రభాసతీర్థానికి వచ్చినాడు. దానికి దగ్గరలో శ్రీకృష్ణుని ఇంటగల సుభద్రపై ప్రేమకారణంగా ఆమెను చూడాలనుకున్నాడు. బలరాముడు ఆమెను దుర్యోధనునకు ఇచ్చి పెండ్లిచేయాలని సంకల్పించినట్టు తెలుసుకున్న అర్జునుడు

సుభద్రను చూడాలనే కోరిక తన మనసులో ఉత్తేజపరుస్తుండగా, సన్యాసి వేషంతో ద్వారకకు వచ్చి, పురజనులు భక్తి స్నేహాలతో కొలువగా, తనకోరిక తీరేవరకు ఓపికగా ఎదురుచూస్తూ వానకాలం వెళ్లేవరకు ఆ ద్వారకలో ఉండి

అర్జునుని కపటరూపాన్ని గుర్తించక, నిజమైన సన్యాసిగా భావించి, ఆతడు చాలాకాలం ద్వారకలో ఉండి, వెల్లిపోవడంచూచి, తన మందిరానికి సాదరంగా ఆహ్వానించాడు.

బలరాముడు కపట సన్యాసిని తన ఇంటికి తెచ్చి ఆతిథ్యమిస్తుండగా అర్జునుడు అక్కడే ఉండి రోజూ భిక్షను గ్రహిస్తూ ఉండగా మన్మథుని సమ్మోహనాస్త్రంవలె ఉన్న వీరులను కూడా మిక్కిలి మోహపరుస్తోందా! అన్నట్లున్న సుభద్ర విహారంగా సంచరిస్తూంది.

అలా కపటసన్యాసిని అర్జునుడుగా గుర్తించి, అర్జునునిపైగల ప్రేమతో సన్యాసిని ప్రీతితో చూస్తూ సుభద్ర అక్కడే సంచరిస్తున్న వేళలో

శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర కపటసన్యాసి అయిన అర్జునుని ముందు ఇటునటూ తిరుగాడుతుంటే ఆ సౌందర్యరాశి వయోవిలాసాలు, సొగసులు అర్జునునిమన్మథబాధను పెంచాయి. తన చిత్తాన్ని ఆమెయందే ఉంచి మన్మథబాధకు గురి అయినాడు.

అర్జునుని వంటిదే సుభద్రస్థితి. కీర్తిమంతుడు, కల్మషరహిత మానసుడు, మన్మథునివంటివాడైన ఇంద్ర నందనుని చూచి సుభద్ర అర్జునునిపట్ల అనురాగంతో మన్మథబాధ పొందింది. సిగ్గు, ప్రేమ, మోహం కన్నుల్లో ప్రతిఫలిస్తున్నా స్త్రీ సహజ భయంతో వ్యక్తంచేయలేని స్థితిలో ఉంది.

ఇట్లు సుభద్రార్దునులు పరస్పరానురాగంతో, మన్మథ భావాలచే మనస్సు ముసురుకొనగా, ఓపికలు నశించి సిగ్గుతో జగడమాడుతుండగా ఒకరోజు దేవతలకొరకు జాతరసాగగా, దానిలో పాల్గొనడానికి నగరం వెలుపలికి సుభద్ర వచ్చింది. అర్జునుడు కూడా కృష్ణ, దేవకీ, వసుదేవుల అనుమతిపొంది వారిఅంగీకారంతో సుభద్రను అనుసరించి ఊరి వెలుపలకి వచ్చినాడు.

శరత్కాలంలోని నిండువెన్నెలలో ప్రకాశించే పున్నమిరాత్రివలె ఉన్నదీ, నిండు చంద్రబింబంనుండి కిందికి దిగి భూమిపై నడయాడే జింక పిల్లవలె ఉన్నదీ, మేఘమండలంనుండి ఇలకు దిగివచ్చి తిరుగుతున్న మెరుపుతీగెవలె ఉన్నదీ, మణులు పొదిగిన బంగారుబొమ్మకు చైతన్యంవచ్చి కదులుతున్నట్టు తిరుగుతున్నద్దీ, ప్రతికదలికలోనూ కాంతులుచిమ్మే కళలొలికిస్తూ, శృంగార రసాధిదేవత రూపుగొన్నట్టిదీ, ఉట్టిపడే మంచి గుణాలచే మంగళ కరమైనదీ అయిన ఆ సుభద్రను చూచినవాడై అర్జునుడు

అర్జునుడు సుభద్ర దగ్గరకువెళ్లి, ఆమెను తీసుకొని రథంమీద కూర్చుండబెట్టుకొని, కైకొనిపోతూండగా, యదుసైన్యాలు అడ్డగించాయి. ఆయన గాండీవం స్వీకరించి బాణాలతో వారిని చిందరవందరచేసి, గెలిచి, ఇంద్రప్రస్థ నగరానికి చేరాడు. బలరామునికి ఈవార్త తెలిసి, చెల్లెలిని అనుమతిలేకుండా తీసుకొనిపోయిన అర్జునునిపై ప్రళయకాలాగ్నివలె మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు, తక్కిన చుట్టాలు అందరూ ఆయన పాదాలకు నమస్కరించి, ఆయనను శాంతపరచి, మృదువైన తియ్యనైన మాటలతో పరిస్థితులు వివరించి, సుభద్ర అర్జునుల దాంపత్యానికి అంగీకరింపజేశారు. బలరాముడు కోపం మానుకొని మనసు తేట పంచుకున్నాడు. తరువాత

బలరాముడు ప్రేమగా తనచెల్లెలు సుభద్రకు పెళ్లిలో తల్లిగారింటి బహుమతిగా రాజోచితమైన ఏనుగులు, గుర్రాలు, రథాలు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, దాసదాసీజనాన్నీ ఇచ్చి పంపాడు.

శ్రీకృష్ణుని సలహామేరకు, అతడు ఇష్టపడేలా, సుభద్రార్జునులకు లోపం రానివ్వకుండా ఘనంగా సార ఇచ్చి పంపినాడని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో తరువాతికథను చెప్పసాగాడు.

శ్రీకృష్ణుడు ఋషిసమేతుడయి మిథిలానగరమునకు బోవుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishna Balabhadrulu Mruthulaina Tama Sahodarula Dechi Devakideviki Ganabaruchuta - శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట

ద్వారకలో అందరూ సుఖంగా కాలంగడుపుతున్నారు. నీళ్లల్లో మునిగి యమలోకం చేరిన గురుపుత్రుని తీసుకొని వచ్చిన వృత్తాంతమంతా జనులనుంచి దేవకీదేవి విని శ్రీబలరాములను పరిపరివిధాల స్తుతిస్తూ, కన్నుల కన్నీరు కారుస్తూ మొరపెట్టుకొంది.

దుర్మార్గులైన మురాసురుడు, కంసుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు మొదలైన మహా బలశాలులైన రాక్షసులను సంహరించి భూభారాన్ని తొలగించినవారు మీరే కదా! (అని దేవకి ప్రశంసించింది.)

జగత్తుకు సృష్టి స్థితి లయకారకులు మీరే! మీకు అవన్నీ లీలావినోదాలు. మిమ్మల్ని నమ్ముకున్నాను. దయచేసి నా కోరికతీర్చండి అని దేవకి ప్రార్ధించింది.

బలరామ, కృష్ణుల్ని అనేక విధాల నుతించి, “అయ్యా! మీరు మహానుభావులు. గతంలో చనిపోయి యమపురం చేరిన మీ గురుపుత్రుణ్ణి బతికించి, యమునివద్దనుండి తీసుకొనివచ్చి గురుదక్షిణగా గురువుకు సమర్పించారు. మహానుభావులారా! ఇదేవిధంగా కంసుడు చంపిన నా కుమారుల్ని కూడా సజీవులుగా తెచ్చియిచ్చి నా దుఃఖాన్ని పోగొట్టండి” - అని ప్రార్థించింది. ఆమె మెత్తని తియ్యని పలుకులు విని గౌరవపూర్వకంగా స్వీకరించి, మాయాప్రభావంతో సుతల(పాతాళ) లోకానికి వెళ్లారు.

సుతల లోకాధీశుడైన బలిచక్రవర్తి బలరామ, కృష్ణుల్ని కన్నులార చూశాడు. వారు కమలదళాలవంటి కన్నులు కలవారు. కార్యసమర్జులు. పచ్చని, నీలివర్ణాల దేహచ్చాయలు గలవారు. సమస్తలోకాల్లో కాంతిమంతులైనవారు. హలాన్ని చక్రాన్ని ధరించినవారు. భక్తులను పరిరక్షించేవారు. ఎప్పుడూ శుభాలతో ఒప్పేవారు. ఎల్లవేళల జయం పొందేవారు. జయశీలురు. అట్టివారు తనలోకానికి రాగా చూచాడు.

బలిచక్రవర్తి తన సన్నిహితులతో ఎదురుగా వెళ్లి బలరామ, కృష్ణులను ఆహ్వానించాడు. వారిపైగల భక్తివల్ల వారి రాకపట్ల కుతూహలుడై సాష్టాంగ దండప్రణామంచేసి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి, వారికాళ్లుకడిగి, సమస్తలోకాల్లో పవిత్రాలైన ఆ జలాల్ని భక్తితో తలపై చల్లుకొన్నాడు.

