Friday, August 14, 2026

Jambumali Vada - జంబుమాలివధ

రామాయణం సుందరకాండ 43వ సర్గ - జంబుమాలివధ

ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమంలో వన విధ్వంసంతోపాటు చైత్య, ప్రాసాదాలు కూడా నేల కూల్చాలని నిశ్చయించుకుని మహాదైెత్యం మీదకు దుమికాడు.

మహోన్నతమయిన ఆ భవనంమీద రెండవ సూర్యునివలె వెలుగుతూ దాని పునాదులు కదలించి నేలమట్టం చేశాడు. చేస్తూనే ఒక్కసారి భుజాస్పాలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడి కాపలాజనం మూర్చపోయారు. మరొక్కమారు సింహగర్ణన చేసి:

అస్త్రవి జ్జయతాం రామో
లక్ష్మణశ్చ మహాబలః

రామ లక్ష్మణులకు జయం. రాఘవ పాలితుడయిన మా ప్రభువుకి స్వస్తి, నేను రామదూతను. శత్రుసంహార సమర్థుడను, వాయుపుత్రుడనైన నా ముందు రావణులు వేలమంది ఆగరు,

ఈ లంకను ధ్వంసం చేసి, సీతాదేవికి ప్రణామాలర్పించి మీరందరూ చూస్తూండగా నిశ్చింతగా తిరిగి వెడతాను, అని గర్జిస్తుంటే కొందరు చెత్యపాలకులు ఆయుధధారులై హనుమంతుని హింసించడానికి రాగా, వారి మధ్య మారుతి, గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు.

వారిని దగ్గరగా రానిచ్చి, చైెత్యస్తంభం ఒకటి అందుకున్నాడు. ఆ వేగతీవ్రతకు నిప్పుపుట్టి భవనం ధ్వంసం అయింది.

వజ్రపాణి అయిన దేవేంద్రునివలె స్తంభహస్తుడైన హనుమంతుడు గగనవీధిని నిలిచి:

ఓ రాక్షసులారా! మహాబలిష్ఠులయిన మా వానర వీరులెందరో సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు.

ఆ మహావీరులలో కొందరు దశమత్తేభాలతో సమమయిన బలం గలవారు. కొందరి బలం వంద ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు. వాయుబలం, ప్రవాహవేగబలం కలవారెందరో ఉన్నారు.

వాడిగోళ్ళు, సుడి తిరిగిన దంతాలు, అవే ఆయుధాలుగా కల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మిమ్ము సంహరించడానికి వస్తున్నాడు.

మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగులవు, ఈ లంక వుండదు. మీ రాజు అసలే వుండడు, అని గర్జించాడు.

ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు.

వాడు మహా బలిష్ఠుడు. యుద్ధయోగ్యంగా ఎర్రవస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టంకారం కర్ణభేద్యంగా వుంది. దిక్కులు దద్దరిల్లేలా వుంది.

ఖర వాహన బద్ధ
యిన రథంమీద వచ్చే వానిని చూచి హనుమ ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు.

ఆ బాణ ఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాలు సోకి వికసించిన అరుణక
లంలా వుంది హనుమంతుని వదనం.

ఆ దెబ్బ తిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెల్లగించగా దానిని పది బాణాలతో పొడి పొడి చేశాడు జంబుమాలి.

హనుమంతుడు మహావృక్షాన్ని పెల్లగించాడు. దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతూంటే చేతికందిన పరిఘాయుధం అందుకుని గిర్రున త్రిప్పి విసిరాడు. అంతే!

జంబుమాలి అవయవాలన్నీ సంధులూడి జారిపోయాయి, రధం, ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రి పుత్రులను పంపించాడు.

మంత్రి పుత్రులు

Sena Naasanam - సేనా నాశనం

రామాయణం సుందరకాండ 42వ సర్గ - సేనా నాశనం

మహావృక్షాలు నేలకూలే ధ్వనులూ, పక్షుల ఆర్తనాదాలూ వింటూ లంకానగర వాసులు భయభీతులై లేచారు. వారికెన్నో అపశకునాలు గోచరించాయి.

రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా పర్వతాకారంతో మహావానరం కనిపించింది. వారందరికీ విపరీత
యిన భయం కలిగింది.

కొంతసేపటికి తేరుకుని సీతాదేవిని సమీపించి:

ఈ వానరు డెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? వాడితో మాట్లాడావా? నిజం చెప్పు. వాడితో ఏం మాట్లాడావు? అని అడిగారు.

జానకి : వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు. మీ రాక్షస మాయలు మీకే తెలియాలి. పామునడక పాముకే తెలిసేది. అ రూపం నాకూ భయంగానే ఉంది. కా
రూపంతో రాక్షసుడెవడో వచ్చినట్టున్నాడు.

ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా, 
రి కొందరు పరుగులు తీయగా, కొందరు ఈ వార్త చెప్పడానికి రావణుని దగ్గరకుపోయి:

ప్రభూ! అశోకవనంలోకి ఒక భయంకరమయిన కోతి వచ్చి సీతతో ఏదో మాట్లాడింది. దానికి చాలా బలం ఉన్నట్లుంది. ఆ కోతిని గురించి ఎంత అడిగినా సీత సమాధానం యివ్వడంలేదు.

