Tuesday, August 11, 2026

Sravana Maasam - శ్రావణ మాసం

శ్రావణ మాసం

శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. సహజంగా శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వస్తుంది. శ్రావణ మాసం నుండి వర్షఋతువు ప్రారంభం అవుతుంది. దీని మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.

శ్రావణమాసం పూజల మాసం, శుభప్రదమైన మాసం, లక్ష్మీప్రదమైన మాసం, పండుగల మాసం, మహిళలకు ప్రీతిపాత్రమైన మాసం, వర్ష ఋతువుతో పరిసరాలు కళకళలాడే మాసం, ఈ సకల శుభాల శ్రావణమాసం.

దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణమాసం. శ్రీమన్నారాయణ జన్మనక్షత్రం శ్రవణం ఆ పేరు మీద వచ్చిన నక్షత్రం కావడంతో లక్ష్మీదేవికి ఈ నెల అత్యంత ప్రీతికరం.ఇళ్లన్నీ పూజాధికాలతో శోభిల్లే కాలం ఇది. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలోనే అలానే శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే కావున మహిళలు భక్తిశ్రద్ధలతో నోములు, వ్రతాలు ఆచరించి విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటారు.

ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య చాలా ముఖ్యమైన పర్వదినాలు.

ముఖ్యంగా శివుడికి ఈ మాసం చాలా ఇష్టమైనది. ఈ నెలలో శివుని ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ సోమవార వ్రతం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇది కాబట్టి, ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయి.

ఈ మాసంలో మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు,పెండ్లికాని యువతులు ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.

క్రొత్తగా పెళ్లి అయిన స్త్రీలు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం లో వచ్చే అయిదు మంగళవారాలు ఆచరిస్తారు.

శ్రావణ శుద్ద చవితి, పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని జరపుతారు. ఆ రోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలిగిపోతాయని భావిస్తారు.

శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని మహిళలు భక్తితో కొలుస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు.

నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్ధిస్తారు.

అదే విధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా జరుపుతారు. అదే రోజున అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కడతారు.

ఈ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమగా జరుపుతారు. ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు ఈ రోజు నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.

శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆరోజున శ్రీ కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.

శ్రావణ మాసం కృష్ణ పక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునే వారు, పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు. 

అదేవిధంగా శ్రావణమాసంలో సోమవారం రోజున శివునికి ఆవుపాలు, పెరుగు,చక్కెర,నెయ్యి,తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కావున ఈ ప్రీతికరమైన మాసం మొత్తం మహిళలు భక్తితో నిష్ఠగా ఉండి అమ్మవారికి విశేష పూజలు చేసుకుంటారు. కావున ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది.

శ్రావణ శుక్రవారం స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.

ఈ నెలలో శివుడితో పాటు గౌరీదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ప్రతిరోజూ దీపారాధన, దేవుని ధ్యానం, పుణ్యక్షేత్రాల సందర్శన, దానధర్మాలు చేయడం మంచిదని నమ్ముతారు.

స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ మాసంలో వచ్చే పండుగలు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
నాగపంచమి, 
వరలక్ష్మీ వ్రతం
రాఖీ పౌర్ణమి,
హయగ్రీవ స్వామి జయంతి,
పుత్రదా ఏకాదశి,
రాఘవేంద్ర జయంతి, 
శ్రీ కృష్ణాష్టమి,
కామిక ఏకాదశి, 
మాసశివరాత్రి,
పోలాల అమావాస్య

వ్రతాలు
మంగళ గౌరీ వ్రతం,
వరలక్ష్మీ వ్రతం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sitaasandarsanam - సీతాసందర్శనం

రామాయణం సుందరకాండ పదిహేనవ సర్గ - సీతాసందర్శనం

శింశుపావృక్షంమీది నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తున్నది. ఋతుభేదం లేకుండా అన్నీ చివుళ్ళతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో అలరారే లతా, తరువులే.

నిండుగా పూచిన అశోకాలతో ఆ వనం రాత్రిపూట కూడా ఉదయ సూర్యశోభతో ఉంది. విరగబూసిన పూలబరువుకి ఆగలేక కొండగోగు నేల మీదికి వంగింది. కొమ్మ, మ్రాను కనిపించకుండా విరిసింది అశోకం. అంగుళం ఖాళీ లేకుండా పూలు నిండిన వెూాదుగ కాంతులు మిరుమిట్లు  గొలుపుతున్నాయి.

