Monday, August 10, 2026

Lankini - లంకిణి

రామాయణం సుందరకాండ తృతీయ సర్గ - లంకిణి

తాం రత్న వసనోపేతాం
గోష్ఠాగారావతంసికాం 
యంత్రాగార స్తనీ మృద్దాం
ప్రమదా మివ భూషితాం

మేఘం వలె వ్రేలాడుతూన్న శిఖరాలుకల లంబ పర్వతంమీదుగా లంకా నగరంలో అడుగుపెడుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు.

అందమైన ఉద్యానవనాలు, స్వాదు జలపూరితా లయిన సరోవరాలు, శరత్కాల మేఘాల వలె భవనాలు. సముద్రపు చల్లనిగాలి. చక్కని ద్వారతోరణాలు. ప్రాంగణాలలో మత్తేభాలు. సర్పరక్షితమయిన పాతాళలోక రాజధాని బోగవతిలా ఉంది లంకానగరం.

విద్యుల్లతలు నిండిన మేఘాలతో కాంతివంతమై, చండమారుతంతో అలరారే అమరావతిలా ఉంది.

మయూరాలు, రాజహంసలు, క్రౌంచమిథునాలు - వీటి కలస్వనాలకు తొడుగా నగర నర నారీ జనుల ఆభరణాల ధ్వనులు, భేరీ భాంకారాలు.

నగరం నలుమూలలా ఆయుధ ధారులయిన రాక్షస యోధుల పహరా!

చూస్తున్న హనుమంతుడు: ఈ నగరంలో సామాన్యు డెవడూ అడుగు పెట్టలేడు. అంగద, సుషేణ,
కుముద, మైంద, ద్వివిదులూ వీరితోపాటు కేతుమాల భల్లూకపతి, కుశపర్వ వానరయూధపతి, మా  ప్రభువు సుగ్రీవుడు, తప్ప మారెవరూ యిటు చూడలేరు, అనుకున్నాడు.

అ సమయంలో రామ లక్ష్మణుల పరాక్రమం స్మృతికి వచ్చి హనుమంతునికి ఆనందం కలిగింది.

చూస్తున్నాడు హనుమంతుడు.

రత్నకాంతులే ఆచ్చాదన వస్త్రంగా, గోశాలలే భూూషణాలుగా, యంత్రాగారాలే ఉన్నత వక్షోజాలుగా అలంకరించుకున్నట్లుంది లంకానగర నారీరత్నం.

నగర గృహాలలోని దీపకాంతులవల్ల లంకలో చీకటి అనేది లేకుండా పోయింది.

అప్పటికి లంకానగరాధిదేవత వికృతాకారంతో హనుమంతుని ఎదుట నిలిచి గర్జించి: ఇక్కడి కెందుకు వచ్చావు? నీ పేరేమిటి? లంకలో అడుగుపెట్టడం నీ తరం కాదు. ముందు నీ ప్రాణాలు పోయేలోగా నీ వ్యవహారం ఎమిటో చెప్పు, అంది.

హనుమ: ఈ వికృత నేత్రాలతో పురద్వారంలోనే ఉన్న నువ్వెవరవు? ఎందుకింత అట్టహాసం చేసి భయపెడుతున్నావు! నీ కథేమిటి?

లంకిణి : మహాత్ము డయిన ఈ రాక్షసేశ్వరుని ఆజ్ఞానుసారం లంకానగర రక్షణ చేస్తున్నాను. నన్ను కన్ను గప్పి లంకలో అడుగుపెట్టడం ఎవరితరం కాదు. సిద్ధంగా ఉండు, నీ ప్రాణాలు హరిస్తున్నాను.

హనుమ: ఈ విశాల ప్రాకార, తోరణాలతో అలరారే లంకానగరాన్ని చూడాలనే కుతూహలంతో వచ్బాను. ఈ ఉద్యానవనాలు, చిన్ని చిన్ని అడవులు, పెద్ద పెద్ద భవనాలు చూచి పోవాలనివించింది.

లంకిణి : ఓరి దుర్భుద్ధి! వానరాధమా! నా అనుమతి లేకుండా ఈ నగరం చూడగలవా!

హనుమ: అమ్మాయీ, నగరం చూస్తాను. చూసీ, వచ్చిన దారినే వెడతాను.

ఆ ధోరణి లంకిణికి నచ్చలేదు. తన అరచెయ్యి విప్పి గుండె మీద చరిచింది. ఆ పిడుగుదెబ్బకు హనుమంతుడు ఒక్క అరుపు అరిచాడు.

ఉత్తరక్షణంలోనే ఎడమ పిడికిలి బిగించి ఒక్కపోటు పొడిచాడు. ఆ పోటుకే లంకిణి అవయవాలు పట్లు తప్పి, కళ్ళు తేలవైచి నేలమీద వాలింది. ఆయనకు జాలి కలిగింది.

అంతలోనే లంకిణి గద్గద స్వరంతో: ఓ మహాపరాక్రమ సంపన్నుడా! రక్షించు, రక్షించు. బలధైర్యాలు కలవారు నియమవ్రత పరాయణులని ఎరుగుదును. నేనీ లంకా నగరాధి దేవతను. నన్ను నువ్వు ఓడించావు. నీ కింక తిరుగులేదు. ఇది బ్రహ్మ వాక్కు.

ఒకానొక వానరుడు నిన్ను జయిస్తాడు. నాటితో లంకానగర వాసులకు భద్రం లేదని గుర్తుంచుకో, అన్నా డొకప్పుడు స్వయంభూ బ్రహ్మ, అది నిజం.

సీతాదేవి కారణంగా ఈ రాక్షస వంశానికి నాశనకాలం సమీపించింది. నువ్వు నిశ్చింతగా ఈ నగరంలో ప్రవేశించి కర్తవ్యం నిర్వర్తించుకు వెళ్ళు. స్వేచ్చగా సీతాన్వేషణం కొనసాగించు, అంది.

Trikutagiri - త్రికూటగిరి

రామాయణం సుందరకాండ ద్వితీయ సర్గ - త్రికూటగిరి

అమరావతిలా గోచరించే లంకానగరాన్ని చూస్తూ, తాను దిగిన త్రికూటగిరిమీద విహరిస్తున్నాడు.

ఆ కొండమీది చెట్లనుండి జారిన పూలతో నిండిన హనుమంతుడు విచిత్రంగా ఉన్నాడు.

నూరుయోజనాలు దాటివచ్చినా ఆయనలో ఈషణ్మాత్రం ఆయాసం కాని, క్లేశంకాని కనిపించడంలేదు.

ఇటువంటి విశాలసాగరాలు మరో యిన్ని అనాయాసంగా దాటగలను, అనుకుంటూ నడుస్తున్నాడు.

పచ్చిక బయళ్ళతో, సుగంధభరిత పుష్పాలతో నిండిన లతలతో అల్లుకొన్న వృక్షసంతతులతో నిండిన వనాలు చూశాడు. దట్టంగా అలముకున్న వృక్షాలు నిండినచోట పర్వతం అంతా వృక్షగిరిలా కనిపించింది.

ఆ గిరిశిఖరంమీద ఉన్నది లంకానగరం.

అంతటా దేవదారువులు, కర్ణికారాలు, ఖర్జూరాలు, కరవీర, కుంకుమ, దేవకాంచనాలు. ఏపుగా పెరిగిన ఏడాకుల అరటి, విరగబూసిన వేగిస, వావిలి మొదలైన వృక్షాలు.

అలా తిరుగుతున్నాడు.

వాటి కొమ్మలు కొన్ని మొగ్గ తొడుగుతూంటే, కొన్ని పూల బరువుతో వంగుతున్నాయి. అంతటా వివిధ జాతుల పక్షుల కలస్వనాలు. అక్కడక్కడ దిగుడుబావులు, విశాల సరోవరాలు. వాటినిండా కమలాలు, కలువలు కలహంసనాదాలు.

లంకానగరాన్ని సమీపిస్తున్నాడు.

చుట్టూ పెద్ద కందకం. కందకంనిండా రకరకాల పూలతోరణాలు.

కొటచుటూ బంగారు కాంతులీనే ప్రాకారం.