దేవేంద్రుడో, కుబేరుడో, కాక రాముడో పంపిన దూతకావచ్చు ననుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన వన ప్రదేశమంతా నాశనం అయింది. చూస్తేవాడు జానకీ రక్షణార్దమే ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టాడనుకోవాలి.

ఆ వానరానికి తగిన శిక్ష వేసితీరాలి. నీకత్యంత ప్రీతి పాత్రురాలయిన సీతతో మాట్లాడిన వానికి మరణమే శరణ్యం, అని వారంటూంటే రావణుని వదనం అగ్నిగుండం అయింది. ఆ వేడికి రెండు కన్నీటి బిందువులు రాలాయి. అవి మండుతున్న దీపం నుండి జారే నేతిబొట్లలా వున్నాయి,

తక్షణం తనతో సమానబలంగల కింకరగణాన్ని పంపించాడు.

వారు ఇనుప బరిసెలు, ముధ్గరాలు తీసుకుని బయలుదేరారు. కోరలపళ్ళు, మహోదరాలు భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల దండులా హనుమంతుని చుట్టుముట్టారు. చేతులలోని ఆయుధాలతో మీదికి వచ్చే ఆ కింకరగణాన్ని చూసీ, సింహగర్జనచేసి, తన దీర్ఘవాలాన్ని వేలమీద తాడించాడు. ఒక్కసారి జబ్బచరిచాడు. ఆ ధ్వని కొండగుహలలో ప్రతి ధ్వనించింది. ఆ చప్పుడుకు భయపడి పక్షలు నేలరాలాయి. వారిని చూస్తూ గొంతెత్తి,

జయ త్యతిబలో రామో
లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతి సుగ్రీవో
రాఘవే ణాభిపాలితః॥

దాసో
హం కోసలేంద్రస్య
రామ స్యాక్లిష్ట కర్మణః।
హనుమాన్‌ శత్రు సైన్యానాం
నిహాంతా మారుతాత్మజః 


న రావణ సహస్రం మే
యుద్ధే ప్రతిబలం భవేత్‌ 

శిలాభిస్తు ప్రహరతః
పాదపైశ్చ సహస్రశః॥

అర్ధయితాః పురీం లంకాం
అభివాద్య చ మైథిలీమ్‌

సమృద్ధార్థో గమిష్యామి
మిషతాం సర్వ రాక్షసామ్‌


అతిబల మహాబలులయిన రామ లక్ష్మణులకూ, వారి రక్షణలో ఉన్న మా ప్రభువు సుగ్రీవునకూ స్వస్తి.

అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువుల దాసుడనైన నేను శత్రుసేనా సమూహాలను చీల్చి చెండాడతాను. నేను వాయునందనుడను, హనుమంతుడను.

మహా వృక్షాలతో గండశిలలతో యుద్దం సాగించే నా ముందు వేలమంది రావణులాగరు.

ఈ లంకానగరాన్ని విధ్వంసం చేసి, జానకీ దేవికి అభివాదాలర్పించి, కార్యసాఫల్యంతో మీ అందరూ అలా చూస్తూండగా హాయిగా తిరిగి వెడతాను, అని నినాదం చేశాడు.

ఆ కంఠధ్వనికి రాక్షసయోధులు కంపించారు.

సంధ్యాకాల మేఘ సదృశంగా ఉన్నాడు హనుమంతుడు.

అయినా ప్రభువు ఆజ్ఞ వారిని ముందుకు దూకించింది.

ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంతో, తాను కూర్చున్న ద్వార తోరణంలోని ఇనుప దూలం లాగి వారిని తాడించడం మొదలుపెట్టాడు.

గరుత్మంతుని గోళ్ళలో చిక్కిన మహాసర్పంలా ఆడుతోంది ఆ దూలం.

దాని తాకిడికి రాక్షసులందరూ నేలకూలారు. హతశేషులు పరుగు పరుగున రావణునికి నివేదించారు.

కింకరగణం పరాభూతం అయిందని విన్న రావణుని కన్నులు గిరగిర తిరిగాయి. పరాజయం ఎరుగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ మంత్రి ప్రహస్తుని కుమారుడు.

జంబుమాలివధ

Asokavana Vidhvamsam - అశోకవన విధ్వంసం

రామాయణం సుందరకాండ 41వ సర్గ - అశోకవన విధ్వంసం

ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.

ఈ రాక్షసులు క్రూరప్రవృత్తి కారణంగా సామమార్గాన లొంగిరారు, ఇంత సిరిసంపదలతో వున్నవారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు.

ఇక మిగిలింది దండనీతియే. అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు.

అందుచేత ఈ రాక్షసయోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగి రావచ్చు.

కార్యసాధకుడైె న దూత ముందు వెనుకల భంగంకాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించిన యితర కార్యాలు కూడా పూర్తిచెయ్యాలి.

ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్టవుతుంది.

ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి.

రావణుని మంత్రి, సేనానుల బలాబలాలు, వాని సర్వశక్తులూ గ్రహించి వెళ్ళాలి.

దానికి ఒకటే దారి కనిపిస్తున్నది.

నందన వనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ, గజ, రథ బలాలను పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను, అని నిశ్చయించుకుని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలు  పెట్టాడు.