పున్నాగం, ఏడాకుల అరటి, సంపెంగ విరగపూసి సువాసనల మత్తు జల్లుతున్నాయి. ఆ వనంలో అశోకాలు కొన్ని బంగారు రంగువి, కొన్ని అగ్నిశిఖా సదృశాలు, దట్టంగా పెరిగి కొన్ని కాటుకరాసిలా ఉన్నాయి.

ఇంద్రుని నందనవనంలా, కుబేరుని చైత్రరథ వనంలా దివ్యంగా వున్న ఆ వనం పూవులనే నక్షత్రాలతో, నీలాకాశంలా, రత్నాకరంలా, మనోహర పరిమళభరితమయిన గంధమాదనంలా వుంది.

ఎదురుగా ఒక ప్రాసాదం కనబడింది.

అది వేయిస్తంభాలతో కైలాసగిరిలా ఉంది.

పగడాల మెట్లతో బంగారువేదికలు.

ఆకాశాన్ని అంటే ఎత్తు,

చూస్తున్నాడు హనుమంతుడు.

నిశితంగా దృష్టిని కేంద్రీకరించాడు.

శుక్ల పాడ్యమినాటి చంద్రరేఖవలె, ఉపవాసాలతో కృశించిన దీనవదనంతో, మలినవస్త్రధారిణియై, రాక్షసీజనపరివృతయై, పొగక్రమ్మిన అగ్ని జ్వాలవలె, కుజగ్రహ పీడిత
యిన రోహిణీ నక్షత్రంలా, క్రూర మృగాలమధ్య ఆడులేడిలా, నల్లత్రాచువంటి జడతో, పచ్చనివస్త్రం ధరించి ఉన్న విశాలనయనను చూశాడు.

చూచి చూచి:

ఈవిడ సీత అయివుండాలి.

ఔను - నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాము ఋశ్యమూకం నుండి చూచిన వనితారత్నం యిలానే ఉంది.

అదే చంద్రవదనం, అదే భ్రూ
ధ్యం, అదే దేహకాంతి. పద్మ దళనయన, బింబాధర, రతీదేవిలా ఉన్నది నియమనిష్టలతో ఉన్న తాపసి. భయకంపితయై రోజుతూన్న నాగరాజ పత్నిలా ఉంది.

సందిగ్ధమయిన స్మృతిలా క్షీణ సంపద వలె, ప్రతిహతమయిన ఆశలా, విఘ్నమయిన కార్యంలా, కలుషమయిన బుద్ధిలా, చెదరిన శ్రద్దవలె, అపవాద దూషితమయిన కీర్తివలె ఉన్నది.

రావణుడు అపహరించాడనే బాధతో కృశించింది. రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేనట్లుంది. బెదరిన లేడిపిల్లలా చూస్తున్నది.

కన్నీటితో నిట్టూర్పులు విడుస్తూ, కారుమేఘాల మా
టున చంద్రకాంతిలా, మననం లేక విస్మరించిన విద్యలా, వ్యాకరణసంస్కారం లేక అనర్థద్యోతకమయిన వాక్కులా ఉంది.

జానకీదేవి ఏఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి గుర్తులు కనిపించాయి.

అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు. అవిగో మాణిక్య దీప్తులు, పగడాల కాంతులు. కొంచెం తగ్గి నల్లబడ్డాయి.

ఋశ్యమూకం మీద పడవేయగా మిగిలిన నగలు కాబోలివి. ఆనాడు ఆ నగలమూటకు కట్టిన పట్టుచీర చెరగు, ఈ చీరదే, ఇంతకాలంగా కడుతున్నా నలిగినా, మాసినా పూర్తిగా రంగు మాయలేదు.

ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే. ఈమె మనస్సు ఆయన మీదనే ఉన్నట్టుంది.

రాముని కీమెయందు జాలి - అబల బలాత్కృతయై అపహరింపబడినదని.

ఈమె యందు ఆదరభావం - తననే నమ్ముకుని వచ్చి యిలా కష్టాలపాలయిందని.

దుఃఖం - ఇటువంటి యిల్లాలితో వియోగంవల్ల,

మదన తాపం - హృదయేశ్వరి దూరమయిందని.

ఇంక సందేహం లేదు.