బలిచక్రవర్తి తన లోకానికి వచ్చిన బలరామకృష్ణుల్ని స్వాగతించి, అర్చించాడు. విశ్వమే రూపమైన వారిని సంపెంగ, అగరు, చందన, ఏలాది ధూపాల్ని (వేసి), భువనాల్ని వెలిగించేవారికి బంగారు పాత్రలలో రత్నదీపాలు, కర్పూరదీపాలతో హారతిచ్చి, వేదాలచే తెలియబడే మహానుభావులకు పాయసాన్నఫలాదుల్ని నైవేద్యంగా ఇచ్చి, దేవతలకు శత్రువులైనవారికి నూత్న రత్నాభరణాల్ని నీల పీతాంబరాలు ధరించేవారికి మంచువంటి పలుచని, తెల్లని విశిష్టవస్త్రాల్ని కట్టబెట్టి, అహంకారరహితులైన, వారికి చందనాది లేపనాలు, పూలమాలల్ని (సమర్పించి)

వివిధపూజలుచేసి, ఉపాయన సమర్పణంకావించి, శ్రీకృష్ణుని కమలాలవంటి చరణాలను ఒత్తుతూ, ఆనందంతో ఉబికిన కన్నీరు కారుతుండగా, పులకించిన శరీరంతో రెండుచేతులు నుదుట జోడించి, నమస్కరిస్తూ ఇలా ప్రార్ధించాడు.

బుద్ధిమంతుడైన బలిచక్రవర్తి “ఓ కృష్ణా! భగవంతుడా! హరుడా! పరమాత్మా! ముకుందుడా! సమస్త భక్తరక్షకా! పురుషోత్తమా! మునులచే నమస్కారాలందుకొనేవాడా! రాక్షసాంతకా! సాంఖ్యస్వరూపా! నీలకేశా! చక్రధారీ! బ్రహ్మా! నీ కొరకు నమస్కారాలని” స్తుతించాడు.

పైవిధంగా భగవంతునిలీలలు నామగ్రహణరూపమున పొగడి ఇంకా ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! కేవలం సాత్వికులు మాత్రం దర్శించగలిగే నిన్ను రజస్తమోగుణులైన వారు చూడలేరు. పద్మాక్షా! నీ పవిత్ర చరిత్రలు మునులు దర్శించి గానం చేస్తున్నారు. శివబ్రహ్మేంద్రాది దేవతా ప్రముఖులు మిమ్ము నమస్కరించుటచే వారి శిరోరత్నాలచే నీ పాదపీఠం ప్రకాశిస్తోంది. నీ దర్శనంచే జన్మబంధాలు తొలగిపోతాయి.

యోగిశ్రేష్ఠులుసైతం నీ మాయలో చిక్కుకొని నీ తత్త్వాన్ని తెలుసుకోలేరు. మా వంటి తామసులు, అహంకారులు నిన్ను ఎలా తెలుసుకోగలరు? మాకు చక్కని జ్ఞానం, చక్కటి వివేకం ఇచ్చి నిన్ను చేరే ముక్తి మార్గం చూపి, ఈ సంసారకూపం నుండి ఉద్ధరించి నీ దగ్గరకు చేర్చుకోవయ్యా!

(మాయ : “మునుపులేనిది, ముందు ఉండబోనిది - ఈ రెంటి నడుమ కొంతకాలంపాటు వ్యవహారగోచరమయినది మాయ. ఎప్పుడూ ఒకే విధంగా ఉండక మారుతుండటం దీని స్వభావం. ఏది సత్తుకాదో, అసత్తును కాదో అది మాయ. కావున, ఈ ప్రపంచం మాయ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏది మార్పు చెందుతుందో, ఏది ఎల్లకాలమూ ఉండదో, ఏది నశిస్తుందో అది మాయామయం. దీనికి విరుద్ధంగా మార్పుచెందక, నశింపక, ఎల్లకాలం ఉండేది ఆత్మ!)

శత్రువులుగా ఉండి చైద్యుడు మొ॥వారు, ప్రేమతో గోపికాస్త్రీలు, భక్తితో పాండవయాదవాదులు నిరంతరం మనస్సులో మీ రూపగుణాదుల్ని ధ్యానిస్తూ మోక్షం పొందుతున్నారు. మహాజ్ఞానులైనాకూడా దేవతలు నీ ధ్యానం లేక కైవల్యపదం అందుకోలేకపోతున్నారు.

(నిరంతరం క్రోధంతో పగవారైన శిశుపాలాదులు స్మరించడంవల్ల వారికి ముక్తి. భగవద్ధ్యానం నిరంతరం చేయనివాడు వివేకి, విద్వాంసుడైనా వానికి కైవల్యం దూరమే.

పద పద్మమన్నచోట ధ్యానకేంద్రమని, భవత్పదమన్నచోట విష్ణుపదం అనగా ఆకాశమని పదశబ్దానికి అర్ధద్వయం భిన్నంగా మహాకవి నిక్షేపించినాడు. చిదాకారుడుకాబట్టి ధ్యానంవలనేగాని గ్రంథాలవలన దొరకడని సారాంశం.)

శ్రద్ధచేత నిన్ను సేవించే వాడెవ్వడైనా భవబంధాలనుండి విముక్తి పొందుతాడు. యోగీశ్వరుడవైన నీవు నీచే పాలింపబడేవారమైన మమ్ము పాపరహితులుగా అనుగ్రహింపుమని ప్రార్థించి, ఇంకా ఇలా అన్నాడు.

నిన్ను తనివిదీరా చూచాను. సంసారబంధమనే సముద్రాన్ని దాట గల్గాను. మోక్షనిధిని చూచాను. నీదయా దృష్టులు నాపై ప్రసరింపగా చూశాను. బ్రహ్మ మహేశ్వరులు కూడా చూడలేని నా పాపాల్ని పోగొట్టావు. అట్టి నీవు, నా యింటికి వచ్చి నన్ను కృతార్జుణ్ణి చేశావు.

స్వామీ! నేను మీ దాసుణ్ణి. మీరు ఏది చెపితే అది చేస్తాను. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని చేతులు జోడించి ప్రార్ధించగా కృష్ణుడు బలి వినయానికి సంతోషించి ఇలా అన్నాడు.

ఓ బలిరాజా! పూర్వం కృతయుగంలో మరీచికి వర్ష అనే భార్యవలన ఆరుగురు కుమారులు పుట్టారు. బ్రహ్మ ఒక రోజు తన కూతురినే కామించి రమించగా చూచి పరిహసించారు. బ్రహ్మ అందుకు కోపించి రాక్షసులుగా పుట్టుడని శపించాడు. శాపవశాత్తు వారు హిరణ్యకశ్యపునికి కొడుకులుగా పుట్టారు. దేవతల కోరికమేరకు యోగమాయాదేవి ఈ ఆరుగురుని దేవకీదేవి గర్భాన ఉంచగా

(కంస నిర్యాణంలో యోగమాయ పాత్ర పెద్దది. వీరార్గురితో బాటు తానూ దేవకీ గర్భాన జన్మించి, జన్మలు చాలించి, అష్టమగర్భ శిశువుగా విష్ణునిరాకకు సుగమం చేసింది. ఇదంతా విష్ణుమాయే.)

దేవకీదేవి తన ఆరుగురు కుమారుల్ని కంసుడు వెనువెంట చంపివేయగా పుత్రవియోగదుఃఖంతో శోకించి, ఆమె ఆ పుత్రుల్ని చూడాలని మమ్మల్ని కోరింది. ఆ కారణంగా మేము వచ్చాము.

ఓ పుణ్యపురుషా! మాకు ముందు జన్మించిన ఆ ఆరుగురుని తిరిగి మా తల్లి దేవకీదేవికి చూపించెదమని ఆమె కోర్కె తీరుటకై మేమునీ వద్దకు వచ్చాం. నీవద్ద సుఖంగా ఏ విరోధమూ లేకుండా ఉంటున్న ఈ ఆరుగురు వీరే అని చెప్పారు.

వీరిని ఇపుడే తీసుకొనిపోయి తల్లి పుత్రశోకాన్ని తీరుస్తాం. వీరుకూడా శాపవిముక్తులై నా అనుగ్రహాన్ని పొందుతారు.

పిదప వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తాయి అని కృష్ణుడు చెప్పి, వారిపై కరుణగల్గి, బలి అనుమతి పొంది భూలోకానికి తీసుకొనివచ్చాడు.

ఆ విధంగా బలి అధీనంలోని సుతలలోకంనుండి ఆ ఆరుగురు అన్నలను తీసుకొనివచ్చి కృష్ణుడు దేవకీదేవితో ఇలా అన్నాడు.

ఆ పిల్లలను సంతోషంగా తీసుకొనివచ్చి "వీరే నీ కుమారులు అని తల్లికి చూపించగా ఆమెకుకూడా పిల్లలమీద వాత్సల్యంతో మోహం కలిగిందై

పిల్లలను చూడగానే స్తనాలనుండి క్షీరధారలు స్రవింపగా, ఆనందబాష్పాలతో కౌగిట్లోకి(ఒడిలోకి) తీసుకొని నా కన్నబిడ్డలు వచ్చారంటూ తమకంతో లాలిస్తూ

(తాను కన్నబిడ్డలే అయినప్పటికీ ఒక కన్నతల్లి తనబిడ్డను దేవుడిగా భావించి, గౌరవవాచకంతో సంబోధించి లాలించడం లోకసహజమైందే! ఆ విధంగా దేవకీదేవి తన ఆరుగురు బీడ్డల్ని “నను గన్న అన్నలు” అని వారిపై లాలన, ప్రేమ చూపింది.)

తల్లి దేవకీదేవి చనిపోయిన తన ఆరుగురు పిల్లలు బతికిరాగా సంతోషంగా కౌగిట్లోకి తీసికొని, ఒడిలో కూర్చోబెట్టుకొని, తలలు ఆఘ్రాణించి, చెంపలు, గడ్డం ప్రేమతో పుణికి, వాత్సల్యంతో గగుర్పాటురాగా, పాలివ్వగా, వారు విష్ణమాయకు లోబడి బాలకులవలెనే పాలుతాగి, భగవంతుడైన కృష్ణుని స్పర్శతో పాపాలు పోయి విధిశాపసముద్రాన్ని హరిదయ అనే నావతో దాటి, నిజరూపాలతో, తల్లిదండ్రులకు, కృష్ణునికి నమస్కరించి, ఆకాశమార్గాన స్వర్గోకానికి చేరుకున్నారు. దేవకీదేవి తన మనస్సులో (ఇలా ఆలోచించింది)

ఓ పరీక్షిన్మహారాజా! మరణించిన తన బాలకులను తిరిగి బతికించి తేవడం చాలా చిత్రమని మనసులో దేవకీదేవి ఆశ్చర్యపడి, ఇది అంతా అచ్చంగా విష్ణమాయ అని భావించింది.

