రావణుడు అంతఃపురం చేరాడు,
అశోకవనంలోని రాక్షస స్త్రీ లందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో:
మా ప్రబువు రావణుడంటే ఎవరనుకుంటున్నావో, పులస్త్య వంశంలో ప్రబవించిన మహామహుడు అటువంటి ఉత్తమపురుషుని వరించడానికి బాధపడతావేమే! అని గర్జించిందొకతె.
ఏకజట: ప్రజాపతులు ఆరుగురు. వీరందరూ బ్రహ్మమానసపుత్రులు. వారిలో నాలుగవవాడు పులస్త్యుడు. ఆయన కుమారుడు విశ్రవసువు, మహాతేజశ్శాలి, మహర్షి, వీరి కుమారుడు మా ప్రభువు, రావణుడు. ఆయనను వరించడం నీ అదృష్టం.
హరిజట: దేవతా శ్రేష్ఠులను జయించిన మ రాక్షస ప్రభువే నీకు యోగ్యుడయిన భర్త.
ప్రఘన: మహావీరుడు, శూరుడు. యుద్ధరంగంలో వెన్ను చూపని మహాయోధుడయిన మా మహారాజును వరించడానికి సంకోచం దేనికీ? ఆయన తన ప్రీయురాండ్రందరను విడిచి నిన్నే దగ్గరకు తీసుకుంటాడు. వేలసంఖ్యలో ఉన్నారు ఆయనకు భార్యలు. వారినీ, మణి, రత్న, శోబితమయిన అంతఃపురాన్నీ విడిచి నిన్నే ఆరాదిస్తాడాయన.
వికట: దేవ, నాగ, గంధర్య, రాక్షసవీరులను మన్ను కరిపించిన మా మహారాజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రీమంతునితో ఉండడానికి ఎందుకంగీకరించవు?
దుర్ముఖి: తెలుసా నీకు; ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు. వాయువు ప్రచండంగా చలించలేడు. లతలు, తరువులు పూలవానలు కురుస్తూంటాయి. అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. అంతటివాడు మా ప్రభువు. నా మాటవిని అయనను వరించు. లేదా నీ ప్రాణాలుండవు.
సర్వప్రాణికోటికీ ఆహ్లాదం కలిగించే రీతిలో సర్వభోగాలతో ఉంటుంది ఆయన అంతఃపురం. అక్కడకు వెళ్ళి హాయిగా వుండు.
నువ్వు మానవస్త్రీవి కనుక మానవుడి భార్యవయావు. బావుంది. కాని యిప్పుడింక మనసు మార్చుకో,
త్రిలోకాలలో వుండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్చగా చరించు.
రాజ్యహీనుడు, ఎందుకూ కొరగానివాడు అయిన రామునికోసం బాధపడకు, అని ఒక్కొక్కరే బెదరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసి సీత:
మీ మాటలు సర్వలోకాలకూ అసహ్యమయినవి. ఈ పాపకార్యానికి నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను మీ మాట వినను.
దీనుడయినా, రాజ్య హీనుడయినా రాముడే నా భర్త. ఇంద్రుని వెంట శచీదేవి, వశిష్ఠులతో అరుంధతి, చంద్రుని కూడి రోహిణి, అగస్త్యులవారితో లోపాముద్ర, చ్యవనునితో సుకన్య.
సావిత్రీ - సత్యవంతులూ, శ్రీమతి - కపిలుడు, మదయన్తీ - సౌదానులు, కేశినీ - నగరులు, నల - దమయంతులు, అలానే నేను రామునితో ఉంటాను, అని నిశ్చలంగా చెప్పింది.
రాక్షస వనితలకు క్రోధం రేగింది. పరిపరి విధాల పరుష భాషలతో వేధిస్తున్నారు.
శింశుపావృక్షశాఖలలో ఉండి చూస్తున్నాడు హనుమంతుడు.
ఆ క్రూరరూపిణులు పళ్ళుకొరికి, పెదవు లాడిస్తూ, గండ్రగొడ్డళ్ళు పైకెత్తి;
ఇది మన ప్రభువుకు తగదు, అని గర్జించారు.
వారిలో వినత;
సీతా! ఇంతవరకూ చూపిన పతిభక్తిచాలు, సంతోషించాం. దేనికయినా అతి పనికిరాదు. నా హితవు ఆలకించు. దీనదశలోవున్న మానవ భర్తను విడిచి, ఇంద్రసమపరాక్రముడయిన మా రాక్షసేశ్వరుని వరించు. దివ్యభోగాలతో మహారాణిగా వెలుగుతావు. రాముడికెప్పుడో ఆయువు చెల్లిపోయింది.