కామరూపఛారులయిన రాక్షసులు కనురెప్ప వెయ్యకుండా కాపలా కాస్తున్నారు. వందలాది బురుజులు. బురుజులపై పతాకాలు. బంగారు లతా తొరణాలు. శరత్కాల మేఘాలవలె విశాలమయిన భవనాలు.

విశ్వకర్మ నిర్మించిన ఆ లంకానగరం త్రీకూటగిరి శిఖరంమీద అలరారు తీరు చూస్తుంటే ఆకాశంలో తేలుతున్నట్లనిపించింది.

ప్రాకారమే కటిస్థలంగా కందకాలలోని నీరే చీనాంబరంగా, కోట గోడలమీది శతఘ్నులూ, శూలాలూ, కేశపాశంగా, బురుజులే ఆభరణాలుగా వెలిగే ఆ నగరాన్ని విశ్వకర్మ మనస్సంకల్పంతో అవతరింపజేసినట్లున్నాడు, అనిపించింది.

దానిలో భవనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకనాడు కుబేరుని రాజధాని అది. ఖడ్గ, శూలపాణు లయిన రాక్షసవీరులు తమ వాడి కోరలతో అటూ యిటూ నడుస్తుంటే నాలుకలు చాచి కోడెత్రాచులే కదులుతున్నట్లనిపించింది.

అలా ఆ నగర ప్రాకార రక్షణ విధానాన్ని చూస్తూ హనుమంతుడు: ఈ లంకలో అడుగుపెట్టడం అసాధ్యం, పెట్టినా దుర్భేద్యమయిన దీనిని స్వాధీనం చేసుకోవడం మరీ కష్టం. ఈ రాక్షసులు సామ మార్గాన మాటలతో లొంగరు. దానం యిక్కడ పని చెయ్యుదు. భేదం అసలే వ్యర్థపదం. ఇక యుద్ధమే శరణ్యం. అయితే వానరయోధులలో సుగ్రీవునితో పాటు అంగదుడు, నీలుడు మాత్రమే సముద్రం దొటి యిక్కడకు రాగలరు. మిగిలినవారిక్కడ కాలు పెట్టలేరు, 

అనుకుంటూ కొంతసేపు తిరిగి: ఇంతకూ సీతాదేవి యింతకాలం యిక్కడ జీవించి ఉన్నదో, లేదో
చూడాలి. అప్పుడు అనంతర కర్తవ్యం ఆలోచించాలి.

అయితే, ఈ విశాలదేహంతో నేను లంకలో తిరగడం మంచిది కాదు. ఈ క్రూర రాక్షసగణం కంటబడకుండా అన్వేషించాలి.

దేశ కాల పరిజ్ఞానం లేని దూతవల్ల సర్వమూ వినాశనమే ప్రాప్తిస్తుంది, కనక ఈ నగరంలో జాగరూకంగా సాగాలి.

నా అంత వాడు లేడు అనుకునే దూతకు అర్థానర్థ పరిజ్ఞానం ఉండదు. అటువంటి అవలక్షణం నాకు లేదు. ఆ గర్వం దరిజేరితే సర్వం వ్యర్థమే. ఇప్పుడు నేను రాక్షస రూపంతో తిరిగినా వీరు పసిగట్టగలరు.

ఈ నగర రక్షణ విధానం చూస్తుంటే గాలికూడా వీరికి తేలియకుండా కదలడానికి వీలులేనట్లుంది.

ఇప్పుడింక ఒకటే దారి.

నేను బాగా చిన్న శరీరంతో రాత్రిపూటనే ఈ నగరమంతా తిరగాలి, అనుకుంటూండగా సూర్యుడు అస్తమించాడు.

హనుమంతుడు పిల్లిపిల్ల అంత అయాడు. లంకా నగరం వైపు సాగుతున్నాడు.

రజత కాంతులు, సువర్ణ శోభలు, మాణిక్య దీప్తులు.

వీటితో అలరారే ఏడెనిమిది అంతస్థుల భవనాలు. రంగురంగు కాంతులీనే నవరత్నాల జాలరులతో గవాక్షాలు.

ఊహాకందని వైభవంతో ఉన్న ఆ నగరం అద్భుతంగా ఉందీ,

అటువంటి లోకొత్తరమయిన నగరాన్ని చూచిన సంతోషం. రామ పత్నిని, ఎలా చూడడం, ఎక్కడుంటుందా అనే విచారం. అంతలో ఆయన యత్నానికి తోడుపడడానికో అన్నట్టు చంద్రుడు ఉదయించి పైకి వస్తున్నాడు. తామరతూడువంటి కాంతులు, పాలవెన్నెలలు, ధవళశంఖరోచులు.

సరోవరంలో విహరించే తెలని హంసలా ఉన్నాడు నీలాకాశంలో చంద్రుడు.

Ramayana Sundara Kanda - రామాయణం సుందరకాండ

రామాయణం సుందరకాండ పారాయణం

శ్రీమద్రామాయణం 

శ్రీ సమృద్ధమూ, విద్వాంస భూషితమూ, వీరయోధ విలసితమూ అయిన అయోద్యానగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కొసల్య, సుమిత్ర, కైకేయి అనే పేర్లుగల ముగ్గురు భార్యలవల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులు కలిగారు.

వీరిలో పెద్దవాడయిన రామచంద్రుడు తండ్రిమాట ప్రకారం అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకీ, తమ్ముడు లక్ష్మణుడూ కూడా వచ్చారు.

పదమూడు సంవత్సరాలకాలం అరణ్యంలో మునీశ్వరుల ఆశ్రమాలను దర్శిస్తూ సాధు హింసకులయిన రాక్షసులను సంహరిస్తూ కాలం గడిపాక, ఒకనాడు లంకేశ్వరుడయిన రావణుడు (మాయచేసి మారీచుని సాయంతో) సీతను అపహరించాడు.

రామలక్ష్మణులు సీతను వెదకుతూ కిష్కింధ చేరారు.

చేరిన వారిని దూరాన ఋశ్యమూక పర్వతం మీద ఆప్తసచివులతో వున్న సుగ్రీవుడు చూశాడు.
చూస్తూనే గజగజలాడిపోయి పరుగు లంకించుకున్నాడు, అనుచర సమేతం.

గుట్టలు, మిట్టలు, కొండలు, కోనలు దూకుతున్నారు వారందరూ. కొంతదూరం సాగిన తరువాయి హనుమంతుడు సుగ్రీవుని ఆపి:

ప్రభూ! ఏమిటీ పరుగు, ఎక్కడకీ ప్రయాణం? అన్నాడు.

సుగ్రీవుడు: హనుమా! చూశావా ఆ కోదండపాణుల్ని, కరవాలధరులను, ఆజానుబాహు దేహులను. విషం క్రక్కే కోడెత్రాచుల వంటి కరవాలాలు, తాళప్రమాణంలో వున్న ధనుస్సులు, ముల్లోకాలనూ భస్మం చేయగల శక్తి సంపన్నులయిన వీరిని మా అన్నగారు వాలి నన్ను చంపడానికి పంపాడు.

హను
: ప్రభూ! భయగ్రస్త హృదయానికి శంకలు ఎక్కువ. నిజానికి వారెవరో ఎందుకు వచ్చారో తెలియకుండా ఎందుకీ పలాయనం. మీరిక్కడే ఆగండి. నేను విషయం తెలుసుకొని క్షణంలో తమకు నివేదిస్తాను.

అని భిక్షుక రూపంలో రామలక్ష్మణుల ముందు చేతులు జోడించి, తలవంచి నిలబడి:

ఆర్యా! దివ్యకాంతులతో విరాజిల్లే మీ శరీర కాంతీ, చతుర్దశ భువనాలనూ గజగజలాడించ గలిగిన మీ ధనుర్భాణాలూ, కరవాలాలూ మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇవన్నీ వీరవరులయిన రాజ పురుష లాంఛనాలు.

కాని - జటాజూటాలూ, నారచీరలూ ధరించి ముని బాలకులవలె వున్నారు. ఇది ఆశ్చర్యంగా వుంది. తమ రెవరు? ఏ పనిమీద యిటు వచ్చారు, అన్నాడు.

