శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట
బ్రహ్మ యిట్లనియె: ఆ జనార్దనుడు మరల నీ విధముగ నుద్బోధించెను. 'మన మెల్లరమిపు డీ దేవి సన్నిధి కరిగి యా తల్లి పదపద్మముమీద పదేపదే మన తలలుంచుదము. ఈ మహామాయ మన కోరిన కోరిక లెల్ల తీర్చగలదు. మన మీ దేవి సమక్షమునకేగి నిశ్చింతగ నామెను సన్నుతించుదము. ఒకవేళ ద్వారపాలురు మనల నడ్డగించినచో మన మచటనే నిలుచుండి తదేకచిత్తముతో శ్రీమహాదేవీ స్తోత్రము పఠించుదము.' ఈ ప్రకారముగ విష్ణువు పలికినమీదట మేమందఱము హర్షము వెలిపుచ్చి ఆ జగదంబ సన్నిధానమున కేగదలంచితిమి. మేము విమానము దిగి శంకించుచునే దేవిద్వారము చెంత కేగితిమి.
మేము ద్వారము ముందునకు జేరగనే దేవి మమ్ము చూచి చిరునగవు నగి మమ్ము స్త్రీ రూపిణులుగ మార్చెను. మేమంతట సురూపములతో చెలగు చక్కని పడుచుకన్నెలమైతిమి. మా రూపములు చూచుకొని మాలో మే మాశ్చర్య మందుచు శ్రీదేవి సమక్షమున కేగి ఆ యతిలోకసుందరాంగి పదకమలముల మ్రోల స్త్రీరూపములతోనే మేము నిలుచుంటిమి. ఆ దేవి మమ్ము ప్రేమపూర్ణమైన చూపులతో గాంచెను. స్త్రీ రూపిణులమగు మే మా మహాదేవికి భక్తిప్రపత్తులతో వినయాంజలు లర్పించి ఒకరి మొగము లొకరము చూచుకొంటిమి. ఆ శ్రీదేవి పాదపీఠము నానా మణిగణ విభూషితము సూర్యకోటి ప్రతీకాశమునై కాంతులు విరజిమ్ముచుండెను. మే మా మణిపీఠమును నేత్రపర్వముగ దర్శించుచు కైమోడ్చి నిలుచుంటిమి.
ఆ దేవి సన్నిధానమునందు దేవి చెలికత్తియలు వేనకువేలు గలరు. వారిలో గొందఱు రక్తాంబరములు కొందరు పీతాంబరములు దాల్చిరి. ఆ జ్యోతిర్మయులగు దేవతలెల్లరు విచిత్ర వస్త్రభూషణములు దాల్చి శోభలు వెలార్చుచు ఆ శ్రీమాతను జేరి సంసేవించుచుండిరి. కొందఱు నర్తించుచుండిరి. ఇంక కొందఱు దేవి నుపాసించుచుండిరి. ఇతరుల హృదయములు పులకరింప మధురముగ వీణలు మీటిరి. వేణువులూదిరి.
ఆ దేవి సన్నిధానమునందు దేవి చెలికత్తియలు వేనకువేలు గలరు. వారిలో గొందఱు రక్తాంబరములు కొందరు పీతాంబరములు దాల్చిరి. ఆ జ్యోతిర్మయులగు దేవతలెల్లరు విచిత్ర వస్త్రభూషణములు దాల్చి శోభలు వెలార్చుచు ఆ శ్రీమాతను జేరి సంసేవించుచుండిరి. కొందఱు నర్తించుచుండిరి. ఇంక కొందఱు దేవి నుపాసించుచుండిరి. ఇతరుల హృదయములు పులకరింప మధురముగ వీణలు మీటిరి. వేణువులూదిరి.