చెరువుల గట్టు తెగగొట్టేశాడు.

ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలు ముక్కలయాయి.

రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా తయారయింది. రావణునికి హృదయక్షోభ కలిగించి, తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్దానికి సన్నద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు.

సేనా నాశనం

Sandesham - సందేశం

రామాయణం సుందరకాండ 38, 39, 40 సర్గలు - సందేశం

హనుమా! నీ మాటలు నా హృదయోనికి ఆశ్వాసనం కలిగిస్తూ, పెరుగుతూన్న పంట చేనుకి సకాలంలో పడిన వాన చినుకుల్లా ఉన్నై. శూరశ్రేష్ఠుడయిన రామునికి నా స్పర్శ ఎంత చల్లదనం కలిగిస్తుందో అలానే నీ మాటలు అలరించాలి. ఇంతకు ముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను.

మరొక గుర్తుంది.

ఒకనాడు నా బొట్టు జారిపోగా ప్రక్కనున్న మణిశిల తీసుకుని అరగదీసి దానితో నా బుగ్గన చుక్క ఉంచాడాయన. అది మరచిపోలేదని చెప్పు,

ఇంద్ర, వరుణ సమ పరాక్రమోపేతుడవైన నువ్వు నీ భార్యను ఎవడో అపహరిస్తే, రాక్షసమధ్యంలో క్లేశాలు పడుతూంటే ఎలా సహించ గలుగుతున్నావు? అని అడిగినానని చెప్పూ,

నా సర్వసంపదలకూ ఆధారభూతమూ, ప్రాణప్రదమూ అయిన ఈ చూడామణిని చూచినప్పుడు ఆయనను చూచినంత సంతోషం కలుగుతుంది. ఇది పంపుతున్నానని చెప్పు.

ఈ బాధలూ, రాక్షస స్త్రీల హృదయవిదారక పరుష భాషణాలూ, ఆయన కోసమే భరిస్తున్నాను.

నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ రాక్షసుని క్రూరదృష్టి నేను భరించలేను, అని శోకదీన వదనయై ఆగింది జానకీదేవి.

అప్పుడు హనుమంతుడు:

అమ్మా! ఆయన నీ కంటె దుఃఖంలో ఉన్నాడు.

లక్ష్మణుడూ అదే దశలో వున్నాడు. నీ వార్త నేను చెప్పగానే వారుభయులూ హుటాహుటి వచ్చి తన పరాక్రమంతో లంకానగరాన్ని భస్మం చేస్తారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. 
రేదయినా అయనకు విశ్వాసం కలిగించే ఆనవాలు ఇస్తావా? అని అడిగాడు.

జానకి : ఈ చూడామణి నా శిరోభూషణం. అంతకంటె ఉత్తమ మయిన అనవాలు లేదు, అంది.

హనుమంతుడు ప్రయాణ సన్నద్దుడై శరీరం పెంచుతున్నాడు.

అప్పుడు జానకి;

హనుమా! రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం మరువకు. వారందరినీ యిక్కడకు తీసుకురాగల శక్తి నీకే ఉన్నది. నాస్థితి చూశావు కదా! ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకు
చెప్పాలి సుమా! నీకు శుభమగు గాక అంది.

హనుమంతుడు సంతోషంతో 'వచ్చినపని అయింది' కాని మరికొంత మిగిలినట్టు ఉంది, అని ఆలోచిస్తూ ఉత్తరదిశగా సాగాడు.

అశోకవన విధ్వంసం

kakasurudu - కాకాసురుడు

రామాయణం సుందరకాండ 36, 37వ సర్గ- కాకాసురుడు

జానకి మాటలు విన్న హనుమంతుడు:

అమ్మా! పరమసాధ్వీమణీ నీ మాటలు నీ పాతివ్రత్యానికి నిదర్శనంగా ఉన్నాయి. నూరు యోజనాల సముద్రం దాటే నా వీపు మీద కూర్చోవడం నీకు భయంగానే ఉంటుంది, నువ్వు స్త్రీవి కనక,

మహాత్ముడయిన రా
చంద్రుని ధర్మపత్నిగా నువ్వాడిన మాట ఉన్నదే!

పరపురుషస్సర్శ సహించనని-

అది నువ్వు మాత్రమే అనగల మాట. మరొక స్త్రీ ఆ పలుకుపలక లేదు.

నీ స్థితి, నువ్వు పలికిన ప్రతి అక్షరం అన్నీ యథాతథం ఆయనకు వినిపిస్తాను.

రామచంద్రునికి సాధ్యమయినంత త్వరలో సంతోషం కలిగించాలనే నా తాపత్రయం; అందుకే నిన్ను తీసుకువెడతానన్నాను. పయిగా ఆ సముద్రందాటి ఈ లంకలో అడుగుపెట్టడం ఎంత క్లేశమో తెలిసి మాట్లాడాను.

రాముని మీద నాకున్న స్నేహగౌరవాలు నన్ను అలా మాట్లాడించాయి తప్ప మరొక భావన నాకు లేదు.

ఇప్పుడింక నువ్వు రావు కనక ఆయనకు ఆనవాలు ఏదయినా యిస్తావా అని అడిగాడు.