రామ లక్ష్మణులు మాట్లాడలేదు. అప్పుడు హనుమ: 

మన్నించండి. నేనెవరినో తమకు చెప్పలేదు. ఈ కిష్కింధకు అధిపతి వాలి. ఆయన తన తమ్ముడయిన సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి, ఆయన భార్యను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. నేను సుగ్రీవుని అనుచరుడను, అన్నాడు.

రాముని వదనం సంతోషంతో వికసించింది. తమ్ముని వైపు తిరిగి:

నా నృగ్వేద వినీతస్య
నా యజుర్వేద ధారిణః
నా సామవేద విదుషః
శక్యమేవం విభాషితుం

అని హనుమంతుని ధీశక్తినీ, వాక్చాతుర్యాన్నీ ప్రశంసిస్తూ,

లక్ష్మణా! ఈ కపిప్రవరుని సంభాషణ ఎంత ఉదాత్తంగా వున్నదో చూశావా!

వేదత్రయం అధ్యయనం చేసి, ఆరుశాస్త్రాలూ, కంఠపాఠం అయి, నవ వ్యాకరణాలూ కరతలామలకం అయినవాడు కాని యిలా మాట్లాడలేడు. అంతేనా!

మాట్లాడుతూన్నప్పుడు తల విసరడం, కనుబొమలు ఎగరవేయడం, నుదురు బిగించడం వంటి వికారాలేమీ లేవు. ఇంకా చూశావా;

అ విస్తరం అ సందిగ్ధం
అ వలంబితం అవ్యధం

చెప్పవలసిన విషయాన్ని ముక్తసరిగా మూడు ముక్కలలో చెప్పాడు. అంతమాత్రాన మనకు వినబడకుండా అక్షరాలు మ్రింగేయలేదు; సాగతీత సంగీతంలేదు. గొంతు చించుకుని తను బాధపడి, మన చెవులకు కఠోరంగా అరవలేదు. సంస్కార సంపన్నమై మధ్యమస్థాయిలో హృదయాహ్లాదకరంగా మాట్లాడాడు.

ఇంత ప్రతిభ కల సచివుడుంటే - ముల్లోకాలనూ జయింఛగలం. కనుక ఇతనితో నువ్వు సముచితంగా మాట్లాడు, అన్నాడు.

తనంత వాడయిన లక్ష్మణుని ఈ విధంగా హెచ్చరించి రాముడు మాట్లాడడం ఇతఃపూర్వం ఎప్పుడూలేదు, అనంతరం అసలు కనబడదు.

రామాయణంలో ఈ చివరినుంచి ఆ చివరకు చదివిన వారికి కూడా రాముని నోట యిటువంటి ప్రశంస ఎవరికీలేదు. ఆయన ప్రశంసించిన వారే, లేరు. హనుమంతుడు తప్ప.

అంటే-

హనుమంతుడు వచ్చి మాట్లాడిన మూడు మాటలలో ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించి, ఆ శక్తిని అభినందించిన ఉత్త
నాయకుడు రామచంద్రుడు. అటువంటి ఉదాత్తశీలుని అభినందనలను అరనిమేషంలో అందుకున్న అద్భుత ప్రతిభాశాలి హనుమంతుడు.

వాల్మీకి రామాయణంలో హనుమంతుని పాత్ర ఇలా ప్రవేశించింది.

అంటే మాట్లాడడం అనే విద్య హనుమంతుని వెంట తిరిగి సర్వ మానవ ప్రాణీ నేర్చుకోవాలని భావించాడు మహర్షివాల్మీకి.

ఎందువల్ల?

మాట ఒక్కటే మానవ ప్రాణికి లభించిన వరం. మిగిలిన ఆహార, నిద్రా, భయ, మైథునాదులు సృష్టిలో అన్ని ప్రాణులకూ సహజమే,

భార్యా విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధచేరి సుగ్రీవునితో స్నేహంచేసాడు. 

భూగోళంలోని వానర సంఘాలకు అధిపతి - వాలి - మహా బలిష్ఠుడు.

చతుర్దశ భువనాలనూ విలవిలలాడించిన లంకేశ్వరుడైన, రావణుని వంటి మహావీరుని తన చంకలో ఇరికించి సముద్రాల ముంచి వదలిన వీరుడు వాలి.

అంతటివాడు - రాముడు విడిచిన ఒకే ఒక్క బాణంతో నేలకూలినాడు. అది చూసిన వానర యోధులు గజ, గవయ, గవాక్ష, గంధమాదన, నల, నీల, మైంద, ద్వివిదాదులందరూ కొయ్యబారిపోయారు.

నోట మాట లేకపోగా, గట్టిగా ఊపిరి పీల్చలేకపోయారు.

వాలి నేల కూలిన వార్త వినీ వినగానే హుటాహుటి వచ్చింది. వానరేశ్వరుని భార్య తార.

వస్తూనే భర్త దగ్గర కూలబడి ఏడ్చింది, ఏమేమో అనుకున్నది. అందరూ శిలా ప్రతిమలవలె నిలబడి వింటున్నారు. ఆవిడ ఎదుట నిలిచి మాట్లాడే ధైర్యం లేదెవరికీ.

అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి:

మహారాణీ! జగదేక మల్లుడయిన వానరేశ్వరుని పట్టపురాణివి, నువ్వు శోకిస్తున్నావా! సర్వవానరయోధులతో కిష్కింధ నీ కనుసన్నలలో నడుస్తుంది. గుండె నిబ్బరం చేసుకుని నీ బిడ్డను సింహాసనం మీద కూర్చోబెట్టు. నీ బుద్ధిబలం వానరరాజ్యానికి పెట్టనికోట........... అన్నాడు.

అదీ హనుమంతుని ధీశక్తి. అమే కుమారుని సింహాసనం ఎక్కించమన్నాడు.

భర్త మరణం ఎంతగా వేధిస్తున్నా, కన్నకొడుకు రాజు కాబోతున్నాడంటే తల్లి గుండె ఎంత పొంగి పులకించాలి. పయిగా నాటి వరకూ ఆవిడ అలోచన మీదనే వానర రాజ్యం నడుస్తున్నది. ఆ అధికారం పోకుండా ఆమె కొడుకు సింహాసనం ఎక్కుతాడు.

అయితే -

సుగ్రీవుడికి రాజ్యం యిస్తానని మాట యిచ్చాడుకదా రాముడు, ఆ విషయం ఎరగడా హనుమంతుడు!

ఎరగక కాదు- తారవంటి ధీశక్తి సంపన్నురాలు తన కొడుకుని ఆ సమయంలో రాజ్యాధిపతిని చెయ్యడానికి అంగీకరించదని తెలుసు హనుమకు.

అదే జరిగింది.

సుగ్రీవుడు రాజుగా పట్టాభిషిక్తుడయాడు.

వర్షాకాలం వచ్చింది. వానలు తగ్గగానే సీతాన్వేషణకు వానరసేనలను పంపుతానన్నాడు.

అన్నాడు కాని రాజ్య భోగాలలో, మదిరాపాన - మదవతీ, పరీరంభాలలో ప్రపంచాన్నే విస్మరించాడు.

వానలు తగ్గినా సుగ్రీవుని జాడ లేకపోవడంతో రాముడు లక్ష్మణుని పంపించాడు. కోటగుమ్మంలో నిలబడి ధనుష్టంకారం చేశాడు లక్ష్మణస్యామి. కిష్కింధ యావత్తూ కంపించింది. సుగ్రీవుని మత్తు దిగిపోయింది. లక్ష్మణుని వెంట రాముని సమీపించి, పాదాభివాదం చేసి, వానర వీరులను నాలుగు
దిక్కులకు పంపుతూ, దక్షిణదిశగా వెళ్ళేవారికి జాంబవంతుడు నాయకుడనీ, అంగదుడు బలాధిపతి అనీ, హనుమంతుడు సేనాధిష్ఠాత అనీ అన్నాడు.

