Thursday, April 23, 2026

Dakshudu Chesina Aparadham - దక్షుడు చేసిన అపరాధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దక్షుడు చేసిన అపరాధం

ఒకప్పుడు దుర్వాసమహర్షి జంబూనదీతీర మేగి యచట వెలసిన శ్రీదేవిని సందర్శించి శ్రీమాయాబీజము నచట జపించెను. అంతట శ్రీదేవేశ్వరి ప్రసన్నయై పూలజుంటి తేనియలకు తిరుగాడు గండుతుమ్మెదలుగల తన మెడలోని పూలదండ ముని కిచ్చెను. ముని దానిని దేవిప్రసాదముగ గ్రహించెను. తాపసు డాకాశమార్గమున బయలుదేరెను.

అతడు సతి తండ్రియగు దక్షుడున్నచోటి కరిగెను. అట జగదంబను దర్శించి యామె పాదపద్మములకు నమస్కరించెను. ఆ పూమాల జూచి 'యిదెవరది? మానవ దుర్లభమైన యిదినీ కెట్లు లభించెనని దక్షుడనెను. దక్షుని మాటలు విని కన్నుల ప్రేమాశ్రులు నిండ 'నిది శ్రీదేవి ప్రసాద' మని డగ్గుత్తికతో ముని పలికెను. దానిని తన కిమ్మని సతి తండ్రియగు దక్షడు ముని నడిగెను. 

శక్తి భక్తులకు ముల్లోకములం దీయరానిది లేదు. అని తలంచి ముని దేవి పుష్పమాలను దక్షున కొసంగెను. దక్షుడు దానిని తన తలపై దాల్చి యింటి కేగెను. ఆ రేతిరి దాని నతడు దంపతుల మెత్తని పానుపుపై నుంచెను. దాని పరిమళములు మూర్కొనుచు దక్షదంపతులు రతియందు సుఖించిరి. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా అతడి మనస్సులో శంకరుడిపై ద్వేషం రగిలింది. ఆల్లుడిమోద కోపం ఆత్మజమోదకు కూడా ప్రసరించింది.

తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడినుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి అహుతి ఇచ్చింది సతీదేవి. అటుపైని ఆ దివ్యతేజన్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీనామధేయంతో పరిఢవిల్లింది - అని చెప్పి ఒక్క క్షణం ఆగేడు వ్యానహర్షి వెంటనే జనమేజయుడు

108 శక్తిపీఠాలు

No comments:

Post a Comment

Devatakrta Devistuti - దేవతాకృత దేవీస్తుతి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవతాకృత దేవీస్తుతి ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించిరి. వారికనులనిండ నందబాష్ఫములు నిండగ నోట...