హిమాలయుడు శ్రీదేవితో నిట్లనెను: ఓ దేవేశీ ! ఈ భూతలమునందు శ్రీదేవీ ప్రియములు-ముఖ్యములు-పవిత్రములు-దర్శనీయములునైన పుణ్యతీర్థక్షేత్రము లెన్నిగలవో తెలుపుము. తల్లీ! ఏయే వ్రతములు దేవీమహోత్సవములు జరుపుటవలన నరుడు కృతకృత్యుడగునో యవన్నియును వివరింపుము.
శ్రీదేవి యిట్లనెను: ఓ చలిమలదొరా ! నేను విశ్వమయిని-సర్వకాల స్వరూపిణి. కనుక కంటికి కనబడుచోట లన్నియును నాదివ్యస్థానములే ఇంక నెల్లకాలములును నా మహోత్సములే. ఓ వలిమలఱేడా ! ఐనను నీమీది వాత్సల్యముచే కొన్ని పుణ్యక్షేత్రముల గూర్చి తెల్పుదును. సావధానముగ వినుము.
కోలా పురము నా మహాపుణ్యస్థానము. అందు శ్రీమహాలక్ష్మినిత్యము విలసిల్లచుండును. రెండవది సహ్యాద్రిమీది మాతృపురము గలదు. అందు రేణుకాదేవి యధిష్టించి యుండును. మూడవది తులజాపురము. అందు హింగులాదేవి విలసిల్లియున్నది. సప్తశృంగమున జ్యాలాముఖి గలదు. శాకంభరీ పరధామము-భ్రామరీస్థానము- శ్రీరక్తదంతికా నివాసము-శ్రీదుర్గాధామమును-గలవు. వింధ్యగిరిపై నున్న దేవీస్థానముత్తమోత్తమమైనది.
శ్రీమంతమైన కాంచీపురము-అన్నపూర్ణా మహాస్థానము-శ్రీభీమాదేవి మహాస్థానము-విమలాదేవిస్థానము-శ్రీచంద్రలా మహాస్థానము-శ్రీకౌశికీస్థానమును-గలవు. నీలపర్వతశిఖరమున నీలాంబరీదేవి నిలయము గలదు. శ్రీనగరమందు జాంబూనదేశ్వరీదేవి వెలయుచున్నది. గుహ్యకాళికి నేపాళము ప్రతిష్ఠా స్థానము-చిదంబరము మీనాక్షిదేవికి నిలయము. శ్రీవేదారణ్య మహాస్థానమున సుందరీదేవి-ఏకాంబర మహాక్షేత్రమున శ్రీపరా శక్తిదేవి ప్రతిష్ఠితలై యున్నారు.
చీనదేశమున మదాలసయును యోగేశ్వరీయును-నీలసరస్వతీదేవియును ప్రసిద్ధి వహించియున్నారు. శ్రీబగళాదేవి వైద్యనాధమున గలదు. శ్రీ త్రిభువనేశ్వరినగు నా పుణ్యధామము శ్రీమంతమగు మణిద్వీపమని ప్రసిద్ధి. సతీదేవి యోని మండలము పూడిన తావు కామాఖ్యా క్షేత్రము. ఇది పుణ్యక్షేత్రరాజము. మహామాయాధివాసితమగు శ్రీమత్తిప్రుర భైరవీ స్థానము. ఇచట శ్రీదేవి ప్రతినెల రజస్వల యగుచుండును. దీనిని మించిన దేవీపుణ్యక్షేత్ర మీ భూతలముల లేనేలేదు. ఇచ్చట నుత్తమదేవత లెల్లరును పర్వతరూపములు దాల్చి పర్వతముల మీదనే వాస ముందురు. ఆ క్షేత్రమందలి ప్రతిరేణువందును అణువణువందునను శ్రీదేవి విలసిల్లునని పెద్దలందురు. ఈ కామాఖ్యా యోనిమండలమును మించిన పుణ్యతీర్థము మరిలేదు.
చీనదేశమున మదాలసయును యోగేశ్వరీయును-నీలసరస్వతీదేవియును ప్రసిద్ధి వహించియున్నారు. శ్రీబగళాదేవి వైద్యనాధమున గలదు. శ్రీ త్రిభువనేశ్వరినగు నా పుణ్యధామము శ్రీమంతమగు మణిద్వీపమని ప్రసిద్ధి. సతీదేవి యోని మండలము పూడిన తావు కామాఖ్యా క్షేత్రము. ఇది పుణ్యక్షేత్రరాజము. మహామాయాధివాసితమగు శ్రీమత్తిప్రుర భైరవీ స్థానము. ఇచట శ్రీదేవి ప్రతినెల రజస్వల యగుచుండును. దీనిని మించిన దేవీపుణ్యక్షేత్ర మీ భూతలముల లేనేలేదు. ఇచ్చట నుత్తమదేవత లెల్లరును పర్వతరూపములు దాల్చి పర్వతముల మీదనే వాస ముందురు. ఆ క్షేత్రమందలి ప్రతిరేణువందును అణువణువందునను శ్రీదేవి విలసిల్లునని పెద్దలందురు. ఈ కామాఖ్యా యోనిమండలమును మించిన పుణ్యతీర్థము మరిలేదు.