వారు బయలుదేరుతూండగా రాముడు హనుమంతుని పిలిచి తన అంగుళీయకం యిచ్చి జానకీదేవికి గుర్తుగా చూపమన్నాడు. అంటే ప్రభువయిన రామునికి తన ఎదుట నున్న వారిలో ఎవరు ఎంతటివారో గ్రహించి వారిని ఉచితరీతిని సమ్మానించడం తెలుసు. అది మరో కథ.

వానరవీరులందరూ సముద్రతీరం చేరారు.

అంతవరకూ ఉరకలు వేసిన ఉత్సాహం సముద్ర దర్శనంతో చల్లబడింది.

నాయకుడయిన జాంబవంతుడు వారిని ఆశ్వాసించి, హనుమంతుని లేపాడు. బయలుదేరాడు హనుమంతుడు. 
ఇది వెుదటి నాలుగు కాండలలో కథ, ఇక అయిదవదయిన సుందరకాం౦డ.

ప్రస్థానం

త్రికూటగిరి














































Journey - ప్రస్థానం

రామాయణం సుందరకాండ మొదటి సర్గ - ప్రస్థానం

తతో రావణ నీతాయాః
సీతాయా శ్శత్రుకర్మనః।
ఇయేష పద మన్వేష్టం
చారణా చరితే పథి-॥

సర్వశత్రుమర్దన సమర్థుడయిన హనుమంతుడు దేవ గంధర్వాదులు విహరించే గగనమార్గాన బయలుదేరి, రావణుడు అపహరించిన సీతను అన్వేషించడానికి సన్నద్ధుడయాడు.

అసాధ్యమయిన పనిని సాధించడానికి ఉద్యుక్తుడై ఆ వానరయోధుడు మెడ నిక్కించి శిరసు పైకెత్తాడు. అప్పుడాయన మోరపైకెత్తిన ఆబోతువలె వున్నాడు.

వైడూర్యకాంతులీనే పచ్చిక బయళ్ళలో ఒక్కసారి యధేచ్చగా తిరిగి, పరిసరప్రాంతాల పక్షులకూ, జంతువులకూ భయం కలిగించే సింహంలా కనిపించాడు.


అయన ఎక్కిన పర్వతంమీద రంగు రంగుల, రాళ్ళు మనోహరంగా ఉన్నాయి. ఆ పర్వత సానువుల మీద చీని చీనాంబర ధారులయిన కామరూపులు యక్ష, కిన్నర, గంధర్వ, నాగజాతులవారు యధేచ్చగా విహరిస్తున్నారు.

మత్తేభయూధాల గుంపులో గజరాజులా వున్నాడాయన,

సూర్యునికీ, దేవేంద్రునికీ, బ్రహ్మదేవునికి చేతులు జోడించి స్మరించి తూర్పుగా తిరిగి తన జనకుడయిన వాయుదేవునికి ప్రణామాలర్పించి, దక్షిణ దిశగా తిరిగి ప్రయాణోన్ముఖుడై శరీరాన్ని పెంచడం ఆరంభించాడు. పర్వదినాలలో సముద్రంవలె ఆ శరీరం పొంగుతున్నది. దేహాన్ని పెంచి పెంచి ఒక్కసారి పాదాలతో పర్వతాన్ని కదిలించాడు. అది గజ గజ లాడింది.

ఆ ఊపుకి పర్యతంమీది చెట్ల పువ్యులన్నీ జలజల రాలాయి. పూలజల్లులతో నిండిన ఆ గిరి పుష్పగిరిలా ఉంది. ఆ తాకిడికి పర్వతం పగుళ్ళిచ్చి నీటి ఊట లుబికాయి.

అగ్నిగుండం మధ్యనుండి మంటలు లేస్తూ అటూ యిటూ పాగలు జిమ్ముతున్నట్లు మణిశిలలతో యితర రకాలతో రాళ్ళతో భాసించిందది.

కొండ గుహలలో విశ్రాంతి తీసుకునే మృగాలు భయభ్రాంతాలయి రోదనధ్వానాలతో బైెటపడుతున్నాయి. స్వస్తిక చిహ్నాలుగల పడగలు విప్పి కాకోలవిషం క్రక్కుతూ మహాసర్పాలు తమ వాడి కోరలతో బండశిలలను కరువగా మంటలురేగి రాళ్ళు పొడిపొడి అయిపోయాయి. సర్పవిషాన్ని హరించగల ఓషధులున్నా మంటలు రేగడంవల్ల ఆ మూలికలు కూడా మాడిపోయాయి.

ప్రశాంతంగా ప్రేయసీజనంతో విహరించే విద్యాధరులు ఈ రణగొణ ధ్వనికీ ప్రకంపనాలకూ జంకి ఎలావున్నవారు అలానే గగనవీధికి ఎగిరి పోయారు.

వారు పానంచేసే సువర్ణపాత్రలనూ, బంగారు కుండలనూ, రత్నపు పిడుల కరవాలాలనూ, వివిధ మాంసాహారాలనూ ఎక్కడి వక్కడే విడిచి ఎర్రపడిన కనులతో ఆకాశ మార్గం చేరారు. ఆశ్చర్యంతో ఎవరికివారు తమ ప్రియుల భుజసీనులను పట్టుకుని నిలబడ్డారు.

వారికి కొంచెం పైభాగాన వున్న సిద్దులూ, మహర్షులూ, ఆ దృశ్యాన్ని చూసి:

"ఓహో! పర్వత సమదేహుడయిన హనుమంతుడు రామ కార్యార్థియై భీకర మకరాలయ మయిన సముద్రం దాటడానికి సంకల్పించాడు, అని అనుకున్నారు".

ఆ మాటలు విని దిగువనున్న విద్యాధరులు కన్నులు విస్పారించి హనుమంతుని చూశారు. మహాపర్వతంలా గోచరించాడు హనుమంతుడు.

ఒక్కసారి తన దేహాన్ని ఊగిసలాడించగా రోమ రోమం కదలింది. ఒక్క సింహనాదం చేశాడు. కారుమేఘం ఉరిమినట్టుంది. తన వాలాన్ని మరింత దీర్ఘంగా పాడిగించాడు.

నేలకు ఆని కూర్చున్నాడు. చేతులు ముడిచాడు, కంఠం ఉగ్గబట్టాడు.

బల, పరాక్రమ, సామర్థ్యాలను క్రేంద్రీకరించాడు. ప్రాణాన్ని హృదయంలో నిబంధించాడు. ఆకాశంలోకి చూపు పోనిచ్చాడు. చెవులు ముకుళించాడు. పాదాలు తొక్కిపట్టాడు. లేవబోతూ, లేవబోతూ తన స్నేహితుల వైపు తిరిగి:

"వాయు వేగంతో సాగే రామబాణంలా లంకానగరానికి వెడతాను. అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకొనికి వెడతాను. అక్కడా అమ్మవారు లేకపోతే తిరిగి లంకచేరి రావణుని బంధించి తెస్తాను. రావణ సమేతం లంకను పెల్లగించి తీసుకు వసాను".

అంటూ ఒక్క ఊపులో పైకి ఎగిరాడు. ఆ క్షణంలో అయన గరుత్మంతునివలె వున్నాడు.

ఆయన గమనవేగానికి పర్వతంమీది వృక్షాలు ఊగిసలాడి సమూలం కదిలి ఆయనతో కొంతదూరం పోయాయి. ఆత్మీయులు ప్రయాణం అవుతూంటే సాగనంపే బంధుజనంలా, మహారాజును అనుసరించి పోయే సేనలా ఉన్నాయి.

కొంతదూరం సాగి సముద్రంలో పడుతూ అవి ఇంద్రభీతితో సాగరంలో మునిగే పర్వతాలను తలపింపజేశాయి. ఎర్రని చివుళ్ళతో, మొగ్గలతో వున్న ఆ వృక్షాల మధ్య హనువుంతుడు మిణుగురులు నిండిన పర్వతంలా వున్నాడు.

కదిలిన తరువులన్నీ సముద్రప్రాంతం చేరగానే క్రింద పడిపోవడం చూస్తే స్నేహితులను జలాశయం దాకా సాగనంపుతున్నట్లనిపించింది.