అటువంటి వాడికోసం బాధపడకు. నామాట వినవో, నిన్ను చీల్చుకు తినెయ్యగలం.
వికట: ఓసి దుష్టురాలా! ఇంతవరకూ నీ పాడుమాటలు వింటూ కనికరాంతో వదిలిపెట్టాం. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణీ దాటిరాలేని సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు.
రావణుని అంతఃపురంలో వున్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకేడుసావు! నా మాటవిను. సుఖంగా ఉంటావు. మా మహారాజును వరించు.
నవ నవలాడే ఈ యౌవనం స్థిరంగా శాశ్వతంగా వుండదు. అది పోకుండానే సుఖసంతోషాలలో తేలియాడాలి.
చూశావా! ఉద్యానవనాలు, పర్వత, కాననాలు, మా ప్రభువు కనుసన్నలలో మెలిగే ఏడువేలమంది కామినీ జనులు అన్నీ నీ కోసం యిస్తాడాయన
వినిపిస్తున్నదా నా మాట! వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాం
చండోదరి: ఇదిగో యీ శూలం చూశావా! నిన్ను చూసిననాటినుండి నీ గుండె చీల్చి ప్రేగులు చుట్టబెట్టి, తల పగలగొట్టి తినాలని నాలుక ఊరుతున్నది.
ప్రఘన: ఓ సీతా! ఇంక నేను ఆలస్యం సహించలేను. నీ గొంతునులిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెపితే, హాయిగా ఆరగించండి అని -ఆజ్ఞాపిస్తాడు మా ప్రభువు.
అజాముఖీ: దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి ఈలోగా నంజుడికి మంచి పచ్చళ్ళ, త్రాగడానికి కల్లూ కావాలి.
శూర్పణఖ : నీ మాట సబబుగా ఉంది అలా కానియ్యి, సర్వదుఃఖాలకూ విరుగుడయిన కల్లు తెప్పించండి త్వరగా సుఖంగా త్రాగి దీని మాంసం తిని నికుంభిలాదేవి దగ్గరనాట్యం చేద్దాం.
ఇలా ఎవరికి తోచినట్లు వాఋ గర్జనలు సాగిస్తుంటే బెదరిన హృదయంతో శోకసాగరంలో మునిగింది జానకి.
విషాదం
మా ప్రబువు రావణుడంటే ఎవరనుకుంటున్నావో, పులస్త్య వంశంలో ప్రబవించిన మహామహుడు అటువంటి ఉత్తమపురుషుని వరించడానికి బాధపడతావేమే! అని గర్జించిందొకతె.
ఏకజట: ప్రజాపతులు ఆరుగురు. వీరందరూ బ్రహ్మమానసపుత్రులు. వారిలో నాలుగవవాడు పులస్త్యుడు. ఆయన కుమారుడు విశ్రవసువు, మహాతేజశ్శాలి, మహర్షి, వీరి కుమారుడు మా ప్రభువు, రావణుడు. ఆయనను వరించడం నీ అదృష్టం.
హరిజట: దేవతా శ్రేష్ఠులను జయించిన మ రాక్షస ప్రభువే నీకు యోగ్యుడయిన భర్త.
ప్రఘన: మహావీరుడు, శూరుడు. యుద్ధరంగంలో వెన్ను చూపని మహాయోధుడయిన మా మహారాజును వరించడానికి సంకోచం దేనికీ? ఆయన తన ప్రీయురాండ్రందరను విడిచి నిన్నే దగ్గరకు తీసుకుంటాడు. వేలసంఖ్యలో ఉన్నారు ఆయనకు భార్యలు. వారినీ, మణి, రత్న, శోబితమయిన అంతఃపురాన్నీ విడిచి నిన్నే ఆరాదిస్తాడాయన.
వికట: దేవ, నాగ, గంధర్య, రాక్షసవీరులను మన్ను కరిపించిన మా మహారాజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రీమంతునితో ఉండడానికి ఎందుకంగీకరించవు?
దుర్ముఖి: తెలుసా నీకు; ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు. వాయువు ప్రచండంగా చలించలేడు. లతలు, తరువులు పూలవానలు కురుస్తూంటాయి. అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. అంతటివాడు మా ప్రభువు. నా మాటవిని అయనను వరించు. లేదా నీ ప్రాణాలుండవు.
సర్వప్రాణికోటికీ ఆహ్లాదం కలిగించే రీతిలో సర్వభోగాలతో ఉంటుంది ఆయన అంతఃపురం. అక్కడకు వెళ్ళి హాయిగా వుండు.
