చిట్టి బొట్టు పెట్టవలె - సిరిగండలయింట పుట్టవలె
యేడుగురన్నలతోడ బుట్టవలె - ఏకచక్రముగా నేలవలె
పదుగురన్నలతోడ బుట్టవలె - పట్టభద్రుని చేపట్టవలె
మాఘపూర్ణిమయందు రథసప్తమినాడు ఈకధచెప్పి అక్షతలు వేసికొని, ఏడాదిదాకా అయిదుగురు ముత్తయిదువులకు ప్రతిదినమున బొట్టు పెట్టుకొనుచు, ఎడాది నిండిన తరువాత ఉద్యాపనము చేసికొనవలయును.
ఉద్యాపనము: అయిదుగురు ముత్తయిదువులకు తలంటి నీళ్ళుపోసి పిండివంటలతో భోజనముపెట్టి బంగారపు బొట్టుచేయించి ఐదుగురు ముత్తయిదువులకు అయిదుచుట్లు, అయిదు రవికలగుడ్డలు, దక్షణతాంబూలములిచ్చి నల్లపూసలు, లక్కజోళ్లు యివ్వవలెను.
No comments:
Post a Comment