ఓ పరీక్షిన్మహారాజా! పరమాత్మా, సమస్తలోకాధిపతి అయిన కృష్ణుడు లీలలుగా సత్కార్యాలు ఎన్నో చేసినాడు అని అనగా శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

సుభద్రా పరిణయము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Naaradaadi Maharshulu Srikrishnu Darsanambu Sesikoni Vasudevuniche Grathuvu Seyinchuta - నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట

బలవంతులైన శత్రువుల్ని అణచివేయడంలో సమర్థులూ, తెల్లని, నల్లని దేహకాంతులు కలవారూ, తమ ముఖకమలాల ప్రకాశంచేత నిండు చంద్రునివర్తులాకార సౌందర్యాన్ని గెలిచినవారూ, పరమపదస్థానాధిపతులైనవారూ, లీలతో మనుష్యులవలె ప్రవర్తించేవారూ, ప్రకాశమానమైన అలంకారాలుకలవారూ, దయాసముద్రులూ, ఓర్పులో నేర్పరులూ, అయిన బలరామకృష్ణులు

ద్వారకలో ఉన్నారని తెలిసి వారిని చూడాలనే నిశ్చలబుద్ధితో తాపస శ్రేష్ఠులైన ద్వితుడు, త్రితకుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్ఠుడు, గాలవుడు, అంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, సుక్తీర్తి మార్కండేయుడు, అగస్త్యుడు, అంగిరులు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు - మొదలైన ఇరువదియొక్క ఋషులందరూ

(పైన పేర్కొనబడిన వివిధ కాలాలలోని తపస్సంపన్నులైన వీరు నిరంతరం హరిపదచింతనతో మోక్షార్థులై ఉన్నారు. తపస్సుతో సాధించవలసిన భగవత్‌ సాక్షాత్కారం చాలా సులభంగా ద్వారకలో లీలామానుషరూపంతో ఉన్న శ్రీకృష్ణుని సంగతివల్ల - కష్టసాధ్యమైన తపంకంటె, సులభసాధ్యమైన కృష్ణదర్శనం శ్రేష్ఠమని పురాణ ఋషులు భావించారు.)

వచ్చిన ఆ మునులకు శ్రీకృష్ణుడు ఆహ్వానంపలికి, ఎదురేగి, మహర్షులకు నమస్కరించి, అతిథులకిచ్చే అర్ఘ్య, పాద్య, తాంబూలాది సకల మర్యాదలూచేసి, ఇలా అన్నాడు.

ఓ సత్పురుషులైన మునులారా! జన్మలు అనుభవించాల్సిన, మోక్షాన్ని వెదుకవలసిన మా వంటి మానవులకు మీ అనుజ్ఞతో దేవతలకు కూడా, దేవతలకు లభించని మీ దర్శనం లభించింది. అదృష్టహీనులం, ఇంద్రియాసక్తులం, జ్ఞానహీనులం అయిన మాకు సంతోషాన్నిచ్చే మీ దర్శనం, తాకడం అదృష్టం, ధ్యానించే అదృష్టం, పాదసేవ చేసేభాగ్యం సహజంగా అందనివి. అయినా, మాకు ఈరోజు ఇవన్నీ అతిసులభంగా లభించాయి. సాధుబుద్ధిగల సత్పురుషులైన మిమ్మందరినీ దర్శింస్తే చాలు, ఇక వేరుగా పుణ్యతీర్థాలు వెదికే పనిలేదుగదా!

(దేవదేవుడైన శ్రీకృష్ణుడే సామాన్యునివలె మాట్లాడుతున్నాడు. మానువ జన్మల సారహీనత, సాధుజనసేవనం, తీర్ధసేవనంవంటి పుణ్యప్రదమైన అంశాల ఔన్నత్యాన్ని చెప్పడం - లోకోద్ధరణకోసమే. సత్పురుష సమాగమం - వుణ్య తీర్ధసేవనంతో సమాన పుణ్యఫలప్రదం. ఇక్కడ శ్యమంతక తీరపంచక సేవనం, నారదవ్యాసాది మహర్షి దర్శనం రెండూ లభించాయి.)

అంతేకాదు, నీటితో నిండిన తీర్ధాలు, మట్టి, శిలలతో నిర్మించిన దేవతావిగ్రహాలూ, తీర్ధదేవతల రూపాలతో సేవించిన వారిని అనుగ్రహించేవే. కాని, వాటిల్ని చాలాకాలం సేవిస్తేనే పవిత్రత సిద్ధిస్తుంది. కానీ, పవిత్రులైన మహాత్ములను కేవలం చూస్తేనే పుణ్యం లభించి జనులు పావనులౌతారు.

మనచుట్టూ ఉన్న పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని సూర్యచంద్ర నక్షత్రాలు, వాయువు, ఆకాశం, వాక్కు మనస్సు అనే వాటిల్ని ఉపాసించినంతమాత్రాన మనలను అవి పవిత్రం చేయలేవు. అన్ని విషయాల్లో జ్ఞానంగల మహాత్ములు తమను సేవించిన క్షణకాలంలోనే మానవుల్ని పవిత్రులుగా చేస్తారు. అదలాఉంచి, ధాతుత్రయంతో నశ్వరమయ్యే శరీరాన్ని ఆత్మగా భావించడం, భార్యాపుత్రులు తనవారేననే అభిమానం కలిగి ఉండడం, సామాన్యజలాల్ని తీర్థా లని భ్రమించడం మూర్ఖుని పని. వాడు జ్ఞానహీనమైన జంతువుమార్గంలో పోవువాడు. పంచభూతోపాసనకంటె మహాత్ముల ఉపాసన చాలా శ్రేష్ఠం.

ఇలా కృష్ణుడు పలికిన - ఆలోచనాత్మకమైన మాటలు విని, మునులంతా ఆశ్చర్యంగా చూచి కొంత సేపు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కక్షణంలో ఆయన అనుమతి పొంది, చిరునవ్వులతో ఇలా అన్నారు. “దేవా! మేమూ, సృష్టి రహస్యం తెలిసిన బ్రహ్మాదులూకూడా నీ మాయచేత మోహితులమై ఉన్నాము. ఎవ్వరికీ అంతుబట్టని నీ సంకల్పంతో మమ్మల్ని దయతలిచావు. నీ లీలలు ఆశ్చర్యకరమైనవి. ఈ భూమి ఒకటే ఐనా వేరువేరు ప్రాంతాల్లో వివిధ రూపాలుగా కనబడినట్టే నీవుకూడా సృష్ట్యాదిలో కారణరూపంతో ఉండి, భిన్నరూపాలుగా కనబడి, ఈ ప్రపంచంయొక్క సృష్టి, స్ధితి, లయాలకు కారణమైన అనేక లీలలుగా అవతారాలెత్తి దుష్టజన శిక్షణం, శిష్టజనరక్షణం చేస్తున్నావు. చాతుర్వర్ణ్యాశ్రమధర్మాలు స్వీకరించి, వేదాలు చెప్పిన మార్గాన్ని అనుమోదించిన బ్రహ్మస్వరూపుడవు. నిరంతర తపస్స్వాధ్యాయ నియమాలతో పవిత్రుడవు. వేద విహిత స్వరూపుడివి. బ్రాహ్మణ జాతిని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి. మహానుభావుడివి. మోహమనే తెరవెనుక ఉండి ఆడిస్తున్న నిన్ను నీ సహచరులైన ఈ రాజలోకాన్ని మేమూ సందర్శించే భాగ్యం పొందాము. మా పుట్టుక, మా చదువు, మా తపస్సు, మా మహిమ, దీంతో సార్థకమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాము” అని మునులు శ్రీకృష్ణుణ్ణి పొగడి నుతించి, తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు.

ఆ మహర్షులందరికీ వసుదేవుడు నమస్కరించి “మునీశ్వరులారా! మీరు ధర్మం బాగా తెలిసినవారు. క్షమించి నా మనవి వినండి. పూర్వజన్మకర్మల సంచితఫలం ఈ జన్మలో అనుభవించనక్కరలేని సత్కర్మాచరణం ఏదైనా ఉంటే దయతో తెలుపండి.” అనగా ఆ ఋషులంతా వసుదేవునితో రాజులందరూ వినేలా “సమస్తయజ్ఞాలకి అధీశ్వరుడు ఈ శ్రీకృష్ణుడు. ఈతణ్ణి గూర్చి చేసిన యాగాలు మీరు ఆచరిస్తే ఎంతటి దుష్కర్మ అయినా తొలగిపోతుంది. ఇదే ధర్మరహస్యం” అని అన్నారు.

అంతేగాక

వసుదేవ మహారాజా! దేవ, ఋషి పితౄణాలు పుట్టిన ప్రతివానికి ఆవశ్యకమై వస్తాయి. వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవఋణం - యజ్ఞాదులచే, ఋషి ఋణం - వేదాధ్యయనంచేత, పితృఋణం - పుత్రపౌత్రాది వంశ పరంపరాభివృద్ధిచే తీర్చబడుతుంది. వీటిని తీర్చలేని నరుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి వెళతాడు.

(దేవతలు హవిస్సుచేత తృప్తి చెందుతారు. కనుక యజ్ఞాల ఆచరణ అవసరం. ఋషులు వేదాలు చెప్పారు. నీ తీరంలో నీవు అధ్యయనం చేసి అధీతి బోధనలచే వేదం తరతరాలకు అందించాలి. ఇది ఋషి ఋణం తీర్చుకోవడానికి మార్గం. పితృఋణం తీర్చాలంటే సంతానం ద్వారానే సాధ్యం.