ఓ దేవర్షీ! ఇంతయేల? అచట మేముగన్న మహాద్భుతము వక్కాణింతును వినుము. ఆ విశ్వజనని పదకమలములందలి నఖములనెడి చరణములలో చరాచరమైన బ్రహ్మాండములు విష్ణువు రుద్రుడు నేను రవి వహ్ని యముడు వాయువు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు మున్నగు దిక్పతులు పర్వతాలు సాగరాలు నదులు అప్సరసలు విశ్వావసువు చిత్రకేతువు శ్వేతుడు చిత్రాంగదుడు నారద తుంబురులు అశ్వినులు వసువులు సిద్ధులు సాధ్యులు పితరులు శేషాదినాగులు కిన్నరులు రాక్షసులు బ్రహ్మలోకము వైకుంఠము పర్వతోత్తమమైన కైలాసము సమస్తము ప్రతిబింబించుచుండెను. నేను నా జన్మకారణమగు మహా పద్మమును ఆ పద్మమందున్న బ్రహ్మను శేషశాయి యగు శ్రీహరిని మధుకైటభులను గంటిని. ఇట్లా జగదంబ పదకమలముల కొనగోళ్ల వెల్గులందు సర్వవిశ్వముగని యెంతకు నంతుపట్టనివింతతో నే నాశ్చర్యమందితిని. శివవిష్ణువులును విస్మయ భరితులైరి. మేమంత నాదేవిని విశ్వమాతగ నొక్కుమ్మడిగ నంగీకరించితిమి. ఆ ప్రకారముగ నా యమృత కాంతులీను ద్వీపమందు మేము స్వేచ్ఛగ విహరించితిమి. ఆ దేవి మహనీయత గనుటలో మాకు నూరేండ్లు నిండెను. అచట మేలిమి సొమ్ములతో జిగజిగమని మెఱయుచు ప్రమోదమందుచున్న దేవాంగనలు మమ్ము తమ చెలికత్తియలుగ చూచుకొనిరి. మేమును వారి యందచందములకు లీలావిలాస వినోదములకు విభ్రాంతులమై సంతసిల్లి లోలోన వారి దివ్యభావములు దలపోయుచుంటిమి.
అప్పుడొకసారి స్త్రీ రూపమందున్న శ్రీ విష్ణువా శ్రీ త్రిభువనేశ్వరీదేవిని గూర్చి యిట్లు మహాద్భుతముగ స్తోత్రము చేయదొడగెను:
అప్పుడొకసారి స్త్రీ రూపమందున్న శ్రీ విష్ణువా శ్రీ త్రిభువనేశ్వరీదేవిని గూర్చి యిట్లు మహాద్భుతముగ స్తోత్రము చేయదొడగెను:
శ్రీదేవికి ప్రకృతి విధాత్రి అమృతత్వ రూప కల్యాణి కామద వృద్ధి-సిద్ధి-శ్రీ సచ్చిదానంద స్వరూపిణి సంసారారణి పంచకృత్య విధాత్రి త్రిభువనేశి అగు దేవికి నమస్సులు. సర్వాధిష్ఠాన స్వరూప కూటస్థ అర్ధమాత్రార్థ రూప హృల్లేఖ అగు దేవికి వినయాంజలులు సమర్పింతును. జనయిత్రీ! ఈ విశ్వబ్రహ్మాండములు నీయందుండి యుద్భవించి నీవలన నెలవైయుండి మరల నీయందే లయమగునని నే నెఱింగితిని. ఇవి అన్నియు చేయు విధాత ప్రభావము నీ శక్తికే కలదనియు సకల లోకమయి వనియు నెరింగితిని. ఆకాశ వాయువులు నీ సద్రూపములు అమూర్తములు. అగ్ని జల భూములు నీ యసద్రూపములు మూర్తములు. వీనినన్నిటిని నీవు జీవరూపుడైన పురుషునకు తగిన సమయమున జూపింతువు. నీవు మా సంతోషమునకు పదారు సాంఖ్యతత్త్వములను