సీతాదేవి బాష్పావృతనయనాలతో నెమ్మదిగా పలుకుతున్నది:

ఆయనకు ఒక కథ చెపుతాను గుర్తుగా; అది చెప్పు:

అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మించుకుని వున్నాము. మా ఆశ్ర
మ   పరిసరాలలో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండే వారు. ఆ కొండకు తూర్పునా, ఉత్తరంలోనూ స్వాదుజలాలూ, ఫలభరిత వృక్షాలూ ఉండేవి.

దగ్గరలోనే మందాకినీ నది.

ఆ ఏటిఒడ్గున సువాసనలీనే లతా, తరువులతో వనాలు.

ఒకనాడు ఆ వనంలో విహరించి, తరంగశీకరాలలో తడిసి ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను.

అప్పుడొక కాకి మాంస ప్రీతితో నన్ను పొడువ రాగా, దాన్ని చిన్న బెడ్డలతో తరుముతున్నాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పొడవడానికి వస్తూనే ఉంది. ఒకసారి అది వచ్చి నా మొలనూలు పట్టి లాగినప్పుడు నా చీరకొంగు జారింది.

అదిచూసి ఆయన చిరునవ్వు నవ్వగా నాకు కోపం వచ్చి దూరంగా వెళ్ళాను. అయినా ఆ కాకి తన పట్టు విడక నన్ను హింసించగా నేను తిరిగివచ్చి అయన ఒడిలో వాలాను. ఆయన నన్ను ఓదార్చారు.

అలసటలో వున్న నేను నిద్రపోయాను. కొంతసేపటికి ఆయన కూడా నిద్రించారు. మరికొంత సేపటికి నేను నిద్రలేచాను.

ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను తన ముక్కుతో పొడిచింది. అప్పుడు నా శరీరం నుంచి రక్తం కారింది. నేను రాముని లేపాను. లేస్తూనే ఆయన నా స్థితి చూసి:

నిన్ను హింసించడానికి సాహసిందిన వాడెవడు?

అయిదు పడగల పాముతో చెరలాటమాడే సాహసం ఎవడికి వచ్చింది.

అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా వున్న కాకిని చూశాడు.

అ కాకి ఇంద్రుని తనయుడట!

రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు.

అది బ్రహ్మాస్త్రం!

ప్రళయాగ్నిలా అది కాకిని వెన్నాడింది.

భయంతో అది లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయం యివ్వలేకపోయారు.

దేవతలు, ఋషులు కూడా శరణు ఇవ్వలేమన్నారు.

శరణాగతరక్షకుడయిన రాముడే దానికి అభయం ఇచ్చి,

ఓ వాయసమా! బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు.

దానికి లక్ష౦ చూపించు, అనగా అది తన కుడికన్ను చూపింది. అలా దానికి చావు తప్పి కన్ను లొట్ట అయింది. అప్పుడది తన ప్రాణ రక్షణ చేసిన రామునీ, వారి తండ్రి దశరథులవారినీ అభినందించి వెళ్ళింది.

అలా కాకిమీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు ఈ రాక్షస రావణుని విషయమై ఏం చెయ్యకుండా ఎందుకూరుకున్నాడు?

అంతటి శక్తిశాలి అయిన నాథుడుండి కూడా నేను అనాథలా వున్నాను.

దయను మించిన ధర్మంలేదని ఆయనే అనేవారు. ఉత్సాహబల, పరాక్ర
 సంపన్నుడు.

శత్రుసంహారసమర్థుడు.
సాగర గంభీరుడు.
ఇంద్ర సదృశుడు.
సముద్ర పరీవృత భూమండలాధీశుడు.
వివిధాస్త్రకోవిదుడు.

దేవ, దానవ, నాగ, గంధర్వజాతులను నిర్జింగల శూరుడు. ఇంతటివాడై ఎందుకీ ఉపేక్ష చేస్తున్నాడాయన.

లక్ష్మణుడయినా అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకురాడు.

అగ్ని, వాయుదేవులతో సమానులయిన ఆ అన్నదమ్ములింత ఉదాసీనంగా ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో. అంతే! వారు రాకపోవడానికి అదే కారణం, అని దుఃఖిస్తున్నది సీత.

హనుమ : అమ్మా! నీ వియోగదుఃఖంతో ఆయన ఏ పనీ చెయ్యలేక దుఃఖంతో ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితాపం చెందుతున్నాడు.

ఈ క్షణం వరకూ నీ జాడ తెలియదాయనకు. ఇప్పుడు నేను నిన్ను చూశాను. ఇంక నీ దుఃఖం సమాప్త
యింది. ఆ రాకుమారు లిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మంచేసి నిన్ను చేరగలరు. ఈ క్రూరరాక్షసుని బంధుసమేతం సంహరించి రాముడు నిన్ను తీసుకువెడతాడు.

నేను తిరిగి వెళ్ళి రామచంద్రునికి చెప్పవలసిన మాటలేమిటి? అలానే లక్ష్మణునికీ, సుగ్రీవునికీ ఏం వివరించాలి, అని అడిగాడు.