గమనం “ఊర్ధ్వ లోకాలవైపే ఉంటే శ్రేష్ఠం. అధోలోకగమనం” హీనం. పుత్రులవల్ల ఊర్ధ్వలోకాలు, పుణ్యచ్యుతితో అధోలోకం రెండూ సూచించబడ్డాయి. త్రివిధ ఋణాలు, వాటిని సాధించే ఉపాయాలు సూచింపబడ్డాయి.)

అలా కావడం వల్ల నీవు (వసుదేవుడు) కూడా

శ్రేష్ఠుడైన కుమారుణ్ణి కని, పితౄణం తీర్చుకొన్నావు. వేదాధ్యయనంతో ఋషిఋణం తీర్చుకొన్నావు. పెద్దల అనుమతంతో యజ్ఞాలు చేసి దేవఋణం తీర్చుకోవడం యుక్తం అని ఋషులు తెలిపారు.

షులు చెప్పిన సూచనను అంగీకరించి, ఎంతో వినయంగా, “సూర్యసమానులైన ఓ మునీశ్వరులారా! మీరు చెప్పినట్లే యాగం నిర్వహించి, దేవణం తీర్చుకుంటాను. కానీ, మీరే నాతో నిర్వహింప చేయించాలి” అని ప్రార్థించాడు.

(వసుదేవుడు అడిగిందే తడవుగా వారిసలహాను పాటించదలచాడు. 'శుభస్య శీఘ్రమ్‌' అని కదా! పైగా మహారాజు శ్రీకృష్ణుని తండ్రి. స్థలం శ్యమంతక పంచక భూమి, అతిపవిత్రం. సమయం సూర్యోపరాగపుణ్యసమయం. బంధువర్గం అందరూ సిద్ధం. సూర్యగ్రహణవేళ సూర్యునివంటి తేజస్వులైన, అతి శ్రేష్ఠులైన మునులంతా ఎదురుగా ఉన్నారు. పెద్దల సూచన శిరోధార్యంగా, ఆముష్మికఫలదాయకంగా ఉంది. ఇంక ఆలస్యం దేనికి? ఈ అవకాశం లోకంలో ఎవ్వరికీ రానిది.)

వసుదేవుడు మునిశ్రేష్ఠులను ప్రార్థించి,ఆ మునీంద్రులనే, యజ్ఞంచేయించే 
త్విక్కులుగా ఎన్నుకొని, ఆ శ్యమంతకపంచక పుణ్యతీర్థాల దగ్గరి భూమిపై, ఇంద్రవైభవంతో, పద్దెనిమిదినుంచిభార్యలతో, దీక్ష స్వీకరించి, ఆ గొప్పయజ్ఞాన్ని వేదవిహితంగా పూర్తిచేసి,  త్విక్కులను గొప్పగా వినిమయ ద్రవ్యదానాలతో తృప్తిపెట్టి, భార్యలతో అవభృథ స్నానాలాచరించి, వజ్రాభరణాలు, విచిత్రవస్త్రాలు, సుగంధలేపనాలు, సుపుష్పమాలలు ధరించి, అక్కడ ఉన్న సమస్త బ్రాహ్మణ, ముని, బంధు, రాజులను యోగ్యంగా సన్మానించి, తృప్తిపెట్టినాడు. యజ్ఞానంతరం అందరూ కృష్ణుని అనుమతితో ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు.

ఓ పరీక్షిన్మహారాజా! 'మాతో ఉండమని' ఉగ్రసేన, శ్రీకృష్ణ, బలరాములు, ప్రేమతో అర్ధించగా యశోదానందులు తమ గోపీగోపాలుర బృందాలతో కొన్నాళ్లు వారితో కలిసి సంబరంగా అక్కడే ఉన్నారు.

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణాదుల ప్రార్థనను మన్నించి, నందుడు వారితో కలిసి మూడునెలలు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుని మర్యాదలతో, తల్లిదండ్రులపట్ల ప్రేమలతో, మధురమైన పలుకులతో, అతని లీలలుగా చెప్పుకునే జీవిత విశేషాలతో ఆనందంగా ఆస్వాదిస్తూ, కుటుంబ, బంధుమిత్రాదులమధ్య సాటిలేని విధంగా గడిపారు.

బలరామ కృష్ణాదులు, తక్కిన యాదవులు, సకలవిధాలుగా గౌరవించి, ఆభరణ వస్త్రాదులు బహూకరించి వీడ్కొల్పగా, నందయశోదాది వ్రేపల్లె వాసులు కృష్ణపాదకమలాల మకరందం కోలే తమ మనస్సులనే తుమ్మెదల్ని బలవంతంగా మళ్లించుకొంటూ, విడువలేక, విడువలేక, చివరకు

వెళ్లలేక వెళ్లలేక వెడుతూ, మాటిమాటికి వెనుకకు తిరిగిచూస్తూ, కృష్ణనామస్మరణచేస్తూ ప్రేమతో, ఆప్యాయతతో, భక్తిసూచకంగా పిలుస్తూ, స్మరిస్తూ మథురా రాజ్యంవైపు నందాదులు సాగిపోయారు. అప్పుడు

ఆ సమయంలో వర్షాకాలం ఆసన్నమైనందున బలరామకృష్ణులు ఆ శ్యమంతక పంచకభూమిని వదలి, యాదవ, బంధువర్గాలు కొలుస్తూండగా, దేవతానమస్కారాలందుకొంటూ ద్వారకకు (పయనమయ్యారు)

బలకృష్ణులు ద్వారకచేరి సుఖంగా ఉన్నారు. అపుడు

శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Lakshana Yanu Sri Krishnuni Yustamabharya Draupadi Deviki Dana Vivaha Vruttantambu Deluputa - లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

ముచ్చటలో భాగంగా శ్రీకృష్ణునిగాథలు చెప్పుకుంటుండగా ద్రాపదీదేవి, రుక్మిణి మొదలగు కృష్ణుని దేవేరుల్ని, మీ మీ వివాహవృత్తాంతాల్ని చెప్పండనగా వారు శ్రీకృష్ణుణ్ణి పరిణయమాడిన విధం వివరించారు. ఓ పరీక్షిన్మహారాజా! అది నేను నీకు గతంలో చెప్పాను. ఒక్క లక్షణాదేవి కథమాత్రం ఆమె ద్రౌపదికి చెప్పిన వృత్తాంతము ఇపుడు సవిస్తరంగా చెప్తానని శుకుడన్నాడు.

ద్రౌపదితో లక్షణ తననుగూర్చి ఇలా చెప్పింది. సంగీత విశారదుడైన నారదుడు వీణావాదన తోడుచేసుకొని శ్రీకృష్ణుని కథల్ని పాటలుగా పాడి వినిపించగా, నేను వాటికి ఆకర్షితురాలనై, శ్రీకృష్ణుణ్ణే మనస్సునందు నిల్పి తన్మయురాలనై ఉండగా, ఆ విషయం తెలిసిన మా తండ్రి నామీద ప్రేమతో, శ్రీకృష్ణునకే ఇచ్చి నన్ను పెళ్లి చేయడానికి ఇతరరాజులకు కోపం రాకుండా ఒక ఉపాయం పన్నాడు. ఆకాశంలో ఉంచినా, ఎవరికీ కనబడకుండ, కింద నీటిలో మాత్రం ప్రతిబింబం కనబడేట్లు మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేశాడు. ఎంతటి గొప్పవాళ్లకైనా కదిలించడానికీ, అల్లెత్రాడు ఎక్కిరావడానికీ వీలుకాని

(లక్షణకు శ్రీకృష్ణునిపై మక్కువ కల్గడానికి నారదుడు కారణం. ఆమె ప్రేమ తండ్రికి తెలిసింది. తండ్రికి పుత్రికపై అమితానురాగం. ఆయనకు అందుకే “దుహితృవత్సలు” డని విశేషణం వాడబడింది. కృష్ణుడుమాత్రం ఛేదించగల్గేటట్లు, ఇతరులెవ్వరికీ సాధ్యంకాని ఒక ప్రత్యేమైన మత్స్యయంత్రాన్ని స్వయంవరానికై ఏర్పాటుచేశాడు. అర్జునుని మత్స్యయంత్రభేదనంలో చేప కనబడుతుంది. ఇక్కడ పైన చేప కనబడదు. అదీ విశేషం. శ్రీకృష్ణుడు విలువిద్యలో అర్జునునికన్నా మేటి అని తెలుస్తూంది.)

ధనుస్సునూ, వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని మత్స్యయంత్రంవద్ద గంధాక్షతలు, పుష్పాలతో పూజించి, “ఏ పురుషుడైనా ఈ ధనుస్సు ఎక్కుపెట్టి, ఈ బాణాన్ని విల్లుకు ఎక్కుపెట్టి, మ
త్స్యయంత్రాన్ని నేలగూల్చిన ధనుర్విద్యా నైపుణ్యంగల శూరుణ్ణి నా కూతురు వరిస్తుందని అందరూ వింటుండగా (ప్రకటించాడు)

మాతండ్రి చాటింపు వేయిస్తే విని దానికనుగుణంగా, నన్ను వివాహమాడాలనే వేగిరపాటుతో గొప్పగొప్ప ధనుర్ధరులైన రాజులు వివాహసంబరాన్ని చూచే ఉబలాటంగలవారు అయిన అందమైన రాజకుమారులు క్రీర్తిమంతులు అమిత సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు.

