జనమేజయు డిట్లనెను: సతీదేవి దగ్దగాగ శివుడేమి చేసెను? తనకు ప్రాణప్రియయగు సతీ విరహమును శివుడెట్లు సహించెనో తెల్పుము.
వ్యాసు డిట్లనెను : రాజా ! తర్వాత వృత్తాంతము తెల్పుటకు నాకే శక్తి చాలకున్నది.
శివుని కోపాగ్నికి ముల్లోకములందు ప్రళయమే సంభవించెను. అంత శ్రీభద్రకాళీ గణములు వెంటరాగా శ్రీవీరభద్రుడవతరించెను. వీరభద్రుడు ముల్లోకములను నాశనము చేయపూనుకొనగనే బ్రహ్మది దేవతలు శివుని శరణు వేడిరి. సతీ నాశమున సర్వనాశమైనప్పటికిని శంకరుడు దయతో వారి కభయ మొసంగెను.
మేక తలను దక్షుని మొండెమున కతికింప జేసెను. ఇట్లు దక్షుని బ్రదికించి దేవతల కభయమిచ్చి విచారగ్రస్తుడై శివుడు యజ్ఞశాలకేగి గోడున దురపిల్లెను.
పిమ్మట చిత్కళాస్వరూపిణియగు సతీదేవి యగ్నిలో దహింపబడుచుండుటగని హా సతీ! యని యామెను తన భుజముపై వేసికొనెను. ఆమెను మోసికొనుచు చలించిన మనస్సుతో శివుడు నానా దేశములు గ్రుమ్మరుచుండగ బ్రహ్మాది దేవతలు చింతాక్రాంతులైరి. వెనువెంటనే శ్రీహరి వచ్చి విల్లమ్ములుగొని సతి యవయవములు ముక్కముక్కలుగ ఛేదింపగ నవి పలుచోట్ల పడెను. ఆ బాగాలు పడినచోట్ల నెల్ల శివుడు పలురూపులుదాల్చి వెలసెను.
శివుడు దేవతల కిట్లనెను:ఈస్థానములందలి శివాదేవిని కొలవవలయును. ఆ విధముగ పరాభక్తితో దేవిని సేవించినవారికి దుర్లభమైనది లేదు. దేవినిజాంగములు పడిన తావులందెల్ల పరాంబ నెలకొనియున్నది. అట్టిస్థానములందు పురశ్చరణ చేసిన వారి మంత్రములు త్వరితగతిన సిద్ధించును.
అని ప్రకటించి శంకరుడు సతీవిరహాతురుడై ఆయా ప్రదేశాలలోనే సంచరిస్తూ జపధ్యాననమాథి నిష్టాపరుడై కాలం గడిపాడు.
వ్యాసు డిట్లనెను: జనమేజయా ! అవి ఎయే క్షేత్రాలో తెలుసుకోవాలనే ఉత్సుకత నీ ముఖంలో కనిపిస్తోంది. చెబుతాను, తెలుసుకో. వాటిని దేవీపీఠాలు అంటారు. వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం, దర్శించలేనివారు శ్రద్ధగా వింటే చాలు పాపవిముక్తులవుతారు. అవి సిద్ధపీఠాలు.
ఓ రాజా ! ఇపుడు శ్రీదేవీ పీఠముల గూర్చి వివరింతును, సావధానముగ వినుము. వానిని విన్నంతనే నరుడు సర్వపాపముక్తుడు గాగలడు. పరమసిద్ధిని విభూతిని గోరువా రేయే పీఠములందే యే నామములతో దేవి నుపాసించి ధ్యానింతురో తెలుపగలను.
ఓ రాజా ! ఇపుడు శ్రీదేవీ పీఠముల గూర్చి వివరింతును, సావధానముగ వినుము. వానిని విన్నంతనే నరుడు సర్వపాపముక్తుడు గాగలడు. పరమసిద్ధిని విభూతిని గోరువా రేయే పీఠములందే యే నామములతో దేవి నుపాసించి ధ్యానింతురో తెలుపగలను.
శ్రీ గౌరీముఖము పడినచోటు కాశి. అచట దేవిని విశాలాక్షి యందురు.