నేడు మహదాదులను కల్పింతువు. ఇదంతయు నీ యింద్రజాలమని మాకు భాసించుచున్నది. నీ యనుగ్రహశక్తి లేనిచో నెంత వస్తువైనను చలింపదు. నీ చైతన్య శక్తియే యెల్ల పదార్థములందు నిండి నిబిడీకృతమై యున్నది. నీ శక్తిలేనిచో పురుషుడుగూడ శక్తిరహితుడే యగునని ధీమంతులు వచింతురు. నీవేనీ చైతన్య ప్రభావమున విశ్వమంతటిని ప్రకాశ శక్తితో నింపుదువు. నీ విశ్వాత్మ తేజముతో సమస్తమును వెల్లడి చేయుదువు. కల్పాంతమందీ విశ్వము నంతమొందింతువు. ఇట్టి నీ యద్భుత చరిత్ర వైభవమెవ్వడెఱుగగలడు? జననీ ! భవానీ ! అలనాడు మధుకైటభుల బారినుండి మమ్ము బ్రోచితిని. మాకు దయతో నీ విశాల దివ్యలోకములు జూపితివి. మమ్ము దివ్యానంద ధామములకు జేర్చితివి. నీ దివ్యదర్శనము మహా ప్రభావసంపన్నమైనది. తల్లీ! బ్రహ్మయు శివుడును నేనును నీ దుర్విభావ్యమైన పవిత్రచరిత్రము తెలిసికొనలేకున్నాము. ఇంక సామాన్యుడేమి తెలిసికొనగలడు? నీ విశ్వరచనా కళా కలాపమునందెన్నెన్ని భువనాలు రవణిల్లుచున్నవో చెప్పగలవాడెవ్వడు?
మే మీ భువనమునందు ప్రసిద్ధ ప్రభావములుగల హరిహరబ్రహ్మలను గంటిమి. ఈ త్రిమూర్తు లితర లోకాలలో గూడ నుందురా యేమి? మనోవాక్కుల కందని నీ విచిత్ర ప్రతిభా ప్రభావ సంపదలు మా కేనాటికి నంతుజిక్కుటలేదు. ఈ మా దీనులదొకే యొక విన్నపము అవధరింపుము. ఆనందనిలయమగు నీ దివ్యమంగళ విగ్రహము మా హృదయ పీఠములందు నిచ్చలు నివాళులందుకొననిమ్ము. నీ హ్రీంకారతారక నామామృతము తనివితీర మా నాల్కలపై నిత్యము ప్రవహింపనిమ్ము. నన్ను నీ దాసునిగ భావించుము. నిన్ను నా స్వామినిగ నేలికగ నెమ్మదిలో నిత్యము దలంతును. ఇట్టి తల్లికొడుకుల ప్రేమలు తెగకుండనిమ్ము. మమ్ము నీ కన్నబిడ్డలవోలె గాపాడుము. జగన్మాతా! ఈ యెల్లభువనముల రహస్యము నీకే తెలియును. నీవు సర్వజ్ఞవు. సర్వము నీయందే పరిసమాప్తమగును. నేను వట్టి పామరుడను. నీకు చెప్పగలవాడను గాను. నీవు మాకేది యుక్తమని తోచునో దానినే యొనరింపుము. బ్రహ్మ యీ లోకాలను పుట్టించును, విష్ణువు బ్రోచును, రుద్రుడు సంహరించునను నానుడి జగములందు ప్రసిద్ధమై యున్నది. ఇదంతయు నిజమేనా? ఏది యేమైన మేము మాత్రము నీ దివ్యశక్తితో యుక్తులమై నీ యిష్టప్రకారము వ్యవహరించువారము. పార్వతీ! ఈ సమస్తమును భూమి మోయుటలేదు. నీ ఆధారశక్తియే సర్వభారమును మోయుచున్నది. ఆ సూర్యుడుగూడ నీ స్వయంప్రకాశము గ్రహించియే జగములు వెలిగించుచున్నాడు. ఇటులెల్లవేళల నెల్లెడల నీవే నిర్మల రూపమున ప్రతిభాసించుచున్నావు.