ఈవిడే ఆయన భార్య.

వీరుభయుల మనస్సులూ ఒకరియందొకరికి లగ్నమయి ఉండడం వల్లనే యింకా జీవించి ఉన్నారు వీరు.

ఈవిడ దగ్గరలేని దుఃఖంతో ఆయన ఎలా జీవించగలుగుతున్నాడో!

ఎంత దుర్భరమయిన వ్యధ, అని సీతా సందర్శన సంతోషంతో నిండిన హనుమంతుని మనస్సు రామచంద్రుని అభినందించింది.

ఆలోచన

Ashokam - అశోకం

రామాయణం సుందరకాండ పదునాలుగవ సర్గ - అశోకం

రావణ భవనప్రాకారం వదలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కసారి శరీరమంతా పులకించింది. తెలయని సంతోషం ఆవహించింది.

వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పాన్న, మామిడి, అశోక, సంపెంగవృక్షాలు గుంపులు గుంపులుగా వున్నాయి.

నారి సారించి విడచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. రంగు రంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు.

ఆయన గమనవేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు రెక్కలాడిస్తూంటే సాలవృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి.

అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు.

పుష్పాలంకృతుడై విహరించే ఆయన వసంతునివలె ఉన్నాడు. పూలతో నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అలరారే సుందరీ
ణిలా ఉంది.

ఆకులురాలిన కొమ్మలతో, పూలు, పండ్లులేని శాఖలతో ఆ వృక్షాలు వస్త్రాభరణాలుకూడా ఓడిన జూదరిలా ఉన్నాయి.

ఆయన తన వాలంతో, దీర్ఘబాహువులతో, పాదాలతో 
ర్దించిన వృక్షాలు-

శరీరంమీది గంధపుపూత రాలిపోయి, జుట్టు విరబోసుకుని, దంతక్షత, నఖక్షతాలతో నిండిన యువతిలా ఉన్నాయి.

వింధ్యగిరిమీది వర్షామేఘాలు ప్రచండ వాయువుతో చెల్లా చెదరయినట్లు, హనుమంతుని విహారగమనతీవ్రతకు ఆ వనంలోని లతలన్నీ చెదరిపోతున్నాయి.

తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు.

సువర్ణ, మాణిక్య, రజత కాంతులీనే ప్రదేశాలు.

స్ఫటిక సోపానాలతో దిగుడుబావులు.

వాటినిండా కలువలు, కమలాలు.

హంసల, చక్రవాకాల, చాతకాల కలస్వనాలు, అమృతమధురంగా ఉండే జలాలు.

అంద
యిన గిరిశిఖరాలు. వాటిమీద ఎన్నో వృక్షాలు. ఆ చుట్టూ శిలామండపాలు.

ప్రియుని ఒడినుండి దూకుతున్న ప్రియురాలివలె ఆ గిరిశిఖరం నుండి జారుతున్న సెలయేరు. దానిలోకి వంగిన కొమ్మలుగల వృక్షాలను చూస్తూంటే, ఎంత కోపం వచ్చినా ప్రియుని విడచి పోకూడదమ్మా, అని వారించే ఆత్మబంధువుల్లా వున్నాయి.

ఒక వంక దూకి, 
లుపు తిరిగిన ఆ యేరు, కోపంవదలి ప్రసన్నురాలయి భర్తను చేరే ప్రేయసిలా ఉంది.

ఆ సమీపంలో రకరకాల విహంగాలు. ముత్యాలకాంతి యిసుకతో, మణిసోపానాలతో, చల్లని నీటితో అలరారే దిగుడుబావి.

ఆ పరిసరాలలో విశ్వకర్మ వినిర్మితమయిన క్రీడావన, భవనాలు. తెల్లని గొడుగులు, బంగారు వేదికలు, సెలయేళ్ళు, శింశుపావృక్షాలు.

అగ్నికాంతులీనే వృక్షాలమిద తిరిగే హనుమంతుడు మేరుపర్వత దీప్తులతో వెలిగే సూర్యునివలె ఉన్నాడు.

బంగరు కాంతుల తరువులను చూస్తూ, గాలి కదిలితే చిరుగంటల మ్రోతలీనే ధ్వనికల శింశుపావృక్షం అధిరోహించాడు. అది లేతచివుళ్ళతో, మొగ్గతొడిగి, వికసితముఖాలుకల పూలతో ఉంది.