స్వయంవరానికి వచ్చిన రాజుల్ని అర్ఘ్య, పాద్య, మజ్జన, భోజనవసతి తాంబూలాది అతిథిమర్యాదలతో సంతోషంగా ఆహ్వానించినాడు. మహాబలులైన వారు స్వయంవరమంటపంలో మత్స్యయంత్రభేదనానికి సన్నద్ధులై ధైర్యంగా ధనుస్సు దగ్గరగా పోయి

ఇలా సమీపించి ఆ ధనుస్సును చూచి

సభాప్రాంగణంలో కొందరు ధనుస్సు వద్దకే వెళ్లక, వెళ్లినా కొందరు కదల్చలేక, కొందరు కొంచెమెత్తి విఫరురై, కొందరునేలపై ఉంచి, అల్లెత్రాడు బిగించి, మరికొందరు బాణం బిగించలేక సిగ్గుపడి, “ఛీ! ఇక్కడికి రావడమే పెద్ద తప్పు” అనుకొంటూ

భీముడూ, కర్ణుడూ ఆర్భాటంగా ముందుకు వచ్చి, విల్లు ఎక్కుపెట్టి బాణంవేసి, ఆ మత్స్యం అలుపెరుగని రీతిగా వేగంగా పైన తిరుగుతుంటే - దాన్ని కనుక్కోలేక విఫలురై వెనుతిరిగిన తరువాత

ఇంద్ర తనయుడైన అర్జునుడు మత్స్యయంత్రాన్నికొట్టే ఉపాయం తెలిసినవాడైనా, బాణంవేసి, చేపను పడగొట్టలేక విముఖుడై, వికలమనస్కుడై తిరిగిపోయాడు.

వచ్చిన రాజకుమారులంతా మత్స్యయంత్రాన్ని ఛేదించే యత్నాలుచేసి అవి వమ్ముకాగా, చిన్నబోయి, దిగులుతో కూడిన ముఖాలతో చూస్తుండగా

శ్రీకృష్ణుడు వింటికి అల్లెత్రాడుకట్టి, మెరిసే బాణాన్ని సంధించి, తన విలువిద్యా నైపుణ్యం ప్రకాశించగా ఆకాశంలో తిరుగాడే యంత్ర మీనాన్ని కూలవేశాడు. సురసిద్ధాదిదేవజాతులు జయజయ ధ్వానాలు చేశారు. ఆకాశంనుండి పూలవాన కురిసింది.

ఆ సమయంలో అంతులేని ఆనందం కల్గింది. ముఖం వికసించింది. సంభ్రమంవల్ల కల్గిన చెమట బిందువులు ఫాలభాగాన కారి కస్తూరితిలకాన్ని చిత్తడిచేయగా, ఆ రేఖల్లో చిక్కుకున్న తుమ్మెదల గుంపుల్లాంటి నల్లనికురుల్ని చిగురుటాకు చేతులతో పక్కకు జరుపుతూ, తళుకులీనే మోముపై మెరుపులు వ్యాపించగా, అందమైన నడుము వణకుతుండగా మెల్లని నడకలతో

(కృష్ణుడు కాక ఇతరులు మత్స్యయంత్రంకొడితే, వారినే పెళ్లాడవలసిన లక్షణకు తా నిష్టపడిన కృష్ణుడే మత్స్యయంత్రాన్ని భేదించడం వల్ల ఆమెకు అంతరంగం ఆనందంతో నిండింది. దానివల్ల ఉద్విగ్నత, స్వేదం, వణుకు ఏర్పడగా, నడుము వణుకుతుండగా, మెల్లగా నడుస్తూ)

కాలి అందెలు ఘల్లుమని మోగగా, చిరునవ్వులు పెదవులపై ప్రకాశింపగా, బంగారు కుండలాలకాంతి చెక్కిళ్ల పై పడగా, చేతికడియాలు మనోహరంగా ధ్వనిస్తూండగా సభామంటపంలోకి వచ్చి నాల్గుదిక్కుల్నీ మొగమెత్తి చూస్తూ

(సహజంగా స్వయంవరంలో కవియే స్వయంవర వధువును వర్ణిస్తాడు. కాని, ఇక్కడ వధువే తన ఆత్మకథ (స్వీయానుభవం) చెప్పడం కథనంలో విశేషం.)

సభాభవనం మధ్యలో రాజులందర్ని జూచి, వారిని తిరస్కరించి, నా చేతుల్లోగల దివ్యమణులు పొదిగిన కాంచన హారాన్ని శౌరిమెడలో వేశాను. అలాగే, ఇప్పపూలమాలనుకూడా విలాసంగా ఈ కృష్ణుని కొప్పుపై ఉంచాను. అపుడు నా కన్నుల్లో సిగ్గు దోబూచులాడింది.

వరమాలవేసిన ఆ మధురక్షణంలో శుభసూచకంగా, ఆనంద చిహ్నంగా ఢమరుక, ఢంకాలు, శంఖాలు, మృదంగాలు, మధుర మురళీ దుందుభులు, ఢక్కామర్దళాలు మొదలైన వివిధరకాల వాద్యధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల్లో నిండాయి. నాట్యకత్తెల నాట్యాలు మనోహరంగా ప్రదర్శింపబడినాయి.

ఆ క్షణంలో దేవతల సైన్యాన్ని పారదోలి గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎలా హరించాడో అలాగ, అపారమైన శత్రురాజసమూహాన్ని తిరస్కరించి, శ్రీకృష్ణుడు నన్ను అక్కున చేర్చుకొని సింహగమనంతో అందమైన బంగారు రథంమీదకు చేర్చాడు.

లక్షణతో కూడి, శ్రీకృష్ణుడు రథమెక్కి సారథి అయిన దారుకుడు శత్రుసంహారశౌర్యంతో ప్రకాశించడానికి యోగ్యమైన మేలైన నాలుగు గుర్రాలు పూన్చిన రథం తోలుతూండగా, శత్రువులనే దట్టమైన చీకట్ల సమూహాలకు తీక్ష్ణమైన సూర్యకాంతివంటి ధనుస్సును తాల్చి, దాని అల్లెతాటి ధ్వనులతో దిగంతరాలు నింపుతూ, రథంపై ప్రయాణిస్తూ ఉండగా

స్వయంవరానికి వచ్చిన రాజులంతా శ్రీకృష్ణుని వైభవానికి కన్నుకుట్టి, ఓర్వలేక, స్వయంవర నియమాలు ఉల్లంఘించి, ఆయన మహిమల్ని తెలుసుకోలేక గర్వాంధకారంతో గుంపులుకట్టి యుద్ధసన్నద్ధులుకాగా

మన్మథుని పూలబాణాల తాకిడికి ఓర్వలేక కామాతురులై, రాజులంతా, ధైర్య, శౌర్య, శక్తి సామర్ధ్యల్ని ప్రకటిస్తూ, ఎల్లప్పుడూ దేవతల నమస్కారాలందుకొనే మహిమాన్వితుడైన కృష్ణునితో గర్వించి యుద్ధం ప్రారంభించారు.

సింహంవంటి పరాక్రమంతో చెలరేగుతూ తన శార్ఙ్గం నుండి బంగారు రెక్కలవాడి బాణాలను శత్రువులపై వేశాడు. తన భుజబల ప్రదర్శనతో ప్రకాశిస్తూ, వారితో యుద్ధంచేసి సైన్యాన్ని చెదరగొట్టే భీకర ధ్వనిగల తన పాంచజన్యాన్ని విజయ సూచకంగా ఊదాడు.

ఆ సమయంలో పరాక్రమవంతులైన శత్రురాజులు మృగాలన్నీ ఒక్కసారి సింహంమీద దూకినట్లు, తత్తరపాటుతో తమ చతురంగ బలాలతో కళంకరహితుడైన శ్రీకృష్ణుని చుట్టుముట్టగా

చుట్టుముట్టిన రాజులపై మిక్కిలి కోపించినవాడై తన బాణాలతో కుండలాలు ధరించిన వారితలల్ని అందెలు ధరించిన పాదాల్ని కడియాలు ఉంగరాలు ధరించిన చేతుల్ని నేలపై పడేలా తెగవేశాడు.

యుద్ధంలో చావగా మిగిలిన రాజుల్ని తీక్ష్ణమైన వాయవ్యాస్త్రం ప్రయోగించి, ఎండుటాకుల్లా ఎగురగొట్టి, పారదోలి, విజయుడై ద్వారకా నగరానికి (నన్ను తీసికొని) చేరుకున్నాడు.

మంగళకరంగా అలంకరించబడి, మనోహరమైన వైభవంతో అందంగా ఉన్న ద్వారకానగరానికి మేము రాగా, మా వెనుకనే ఎంతో సంతోషంతో నా తండ్రికూడా వచ్చి పెళ్లి కూతురితోబాటు అల్లునికి బహుమానంగా ఇచ్చేసారెగా రత్నభూషణాలైన గండపెండేరములు, హార, కుండల, కిరీట, కంకణ, అంగులీయకాలు, శ్రేష్ఠమైన పీతాంబరాదివస్త్రాలు, హంసతూలికా తల్పాలు, రథగజ తురగాది వాహనాలు, వివిధరకాల ఆయుధాలు, దాసదాసీ జనాలు మొదలైన వాటిని లెక్కపెట్టలేనంత సంఖ్యలో ప్రేమగా సమర్పించాడు.

ఈయన వైభవమంతా శ్రీకృష్ణానుగ్రహమే అయినా రాజోచిత, వివాహోచిత ధర్మంగా తన కన్యను, సంపదల్ని తిరిగి సమర్పించాడు - అని బ్రాహ్మణులు పలికి, ఆశీర్వదించి పొగడగా, బృహత్సేనుడు, కన్యాకనకసంపన్నాది ఉపాయనాలు అల్లుడైన శ్రీకృష్ణునికి సమర్పించి, వరుసక్రమంలో పెద్దవారైన దేవకీవసుదేవాదులు మొదలుకొని, యదుపుంగవుల్ని పూజించి, మరలి, తన రాజధానికి పోయాడు.” అని లక్షణ తనవివాహవృత్తాంతాన్ని చెప్పగా, అక్కడ ఉన్న కుంతి గాంధారి ద్రౌపది, ఇతరరాజపత్నులు, గోపికలు తమ హృదయాల్లో భగవంతుడైన విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి ఆనంద పరవశులై


నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnudu Sakutumbamuga Grahana Snaanamunaku Bovuta - శ్రీ కృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీ కృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు బోవుట

అవతారిక: దీనికి ముందు జరిగిన కథలో తన బాల్యసఖుడైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు చిన్ననాటి చెలిమితో ఆదరించి చక్కగా ఉజ్జీవింపజేసిన కథ వినిపించినాడు. విన్నశ్రోత పరీక్షిత్తు. వక్త శుకమహర్షి అందుకే, భాగవతగాథ అంతా “వేదకల్పవృక్షవిగళితమై శుకముఖసుధాద్రవం”లో తడిసిందని చెప్పబడింది. భక్తిరసార్ద్రత భాగవతజీవధాతువు.