రంగు రంగుల పూలకాంతుల మధ్య హనుమంతుడు మెరపు తీవెలు నిండిన మేఘంలా వున్నాడు.

రాలిన పూలతో నిండిన సముద్రం తారా తోరణాలంకృత గగనవిధిలా ఉంది.

బారసాచిన చేతులు అయిదు పడగల పాముల్లా ఉన్నాయి. చూస్తూంటే ఆ మహాకపి ఆకాశాన్ని కబళించి, సాగరాన్ని ఔపోసనం పట్టేలా ఉన్నాడు. ఎరుపెక్కిన కన్నులు పర్యతంమీద అగ్నిగోళాలవలె ఉన్నాయి. ఉదయించే సమయంలో చంద్ర, సూర్యబింబాలవలె కనిపిస్తున్నాయి ఆ కన్నులు.

ఎరుపెక్కిన ముఖం మరింత ఎర్రని వదనం సంధ్యారాగ రంజిత మయిన సూర్యమండలమేమో అనిపిస్తున్నాయి.

ఆ వాలం ఇంద్రధ్వజంలా ఉంది. అప్పుడప్పుడు అయన తోక వలయాకృతిలోకి వచ్చి చుట్టూ గుడి కట్టిన సూర్యునివలె తోపింపజేస్తున్నది. తోక పైకి లేచినపుడు ఆ ఎరుపు చూస్తే పెల్లగించిన జేగురురాతి పర్వతంలా ఉంది, హనుమంతుని దేహం. కదులుతూన్నప్పుడు చలించే గాలి ఉరుముల ధ్వనితో వస్తున్నది.

వాలం నిటారుగా వచ్చినపుడు పొడుగయిన తోకచుక్కలా ఉన్నాడు. మధ్యగా వచ్చి వ్రాలిన తోకతో ఆయన దీర్ఘరజ్జుబంధితమైన మత్తేభంలా భాసిస్తున్నాడు. వాయువశమయిన పెద్ద నౌకలా సాగుతున్నాడు.

ఆయన ముందుకు సాగుతూంటే ఆ వాయువేగానికి సముద్రం అల్లకల్లోల మవుతున్నది.

ఆ కపిశార్దూలుడు తన బాహువులతో సముద్రాన్ని చిమ్ముతూ ముందుకు సాగుతున్నట్లనిపించింది.

ఆ తీవ్రవేగానికి పైకిలేచిన తరంగాలు మేఘమండలాన్ని చేరి శరత్కాల మేఘంలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు వస్త్రహీనులయిన మానవులను తలపింపజేశాయి,

సాగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనుమంతుడు గరుత్మంతుడేమో అనిపించింది. ఆయన నీడ బహువిశాల ప్రాంతాన్ని ఆక్రమించింది. నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది. వాయుపథంలో సాగే హనుమంతుడు రెక్కల పర్వతంలా వున్నాడు. సాగుతున్నంతమేరా క్రింది
సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోనెలా అవుతున్నది,

మేఘమండలంలో చంద్రునివలె సాగుతున్నాడు. దారికి అడ్డువచ్చి చెల్లాచెదరయిన మేఘాలు రక రకాల కాంతులీనుతున్నాయి.

హనువుంతుని తీవ్రగమనాన్ని తిలకించి దేవ, గంధర్వగణాలు పూలవాన కురిపించాయి.

ప్రయాణంలో వాయువు సహకరించాడు. సూర్యుడు చల్లచల్లగా ఉన్నాడు. గగన సంచారులెందరో ప్రశంసావర్షం కురిపించారు.

అనాయాసంగా ఆకాశమార్గాన సాగే ఆ మహాకపిని అభినందించారు, వారు.

ఇక్ష్వాకువంశీయులయిన సగరులవల్ల వృద్ధిపాందిన సాగరుడు ఆ హనుమంతునికి ఏదోవిధంగా సాయపడడం తన కృతజ్ఞతకు అవకాశంగా భావించాడు.

ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి యివ్వగలిగితే మరింత సుఖంగా సముద్రం అవలి ఒడ్డును చేరగలడనుకున్నాడు.

తనలో మునిగి ఉన్న హిరణ్యనాభుడయిన మైనాకుని పిలిచి, పాతాళంలోని రాక్షసులు వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా ఉంచాడు. ఇప్పుడు నువ్వు కామరూపశక్తితో పైకి పెరిగితే నీకూ, నాకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్ష్వాకువంశీయుడయిన శ్రీరామచంద్రునికి సేవా ధర్మంతో హనుమంతుడు వెడుతున్నాడు. నువ్వు పైకి పెరిగితే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆలస్యం చెయ్యకు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చి మన కర్తవ్యం మనం నిర్వర్తించి పెద్దల మన్ననలు పొందుదాం.

ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్ళే ఈ వానర వీరునికి శ్రమలేకుండా సాయపడాలి, అనగా విని మైనాకుడు, మేఘమండలాన్ని చీల్చుకు వచ్చే సూర్యునివలె సముద్రంనుండి పైకి లేచాడు.

కాగి కాగి కరగిన బంగారు కాంతుల శిఖరాలతో లేచిన మైనాకం కాంతితో నీలాకాశం పసిడిశోభ లీనింది.

పెరిగి పెరిగి తన మీదికి వచ్చే మైనాకాన్ని చూచి, హనుమంతుడు తన ప్రయాణానికి ఏదో అడ్డం వస్తున్నదని భావించి, తీవ్రవేగంతో శిఖరాన్ని ఢీకొన్నాడు.

మైనాకుడు హనుమంతుని తీవ్రవేగశక్తికి సంతోషించి:

వానరోత్తమా! అనన్యసాధ్యమయిన ఈ సాగరతరణంలో కొంతసేపు నా శిఖరంమీద విశ్రాంతితీసుకో. నువ్వు రామకార్యార్థివై వెడుతున్నావు. ఆ రామచంద్రుని ప్రపితామహులయిన సగరులవల్ల యింతవాడయిన సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు. ఉపకారానికి
ప్రత్యుపకారం చెయ్యడం సర్వప్రాణిధర్మం. నా సానువులమీద సువాసనలీనే, అతిమధురమయిన కందమూలఫలాలున్నాయి. వాటిని ఆరగించి, విశ్రాంతి తీసుకుని వెళ్ళు.

ఎంతటి సామాన్యుడయినా అతిధిని పూజించాలి. అటువంటప్పుడు నీవంటివాని విషయంలో వేరే ఆలోచన అవసరంలేదు. దేవతా శ్రేష్ఠుడయిన వాయువుకి కుమారుడవు. నీ తండ్రి అంతవేగంగా పయనించగల శక్తి సంపన్నుడవు.

నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెందుతుంది. ముఖ్యంగా నీకీ అతిథిముర్యాద జరపడంలో నా కృతజ్ఞతకూడా వెల్లడించుకుంటున్నాను,

కృతయుగంలో మా పర్వతాలకు రెక్కలుండేవని వినివుంటావు. వాటితో అవి గరుత్మంతునివలె వాయువేగంతో ప్రయాణాలు చేసేవి. అవి ఏ ప్రాంతాన పడతాయో అని అందరూ భయపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలు చేశాడు.

ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు. ఆయనవల్ల నా రెక్కలు సురక్షితంగా వున్నాయి, ఇప్పుడు తెలిసిందా. నేనెందుకింత ఆదరం చూపుతున్నానో. నా సత్కారాలు పొంది అనుగ్రహించు, అన్నాడు.

మైనాకా! నీ ఆదరవచనాలే నా కెంతో సంతోషం కలిగించాయి అయితే యిప్పుడు నేను ఆగడానికి వీలులేదు. సూర్యాస్తమయం కాకుండా నేను ఆవలితీరం చెరాలి, మరొక విధంగా నువ్వు భావించకు. అతిథి సత్కారం అందినట్లే విశ్వసించు, అని తన చేతితో గిరిశిఖరం స్పృశించి ముందుకు సాగాడు.

సాగరుడు, మైనాకుడు హనుమంతుని ఆశీర్వదించారు. దేవేంద్రుడు మైనాకుని ప్రశంసించాడు.