ఇక్కడ జానకి ఉండవచ్చు. రా
దర్శనకాంక్షతో ఆమె యీ పరిసరాలలో తిరుగుతూ ఉండాలి. ఈ చుట్టుప్రక్కల అంతా పొగడలు, సంపెంగలు, మంచిగంధపు తరువులు. జలపక్షి సమూహాలతో పద్మసరోనరం.

రామమనోహరి జానకి. వనశోభలెరిగిన ఆ రాఘవహృదయేశ్వరి, రామ విరహబాధతో తప్పకుండా యీ వనానికి వస్తుంది.

జనకరాజనందన, రా
చంద్రుని అర్ధాంగి, వనవాసప్రియ, సంధ్యాసమయ విధ్యుక్త కార్యనిర్వహణకై యీ శుభప్రదమయిన జలాశయం దగ్గరకువచ్చి తీరుతుంది. ఆవిడ జీవించివుంటే యిక్కడకు రాకుండా ఉండదు, అనుకుంటూ శింశుపావృక్షం మీద నుండి అంతటా పరికిస్తున్నాడు హనువముంతుడు.

సీతాసందర్శనం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Manastaapam - మనస్తాపం

రామాయణం సుందరకాండ 11,12,13 సర్గలు - మనస్తాపం

రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రయిన లతాగృహాలు, నిశాసౌధాలు అన్నీ తిరిగాడు. జానకీదేవి జాడలేదు.

ఈ దుష్ట రాక్షసుని చేతులలో పడడం యిష్టంలేక జానకీదేవి ప్రాణ త్యాగం చేసి ఉండాలీ. ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో!

ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళడమెలా! ఆ కపిరాజు దండనితి విషయుంలో చాలా తీక్షణదృష్టి కలవాడు. అంతకు ముందుగా - వానరవిరులందరూ కనిపిస్తారు, వారికేం చెప్పాలి. సుగ్రీవుడు పెట్టిన గడువుదాటింది కనక వారంతా ప్రాయోపవేశం చేస్తారు. సముద్రం
దాటివెళ్ళగానే అంగద, జాంబవంతులు ఎదురువస్తే వారికి ఏం చెప్పను, అని చింతించాడు.

అంతలో వివేకం తెచ్చుకుని-

సర్వ అనర్ధాలకూ దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం.

మరోసారి అంతటా వెదకుతాను, అనుకుని మళ్ళీ అన్ని వనాలూ, శాలలూ, భవనాలూ వెదుకుతున్నాడు,

రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యాసమూహోన్ని చూశాడు. సీత జాడలేదు.

మళ్ళీ విచారంలో పడ్డాడు.

ఇందరు వానరుల శ్రమకూ ఏవిటి ఫలితం?

రా
చంద్రునికి ప్రీతికరమయిన పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా వెదకగలిగినా అమ్మవారిజాడలేదు.

గృధ్రరాజు సంపాతి చెప్పాడే - సీత లంకలో ఉన్నదని? ఎక్కడుంది ఆవిడ?

మిధిలాధీశుడయిన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా!

ఒకటి జరిగి ఉండవచ్చు- 

రామబాణభీతితో వచ్చే రావణుడు తీవ్రవేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి. లేదా సీత స్వయంగానే సాగరమధ్యంలో పడిపోయిందేమో! ఈ దుష్టుడిబాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీలరక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ యిల్లాలిని తిని ఉంటాడా! కాకుంటే - ఈ రాక్షస స్త్రీలే ఆరగించి ఉండరుకదా! రామనామ జపంతో ఆవిడే తనువు చాలించిందా!

కాకుంటే ఆ రావణాంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం రామనామం జపిస్తూ ఉండదా!

ఇప్పుడు వెళ్ళీ రామచంద్రునికి ఏం చెప్పాలి! వెళ్ళిన తరువాయి ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే.

అదీకాక - సీతను చూడకుండా వెడితే నేను ఏం సాధించినట్లు?

సీత కనబడలేదు, అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూచి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని ఆయోధ్యలో భరత, శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు.

కృతజ్ఞతకు మారుపేరయిన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా! ఆయనతో పాటు ఆయన భార్య రు
, తార, అంగదుడు వీరందరూ దేహయాకత్ర ముగిస్తారు.

ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బ్రద్దలు కొట్టుకుంటారు! విషం మింగుతారు, ఉరిపోసుకుంటారు, అగ్నిగుండాలలో దూకుతారు,

ఉపవాసాలతో 
రణిస్తారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకువంశం, ఇటు సర్వవానరజాతి నాశనం తధ్యం.

అందుచేత నేనిక్కడే వాన ప్రస్ధజీవితం గడిపితే వారందరూ నేనింకా సీతాన్వేషణం చేస్తున్నాననే ఆశతో జీవిస్తారు.

ఏమయినా సరే నేను వెళ్ళక పోవడమే మంచిది. చితి పేర్చుకుని అందులో దూకుతాను. లేదా ఏ చెట్టు క్రిందనో ఉపవాస నియమంతో కూర్చుంటే కాకులూ, కుక్కలూ నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్యాణ మార్గం,

సీతను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి, అని కొంతసేపు విచారించి:

ఛీ! మరణం కంటె దోషం లేదు. బ్రతికి ఉంటేనే సుఖాలకు ఆస్కారం ఉంది; ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు, ఇప్పుడింక ఈ దశకంఠుని కడతేరుస్తాను. కాదు, వీణ్ణి బలిపశువులా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను.

అనుకుంటూ మళ్ళీ శోకసముద్రంలో మునిగి-

ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో యిక్కడే శేషజీవితం గడుపుతాను, అందువల్ల అయోధ్యలో వారూ కిష్కింధలో వీరూ సుఖంగా ఉంటారు, అనుకుని ముందుకు సాగాడు.

ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకూ ఈ వనం చూడలేదు, అనుకుంటూ, ఆదిత్య, వసు, రుద్ర, అశ్వనీ దేవతలకు నమస్కరించి:

తపస్వి జనానికి ఫలసిద్ధివలె ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవిని రామునికి అందించాలి, అనుకుని:

రామ లక్ష్మణులకు, జానకీదేవికి, ఇంద్ర, రుద్ర, వాయు, యమ దేవతలకు న
స్కారం. సూర్య, చంద్రులకు ప్రణామం. మా ప్రభువు సుగ్రీవునికి అభివాదం, అనుకుంటూ అశోకవనం వయిపుసాగుతూ:

ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు, అనేకులు రక్షిస్తూ ఉండవచ్చు. వాయువుకూడా యిక్కడ తగు మాత్రంగా చలిస్తూంటాడు.

ఇప్పుడింక నా కార్యసాధనకు దేవతలూ, ఋషులూ సాయపడాలి. చతుర్ముఖ ప్రజాపతితో సర్వదేవగణాలూ, అగ్నిహోత్రుడూ, వాయువూ, వజ్రధారి దేవేంద్రుడూ, పాశహస్తుడయిన వరుణుడూ, సూర్య, చంద్రులూ, త్రినేత్రధారి శివుడూ, అశ్వని దేవతలూ అందరూ నాకు కార్యసిద్ధి యివ్వాలి. సర్వభూతాలూ, భూత నాథులూ, నా యత్నానికి తోడుపడాలి. ప్రసన్న 
చంద్రబింబంవంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి.

పరమదుష్టుడూ, నీచుడూ, క్రూరుడూ అయిన ఈ రావణునిచే అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలనో - అనుకుంటూ అశోకవనం వయిపు సాగుతున్నాడు.


అశోకం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Panashala (Tavern) - పానశాల

రామాయణం సుందరకాండ పదవ సర్గ - పానశాల

మరుక్షణంలో ఆ మహామహుని బుద్ధి పనిచేయుడం మొదలు పెట్టింది.

రామ వియోగంలో ఉన్న సీత అన్న పానాలు ముట్టదు; అలంకారాలూ, నిద్రా అమె దరి జేరవు.

దేవేంద్రుడయినా సరే, అమె వానిని కన్నెత్తి చూడదు. ముల్లోకాలలో రామునివంటి పురుషు డుండనప్పుడు సీతాదేవి పరపురుషునివైపు ఎందుకు చూస్తుంది, అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు.

అక్కడ

ఆటలాడి, పాటలు పాడి, నాట్యం చేసి, తెగత్రాగి అలసిన నారీజనం కొందరు మద్దెళ్ళమీద, మరికొందరు పీటలమీద, మరెందరో తివాసీలమీద పడి నిద్రిస్తున్నారు.