జానకి: హనుమా! లోకనాథుడుగా కౌసల్యాదేవికి ప్రభవించిన రా
చ౦ద్రునికి శిరసా నస్కరించి ఆయన కుశలం అడుగుతున్నానని చెప్పు,

తల్లిదండ్రులయందు అమిత
యిన గౌరవం చూపుతూ, వారిని ఆరాధించుకునే మా లక్ష్మణస్వామి సుఖంగా సర్వభోగాలతో అలరారే రాజధానిని విడిచి మాతో వనవాసక్లేశం అనుభవించడానికి వచ్చాడు. అటువంటి బిడ్డను కని సుమిత్రాదేవి ధన్యురాలయింది. ఆ మహావీరుడు మాకు రక్షకుడుగా వచ్చాడు. ఆ మహాబాహుడు, సింహస్కంధుడు, ప్రీయవాది నన్ను తల్లిగా, అన్నగారిని తండ్రిగా భావించి సేవించుకున్నా డింతవరకూ.

ఆనాడు, రాక్షసుడపహరించిన నాడు మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు, ఉంటే యింత జరిగేది కాదు, మా లక్ష్మణుడు సర్వకార్య నిర్వహణదక్షుడు. అయనకు తమ్మునిమిదనే ప్రే
మ ఎక్కువ.
ఆ తమ్ముని తోడు చూసుకుని రాముడు పితృ మరణబాధ మరచి పోగలిగాడు.

అటువంటి మరది క్లేమంగా ఉన్నాడని నమ్ముతున్నానని చెప్పు - ఇంక నా భర్తతో యీ మాట చెప్పు.

నే నింక ఒక నెలకంటె జీవించను. ఈ పాపి నుండి నన్ను యీ లోపునే రక్షించుకోవాలి, ఈ చూడామణి ఆయనకు అనవాలుగా యిచ్చానని చెప్పు, అంటూ కొంగుముడి నున్న చూడామణి
హనుమంతునికి అందించింది. ఆ అభరణాన్ని ఉంగరంలా వ్రేలికి తొడుగుదామనుకున్నాడు కాని అది కుదరలేదు. దానిని చేతబట్టి సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వినయంగా నిలబడ్డాడు.

అప్పుడే ఆ వాయునందనుని 
నస్సు రామయం అయింది, తిరుగు ప్రయాణానికి సన్నద్దుడవుతున్నాడు.

జానకి: హనుమా! ఈ చూడామణి చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య మా మా
గారు దశరథులు, నేను, ముగ్గురం మనసులో కనిపిస్తాం, అంది,

హనుమంతుడు తలవంచి నమస్కరించాడు,

ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ;

హనుమా! నువ్వు వెళ్ళగానే రా
 లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్దులందరి కుశలం అడుగుతున్నానని చెప్పు.

అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట వినగానే ఆయన కార్యరంగంలో ప్రవేశిస్తాడని ఎరుగుదును.

హనుమ : రాముడు సర్వవానర, భల్లూక సేనా సమేతం యిక్కడకు హుటాహుటిన వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం కురిపిస్తుంటే ఎదురు నిలిచే వారుండరు, ఇంద్ర, య
, సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీవల్ల ఆయన విజయం సాధించగలడు. మరి నేను వెడతాను, అన్నాడు.

జానకి: నాయనా! ఈ రోజుకి ఎక్కడయినా రహస్యంగా విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరవచ్చు కదా! మరికొంత సేపు నువ్వుంటే నాకు ఆశ్వాసన. ఇంతకూ మీరందరూ వచ్చేవరకూ నా ప్రాణాలు
ఉంటాయో ఉండవో!

ఒకవేళ మీరు రాదలచినా వానర భల్లూక సేనలు ఈ మహాసాగరాన్ని ఎలా దాటగలవు?

వాయుదేవుడూ, గరుత్మంతుడూ, నువ్వూ తప్ప ఇంత సముద్రం దాటగల ప్రాణి 
రొకటి ఉండదు,

అయినా రాముడు స్వయంగా వచ్చి లంకా నగరాన్ని జయించి నన్ను తీసుకువెడితేనే మాకు కీర్తి ఆ మహాకార్యం ఎలా సాధ్యం, అని ప్రశ్నించింది.

హనుమ : అమ్మా! ఈ సందేహం నీ కనవసరం. మా ప్రభువు సుగ్రీవుడు ఈ విషయమై ఎప్పుడో నిశ్చయించాడు, మా వానర భల్లూక వీరులందరూ ఆయన అజ్ఞానుసారం నడుచుకుంటారు. వారికి
భూమ్యాకాశాలలో అడ్డంకిలేదు. వారు మహాతేజస్వులు. నదీ నద పర్వత కానన సాగర పరివృత భూమండలం అంతా వారికి కొట్టిన పిండి. మా వారిలో నన్ను మించిన వారూ, నా అంతటివారే
అందరూ. నా కన్న తక్కువవాడు లేడక్కడ. దూతగా మహామహులను పంపరు కదా! నా వంటి సామాన్యులను తప్ప; అంటే ఆలోచించవచ్చు మా వారి బల శక్తులు.

