తిరుప్పావై - పద్నాల్గవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈ రోజు 14.వ. పాశురం
ఉంగళ్ పుళక్కడై తోట్టత్తు వావియళ్
శెంగళు నీర్ వాయ్ నెగిళిందు ఆమ్బల్ వాయ్ కూంబినగాణ్
శెంగల్ పొడిక్కూరై వెణ్పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్
ఎంగళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఏళుందిరాయ్! నాణాదాయ్ నావుడైయాయ్!
శంగొడు శక్కరమ్ ఏందుం తడక్కైయన్
పంగయక్కణ్ణానై ప్పాడేలోరెంబావాయ్ || 14 ||
ఒక గోపిక! ముందుగా వచ్చి మమ్మల్ని లేపుతాను అని మాట ఇచ్చిన పరిపూర్ణమైన వనితా! నిద్రపోతున్నావా నువ్వు. మీ పెరట్లోని దిగుడుబావిలోని ఎర్రకలువలు వికసించేయి. నీలికలువలు ముడుచుకున్నాయి. అంటే తెల్లవారింది అనడానికి సంకేతం. కాషాయవస్త్రములు ధరించిన, తెల్లని పలువరుస గల వారు తమ తమ ఆలయములకు తలుపులు తెరిచి భగవంతుని ఆరాధన కోసం కుంచెకోలను తాళములు తీసుకుని వెళుతున్నారు. ఇవన్నీ తెల్లవారింది అనడానికి సంకేతాలు. ఓ తీయగా మాట్లాడేదానా! శంఖం, చక్రం ధరించిన వాడు, విశాలమైన హస్తములు కలవాడు, పుండరీకాక్షుడు అయిన శ్రీ కృష్ణుని కీర్తించుటకు లేచి రావమ్మా!ఈవిధంగా గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కాబట్టి వెంటనే మేలుకో!
ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతియైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపికను ఆండాళ్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. తానే వచ్చి అందరినీ మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకా నిద్రపోతుంది ఈ గోపిక. తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నయైన యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు.
ఈ తిరుప్పావై పాసురం యొక్క అంతర్గత, అంతర్లీన అర్ధం
చెరువులో సూచించిన పువ్వులు జ్ఞాన నివాసాల వైపు చూపుతాయి. ఒకడు తన గురువును చేరుకోగానే, అతని హృదయంలోని అజ్ఞానం నశించి, అత్యున్నతమైన జ్ఞానాన్ని గురించిన అవగాహన వికసిస్తుంది.
అజ్ఞానాన్ని నీలిరంగు కలువతోనూ, ప్రకాశాన్ని ఎర్ర కమలంతోనూ పోల్చారు.
ఆచార్యుడు జ్ఞానానికి నిలయం. ప్రకాశించే దుస్తులను ధరించి, వారు పరమాత్మ గురించి తమ అంతర్గత అవగాహనపై దృష్టి పెడతారు. శంఖం ఊదడం వారి శిష్యులకు (విద్యార్థులకు) జ్ఞానాన్ని వ్యాప్తి చేసే చర్య.
గోదా దేవి మరియు గోపికలు నిద్రపోతున్న బాలికకు (ఆధ్యాత్మికంగా వారి కంటే ఉన్నతమైన) తన భగవంతుని అనుభవాలను వారికి అందజేస్తానని వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు.
ఇక్కడ "నా నాదాయ్" మరియు "నావుడయ్యాయ్" అనే పదాల సాహిత్యపరమైన అర్థం తీసుకోరాదు. నంగై నిరాడంబరమైన వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి నిరాడంబరమైన వ్యక్తి స్వార్థపూరితంగా లేదా మోసపూరితంగా ఉండలేడు. వారు చెడు లక్షణాల నుండి విముక్తి కలిగి ఉంటారు మరియు వారి అవగాహనా మరియు ఆహ్లాదకరమైన స్వరంతో ఇతరులపై విపరీతమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు.
శ్రీకృష్ణుడు మనలను అజ్ఞానం నుండి వెలుగులోకి తీసుకెళ్తాడని గోదా దేవి ఇక్కడ చెబుతుంది, అతను జ్ఞానం ద్వారా ప్రజలను రక్షించడానికి మరియు ఆశీర్వదించడానికి చేతిలో శంఖం మరియు చక్రం పట్టుకున్న పరమాత్మ.
No comments:
Post a Comment