శ్రీపుష్కరక్షేత్రమున శ్రీగాయత్రీదేవియు అమరేశ్వరమున చండికాదేవియు ప్రభాసమున పుష్కరేక్షిణియు వెలయు చుందురు. శ్రీలింగధారిణీదేవికి నైమిశమును పురుహూతాదేవికి పుష్కరాక్షమును-రతీదేవి కాషాఢమును-నివాసస్థానములు. చండముండా మహాస్థానమున దండినీ పరమేశ్వరియును-భారభూతియందు మహాభూతియును-నాకు లేశ్వరమున నాకులి యును పేరు గాంచిన దేవతలు.
హరిశ్చంద్రపురి శ్రీ చంద్రికకు-శ్రీగిరి శాంకరికి-జప్యేశ్వరి త్రిశూలకు-ఆ మ్రాతకేశ్వరము సూక్ష్మాదేవికిని-నివాసములు. శ్రీశాంకరి యుజ్జయినిలోను-శర్వాణిమధ్య మేశ్వరములోను శ్రీమార్గదాయినీదేవి కేదారమహాక్షేత్రములోను వెలసి యొప్పుచున్నారు.భైరవ స్థానమున భైరవీదేవియును-శ్రీగయాక్షేత్రమున మంగళాదేవియును-కురుక్షేత్రమున స్థాణుప్రియయు-మాకులమున స్వాయంభువియు-శోభిల్లుచున్నారు. ఉగ్రాదేవి కనఖలమున-విశ్వేశి విమలేశ్వరమున - మహానంద ఆట్టహాసమున-మహాంతక మహేంద్రమున-వెలసిన దేవతలు.
భీమపురి భీమేశ్వరికి-వస్త్రాపథము భవానిశాంకరికి-అర్థకోటి రుద్రాణికి-వన్నెగాంచిన దేవీధామములున. శ్రీవిశాలాక్షీదేవి కాశియందు-మహాభాగ మహాలయమున-భద్రకర్ణి గోకర్ణమున భద్రాస్య భద్రకంటకమున ప్రసిద్ధ దేవతలు. సువర్ణాక్షమందుత్పలాక్షీదేవియు-స్థాణుక్షేత్రమున స్థాణీశ్వరీదేవియు-కమలాలయమందు కమలయు-ఛగలండమందు ప్రచండయును-విరాజిల్లు దేవీరత్నములు.
త్రిసంధ్యాదేవి కురండలక్షేత్రమున-మకుటేశ్వరి మహాకోటమున-శాండకి మండలేశ్వరమున-కాళిక కాలంజరమున వెలసిన దేవతలు. శంకుకర్ణములో ధ్వని-స్థూలకేశ్వరములో స్థూల-జ్ఞానుల హృదయకమలమందు హృల్లేఖా ప్రాణశక్తి-దేవతలు విలసిల్లుచున్నారు.
నగపతీఃఇటుల శ్రీదేవికి ప్రియతమములైన పుణ్యస్థానము లన్నియును నీకు చెప్పబడినవి. ఆయా క్షేత్ర మహాత్మ్యములు వినవలయును. నేను చెప్పిన విధానమున శ్రీదేవిని పూజింపవలయును. ఎల్ల పుణ్యక్షేత్రములు శ్రీకాశీక్షేత్రమం దుండును. శ్రీదేవివీ భక్తి పరాయణుడు నిత్యమాయాదేవి పుణ్యధామములు దర్శించుచు శ్రీదేవిని నిరంతరము జపింపవలయును. దేవీ దివ్యచరణ కమలములు ధ్యానించుచున్నవాడు సంసారఘోరబంధములనుండి విముక్తుడగును.
ఈ దివ్యదేవి నామములును క్షేత్రములు నుదయమున మేల్కొంచి చదువవలయును. వీనిని చదివినవాని పాపరాసు లెల్లను భస్మీపటలము జెందును. వీనిని శ్రాద్దకాలమున బ్రాహ్మణ సన్నిధిలో నిర్మలాత్మతో చదువవలయును.
అట్లు చదివినవానిపాపరాసు లెల్లను భస్మీపటలము జెందును. వీనిని శ్రాద్ధకాలమున బ్రాహ్మణసన్నిధిలో నిర్మలాత్మతో చదువవలయును. అట్లు చదివినవాని పితరులు విముక్తులై పరమగతి జెందురు.
No comments:
Post a Comment