ఓ జననీ! బ్రహ్మ శివుడు నేను నీ సత్ప్రభావమువలన నీ దయవలన జన్మించితిమి. మే మనిత్యులము. ఇక శతక్రతువగు నింద్రాదులు నిత్యు లెట్లగుదురు? నీవే సత్యవు; నిత్యవు; పురాణ ప్రకృతివి. శాశ్వతవు. నీవే పురాణపురుషుని కనికరింతువను సంగతి యిన్నాళ్లు నీ సామీప్యమున నండుటవలన గ్రహింపగలిగితిని. తెలియని ప్రతివాడును నన్నే విభుడని యాద్యుడని యీశుడని నిరీహుడని విశ్వాత్ముడని తలచి యహంకారమయమైన తమఃప్రకృతి గలవాడగును. పండితుల యందలి విద్య శక్తిమంతులయందలి శక్తి మనుజలోకమందలి కీర్తి-కాంతి-తుష్టి నీవే. ముక్తిప్రదవు కమలవు విశ్రాంతి ప్రదాయినివి నీవే. వేదమాతయగు గాయత్త్రి అర్ధమాత్ర స్వాహా స్వధా భగవతియగు సగుణనీవే. దేవతలు మొదలగు జీవుల బ్రతుకుదెరువునకు నీవే వాదాలు నిర్మించితివి. ఎల్లజీవులు నీ యనుగ్రహమునకు పాత్రులై తరించుటకే నీ వీ ప్రపంచములను లీలగ సృజింతువు. అనాదినిధనుడు అనఘుడు పరిపూర్ణుడునైన పరమాత్మయొక్క యంగమే యీ జీవాత్మ. ఈ సకలమును తుదకు నీవే యంతమొందింతువని నీ మహామహిమ నెఱింగిన జీవుడు శాంతుడగును. చమత్కారమయమైన నాటకమందొక నటుడాడి యాడి తుదకు విశ్రమించును. ఈ జీవులందఱు నటులే చివరకు నీ చెంతనే విశ్రమింతురు. ఈ కాలము సుఖదుఃఖములతో దాగుడుమూత లాడును. ఈ దుఃఖదాయకమైన కాలమునుండి మోహసాగరమునుండి మమ్ము వెన్నంటి గాపాడుము. తల్లీ! మేము నీ శ్రీచరణములకు శరణార్థులము. మహావిద్యా! శివస్వరూపా! సర్వార్థప్రదాయినీ! దేవాధిదేవీ! నీ పదకమలములమీద మా తలలుంతుము. మమ్మీ మోహసాగర మీద నిమ్ము. నీ విజ్ఞానమను వెలుగుబాట చూపుము. మము బ్రోచు భారము నీదే!
అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
మే మీ భువనమునందు ప్రసిద్ధ ప్రభావములుగల హరిహరబ్రహ్మలను గంటిమి. ఈ త్రిమూర్తు లితర లోకాలలో గూడ నుందురా యేమి? మనోవాక్కుల కందని నీ విచిత్ర ప్రతిభా ప్రభావ సంపదలు మా కేనాటికి నంతుజిక్కుటలేదు. ఈ మా దీనులదొకే యొక విన్నపము అవధరింపుము. ఆనందనిలయమగు నీ దివ్యమంగళ విగ్రహము మా హృదయ పీఠములందు నిచ్చలు నివాళులందుకొననిమ్ము. నీ హ్రీంకారతారక నామామృతము తనివితీర మా నాల్కలపై నిత్యము ప్రవహింపనిమ్ము. నన్ను నీ దాసునిగ భావించుము. నిన్ను నా స్వామినిగ నేలికగ నెమ్మదిలో నిత్యము దలంతును. ఇట్టి తల్లికొడుకుల ప్రేమలు తెగకుండనిమ్ము. మమ్ము నీ కన్నబిడ్డలవోలె గాపాడుము. జగన్మాతా! ఈ యెల్లభువనముల రహస్యము