అందరూ అందకతెలే. చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్ర మర్యాద లెరిగినవారే, హాయిగా సంయోగసుఖంతో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు.

ఇందరు స్త్రీల నడుమ, గోగణమధ్యంలో వృషభరాజులా ఉన్నాడు, రావణుడు. ఆడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు.

పానశాల ప్రక్కకు చూశాడు హనుమంతుడు.

దున్నపోతుల, అడవిపందుల, లేళ్ళ మాంశాలు పోగులు పోగులుగా ఉన్నాయి, వెండి పాత్రలలో, బంగారు గిన్నెలలో తింటూ తింటూ విడిచిన నేమళ్ళ, కోడిపెట్టల మాంసాలున్నాయి. సగం సగం ఆరగించిన చకోరాలు, చేపలు, మేకలు.

షడ్రసోపేతమయిన వంటకాలు, పువ్వులు. పళ్ళు...... రకరకాల మద్యాలు, బంగారు కమండలువులలో ఉన్నాయి. మణులు పొదిగిన వెండి చెంబులు, బంగారు పాన పాత్రలు.

కొన్ని పాత్రలలో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా ఆరగించినవి, కొన్ని యింకా ముట్టకుండా నిండుగా తొణీకిసలాడుతున్నవి.

త్రాగుతూ మత్తులో బోర్లగిల పడవైచిన కుండలు, కమండలాలు. వాటికి యెడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు,

మళ్ళీ వెనుదిరిగాడు.

అక్కడ స్త్రీలు ఒకరి చీర లొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు, ఒకరి నొకరు దగ్గరగా కౌగలించుకుని నిద్రిస్తున్నారు.

మధురమయిన 
ద్యపు వాసనతో, మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనం అంతా వ్యాపిస్తున్నాయి.

స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు ఛాయ మేనివారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు; కాని, జానకీ దేవి కనపడలేదు.

ఆ దశలో వున్న స్త్రీలను చూసిన హనుమంతుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంతఃపురంలోని నారీజనం, పయిగా ఆచ్చాదనలు లేకుండా వున్నారు. పరస్త్రీని చూడడమే పాపం! కాగా ఈ స్థితిలో చూడడం మరెంత పాపం-

అయితే యిందరు సుందరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి వికారానికి లోనుకాలేదు. ఇంద్రియాలన్నిటిలో ప్రధానమయినది మనస్సు. అది నిశ్చలంగానే ఉంది.

పయిగా సీతాదేవిని స్త్రీ జన మధ్యంలో గాక ఎక్కడ వెదకాలి?

స్త్రీని వెదకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెడతామా! నా మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనక పాపభీతి లేదు.

దేవ, గంధర్వ, నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సితాదేవి జాడలేదు. పానశాల విడిచి యీవలకు వచ్చాడు.

మనస్తాపం

Pattamahishi - Shayanagaaram - పట్టమహిషి - శయనాగారం

రామాయణం సుందరకాండ తొమ్మిదవ సర్గల - పట్టమహిషి - శయనాగారం

సాగి సాగి హనుమంతుడు

ఏనుగు దంతాలతో, పదారు వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక, వెడూర్య, రత్నాలతో అలంకృతమయిన శయ్యను చూశాడు. ఒకవంక చంద్రకాంతితో తెల్లని గొడుగు. మరొక వంక సూర్యకాంతితో, అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం. శయ్యమీద అజిన చర్మం.

అగరు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు. తెల్లని వింజామరలతో అందగత్తెలు.

ఆ శయ్యమీద మేఘసన్నిభుడైన మహావీరుని చూశాడు, పొడుగాటి బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు, చీనాంబరం, శరీరమంతా మంచిగంధపుపూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపు కాంతుల మేఘంలా వున్నాడు.

లతా, తరుశోభితమయిన మందరగిరిలా ఉన్నాడు. హాయిగా మధుపానం చేసి, మదవతీ పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాడు.

కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు.

బుస కొడుతున్న కోడెత్రాచులా వున్నాడు.

ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి, మరొక వేదిక మీదకు నడిచి చూశాడు.

మత్తేభం అధివసించిన ప్రస్రవణగిరిలా ఉంది, రావణుడు నిద్రిస్తున్న అ శయ్య.