మా వానర బలాధిపులు ఒక్క అంగలో సముద్రం దాటి రాగలరు, రా
 లక్ష్మణులంటావా! ఇద్దరినీ చెరొక భుజంమీద ఎక్కించుకుని నేను వస్తాను. వారు త బాణపరంపరతో ఈ లంకను ముంచుతారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. ప్రజ్వలిగాగ్ని వదనుడయిన రాభద్రుడు అచిరకాలంలో యిక్కడ నీకు కనిపిస్తాడు. నిశ్చింతగా వుండు. నీకు శుభం కలుగుతుంది. ఈ రాక్షస వంశం నేలకూలిన నాడు నువ్వు రోహిణివై రామచంద్రుని చేరుతావు. మలయ పర్వత గుహలలో చరించే సింహ శార్దూల సమ పరాక్రమ సంపన్నులయిన వానర
భల్లూక పతులందరూ నీ కోసం ఈ రాక్షస సంహారానికి వస్తారు.

నువ్వు విచారించకు. వాయువూ, అగ్నీవలె రామ లక్ష్మణులు విజృంభించి నీ రక్షణభార చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన క్షణంలో వారు వచ్చి తీరుతారు, అని ఓదార్పు పలికాడు,

సందేశం

Thursday, August 13, 2026

Anuchitam - అనుచితం

రామాయణం సుందరకాండ 35వ సర్గ- అనుచితం

భర్తృ భక్తిం పురస్కృత్య
రామా దన్యస్య వానర
న స్ఫృశామి శరీరం తు
పుంసో వానర పుంగవ॥

వాయునందనా! రాముడు శోకసాగరమగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచన చెయ్యడం లేదని నువ్వు చెపుతూన్న మాటలు విషంచుక్క పడిన అమృతంలా ఉన్నాయి.

అఖండ సంపదలు వచ్చిపడినా, దారుణక్లేశాలు నెత్తిమీద వున్నా, కాలపాశం ఎప్పుడూ 
న కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. రామలక్ష్మణులూ నేనూ క్లేశాలలో మునిగి వున్నాము.

సాగర
ధ్యంలో విరిగిపోయిన నావనుండి నీటిలో పడి యీధుతూ అలసిన వానిదశలో వున్న రాముడు ఎప్పటికి ఒడ్డు చేరుతాడో! రాక్షసులందరిని, రావణునీ సంహరించి ఎప్పటికి నా దగ్గరకు రాగలడో! ఈ రెండు మాసాలలోపలే ఆయన రావాలి. అది దాటితే ఈ క్రూరుడు నన్ను విడువడు.

ఆ రాక్షసుని సోదరుడయిన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని చెపుతూనే వున్నా, రావణుని చెవి కెక్కడంలేదనీ, వానిని మృత్యువు వెన్నంటి తరుముతున్నదనీ విభీషణుని పెద్దకూతురు అనల వచ్చి చెప్పింది, ఆ పిల్లను స్వయంగా ఆమె తల్లి పంపిందట.

రావణుని అనుచరులలో వృద్ధుడు, ధర్మపరుడు, ధీశాలి, విద్వాంసుడు అయిన అవింద్యుడనే ఆయన కూడా రామునివల్ల రాక్షస నాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినడం లేదట.

మారుతీ!

అన్నింటి కంటె నా అంతరాత్మ పరిశుద్దంగా ఉంది. నా భర్త సర్వసద్గుణరాశి. ఉత్సాహం, పరాక్రమం, మృదుహృదయం, సాహసం, సామర్ధ్యం అన్నీ వున్నవాడాయన.

అలనాడు-

జనస్థానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండా ఆయన ఒంటరిగా నిలబడి పదునాలుగువేల మంది రాక్షసులను నేల కూల్చినవాడు. ఇంక అయనకు ఎదురు నిలిచేవాడెవడు?

ఇంద్రుని ప్రతాప ప్రభావం శవీదేవికే తెలిసినట్లు మా వారి శక్తి నేనే ఎరుగుదును, అందరికంటె ఎక్కువగా.

ఈ రాక్షస శత్రుజలాన్ని రాముడనే సూర్యుడు తన బాణ కిరణాలతో ఎండబెట్టగలడు, అన్నది జానకి.

అమ్మా! సందేహం లేదు. నేను వెళ్ళి నీ వార్త చెప్పగానే ఆయన వానర భల్లూక సేనలతో వస్తాడు.

అంతవరుకూ ఎందుకమ్మా! నా వీపు మీద కూర్చుంటే యిప్పుడే నిన్ను తీసుకువెళ్ళి ఆయన ముందుంచుతాను. నిన్నేకాదు; రావణసమేతం ఈ లంకానగరాన్ని కదలించి తీసుకుపోగలను. హోమ ద్రవ్యాలను అగ్ని హోత్రుడు యింద్రుని ముందుంచేటట్లు నిన్ను నేను రాముని కర్పిస్తాను.

రావణవధోద్యుక్తులయిన రా
లక్ష్మణులను నువ్వు యిప్పుడే చూడవచ్చు. మరే ఆలోచనా లేకుండా రావమ్మా చంద్రుని సరసన రోహిణి వలె రాముని ప్రక్క నువ్వు అలరారుతావు. ఈ లంక అంతా కలిసి వచ్చినా నన్ను ఆపలేరు. ఇక్కడకు వచ్చినంత అనాయాసంగా నిన్ను అక్కడకు తీసుకువెళ్ళగలను.