నైమిశారణ్యక్షేత్రమునందలి దేవి లింగధారిణి,
ప్రయాగలో లలిత,
గంధమాదనమున కాముకి,
దక్షిణ మానసమున కుముద,
ఉత్తర మానసమున విశ్వకామములు తీర్చు విశ్వాకామ,
గోమంతమందు గోమతి,
మందరమున కామ చారిణియై,
చైత్రరథమున మదోత్కట
హస్తినాపురమందు జయంతి,
కన్యాకుబ్జమందు గౌరి,
మలయాచలమున రంభ,
ఏకామ్ర పీఠమున కీర్తిమతి,
విశ్వమందు విశ్వేశ్వరి
పుష్కరమున పురుహూత,
కేదారమందు సన్మార్గదాయిని,
హిమాలయము వెనుక భాగమున మంద గోకర్ణమున భద్రకర్ణిక,
స్థానేశ్వరమున భవాని,
బిల్వకమున బిల్వపత్రిక,
శ్రీశైలమున మాధవి,
భద్రేశ్వరమున భద్ర,
వరాహశైలమున జయ
కమలాలయమున కమల,
రుద్రకోటియందు రుద్రాణి,
కాలంజరమున కాళి,
శాలగ్రామమున మహాదేవి,
శివలింగమున జలప్రియ
మహాలింగమున కపిల,
మాకోటమున ముకుటేశ్వరి,
మాయా పురియందు కుమారి,
సంతానమందు లలితాంబిక,
గయలో మంగళ,
పురుషోత్తమమున విమల,
సహస్రాక్షమున ఉత్పలాక్షి,
హిరణ్యాక్షమున మహోత్పల,
విపాశలో అమోఘాక్షి,
పుండ్రవరమున పాటలయని దేవిని వ్యవహరింతురు.
సుపార్శ్వమున నారాయణి
సుపార్శ్వమున నారాయణి
త్రికూటమందు రుద్రసుందరి
విపులమున విపుల
మలయాఛలమున కల్యాణి
సహ్యగిరిపై ఏకవీర
హరిశ్చంద్రమున చంద్రిక
రామతీర్థమున రమణ
యమునయందు మృగావతి
కోట తీర్థమున కోటవి
మాధవీ వనమున సుగంధ
గోదావరియందు త్రిసంధ్య
గంగాతీరమందు రతిప్రియ
శివకుండమున శుభానంద
దేవికాతటమున నందిని
ద్వారకయందు రుక్మిణి
బృందావనమున రాధ
మధురలో దేవకి
పాతాళమందు పరమేశ్వరి
చిత్రకూటమున సీత
వింధ్యాద్రిపై వింధ్యాదివాసిని
కరవీరమున మహాలక్ష్మీ
వినాయకమున ఉమాదేవి
వైద్యనాధమున ఆరోగ్య
మహాకాళమున మహేశ్వరి
ఉష్ణతీర్థమున అభయ
వింధ్యగిరిపై నితంబ
మాండవ్యమున మాండవి
మహేశ్వరీపురమున స్వాహా ఛ
గండమున ప్రచండ
అమర కంటకమన చండిక
సోమేశ్వరమున వరారోహ
ప్రభసమున పుష్కరావతి
సరస్వతిలో దేవమాత
సాగరతటమునందు పారా
వార మహాలయమున మహాభాగ
పయోష్ణిలో పింగలేశ్వరి
కృతశౌచమున సింహిక
కార్తికమున అతిశాంకరి
ఉత్పలావర్తమున లోల
శోణసంగమున సుభద్ర
సిద్ధవనమందు లక్ష్మిమాత
భరతాశ్రమున అనంగ
జాలంధరమున విశ్వముఖి
కిష్కింధపర్వతమున తార
దేవదారువనమందు పుష్టి
కాశ్మీరమండలమందున మేధ
హిమాద్రియందు భీమాదేవి
విశ్వేశ్వరీ క్షేత్రమున తుష్టి
కపాలమోచనమున శుద్ధి
కాయావరోహణమున శ్రీమాత
శంఖోద్ధారమున ధర
పిండారకమున ధృతియని శ్రీదేవికి నామములు.
చంద్రభాగయందు కళ
చంద్రభాగయందు కళ
అచ్చోదమున శివధారిణి
వేణయం దమృత
బదరియం దుర్వశి
ఉత్తరకురువులందు ఔషధి
కుశద్వీపమున కుశోదక
హేమకూటమున మన్మథ
కుముదమున సత్యవాదిని
అశ్వత్థమున వందనీయ
వైశ్రవాణాలయమందు నిధి
వేదదనమున గాయత్రి
శివసన్నిధియందు పార్వతి
దేవలోకమందింద్రాణి
బ్రహ్మముఖమందు సరస్వతి
సూర్యబింబమున ప్రభ
మాతృగణములందు వైష్ణవియని శ్రీదేవికి క్షేత్రభేదమున వ్యవహారము. సతులందురుంధతీదేవి అందకత్తెలలో తిలోత్తమ- ఎల్లరి చిత్తములందు చిత్కలాశక్తి-గ దేవి విలసిల్లుచున్నది.
ఓ జనమేజయా! ఇవి మొత్తము నూటయెనిమిది శ్రీదేవీ పీఠములు. శ్రీదేవి నామములను నూటయెనిమిదిగ ప్రసిద్ధిగాంచెను. ఈ ప్రకారముగ దేవి శరీరము నుండి యేర్పడిన దేవి పీఠములు తెల్పితిని. ఈ భూతలమందింకను ముఖ్యములైన దేవీ నిలయములు గలవు.