ఇంద్ర ధనుస్సులా వున్నాయి వాని బాహువులు.

దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు, వజ్రాయుధాన్ని ఢీకొని గట్టి బొప్పికట్టి వున్నాయి. విష్ణుచక్రపు రాపిడికూడా అనుభవించాయి.

చక్కగా, బలిసి, మంచి కణుపులతో, సర్వలక్షణలక్షితములై అలరారుతున్న గోళ్ళతో, వ్రేళ్ళతో ఆ బాహువులు అయిదు పడగలపాములా ఉన్నాయి. వాటికి మంచిగంధపు పూతలున్నాయి. మందరగిరిమీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తూన్న మహాసర్పాలవలె వున్నాయి.

అంతటా సురపాన్న సౌరభం, పాగడపూల పరివుళం. మధుర మదిరాగంధం - అది అంతా ఆ రావణుని నిశ్వాసవాయువే.

మణి, రత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులినే కుండలాలు.

రక్త చందనాల కృతం, మణిహార భూషితం అయిన విశాల వక్షస్థ్సలం పసుపురంగు పంచె. తెల్లని ఉత్తరీయం.

చూస్తున్నాడు హనుమంతుడు.

గంగానది ఒడ్డున విశ్రమించే ఎనుగులా వున్నాడు. మినుముల రాశిలా ఉన్నాడు. నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు.

ఆ రాక్షసేంద్రుని పాదసమీపంలో కొందరు భార్యలు. వారు చంద్రవదనలు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంగల వనితలు కొందరు ఆయన కటి ప్రాంతంలోనూ, భుజసీమ దగ్గరావున్నారు. వారందరితో గృహం తారాశోభితమయిన ఆకాశంవలె ఉన్నది.

అలసి, అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట, కొందరు.

ఒకతె నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది.

నదిలో తరంగాలతో కదలిపోయి నావ చాటున చేరిన కమలం వలె, ఒక కమలముఖి వీణను కౌగలించుకుని ఉంది,

పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక మదవతి.

చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాద్యాన్ని చుట్టుకుని పడుకుంది.

ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది.

మరొకతె మద్దెల నానుకుని నిద్రించింది.

భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకతె. కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది, భేరీ వాద్యాలింగనంతో, ఒకతె;

వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్న దొక పూబోణి పగలకొట్టిన కుండనీటిలో తడిసి.

సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రొఢ ఒకతె-

ఒక చంద్రానన మరొక సుశ్రోణిని కౌగలించుకుని పరవశంతో నిద్రిస్తున్నది.

కామ తీవ్రతగల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీవాద్యాలను ఆలింగనం చేసుకున్నారు.

ఆ రమణీయ రమణీగణంలో అందరికంటె విశిష్టంగా, అత్యంత సౌందర్యంతో, మణి రత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా, సువర్ణకాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఈమెయే అనుకున్నాడు.

అనుకున్న క్షణంలో ఆయన కపిప్రకృతి విజృంభించింది.

తోక నేలకు కొట్టాడు.

తోకను ముద్దుపెట్టుకున్నాడు.

గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు.

పానశాల

Anthapuram - అంతఃపురం

రామాయణం సుందరకాండ ఎనిమదవ సర్గ - అంతఃపురం

సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం వుండే అంతఃపుర భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్థయోజనం వెడల్పు వున్న ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు కల ఏనుగులు రక్షణ కార్యంలో వున్నాయి. ఆయుధపాణు లయిన యోధులు అప్రమతంగా తిరుగుతున్నారు. మకర, తిమింగల, మహాసర్ప సమృద్ధమయిన సాగరంలా ఉన్నదది. యమ, వరుణ, కుబేర, దేవేంద్ర భవనాలను అధఃకరిస్తున్నది.

రావణుని భార్యలందరూ అక్కడ వున్నారు. ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీజనం కూడా ఆ భవనంలో స్వేచ్చగా విహరిస్తున్నారు.

విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షేశుడయిన కుబేరుడు తీవ్ర తపస్సుచేసి బ్రహ్మను సంతుష్టుని చేసి ఆ విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని ఓడించి రావణుడు దీనినీ సాధించాడు.