వాయువీధిని వీడి విమల వినీలాంబర వీధిలో వెడుతున్నాడు.

సిద్ద, సాధ్య, దేవ ఋషి సంఘాలు హనుమంతుని అభినందిస్తున్నాయి. ఆ సమయంలో వారు నాగమాత సురసను పిలిచి: ఈ హనుమంతుడు సాహసపరాక్రమోపేతుడు. దానికితోడు ధీశక్తి ఉన్నదో లెదో పరీక్షించాలి, అనగా ఆమె భయంకర రాక్షసాకారంతో బయలుదేరి హనుమంతునికి అడ్డుగాపోయి:

మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా యిచ్చారు. నువ్వు మర్యాదగా నా వదనగహ్వరంలో ప్రవేశించు. హాయిగా ఆరగిస్తాను, అంది.

అప్పుడాయన: దశరథనందను డయిన రాముడు భార్యసీతతో, తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు. అక్కడ సాధుజనరక్షణ కార్యమగ్నుడు కాగా రాక్షసులకు వీరిమీద ద్వేషం కలిగింది.

అంతతో వారి ప్రభువయిన రావణుడు దొంగచాటుగా సీతను అపహరించుకుపోయాడు. ఇప్పుడు నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆ పని పూర్తికాగానే వస్తాను. నన్ను నమ్ము అన్నాడు.

మాటలు కట్టిపెట్టు. ఈ భువన భవనంలో నన్ను అతిక్రమించి పోగలవారు లేకుండా వరమిచ్చారు దేవతలు నాకు, అంది.

హనువముంతుడు: సరే, నా శరీరం పట్టేటంత విశాలంగా నీ నోరు తెరుస్తావా; అంటూ దేహాన్ని పెంచుతున్నాడు.

సురస తన వదన గహ్వారం విశాలం చేస్తున్నది. ఆయన ఎంత పెరిగితే అంతకు రెట్టింపు నోరు పెంచుతున్నది.

అలా పెరిగి పెరిగి ఒక్కలిప్తలో అంగుష్ఠమాత్రదేహుడై మరొక లిప్తవ్యవధిలో ఆమె ఉదరంలోకి పోయి పెకివచ్చి: ఓ దాక్షాయణీ, మరి నాకు సెలవా, అన్నాడు.

సురస, నాయనా సంతోషం. సుఖంగా కార్యసాధనచేసి రామచంద్రునికి సంతోషం కలిగించు, అంది.

గరుత్మంతునివలె సాగుతున్నాడు, హనుమంతుడు.

సింహ శార్దూల, పక్షి, సర్పవాహనాలమీద విహారయాత్ర చేసే విద్యాధరాది గణాలన్నీ సంతోషిస్తున్నాయి. చంద్ర, సూర్యసంచార యోగ్యమయిన మంగళ పథంలో వెడుతున్నాడు.

సాగుతూ సాగుతూండగా హనుముంతుని గమనం ఆకస్మికంగా ఆగిపోయింది.

ఏమిటా అని క్రిందికి చూశాడు, సముద్రంలో ఛాయాగ్రాహిణి సింహిక కనిపించింది. అది సముద్రంలోపలి నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు. సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు చెప్పాడు.

దక్షిణ సముద్రంమీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక రాక్షసి ఉంది. దానిమీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని క్రిందికి లాగుతుంది, అని,

అది గుర్తుకు రాగా తన శరీరాన్ని వర్షాకాలమేఘంలా విశాలంగా పెంచాడు. సింహిక తన నోరు మరింత విశాలంచేసి లాగుతున్నది. తెరిచిన వేదనంలోంచి దాని మర్మస్థానాలు చూశాడు హనుమంతుడు.

చూస్తూనే క్రిందికి దిగుతూ తన శరీరాన్ని సంకోచింపజోసి దాని వదనంలోనుండి ఉదరంలోకిపోయి, వాడిగోళ్ళతో మర్మస్థానాలు చీల్చి ఒక్క ఊపులో గగనవీధికి చేరాడు.

సింహిక సముద్రంమీద తేలిపోయింది, చచ్చిపడి.

సిద్ధ, సాధ్య, విద్యాధర, గంధర్వగణాలు హనుమంతుని ధీశక్తినీ, ధీరత్వాన్నీ అభినందించాయి.

సాగి సాగి సముద్రం అవ్వలి ఒడ్డు చేరాడు. అక్కడ వనాలూ, సముద్రంలో ప్రవేశించే నదీ ముఖద్వారాలూ చూశాడు.

పర్వతంమీద దిగుతూ: నేను యింత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే
కాంక్షతో రావచ్చు. అది కార్యభంగ హేతువవుతుంది, అనుకుంటూ శరీరాన్ని బాగా కుంచించాడు. బలిచక్రవర్తిని వంచించడానికి త్రివిక్రమ రూపం ధరించిన మహావిష్టువువలె పెరిగిన హనునుంతుడు వామనాకృతి ధరించాడు.

ఆ కొండమీద విహరిస్తూ లంకానగరాన్ని చూశాడు. ఆ నగరం అమరావతిలా వెలుగుతున్నది.

(మహర్షి వాల్మీకి విరచిత రామాయణం సుందరకాండ మొదటి సర్గ సమాప్తం)


రామాయణం సుందరకాండ

Shatabhisha Nakshatra - శతభిష నక్షత్రము

శతభిష నక్షత్రము

నక్షత్రం - శతభిష

అధిపతి - రాహువు

గణము - రాక్షస

జాతి - స్త్రీ

వృక్షం - అరటి

జంతువు - గుర్రము

నాడి - ఆది

పక్షి - కుకుటము

అధిదేవత - వరుణుడు

రాశి - కుంభం

నామ నక్షత్రంగో, /సా,/ సీ, /సూ

శతభిషా నక్షత్ర జాతకుని గుణగణాలు:
నక్షత్రములలో శతభిషా నక్షత్రం 24వ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులకి దోషం లేదు కనుక శాంతి అక్కర్లేదు. ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.

ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి.

ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంతకాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు.

పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది.

ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చెయవలసి ఉంటుంది. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు.

కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా వీరిని కాపాడుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవిస్తాయి.


"సత్యమేవ జయతే" అనే ఫిలాసఫీని శతభిషా నక్షత్ర జాతకులు విశ్వసిస్తారు. సత్యం కొరకు, జీవితాన్ని సైతం పణంగా పెడతారు. జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలుంటాయి. వీరు స్వీయ ఆసక్తితో పనులు చేయరు. వీరి హృదయం ఎంతో ఉదారంగా ఉంటుంది. ధైర్యసాహసాలుంటాయి.

ఉద్దేశ్యాలు చాలా బలంగా ఉంటాయి మరియు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లయితే, దానిని పూర్తి చేసే వరకు వీరు విడిచిపెట్టరు. తమ బాధ్యతలు తెలుసుకొని వాటిని సరిగ్గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

ఎక్కువగా శారీరక శ్రమ చేయడాన్ని విశ్వసించరు, దానికి బదులుగా మెదడును ఉపయోగిస్తారు. స్వంతంగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉండటం వల్ల, భాగస్వామికంటే స్వేచ్ఛగా విడిగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరి ప్రవర్తన కాస్తంత సోమరిగా ఉంటుంది, అలానే కాస్తంత వినోదాత్మకంగా ఉంటారు.

వీరు జీవితాన్ని పూర్తి ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. వీరు యంత్రంలా పనిచేయరు మరియు జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి ఇష్టపడతారు. వీరు ఏ సమస్యకు కూడా భయపడరు, దానికి బదులుగా ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు.

నమ్మకం మరియు శక్తి, మీకు బలాన్ని ఇస్తాయి, ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలోనైనా విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఇది వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక లక్షణంగా ఉంటుంది, ఎవరైనా వీరిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తే, వారిని ఓడిస్తారు.