పాపులను శిక్షించి, వారి దుష్టకార్యాలను ముందు తరాలలో ఎవ్వరూ చేయకుండా కట్టడిచేసి, వారిచే బాధితులైన మంచివారికి రక్షణనిచ్చే మహాకార్యాలు చేసే లక్ష్యంతో శ్రీకృష్ణభగవానుడుగా అవతారమెత్తిన విష్ణుకథను విపులంగా చెప్పవయ్యా! అని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినాడు.

శుకమహర్షి పరీక్షిత్తు అడిగినదానికి జవాబుగా ఇలా అన్నాడు.

కుచేలు
ణ్ణి సత్కరించిన ఘట్టం తరువాత - కొంతకాలం గడిచింది. బలరామకృష్ణులు సుఖంగా కాలం గడుపుతున్నారు. జగత్ప్రళయకాలంలో వలె కన్నులు భరించలేనంత దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యబింబానికి గ్రహణంపడుతోందని తెలిసి, ప్రజలు పూర్వం జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు మహాక్రోధంతో తన తండ్రిమృతికి కారణమైన రాజలోకాన్ని తన పదునైనగండ్రగొడ్డలి అంచుతో ఇరవై ఒక్కసార్లు తలలు నరికి, వారిరక్తధారల ప్రవాహాలతో (నిండిన ఐదు మడుగుల శ్యమంతకమనే పవిత్ర సరోవరాలున్న చోటికి కదలివెళ్లారు. )

(సూర్యగ్రహణాన్ని సూర్యోపరాగమనీ, చంద్రగ్రహణాన్ని చంద్రోపరాగమనీ అంటారు. ఉపరాగమంటే గ్రహణం.)

పరశురాముడు ఇరువదొక్కమార్లు చంపిన రాజుల రక్తధారలతో శ్యమంతక పంచకమనే పేర ఐదుచెరువులను సృష్టించినాడు. అక్కడికి ద్వారకా ప్రజలు, ఆపై బలరామకృష్ణులుకూడా స్నాన, దానాదికాలకోసం సూర్యగ్రహణ సమయానికి అక్కడికి బయల్దేరినారు.

కర్మలను ఆచరించవలసిన అవసరంలేనప్పటికీ, లోకాచారాన్ని అనుసరించి, గ్రహణవేళస్నానాదిధర్మకర్మలను ఆచరించదలచి, ద్వారకా నగర రక్షణకు ప్రద్యుమ్నాదియువకులైన యోధులను నియమించి, వృద్ధులైన వసుదేవాదులతో, మిగిలిన పరివారంతో, స్త్రీజనంతో గంధమాల్యాభరణాదులు ధరించి, అందమైన అలంకరణలతో, పుష్పకాలవంటి రాతల్ని, మేఘాలవంటి ఏనుగుల్ని శ్రేష్ఠమైన గుఱ్ఱాల్ని ఎక్కి సేవకజనం వెంటరాగా, సూర్యగ్రహణవేళ పవిత్రమైన సరోవరాల్లో స్నానంచేసి, ఉపవాస దీక్షతో ఉండినారు. ఆ తరువాత

(1. పుణ్యకార్యాచరణం సంస్కారబలాన్ని పెంచి, మనస్సును పాప సంకల్పాలనుంచి దూరం చేస్తుంది. అవతారపురుషులైన బలరామ, శ్రీకృష్ణులకు సామాన్య మానవులకువలె పుణ్యకర్మలు ఆచరించవలసిన పనిలేదు కనుక వారు నిష్కర్ములని సూచించబడింది. కాని, వారు ఇపుడు సాధారణప్రభువులవలెనే ఉన్నారు కనుక లోకాచారాలైన ధర్మాచరణం చేయవలసి ఉంది. “యథా రాజా తథా ప్రజాః" అన్నట్లుగా రాజులు ప్రజలందరికీ ఆదర్శప్రాయులు. కనుక, సామాన్య ప్రజలకు
ఈ పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి, ప్రేరణగా బలరామకృష్ణులు ఆచరించారని భావించవచ్చు. అందుకే, సూర్యగ్రహణపవిత్రసమయంలో స్నానదానాదిధర్మకర్మాచరణానికై పవిత్ర తీర్ధస్నానాలకు వెళ్లడం.

2.  ఒక జాతిలోని సంఘటిత శక్తిని ప్రచోదనం చేయడానికి ఇలాంటి సత్కార్యాచరణాలు, సదాచారాలు దోహదం చేస్తాయి. ఈ సామాజిక ప్రయోజనాన్ని కూడా రాజులు భావించి ప్రోత్సహించారు.

3. ప్రవాహవేగం గల నది / తరంగాలలో స్నానంచేయడం ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది.

4. ప్రభువులు రాజధాని విడిచివెళ్లుతున్నారు కాబట్టి, ద్వారకారక్షణానికై యోధులను, యువకులను నియోగించినారు. వృద్దులకు ధర్మాచరణం ఆవశ్యకం కనుక వసుదేవుడు, ఉగ్రసేనుడు మొ॥ వారు వెంబడి వచ్చినారు. ధర్మకార్యాచరణానికి పత్నీసమేతంగా వెళ్లాలి కనుక, స్త్రీ జనాన్ని తీసుకొనిపోయారు.

సాటిలేని దుస్తులు, ఆభరణాలు, గోవులు, బంగారు, రత్నాలు, భూమి మున్నగు విలువైన వస్తువులను యోగ్యులైన బ్రాహ్మణులకు దానముచేసి, వారిచే సంతోషపెట్టబడినవాళ్లై

(దానంవల్ల అహంకార, మమకారాలు లేని మానసిక స్థితి ఏర్పడుతుందని, ప్రజల్లో త్యాగగుణం పెంపొందుతుందని పెద్దలు చెప్పారు.)

గ్రహణం విడిచాక మోక్షణస్నానాలు ఉత్సాహంగా చేసి, అంతవరకు ఉపవసించినారుకనుక భోజనాదులు, బంధువులందరితో ఆత్మీయతలు వికసించేలా పరస్పరప్రేమలతో గావించి, ఆ ప్రదేశంలో చక్కగా

(సూర్యచంద్ర గ్రహణాలకు కొన్నిగంటలముందే ఉపవాసదీక్ష గ్రహణవేళ స్నానం మోక్షణవేళవరకు దాన, జప, తపాదులతో గడిపి, మోక్షణ స్నానానంతరం వంటలు ప్రారంభం - ఇది శాస్త్రసమ్మతవిధి. ఈ విధిని రామకృష్ణులు ఆచరించారు.)

నదీ తీరంలో బంధుమిత్రులతో సూర్యగ్రహణ మోక్షణ స్నానానంతరం వంటలు వండుకొని సామూహికంగా భోజనాదులు చేయడంలో అనురాగం వెల్లి విరిసిందని పోతన వివరించాడు. ప్రజలలో సామరస్యం, సంఘటితభావం పెంపొందటానికి ఇలాంటి విధానాలు సహకరిస్తాయి.

పొన్నచెట్లు బాగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించుటచేత సూర్యకిరణాలు చొరలేనంత దట్టమైన ఆ అటవీ భూములలో విశ్రమించిన శ్రీకృష్ణుడు, అతని పరివారం

చిగురాకుల ఆసనాలపై సద్గోష్ఠులతో మనసులు ఆనందం పొందుతుండగ, ఆ శమంతక సరోవరాలలో మరికొన్నిసార్లు స్నానంచేయడానికి ఆసక్తికలవారై

(రాజులైనా, ప్రస్తుతం ప్రకృతి ఒడిలో ఉన్నారు కనుక చిగురుటాకులసెజ్జలే! సత్పురుషులు చుట్టూ ఉన్నారు గనుక సద్గోష్ఠులే! రాచకార్వాలు, మంత్రాంగాలకు దూరమైనచోటు. స్థలం, సమయం ఆధ్యాత్మిక వాతావరణం కనుక మనసు గోష్టిలో ఉల్లాసం పొందుతున్నది. జలాశయ పంచకం అతిశ్రేష్ఠమైందికనుక కేవల గ్రహణ స్నానంచేసి, తిరుగు ప్రయాణానికి బదులు 'తీర్ధసేవారతి' అనగా మరింత సేవించే అభిలాష. పుణ్యనదీజలాలకు తీర్చాలని, పుణ్యప్రదేశాలకు క్షేత్రాలని స్థూలవ్యవహారం. జలస్థలాలన్న అర్థాలుగల ఈ పదాలకు అర్థవిశేషత స్థిరమైనది. గోవులుండే ప్రదేశం గోష్ఠం. పవిత్రమైనచోటు. సత్పురుషులుండునది అలాంటిదే. వారుచేసే చర్యలవల్ల ఆ స్థలం(గోష్ఠము) 'గోష్ఠి' అన్న అర్థం పొందింది. గొడవలుపడే చోటులు గోష్ఠులు కాజాలవు.)