జానకి: హనుమా! చాలా సంతోషంగా వుంది నీ మాటలు వింటుంటే. కాని అంత దూరం నన్నెలా తీసుకుపోగలవు?

నీ వానరత్వం అలా పలికించింది, లేకుంటే ఇంత అల్ప శరీరంతో వున్న నువ్వు!

అని సీతాదేవి పరిహసించగా హనుమంతుడు పరాభవ దుఃఖాన్ని అణచుకుని తన దేహాన్ని సువిశాలం చేసి, మేరుగిరిలా నిలిచాడు ఆయన కన్నులు అగ్నిగోళాలవలె వెలుగుతున్నాయి. గోళ్ళు వజ్రకాంతులతో వున్నాయి.

హనుమ : 
తల్లీ ఇప్పుడు చూశావా నా శక్తి! యీ లంకానగరాన్ని, వన, భవన, ప్రాకార, పర్యత సమేతం దీని రాజయిన రావణునితో కలిపి తీసుకుసోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను తీసుకువెళ్ళి రా లక్ష్మణులను దఃఖసాగరం నుండి ఉద్దరించడమే నా కర్తవ్యం.

జానకి: నీ శక్తి సామర్ఢ్య బల గమనాలు నాకు తెలుసునయ్యా! నువ్వు అగ్ని వంటి తేజస్సు కలవాడవనీ ఎరుగుదును. అంతటి శక్తిలేని వాడెవడయినా యీ అంతులేని సముద్రాన్ని దాటి రాగలడా?

నువ్వు నన్ను తీసుకుపోగలవు. కాని నీ గమనవేగ తీవ్రతను నేను సహించలేక సృహతప్పి సముద్రంలో పడితే జల జంతువులు నన్ను ఆహారంగా గ్రహిస్తాయి. అందుచేత నేను రాను.

అదీకాక, ఈ వార్త విని రావణుడు 
హాకాయులయిన రాక్షసులను వదులుతాడు. వారు శూల, ముద్గరాది ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధుడవై నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు, ఒకవేళ నువ్వు చేసినా ఆ సమయంలో నేను భయంతో జారిపోవచ్చు. ఆ రాక్షసులు నన్ను తీసుకుపోయినా తీసుకుపోతారు. లేదంటే నరికిపారేయగలరు, లేదా లంకలో బహురహస్య ప్రదేశంలో దాచగలరు.

మరొక మాట -

నీ శక్తితో నువ్వు సర్వరాక్షస సంహారం చెయ్యవచ్చు, కాని, అది ప్రభువయిన రామునికి కీర్తికరం కాదే! అందుచేత నువ్వు ఆయనను తీసుకు రావడమే శ్రేయస్కరం.

నీ మాటవిని బయలుదేరితే, నేను చెప్పిన ప్రమాదం జరిగితే రా
లక్ష్మణులతోపాటు మీ వానర భల్లూక పతులు కూడా ప్రాణాలు వదులుతారు.

అన్నిటికంటె ముఖ్యమయిన విషయం-

భర్తృభక్తిపరాయణురాలయిన నేను పరపురుషుని స్పర్శను కూడా సహించను.

మరి రావణుడు తెచ్చాడు కదా అనవచ్చు, నువ్వు.

అప్పుడు నా భర్త దూరంలో వున్నాడు. నా మనస్సు నా వశంలో లేదు. ఆ సమయంలో నేను చేయగల్గింది లేదు.

ఇకా ఈ దశకంఠుని బంధుసమేతం సంహరించి నన్ను స్వీకరించడం రామచంద్రునికి కీర్తికరం.

దేవ నాగ గంధర్వులను నిగ్రహించగల అయన ధనుష్పాణియై నిలబడితే-

జ్యలితాగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే వారివైపు కన్నెత్తి చూడగలవాడుండడు. కనక - లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక సేనానులందరూ రాముని వెంట యిక్కడకు రావాలి. అదే నాకు
సంతోషం కలిగించే పని. మరేదీ నాకు రుచించదు అంది.

కాకాసురుడు

Anguliyakam - అంగుళీయకం

రామాయణం సుందరకాండ 33, 34వ సర్గ- అంగుళీయకం

అమ్మా! ఇప్పుడు నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. వాయువు ఎంతశక్తిముంతుడో నేను కూడా అంతశక్తిశాలిని, అని వినయంగా:

ఇదిగో రామముద్రిక. ఈ అంగుళీయకం చూచి నన్ను పూర్తిగా విశ్యసించు. విచారాన్ని విడిచి సంతోషంగా ఉండు, అని ఉంగరం అందించాడు.

ఆ ఉంగరాన్ని చూచే సీతాదేవి వదనం రాహువునోటి నుండి వెలువడిన చంద్రబింబంలా ఉంది. ఎదురుగా రా
చంద్రుడే వచ్చి నిలబడి నట్టనిపించింది. తన కంత సంతోషం కలిగించిన వాయునందనుని కొనియాడుతూ.

నువ్వు తప్ప ఈ పని చెయ్యగలవారు లేరయ్యా. ఈ రాక్షస రాజధానిలో అడుగు పెట్టడం ఎవరితరం! నూరు యోజనాల విస్తీర్ణమయిన మహాసాగరాన్ని గోపాదంలా దాటి రాగలిగిన నీ సాహస పరాక్రమాలు మరెవరికుంటాయి.