ఎవడీ నూట యెనిమిది దేవీ పీఠనామములు వినునో చదువునో వాడు సకల పాపముక్తుడై తుదకు దేవీసాలోక్యమందగలడు. ఈ యెల్ల పుణ్యదేవీపీఠనామములు వినునో చదువునోవాడు సకల పాపముక్తుడై తుదకు దేవీసాలోక్యమందగలడు. ఈ యెల్ల పుణ్యదేవీ పీఠములకు యాత్రజేసి తెలిసినవాడు యథావిధిగ పితరులకు సంతర్పణము శ్రాద్ధాదులాచరింపవలయును.
శ్రీభగవతికి విధివిధానముగ దేవీపూజలు జరిపి మాటిమాటికిని జగద్దాత్రియగు జగదంబను క్షమించ వేడుకొనవలయును. ఇట్లోనరించి తానొక ధన్యజీవుడనని భావింపవలయును.
రాజా! ఎల్ల బ్రాహ్మణులను భక్ష్యభోజ్యాదులతో సంతోషపఱచవలయును. బ్రహ్మచారులను బాలలను భోజనాదులచే తనుపవలయును. ఆయా క్షేత్రములందలి తక్కినవారిని చండాలాదులను తనుపవలయును. పిమ్మట వీరి నెల్లరను దేవీ స్వరూపులుగ భావింపవలయును. పూజింపవలయును. ఆ పుణ్యతీర్థములందు దానములు గ్రహింపరాదు.
తన శక్తి కొలది మాయాబీజమంత్రమునకు పురశ్చరణ చేయవలయును. మాయా బీజముతో మాయా పీఠములందు వసించు దేవేశిని పూజించవలయును. దేవీ మంత్రమును రాత్రింబవళ్లు జపించి దేవిని పూజించిన పురశ్చరణ జరుగును. దేవీ భక్తి తత్పరు డెన్నడును దేవీపూజకై ధనమునకు వెనుకముందు లాడరాదు.
తన శక్తి కొలది మాయాబీజమంత్రమునకు పురశ్చరణ చేయవలయును. మాయా బీజముతో మాయా పీఠములందు వసించు దేవేశిని పూజించవలయును. దేవీ మంత్రమును రాత్రింబవళ్లు జపించి దేవిని పూజించిన పురశ్చరణ జరుగును. దేవీ భక్తి తత్పరు డెన్నడును దేవీపూజకై ధనమునకు వెనుకముందు లాడరాదు.
ఎవడీ విధముగ ప్రీతచిత్తముతో శ్రీ దేవీ యాత్రలు జరుపునో యతని పితరులు వేయి కల్పములవఱకు మహత్తర బ్రహ్మలోకమునందు వసింతురు. అటుపిదప పరమజ్ఞానము బడసి సంసారసాగరము దాటి శ్రీమంతమగు దేవీపురమున విరాజిల్లుచుందురు. ఈ నూటయెనిమిది దేవీ నామ ములు చదివినవారు సిద్దులైరి. ప్రతియింట నివి పుస్తకరూపమున వ్రాయబడియుండ వలయును.
అచ్చోట దుష్ట-గ్రహ-మారీ-భయాదులు గలుగవు. మఱియును నిండుపున్నమనాటి సంద్రమువలె నిత్యము శాంతి సౌభాగ్యములు వర్ధిల్లును. ఈ దేవీ నామాష్టశతకము జపించువానికి లోకమున దుర్లభ మనునది లేదు. అట్టి దేవీ భక్తి పరాయణుడు కృతకృత్యుడు. ధన్యజీవనుడు. అట్టివానిని దేవీ స్వరూపునిగ నెంచి యెల్లదేవతలు నమస్కరింతురు. అతడు దేవతలచేతనే పూజింపబడును.
ఇక నరులవలన చెప్పెడి దేమున్నది! ఈ దేవీ నామాష్టశతకమును శ్రాద్ధకాలమందు పఠించినచో పితృదేవతలు తృప్తులై పరమ గతిని జెందుదురు. ఈ సిద్దపీఠము లన్నియును జ్ఞానతీర్థములు-ముక్తిక్షేత్రములు. మతిమంతుడీ దేవీసిద్దక్షేత్రములు తప్పక సేవింపవలయును. శ్రీ మహేశ్వరిని గూర్చి నీ వడిగిన గుహ్యములు గుహ్య తమముల నెల్ల నీకు వివరించితిని. ఇంకేమి విన వలతువో తెలుపుము.
తారకాసుర విజృంభణ
No comments:
Post a Comment