ద్వారకనుండి శ్రీకృష్ణాదులు వచ్చినట్టే, వివిధ దేశాలనుండి రాజులు వచ్చినారు. ధర్మరాజు, ఆయనతో తక్కిన పాండవులు, ఆయనను అనుసరించి వచ్చిన భీష్మ ద్రోణ, ధృతరాష్ట్రులు, గాంధారి, కుంతి, కురు-దేశాల రాజులూ, వారి వారి భార్యలు సంజయుడు మొదలైన ధృతరాష్ట్రానుచరులు, బంధువులైన కుంతిభోజ, విరాట, భీష్మకాదిరాజులు వచ్చారు. యాదవ వంశంలోని వృద్ధులైన ఉగ్రసేనాదులను పూజించి గౌరవించారు. ఉభయులు సంతుష్టులైనారు. అప్పుడు

(వచ్చినవారంతా వృద్ధులు, స్త్రీలు, ఏకాగ్రమైన పట్టుదలతో పుణ్యకార్యాలు చేసేవాళ్లు, శారీరక శ్రమకోర్చి సుదూర శ్యమంతక తీర్థానికి వచ్చారు. ఉత్తములు కనుక వృద్దులకు పూజలు చేశారు. ఇందరు రాజులు వచ్చినా, దుర్యోధనాదులు, వారిని అనుసరించి వచ్చినవారు లేరు. వారికి పుణ్యమైన పనులను కలిసివచ్చెట్లు చేయడంగాని, ధర్మంపట్ల ఆసక్తిగాని లేదు. అందుకే వారి ప్రస్తావన లేదు. పై వచనంలో స్త్రీజనాన్ని మాటిమాటికి చెప్పటంచేత పుణ్యకార్యాలందు వారికి అభిరుచి అతిశయమని, ఇది నాటికి నేటికి ఒకే తీరుగా ఉన్నదని గమనించాలి. పురుషులకన్న స్త్రీలకు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి తొలినాళ్లనుండి అధికమే! సహజమే!)

వచ్చిన రాజులంతా భార్యాసమేతులై ధైర్యవంతుడు, దానవసంహారి, గోపీజనవల్లభుడు, పరివారసహితుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసికొన్నారు.

(పూర్ణపురుషుడు, అవతారమూర్తి, రాక్షససంహారకుడైన శ్రీకృష్ణభగవానునిదర్శనం భార్యాసమేతులై వచ్చి దర్శించుకొన్న రాజులకు సూర్యగ్రహణ పవిత్ర సమయాన మరింత పుణ్యప్రదం. కానీ కేవలం ద్వారకకురాజుగా ఇతర రాజులు సందర్శించినట్టుగాక, భార్యాసమేతులై ఒక పుణ్యకార్యంగా దర్శించుకొన్నారని సూచన.)

ఆ శ్రేష్ఠులైన రాజులు బలరామకృష్ణులచే ఉచితమైన గౌరవాలు పొంది, శ్రీకృష్ణుని సన్నిధివల్ల తృప్తులై, వారి దయచేత సంపదలు, వైభవాలు పొందిన ఉగ్రసేనాదులతో కృష్ణుడు వింటుండగా ఇలా అన్నారు.

మన శాస్త్రాలు నిరూపించిన ఆచరణ విధులు, ఏ లక్ష్మీవల్లభుని పాదప్రక్షాళిత జలం మనవల్ల త్రికరణాలు పావనమవుతాయో, ఏ మహాత్ముని పాదాలు సోకిన మాత్రాన ఆ ప్రాంతం ముక్తిప్రదం అవుతుందో ఆ పుణ్యపురుషుడు ఈ కృష్ణుడే సుమా!

(1. సమకాలీనులైన రాజన్యులంతా శ్రీకృష్ణుని పరమాత్మగా భావించినారు. భగవంతుడు గోకులంలో పుట్టి, పెరిగి, తమలో ఒకడుగా జీవించడంవలన ఆత్మీయుడుగా భావిస్తున్న వారికి, ఈ మాటలు కృష్ణుణ్ణి మహిమాన్వితునిగా వివరిస్తున్నాయి. తమవాడని భావించడంవల్ల శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయిన వీరికి ఉద్ధవాదుల బోధలు అవసరమయ్యాయి.)

సనకసనందనాది గొప్ప మునులే యోగదృష్టితో భగవంతుణ్ణి దర్శించలేక సకలఆత్మలందు వెతికి, దొరకక ప్రయత్నిస్తున్నారు కదా! ఈ గోపకులు ఏమి తపస్సు చేశారో కాని, యోగమక్కరలేక, భౌతిక శరీరాలతో, చర్మ చక్షువులతో హరిని నిరంతరం చూడగలిగే భాగ్యవంతులయ్యారే! వీరి తపస్సు ఎంత గొప్పదో కదా!

ఉగ్రసేనుడు మొదలుగాగల శ్రీకృష్ణుని బంధుకోటిలోని యదుపుంగవులకు, తాము చేసే పనులతో అనగా పాప, పుణ్యకర్మలతో సంబంధంలేకుండా, వాటిని వదిలివేసి, మోక్షస్వరూపుడైన ఆ భగవంతుడే తమ పక్కన ఉండుటచే ఆతనితో సాధారణ మానవునివలె, చూడడం, మాట్లాడించడం, శరీరాన్ని తాకడం, పాటలు పాడడం, కలిసి తిరగడం, ఆయనతోబాటే ఆసనాలు, పరుపులు, శయ్యలవంటివానిపై కూర్చోవడం, పడుకోవడం, ఆయనతో బంధుత్వస్నేహాలను పాటిస్తున్న ఈ అదృష్టం ఎలా దక్కిందో!

రాజులంతా, కృష్ణుని దయవల్ల తీరిన సకలమైన కోర్కెలుగల్గి హాయిగా జీవిస్తున్న వైనాన్ని పలుమార్లు ప్రశంసించి, చివరకు వీడ్కోలు తీసికొన్నారు

కృష్ణుడు అవతారపురుషుడని పొగడి రాజులు వెళ్లిన పిదప, కుంతీదేవి, దుర్యోధనాదులవల్ల తన కుమారులైన పాండవులకు కల్గుచున్న ఇక్కట్లను మనసులో స్మరించి, బాధపడుతూ, పుణ్యాత్ముడు, కల్మషాలులేని తన అన్న వసుదేవునితో ఇలా అన్నది.

నీకు అల్లుళ్ళైన పాండురాజకుమారులు ధర్మజాదులు క్రూరమృగాల మధ్య అరణ్యాలలో కష్టాలు పడుతుంటే మీరు దయార్ద హృదయంతో వారి బాధలను పట్టించుకోరా?

పైవిధంగా చెప్పి, అనేకవిధాలుగా బాధపడుతూ, కుంతి అన్నగారైన వసుదేవునితో ఇలా అంది.

విధియే బలవత్తరమై వ్యతిరేకంగా ఉంటే బంధువులుఉండి మాత్రం ఏమి చెయ్యగలరని కన్నీరు ఒలుకగా దుఃఖించే చెల్లెలు కుంతిని చూచి వసుదేవుడు ఇలా అన్నాడు.

అమ్మా! ఎందుకు తపించిపోతావు? ఆలోచించకుండా విధినెందుకు నిందిస్తావు? అన్నిటికి కర్త ఈశ్వరుడు. మాయ అనేది ఒక తెర. దానికి వెనుక ఉండి, బొమ్మలనాడించే సూత్రధారి ఈశ్వరుడు. అతనిచేతిలో ఉండి నటించే కీలు బొమ్మలవంటివారు మానవులు. దేవతలైనా, విధిని తప్పి ప్రవర్తించలేరు. మేము అలా దుర్మార్గుడైన కంసుని చేతిలో చాలా బాధలుపడి, తాళలేక అడవులు పట్టినాము. దయానిధియైన ఈ కృష్ణుని అనుగ్రహంవల్ల మా కష్టాలు తొలగి తిరిగి స్థిరనివాసులమైనాము.

ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు శ్యమంతక ప్రదేశానికి రాగా, వ్రేపల్లెలో ఉన్న శ్రీకృష్ణుని బాల్య బంధుగణం, తల్లిదండ్రులైన నందుడు, యశోదలతోపాటు గోపగోపికాగణం కృష్ణుణ్ణి చూచే సంబరంతో కలిసివచ్చారు.

ఈ విధంగా కృష్ణునివద్దకు వచ్చి

చాలాకాలం తరువాత వచ్చిన నందుణ్ణి చూచి వృష్టి యాదవ, భోజవంశీకుల గుంపులు ఎదురేగి ఒకరి తరువాత ఒకరు ఆలింగనాలు చేసుకొన్నారు.

యశోదానందులకు వసుదేవుడు సంతోషంగా ఆతిథ్యమిచ్చాడు. తల్లిదండ్రులకు బలరాముడు, కృష్ణుడు వినయంగా నమస్కరించారు.

ఆ విధంగా బలరామకృష్ణులు నమస్కారాలుచేసి కౌగిలించుకొని తామరలవంటి కన్నులలో సంతోషంతో ఉబికిన కన్నీళ్లు కారగా, సంపూర్ణమైన మమకారాలు మనసులలో వ్యాపించగా ఏమీ మాట్లాడలేక ఉండిపోయారు. అప్పుడా యశోదమ్మ బలరామకృష్ణులను తన ఒడిలో ఉంచుకొని, తన వక్షస్థ్సలానికి దగ్గరగా లాగుకొని చెంపలకు ముద్దుపెట్టి, తన ముఖాన్ని వారిశిరస్సులకు ఆనించి చిబుకాన్ని నిమురుచు మరల మరల కౌగిట్లోకి తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతుండగా, ఆ తర్వాత

రోహిణీ, దేవకీ సతులిద్దరు యశోదాదేవిని నిండైన మనసుతో కౌగిలించుకొని, బలరామకృష్ణులను పెంచడంలో ఆమె పాటించిన అన్ని విధాల సత్కార్యాలను తలచుకొంటూ అమ్మా! యశోదా! మీ దంపతులిద్దరు బంధుప్రీతితో మాకు చేసిన మేలు (కార్యాలు) మరచిపోగలమే! అని అన్నారు.

పుట్టినప్పటినుండి మీరే ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసినందువల్ల రామకృష్ణులిద్దరూ ఈనాటికీ నీ బిడ్డలమనే భావిస్తున్నారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా అనుకోవటం లేదు.