ఆత్మవేత్తయైన రామభద్రుడు పంపిన నీతో మాట్లాడడం నాకెంతో సంతోషంగా ఉంది.

ఆయన నా దగ్గరకు సామాన్యులను పంపడు. ఎంతో పరిశీలించి, పరీక్షించి పంపుతాడు. ధర్మ సత్యపరుడయిన రాముడు, అయన సోదరుడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారని విన్న నా గుండె తేలికపడింది.

నాకొక సందేహం కలుగుతున్నది. ఆయన కుశలంగా ఉంటే ఈ పాటికి ఈ లంకా నగరాన్ని భస్మంచేసి తీరాలి. దేవ గణాలను సైతం నిగ్రహించగలిగిన వారుభయులూ మౌనంగా ఉన్నారంటే నా దురదృష్టమే కావాలి.

ఇంతకూ, బాధతో ఆయన నిశ్చలంగా కూర్చుని ఉండడం లేదు కదా! ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడా! ఆయన సా
, దాన, భేద, దండాలను సకాలంలో అనుసరిస్తున్నాడా!

ఆయనకు యోగ్యమిత్రులు చేకూరుతున్నారా! వారు ఆయన శ్రేయస్సు కోరి పని చేస్తున్నారా! గౌరవభావంతో చూస్తున్నారా. అదృష్టాన్ని గ్రహించి పురుషకారంతో దేవతానుగ్రహం కోసం యత్నం జరుపుతున్నాడా!

నా వియోగ బాధతో కృశించడం లేదు కదా! నన్ను ఈ రాక్షస పీడనుండి విముకంచేసే కృషిలో ఉన్నాడా! అయోధ్యలో వున్న మా అత్త కౌసల్య, ఆవిడతోపాటు సుమిత్ర ఆదిగాగల వారి క్షే
  సమాచారాలు అందుతున్నాయా!

సోదర ప్రేమగల భరతుడు నన్ను రక్షించడానికి చతురంగ బలాలు పంపుతాడా! వానరేశ్వరుడు సుగ్రీవుడు తన సర్వసేనా బలంతో నన్ను రక్షించడానికి రానున్నాడా! అస్త్రవిదుడయిన మా లక్ష్మణుడు రాక్షస సంహారానికి ఉత్సాహంతో ఉన్నాడా! రామభద్రుడు త్వరలో యిక్కడకు వచ్చి
ఈ క్రూర రావణుని సంహరిస్తాడా!

నా వియోగంవల్ల ఆయన వేసవిలో నీరింకిన చెరువులో కమలంలా శుష్కించడం లేదు కదా!

ధర్మనిష్ఠతో రాజ్యసర్వస్వం వదలి అనందంగా అరణ్యానికి వచ్చిన ఆ మహాత్ముడు భార్యావియోగంతో శోకించడం లేదు కదా!

ఆయనకూ నాకూ వున్న స్నేహం తల్లిదండ్రులతో కూడా ఉండదు. ఆయన కుశలవార్త వినడానికే నేను జీవించి ఉన్నాను సుమా, అని ఆగింది.

అప్పుడు హనుమంతుడు.

అమ్మా! ఇంతవరకూ ఆయనకు మీరెక్కడ వున్నదీ తెలియదు. తెలిసిన క్షణంలో ఆయన మా వానర, భల్లూక సేనలతో బయలుదేరి సముద్రాన్ని స్తంభింపజేసి, అడ్డువచ్చినవారిని కడతేర్చి ఈ లంకానగరాన్ని సర్వరాక్షస సమేతం నాశనం చేసి తీరతాడు.

నీ వియోగంవల్ల ఆయన సింహపు పంజాదెబ్బతిన్న ఏనుగు వలె బాధపడుతున్నాడు. ఇంక ఆ బాధ ఉండదు. త్వరలోనే రా
చంద్రుని పూర్ణచంద్రవదనం నీకు దర్శనమిస్తుంది.

స్వర్గంలో ఇంద్రుని వలె ప్రస్రవణగిరిమీద ఉన్న రామభద్రుని నువ్వు చూడగలవు. ఆయన నీ వియోగంలో, మధపానం మాంసభక్షణ వదిలేశాడు. ఆ బాధలో శరీరంమీద వ్రాలి బాధించే మశక, మక్షికాల స్పర్శకూడా తెలియడంలేదు.

నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాడు.

నీ నామస్మరణమే ఆయన కెప్పుడూ,

అందమయిన పువ్వు, మధుర
యిన ఫలం, మరేదయినా సరే మనస్సును హరించేది కనిపిస్తే చాలు 'హా ప్రియా సీతా' అని విలపిస్తాడు.

నిన్ను దగ్గరకు తెచ్చుకోవడానికే ఆయన కృషి చేస్తున్నాడు,

అని చెపుతూంటే సీతాదేవి వదనం శరత్కాల మేఘాలతో నిండిన ఆకాశంలో చంద్రబింబంలా కనిపించింది.

అనుచితం

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు మారుతి మాటలు విని అంగదుడు: సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్...