మేరు మందర గిరిశిఖర సదృశమయిన గోపుర సమూహాలతో అలరారుతోంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు. స్ఫటికమణులతో రూపొందించిన గవాక్షాలు. పగడాలు, మణులు, ముత్యాలతో నిండి అక్కడి నేల అంతా కాంతు లీనుతున్నది. రక్త చందనాలేపనంతో లేతసూర్య కాంతితో
వెలుగుతోంది, రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. ఆప్త బంధువుకి విందుకోసం చేసినట్లున్నాయి.

ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది.

గ్రామ, నగర, సౌధ చిత్రా లలంకరించిన తివాసీ పరచి ఉంది.

ఆ భవనంలో తెల్లని రాజహంసలవలె అగరు ధూమం వ్యాపించి శోభావహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది.

చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలా ఉంది. అక్కడి బంగారు దీపకళికలను తదేకంగా చూశాడు.

చూసి లోపలకు సాగుతున్నాడు హనుమంతుడు.

రంగు రంగుల చీరలతో వివిధ విధాలయిన ఆభరణాలతో అలరారే నారీమణులు అర్థరాత్రివరకూ ఆసవాలు సేవించి, నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో వున్న సరోవరంలా వున్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన
పద్మాలమీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖపద్మాలచుట్టూ భ్రమిస్తాయి.

తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకుని నేలకుజారిన తారాగణాల వలె వున్నారువారు.

సడలిన కేశబంధాలు, చెదరిన అంగభూషణాలు, జారిన పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటకు కరగిన తిలకాలు.

పాన వ్యాయామ సమయంలో తెగిన ముత్తెపుసరులు. జారిన వసనాలు, పట్టు సడలిన వడ్డాణాలు, తెగిపోయి ఊడిపడి పగిలిన కుండలాలు.

ఏనుగులు నలగత్రొక్కిన లతామతల్లులవలె ఉన్నారు. చంద్రకిరణ శోభ లీనే ముత్యాలహారాల కిరివంకలా ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలు గోచరించాయి.

వారి అలంకారాలలో వైడూర్యముణులు రాజహంసలవలె, బంగారు హారాలు చక్రవాకాలవలె కనిపిస్తూంటే, హంసలూ చక్రవాకాలూ విహరించే నదులవలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి.

వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత కమలాలుగా, శృంగారక్రియలే మకరాలుగా, తనుద్యుతులే తటాలుగా వారందరూ నదీ దేవతల్లా వున్నారు.

కొందరి చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ భ్రమ గొలుపుతోంది. కొందరి నిట్టూర్పులకే వారి చేలాంచలాలు ముఖంమీద ఆడుతున్నాయి. అవి రంగు రంగుల పతాకాలవలె ఉన్నాయి.

ఆ గాలిసోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి. ఆ మహిళల కాంతిగంధానికి తోడు మధుపానగంధం కలిసివచ్చే వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి.

మద్యపాన వివశలయిన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూంటే, ఆ సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు.

మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపధానాలుగా కొందరు, ఎదుటి ఆమె వక్షస్థ్సలం మీద తలవంచి ఒకతె, దాని ఒడిలో తల పెట్టి యింకొకతె, తొడలమీద, పిరుదులమీద ఆలా ఒకరికి తెలియని మైకంలో ఒకరు హాయిగా నిద్రాముద్రలో వున్నారు. ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు.

తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలె వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నవారు నారీమణిహారంలా ఉన్నారు.

వసంత వాయువుకు కదలియాడే లతలు, పూవులు, ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరి నొకరి బంధించుకున్నారు.

ఎవరి అవయవాలు ఎవో, ఎవరి అలంకారాలు ఎవో, ఎవరి కేశాలంకారం యేదో తెలియకుండా ఉంది. బంగారు దీపాలవలె వున్నారు.

ఇందరినీ రావణుడు తన పరాక్రమంతోనే తెచ్చాడు. కొందరు మాత్రం రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితులనెవరినీ తీసికొని రాలేదు. ఇతరుల యందు అనురాగం వున్న ఆడదాన్నీ తేలేదు.

వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం.

అందరినీ చూస్తూ హనుమంతు డనుకున్నాడు.

వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీ దేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థమయేది. ఎంతటివాడయినా సీతాపహరణంతో తుచ్చుడయాడు రావణుడు.

పట్టమహిషి - శయనాగారం

Trnaprayum - తృణప్రాయుం

రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ -  తృణప్రాయుం రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి,...