సులభంగా కోపం రాకపోయినప్పటికీ, ఒకవేళ వీరికి కోపం వచ్చినట్లయితే, దానిని నియంత్రించుకోవడం చాలా కష్టం. వీరు సుమనస్కులు మరియు తెలివైనవారు, క్షణాల్లో కోపం మాయమవుతుంది. ఏదైనా చేయాలని ఒక్కసారి నిర్ణయించుకున్న తరువాత, వీరు ఇక వెనక్కి తిరిగి చూడరు.

వీరికి నైపుణ్యం ఉండటం వల్ల జీవితంలోని అన్ని రంగాల్లో కూడా వీరు విజయం సాధిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తిని వీరు ఎగతాళి పట్టిస్తారు. అయితే, వీరు ఆడంబరాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు, మరియు వీరు దేనినైనా ఒక్కసారి చదివినట్లయితే, దానిని చాలాకాలం గుర్తుంచుకుంటారు.


వీరిలో సాహిత్యపరమైన నైపుణ్యం ఉంటుంది, దీనివల్ల వీరు అనతికాలంలోనే పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మంచి స్వభావం వల్ల, వీరు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.

శతభిష నక్షత్రం మొదటి పాదము
ఈ జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు.

ఈ జాతకులకు ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి అనుకూలిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు 16 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహుదశ సమస్యలు కనిపించకుండా పోతాయి.

తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో ఉన్నత చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.

వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 32 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కేతు దశ అనుకూలిస్తేనే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రం రెండవ పాదము
శతభిషా నక్షత్ర రెండవ పాద జాతకుల మీద రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరు పట్టుదలగల వ్యక్తులై ఉంటారు.

శ్రమించి పట్టుదలతో కార్యాలను నెరవేర్చగలరు. ఈ జాతకులకు పరిశ్రమలు, కర్మాగారాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 12 సంవత్సరాలు రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తగ్గుతాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండానే ముగిసిపోతాయి.

తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో మాధ్యమిక చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. ఇక వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాలి.

28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి.

47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధ యాత్రలకు అవకాశం ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.


శతభిష నక్షత్రం మూడవ పాదము
శతభిషా నక్షత్ర మూడవ పాద జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. పట్టుదలతో, శ్రమించి కార్యాన్ని పూర్తి చేయగలరు. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.

ఈ జాతకులకు ఎనిమిది సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహుదశ అను కూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు ప్రభావం చూపే అవకాశం లేదు.

తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు.

24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశ వస్తుంది. దీంతో సంపాదన కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమ స్యలు తగ్గుతాయి. తీర్థ యాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది.

67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగానే గడిచిపోతుంది.


శతభిష నక్షత్రం నాలుగవ పాదము
శతభిషా నక్షత్ర నాల్గవ పాద జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. వీరు రచయితలుగానూ రాణించే నేర్పు ఉంటుంది.

ఉపాధ్యాయ వృత్తి వీరికి అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల కాలం మాత్రమే రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా చదువు ఆటంకాలు లేకుండా సాగుతుంది. అయితే ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు తప్పకపోవచ్చు. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది.

20 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది.

39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి.

తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.


శతభిషా నక్షత్ర జాతకులు పెంచవలసిన చెట్టు:
శతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం మరియు పూజించడం చాలా మంచిది మరియు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

శతభిషా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - శరీరశ్రమ

సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ధన లాభం

విపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - కార్యహాని

సంపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - క్షేమం

ప్రత్యక్ తార - అశ్విని, మఖ, మూల - ప్రయత్న భంగం

సాధన తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - బంధనం

మిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం

అతిమిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం, లాభం

అంశ గుణాలు :
1 ఉత్పన్నాంశ : శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు.

2 పాపాంశ : శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు సత్యం మాట్లాడువారు. స్థిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు.

3 భయాంశ : శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పాండిత్యం కలవారు.

4 సౌమ్యాంశ : శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారుగా ఉంటారు.

నక్షత్ర శాంతి: 
ఎర్రని పువ్వులు దేవాలయంలో దానంగా ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
క్షత్రస్య రాజా వరు'ణో ధిరాజః ।
నక్షత్రాణాగమ్ శతభి'షగ్వసి'ష్ఠః ।
తౌ దేవేభ్యః' కృణుతో దీర్ఘమాయుః' ।
శతగ్మ్ సహస్రా' భేషజాని' ధత్తః ।
యన్నోరాజా వరు'ణ ఉప'యాతు ।
తన్నో విశ్వే' అభి సంయంతు దేవాః ।
తన్నో నక్షత్రగ్మ్ శతభి'షగ్జుషాణమ్ ।
దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని' ॥

నక్షత్ర గాయత్రి
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి 
తన్నో శతభిషా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ పాదం – తొట్టరమూడిలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ పాదం – పాతకోటలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

Sunday, August 9, 2026

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి

మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ
మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమైన తర్వాత శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తరువాత వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి రోజు శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను స్వామికి నైవేద్యంగా సమర్పించడం మన సంప్రదాయం. 

ఆషాఢ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు.

ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు అందునా కామికా ఏకాదశి ఇంకా ప్రీతికరం.
కోరిన కోరికలు తీర్చే ఈ ఏకాదశికి కామిక ఏకాదశి అని పేరు. మనం స్థితి కర్త అయిన  శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి అర్చించి కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పూర్వజన్మ పాపాలు తొలగి, మోక్షం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు దక్షిణాయన ప్రారంభంలో యోగనిద్రలోకి వెళ్లిన తరువాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.

కామికా ఏకాదశి అశ్వమేధ యాగంతో సమానంగా పరిగణించబడుతుంది. కామిక ఏకాదశి రోజున తులసి దళాలతో ఆ శ్రీమహా విష్ణువును పూజిస్తే పితృ దోషం తొలగి ముక్తిని ప్రసాదిస్తుంది. కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తే సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

పురాణకథనం:
పూర్వం ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఒకసారి ఈ జమీందారు ఒక బ్రాహ్మణుడితో పోరాడి కోపంతో అనుకోకుండా అతన్ని చంపేశాడు. బ్రాహ్మణహత్య తీవ్ర మనోవేధనతో కనీసం ఆ బ్రాహ్మణుని దహన సంస్కారాలను నిర్వహించి అన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తలంపుతో దహన సంస్కారాలను చేయాలనీ తలచాడు. కాని గ్రామస్థులు అంగీకరించలేదు.

తీవ్ర మనోవేధనతో తిరుగుతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు ఒక సాధువును కలిసాడు. ఆ సాధువు అతని మనోవేదనకు కారణం తెలుసుకొని కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించమని అతనికి సలహా ఇచ్చాడు. 

జమీందారు సాధువు చెప్పిన విధంగానే ఉపవాసం ఉండేవాడు. అంతేకాక ఆ శ్రీమహావిష్ణువు సన్నిధిలోనే నిదురిస్తుండేవాడు. కొంతకాలానికి ఒక రాత్రి భూస్వామికి ఆ శ్రీమహా విష్ణువు అతని కలలో సాక్షాత్కరించి, ఆశీర్వదించి అతని దోషాలను తొలగించి పాపవిముక్తి కలిగించాడు.

ఎవరైతే అన్నీ ఏకాదశులతో పాటు ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భక్తితో ఆ శ్రీమహావిష్ణువును పూజించి కథా శ్రవణం చేసి తరిస్తారో వారి సమస్త పాపాలు తొలగి అంత్యకాలంలో వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది.

పూజా విధానం:
కామిక ఏకాదశి వ్రతం ఆచరించే వారు సూర్యోదయంతోనే నిద్రలేచి తలారా స్నానం చేసి ముందుగా సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించాలి. శ్రీలక్ష్మీనారాయణులను పంచామృతాలతో అభిషేకించి షోడశోపచారాలు చేయాలి. ఆవునేతితో దీపారాధన చేసి పసుపు రంగు పూలతో, తులసి దళాలతో స్వామిని అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. స్వామివారికి, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి. అనంతరం మంగళ హారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి.

తదుపరి ఆలయదర్శనం చేసుకొని స్వామికి తులసిమాల సమర్పించాలి. అలాగే ఈ రోజు ఉపవాసంతో పాటు రాత్రి భగవన్నామ సంకీర్తనలతో జాగరణ చేయడం కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది.

దానాలు:
కామిక ఏకాదశి నాడు పాలు ఇచ్చే గోవును దూడతో సహా, గ్రాసం కలిపి దానం చేస్తే సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాగే కామిక ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ దీక్షలతో విష్ణువును పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించి తులసి కోట వద్ద నేతి దీపాన్ని వెలిగించాలి.

ద్వాదశి పారణ
ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి రోజు ఉపవాసాన్ని విరమించే విధానాన్ని ద్వాదశి పారణ అంటారు. ఏకాదశి మరుసటి రోజు సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానం చేసి మడిగా, శుచిగా షడ్రసోపేతమైన భోజనాన్ని తయారు చేసి శ్రీ మహావిష్ణువుకు నివేదించాలి. అనంతరం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించుకోవాలి. అటు తరువాత ద్వాదశి ఘడియలు పూర్తికాకముందే భోజనం చేసి ఏకాదశి ఉపవాస దీక్షను విరమించాలి.

కామిక ఏకాదశి విశిష్టతను గురించి బ్రహ్మదేవుడు నారదునికి వివరించగా, నారదుని ద్వారా ఈ 
కథను శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి తెలియజేసి ఆయన చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసినట్లు పురాణకథనం. దీనికి పూర్వం ఈ కథను  వశిష్ఠ మహర్షి  దిలీప మహారాజుకు తెలియజేసాడు.  ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుని నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతముగా సూర్యలోకం లో నివసించే అర్హత కలిగి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కామిక ఏకాదశికి బ్రహ్మహత్యా పాతకాన్ని, భ్రూణ హత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది.

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పసిపిల్లలు, వృద్ధులు ఉపవాస జాగర నియమాలు పాటించక పోయినా ఈ రోజు మనసా వాచా కర్మణా భక్తితో శ్రీహరిని తులసి దళాలతో పూజించి అర్చించాలి.

కామిక ఏకాదశి రోజున ఉపవాస జాగారాలతో ఆ శ్రీహరిని పూజించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ఇష్టకామ్యాలు సిద్ధింపజేసుకుందాం.


జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Saturday, August 8, 2026

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం

గాయత్రీస్తోత్రం
నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను. ఆదిశక్తీ! జగన్మాతా! భక్తానుగ్రహకారిణీ! సర్వవ్యాపికా! అనంతా! శ్రీసంధ్యా! నమోనమః. నువ్వే సంధ్యవు, గాయత్రివి, సావిత్రివి, సరస్వతివి, వైష్ణవివి, రౌద్రివి, రక్తవు, శ్వేతవు, కాళికవు. 

ప్రాతఃకాలంలో బాలాస్వరూపిణివి, మధ్యాహ్నంలో యువతివి, సాయంకాలంలో వృద్దవు. మునిపూజితవు, హంసవాహనవు, గరుడారూఢవు, వృషభవాహినివి, ఋగ్వేదం పఠిస్తూ తపస్వులకు దర్శనమిస్తావు. యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షంలో విరాజిల్లుతావు. సామగానం చేస్తూ భూమండలమంతటా సంచరిస్తుంటావు. రుద్రలోక విష్ణులోక బ్రహ్మలోకాలు నీ నివాసభూములు. 

మానవులను అనుగ్రహించడమే నీ శీలం, నీ స్వభావం. ఓ మాయాదేవీ! సప్తర్షిప్రీతికారిణీ! బహువరప్రదా! పార్వతీపరమేశ్వరులకు నువ్వు చేతుల్లో కన్నుల్లో అశ్రుబిందువుల్లో స్వేదంలో జన్మించావు, నువ్వు ఆనందజననివి, దుర్గవు. 

ఓ వరేణ్యా! వరదా! వరిష్ఠా! వరవర్ణినీ! గరిష్ఠా! వరార్హా! వరారోహా! సప్తమీ! నీలగంగా! సంధ్యా! సర్వదా! భోగమోక్షప్రదా! స్వర్గంలో మందాకినివి, భూలోకంలో భాగీరధివి, పాతాళంలో భోగవతివి, నువ్వు త్రిలోకవాహినివి, త్రిలోకనివాసినివి, భూలోకంలో ధరిత్రివి - శోకధారిణివి. భువర్గోకంలో వాయుశక్తివి, స్వర్లోకంలో తేజోనిధివి, మహర్లోకంలో మహాసిద్ధివి, జనలోకంలో జననివి, తపోలోకంలో తపస్వినివి, సత్యలోకంలో సత్యవాక్కువు, విష్ణులోకంలో లక్ష్మీదేవివి, బ్రహ్మలోకంలో గాయత్రివి, రుద్రలోకంలో గౌరివి, హరుడికి అర్థాంగనివాసినివి.

తల్లీ! మహదహంకారాలకు(సంధాన) ప్రకృతివి నువ్వు. సామ్యావస్థారూపిణివి, శబల బ్రహ్మరూపిణివి, పరా - పరమా - పరాశక్తులు నువ్వే, ఇచ్చాక్రియా జ్ఞానశక్తులను ఇచ్చేదానవు నువ్వే, గంగా యమునా విపాశా సరస్వతీ సింధు నర్మదా గోదావరీ కావేరీ కౌశికీ చంద్రభాగా గండకీ గోమతీ వేత్రవతీ శతద్రూ సరయూ దేవికా ఇరావతీ వితస్తా తాపినీ ప్రముఖనదీనదాలన్నీ నువ్వే.

మానవశరీరంలో ఉండే ఇడా పింగళా సుషుమ్నా గాంధారీ హస్తిజిహ్వా పూషా అలంబుసా కుహూ శంఖినీ ప్రాణవాహినీ ప్రభృతి నాడీమండలం నువ్వే, హృదయపద్మంలో ప్రాణశక్తివి, కంఠంలో స్వప్ననాయికవు, తాలువులలో సదాధారవు, బిందుప్రదేశంలో బిందుమాలినివి, మూలాధారంలో కుండలినివి, కేశమూలాల్లో వ్యాపినివి, శిఖామధ్యాసనవు, శిఖాగ్రభాగంలో మనోన్మనివి. 

అమ్మా! వెయ్యేల. ఈ జగత్రయంలో సమస్తమూ నువ్వే. మహాదేవీ! శ్రీదేవీ! సంధ్యాదేవి! నమో నమః నమో నమః.

నారదా! ఈ గాయత్రి స్తోత్రాన్ని సంజవేళల్లో పఠిస్తే సమస్తశక్తులూ సిద్ధిస్తాయి. అపుత్రకులు పుత్రవంతులూ దరిద్రులు ధనవంతులూ అవుతారు. సర్వతీర్థ తపోదాన యజ్ఞఫలం లభిస్తుంది. భూలోకంలో శతాయుష్కుడై భోగాలు అనుభవించి ఆరోగ్యవంతుడుగా జీవించి కట్టకడపట అపునర్భవంగా ముక్తిపాందుతాడు. ఏ సమయంలో ఎక్కడ పఠించినా పుణ్యప్రదమే. ఎవరైనా పఠిస్తుండగా విన్నా పుణ్యమే. పీయూషధారవంటి స్తోత్రమిది.

నారాయణమహర్షీ! సర్వధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారదా! శ్రుతి స్మృతి పురాణ రహస్యాలెన్నెన్నో నీనోటినుంచి విన్నాను. అయినా ఇంకా తృప్తి కలగడంలేదు. అవిద్యను తొలగించి విద్యను కలిగించేది ఏది? బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఏది దారి? ఐహికాముష్మిక సుఖాలతోపాటు మోక్షం కూడా కావాలంటోంది అంతరంగం. దీనికి సాధనమేమిటి? సారాంశంగా తెలియజేస్తివా నీ పుణ్యమా అని తరిస్తాను.

గాయత్రీ అష్టోత్తర సహస్రం





Srikrishnudu Kundina Nagarambunaku Ratharudhudai Chanuta - శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట అని ఈ విధంగా బ్రాహ్మణునిద్వారా రుక్మిణి చెప్పిపంపిన ...