(కన్న ప్రేమ కన్న పెంచిన ప్రేమ విశేషమైనదని ఈ సన్నివేశం వల్ల తెలుస్తోంది.)

మీరు వీరిని ఎంతోప్రేమగా కంటికి రెప్పల్లా కాపాడుతూ పెంచి పెద్దచేశారు. మాకంటే మీరే ఎక్కువగా ప్రేమించారు. కనుక వారు మీ ఇండ్లల్లోనే  ఇంతకాలం ఉన్నారు.

రోహిణి, దేవకీదేవులు మాట్లాడుతుండగా గోపికాస్త్రీలు, తమ హృదయేశ్వరుడైన శ్రీకృష్ణుడు చాలాకాలం తరువాత రావడంచేత, ఆయనను చూడటానికి కోర్కెలు హృదయాలలో పొంగుతుండగా వచ్చారు.

సుందర రూపుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆ గోపికలు కన్నులు రెప్పలు వాల్చక చూచినారు. మనసులలోనే ఆయన దేహసౌందర్యానికి మోహించి కౌగిళ్లు ఇచ్చినారు. బ్రహ్మమును ఆరాధించే యోగులు ధ్యానంలో పరవశించినట్టు, శరీరాలలో పులకలు కలుగగా గోపికలు భౌతిక ప్రపంచాన్ని మరచారు.

(గోపీకృష్ణుల పరస్పర ప్రేమ జీవాత్మ పరమాత్మల బాంధవ్యంవంటిదని భాగవతవ్యాఖ్యాతలు చెప్పారు.)

గోపికలయొక్క ప్రేమను శ్రీకృష్ణుడు పసిగట్టాడు. ఆ గోపికల మనోభావాలను గమనించిన శ్రీకృష్ణుడు ఏకాంత ప్రదేశానికి తీసుకొనిపోయి, ప్రేమతో కౌగిలింతలుఇచ్చి ఎడతెగని భక్తిభావంతో నిండిన వారితో చిరునవ్వులు చిందిస్తూ (ఇలా) పలికాడు.

ఓ వనితలారా! మిమ్మల్ని విడిచిపోవడానికి కారణం ఉంది. బలవంతులైన శత్రువులను అణచి వేయడానికి విజయయాత్ర చేసినందువల్ల ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమైంది. దీనికి మీరు కోపించవద్దు. గాలికెగుర గొట్టబడే దూది వలె, గడ్డిపోచలవలె విధి చరాచర ప్రపంచంలో జీవులను ఒక్కోసారి కలుపుతుంది. ఒక్కోసారి విడగొడుతుంది. (కలియుట విడిపోవుట ప్రాణులకు సహజమైనదని భావం.)

గోపికల్లారా! నా యందలి భక్తివల్ల ప్రాణులకు మోక్షానందం సిద్ధిస్తుంది. భక్తిలేకుండా కేవలం జపతపాదులవల్ల, మోక్షం కలుగదు. శివుడు, బ్రహ్మ సనకాది మునులు తమ మనస్సుల్లో నిలిపిన నిర్మలభక్తి మీలో పుట్టింది. మీ పూర్వజన్మ సంచిత పుణ్యం ఫలవంతమైంది. నా సంబంధమైన (భగవత్ సంబంధమైన) జ్ఞానంచేత ఇంక మీకు నరకాదులు, జననాదులు, పాపపుణ్యకర్మలు ఏవీ ఉండవు, అతీతమైన మోక్షం లభిస్తుంది. ఇది అసత్యం కాదు.

(కర్మాది అనుభవాలవల్ల స్వర్గనరకాదులు, సంచిత కర్మఫలాలవల్ల పునర్జన్మాదులు, తిరిగి పాపపుణ్యకర్మాచరణం ఇది ఒక చక్రభ్రమణం. దీనినుండి తప్పించుకొనడం మోక్షస్థితి. దీనికై జపతపాదులు మాత్రమేగాక, భగవంతునియందు గాఢభక్తి అవసరం. బ్రహ్మేశ్వరాదులకుమాత్రమే అనుభవంలోనికి వచ్చిన ఈ మానసికస్థితి ప్రస్తుతం కృష్ణునివల్ల గోపికలకు అనుభవమైంది. గోపికల అనన్యభక్తి, జప, తప, దాన, ధర్మాది కర్మాచరణంకంటె శ్రేష్ఠమైందని భాగవత సందేశం.)

సర్వభూతాల్లో(సమస్త ప్రాణికోటిలో) జన్మ, జీవన, మృత్యువులు నేనే! లోపల, బయట నేనే వ్యాపించి ఉన్నాను. ఘటపటాది వస్తుజన్యతకు(సకలప్రాణి కార్యాలకు) ఉపాదానకారణాలైన పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు (భూమి, నీరు, అగ్ని/తేజస్సు, వాయువు, ఆకాశం) వీటి ఐక్యకార్యఘటనకు నేనే కారణం. సకల లోకాల్లోని పంచీకరణ వ్యవస్థతో నడుపబడే ప్రాణులకు కారణమైన గగనాదిపంచభూతాలకు (పంచప్రాకృతికశక్తులకు) వాటి మధ్యగల కార్యకారణసంబంధం నేనే. ఆధారమూ నేనే. సర్వానికీ నేనే కర్తను. నాకు స్వపరభేధాలు లేవు. అంతా సమానమే! ఓ పడతులారా! ఇంతకన్న ఇంక ఎక్కువ చెప్పడమెందుకు?

మోహపరవశులైన ఆ గోపికలు శ్రీకృష్ణుని సర్వవ్యాప్త ఈశ్వరతత్త్వాన్ని భగవంతునినోటనే విని, వివేకాన్ని పొంది, తమ దేహాభిమానాల్ని విడిచారు. విష్ణుస్వరూపా! జగత్తులు నీలో నిల్పుకొన్నవాడా! భక్తుల కోర్కెలు తీర్చే పారిజాతమా! అని ప్రార్షించి

ఘోరమైన సంసారసముద్రాన్ని దాటించేవీ, జ్ఞానయోగులైనవారి హృదయాల్లో ప్రతిష్టితమై ధ్యానింప తగిందై ప్రకాశించే నీ చరణ కమలాల్ని మా మనస్సుల్లో నిరంతరం ధ్యానించేలా వరమివ్వమని వేడినారు.

(దేహికి ముందు దేహాభిమానం, ఆపై జ్ఞానసంపాదనం, ఆపై భగవద్భక్తి, ఆపై భగవల్లీనం - కాగల్గే  ధ్యానయోగం - ఈ వరుసలో గోపికల పరిణతి ప్రదర్శించబడింది. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు భగవత్సన్నిధికి సోపానక్రమం అని భాగవత సందేశం.)

గోపికల ప్రార్ధనవిని, మునులచే నమస్కారాలు పొందేవాడు, కరుణాసముద్రుడు, భక్తులంటే అపారంగా వాత్సల్యంచూపే ఆ శ్రీకృష్ణుడు గోపికలు కోరినట్లుగా నిరంతరపదధ్యానాసక్తిని ప్రసాదించాడు.

అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి, పాదాలకు నమస్కరించి, కపటంలేని భక్తితో సపర్యలుచేసి, “నీవూ, తమ్ములూ, బంధువులూ. సత్కర్మలు చేస్తూ సుఖంగా ఉన్నారా?” అని కుశలం అడుగగా, ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా బదులిచ్చాడు.

పద్మనాభుడా! మురారీ! నీవంటి భక్తపారిజాతాన్ని ఆశ్రయించిన భక్తజనులు నిత్యసంతుష్టులై ఉంటారుగదా! అని ధర్మరాజు జవాబు ఇచ్చాడు.

ఇంకా

కృష్ణా! జాగ్రదాదిఅవస్థాత్రయానికి నీవు అతీతుడివి. సర్వత్ర వ్యాపించినవాడివి. విశ్వంలో నీవు, నీలో విశ్వం ఉన్నాయి. విశ్వాన్ని నిలిపి ఉంచేది నీవే. సర్వభువనాలు నీలోపుట్టి; నీలో స్థితికల్గి, నీలోనే నశిస్తాయి. అఖండ జ్ఞానస్వరూపుడివి. యోగమాయను నీలో ధరించినవాడివి. పుణ్యాత్ములు, నిత్యముక్తులైన యోగులైనవారికిసైతం లభించేవాడివి. నీరజాక్షుడివి, నిఖిలలోకేశ్వరుడివి, దయాసముద్రుడివి, సమస్త వికారాలూ దూరంచేసే ఓ జగద్రక్షకా! నీకు నమస్కరిస్తున్నాను అని ధర్మజుడు స్తుతించాడు.

(భాగవతం దశమస్మంధం అంతా కృష్ణావతారగాథ, భగవత్తత్త్వం, భగవంతుణ్ణి చేరే జీవన విధానం, విశ్వమూలాలు - వీటిమీదే విషయం కేంద్రీకృతమౌతుంది. సందర్భోచితంగా ఆయాపాత్రల రూపంలో భగవన్నుతి సువ్యక్తమౌతుంది. తనకు పాదాభివందనంచేసి నమస్కరించిన శ్రీకృష్ణుణి ధర్మజుడు స్తుతించిన ఈ విధానంలో ధర్మజుడు నిమిత్తంగా వ్యాసమహర్షి సర్వలోకులకూ భగవత్తత్త్వం సువ్యక్తం చేస్తున్న సందర్భమిది.)

ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణు
ణ్ణి స్తుతించగా అక్కడ ఉన్న రాజులు, బంధువులు, మిత్రులు, గోపాలకులు, తదితరులు నిండైన మనసుతో సంతోషంతో విన్నారు.

అటువంటి చక్కని సందర్భంలో స్నేహంతోకూడి, ఒకేచోట గుమిగూడి, కృష్ణుని భార్యలు, ద్రౌపది ఆనందంగా సరసల్లాపాల్లో మునిగి ఉండగా

లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...