నువ్వు మానవస్త్రీవి కనుక మానవుడి భార్యవయావు. బావుంది. కాని యిప్పుడింక మనసు మార్చుకో,
త్రిలోకాలలో వుండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్చగా చరించు.
రాజ్యహీనుడు, ఎందుకూ కొరగానివాడు అయిన రామునికోసం బాధపడకు, అని ఒక్కొక్కరే బెదరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసి సీత:
మీ మాటలు సర్వలోకాలకూ అసహ్యమయినవి. ఈ పాపకార్యానికి నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను మీ మాట వినను.
దీనుడయినా, రాజ్య హీనుడయినా రాముడే నా భర్త. ఇంద్రుని వెంట శచీదేవి, వశిష్ఠులతో అరుంధతి, చంద్రుని కూడి రోహిణి, అగస్త్యులవారితో లోపాముద్ర, చ్యవనునితో సుకన్య.
సావిత్రీ - సత్యవంతులూ, శ్రీమతి - కపిలుడు, మదయన్తీ - సౌదానులు, కేశినీ - నగరులు, నల - దమయంతులు, అలానే నేను రామునితో ఉంటాను, అని నిశ్చలంగా చెప్పింది.
రాక్షస వనితలకు క్రోధం రేగింది. పరిపరి విధాల పరుష భాషలతో వేధిస్తున్నారు.
శింశుపావృక్షశాఖలలో ఉండి చూస్తున్నాడు హనుమంతుడు.
ఆ క్రూరరూపిణులు పళ్ళుకొరికి, పెదవు లాడిస్తూ, గండ్రగొడ్డళ్ళు పైకెత్తి;
ఇది మన ప్రభువుకు తగదు, అని గర్జించారు.
వారిలో వినత;
సీతా! ఇంతవరకూ చూపిన పతిభక్తిచాలు, సంతోషించాం. దేనికయినా అతి పనికిరాదు. నా హితవు ఆలకించు. దీనదశలోవున్న మానవ భర్తను విడిచి, ఇంద్రసమపరాక్రముడయిన మా రాక్షసేశ్వరుని వరించు. దివ్యభోగాలతో మహారాణిగా వెలుగుతావు. రాముడికెప్పుడో ఆయువు చెల్లిపోయింది.
అటువంటి వాడికోసం బాధపడకు. నామాట వినవో, నిన్ను చీల్చుకు తినెయ్యగలం.
వికట: ఓసి దుష్టురాలా! ఇంతవరకూ నీ పాడుమాటలు వింటూ కనికరాంతో వదిలిపెట్టాం. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణీ దాటిరాలేని సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు.
రావణుని అంతఃపురంలో వున్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకేడుసావు! నా మాటవిను. సుఖంగా ఉంటావు. మా మహారాజును వరించు.
నవ నవలాడే ఈ యౌవనం స్థిరంగా శాశ్వతంగా వుండదు. అది పోకుండానే సుఖసంతోషాలలో తేలియాడాలి.
చూశావా! ఉద్యానవనాలు, పర్వత, కాననాలు, మా ప్రభువు కనుసన్నలలో మెలిగే ఏడువేలమంది కామినీ జనులు అన్నీ నీ కోసం యిస్తాడాయన
వినిపిస్తున్నదా నా మాట! వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాం
చండోదరి: ఇదిగో యీ శూలం చూశావా! నిన్ను చూసిననాటినుండి నీ గుండె చీల్చి ప్రేగులు చుట్టబెట్టి, తల పగలగొట్టి తినాలని నాలుక ఊరుతున్నది.
ప్రఘన: ఓ సీతా! ఇంక నేను ఆలస్యం సహించలేను. నీ గొంతునులిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెపితే, హాయిగా ఆరగించండి అని -ఆజ్ఞాపిస్తాడు మా ప్రభువు.
అజాముఖీ: దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి ఈలోగా నంజుడికి మంచి పచ్చళ్ళ, త్రాగడానికి కల్లూ కావాలి.
శూర్పణఖ : నీ మాట సబబుగా ఉంది అలా కానియ్యి, సర్వదుఃఖాలకూ విరుగుడయిన కల్లు తెప్పించండి త్వరగా సుఖంగా త్రాగి దీని మాంసం తిని నికుంభిలాదేవి దగ్గరనాట్యం చేద్దాం.
ఇలా ఎవరికి తోచినట్లు వాఋ గర్జనలు సాగిస్తుంటే బెదరిన హృదయంతో శోకసాగరంలో మునిగింది జానకి.
విషాదం