నీకే తెలియును. నీవు సర్వజ్ఞవు. సర్వము నీయందే పరిసమాప్తమగును. నేను వట్టి పామరుడను. నీకు చెప్పగలవాడను గాను. నీవు మాకేది యుక్తమని తోచునో దానినే యొనరింపుము. బ్రహ్మ యీ లోకాలను పుట్టించును, విష్ణువు బ్రోచును, రుద్రుడు సంహరించునను నానుడి జగములందు ప్రసిద్ధమై యున్నది. ఇదంతయు నిజమేనా? ఏది యేమైన మేము మాత్రము నీ దివ్యశక్తితో యుక్తులమై నీ యిష్టప్రకారము వ్యవహరించువారము. పార్వతీ! ఈ సమస్తమును భూమి మోయుటలేదు. నీ ఆధారశక్తియే సర్వభారమును మోయుచున్నది. ఆ సూర్యుడుగూడ నీ స్వయంప్రకాశము గ్రహించియే జగములు వెలిగించుచున్నాడు. ఇటులెల్లవేళల నెల్లెడల నీవే నిర్మల రూపమున ప్రతిభాసించుచున్నావు.
ఓ జననీ! బ్రహ్మ శివుడు నేను నీ సత్ప్రభావమువలన నీ దయవలన జన్మించితిమి. మే మనిత్యులము. ఇక శతక్రతువగు నింద్రాదులు నిత్యు లెట్లగుదురు? నీవే సత్యవు; నిత్యవు; పురాణ ప్రకృతివి. శాశ్వతవు. నీవే పురాణపురుషుని కనికరింతువను సంగతి యిన్నాళ్లు నీ సామీప్యమున నండుటవలన గ్రహింపగలిగితిని. తెలియని ప్రతివాడును నన్నే విభుడని యాద్యుడని యీశుడని నిరీహుడని విశ్వాత్ముడని తలచి యహంకారమయమైన తమఃప్రకృతి గలవాడగును. పండితుల యందలి విద్య శక్తిమంతులయందలి శక్తి మనుజలోకమందలి కీర్తి-కాంతి-తుష్టి నీవే. ముక్తిప్రదవు కమలవు విశ్రాంతి ప్రదాయినివి నీవే. వేదమాతయగు గాయత్త్రి అర్ధమాత్ర స్వాహా స్వధా భగవతియగు సగుణనీవే. దేవతలు మొదలగు జీవుల బ్రతుకుదెరువునకు నీవే వాదాలు నిర్మించితివి. ఎల్లజీవులు నీ యనుగ్రహమునకు పాత్రులై తరించుటకే నీ వీ ప్రపంచములను లీలగ సృజింతువు. అనాదినిధనుడు అనఘుడు పరిపూర్ణుడునైన పరమాత్మయొక్క యంగమే యీ జీవాత్మ. ఈ సకలమును తుదకు నీవే యంతమొందింతువని నీ మహామహిమ నెఱింగిన జీవుడు శాంతుడగును. చమత్కారమయమైన నాటకమందొక నటుడాడి యాడి తుదకు విశ్రమించును. ఈ జీవులందఱు నటులే చివరకు నీ చెంతనే విశ్రమింతురు. ఈ కాలము సుఖదుఃఖములతో దాగుడుమూత లాడును. ఈ దుఃఖదాయకమైన కాలమునుండి మోహసాగరమునుండి మమ్ము వెన్నంటి గాపాడుము. తల్లీ! మేము నీ శ్రీచరణములకు శరణార్థులము. మహావిద్యా! శివస్వరూపా! సర్వార్థప్రదాయినీ! దేవాధిదేవీ! నీ పదకమలములమీద మా తలలుంతుము. మమ్మీ మోహసాగర మీద నిమ్ము. నీ విజ్ఞానమను వెలుగుబాట చూపుము. మము బ్రోచు భారము నీదే!
అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment