Monday, April 6, 2026

Amaravati - Amaralingeswara Swamy - అమరావతి - అమరేశ్వరుడు

అమరావతి - అమరేశ్వరుడు

పంచారామాలలో ఒకటైన అమరారామం 
అమరావతి

అమరావతి చరిత్ర
నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆ నాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీతీరమగుటచేత సారవంతమైన భూమి వున్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృధ్ధి చెందింది. 15 అడుగుల ఎత్తైన తెల్లటి పాలరాతి శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఈ క్షేత్రాన్ని అమరారామం అని కూడా పిలుస్తారు, 

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు, ఆయన కాలంలోనే అమరావతి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి.

పంచారామ క్షేత్రం: అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో (అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, కుమారారామం) ఒకటైన అమరారామం.

అమరావతి విద్యా విషయంలో కూడా చాలా ప్రసిధ్ధికెక్కింది. ఆచార్య నాగార్జునుడు స్ధాపించిన విశ్వ విద్యాలయంలో చైనా, జపాను, టిబెట్టు, సింహళ దేశాలనుంచి వచ్చిన విద్యార్ధులు విద్యని అభ్యసించేవాళ్ళు. ఇలాంటి విద్యాపీఠాలు ఇంగా వున్నందువల్ల విద్యనభ్యసించేవారి సంఖ్య వేలలో వుండేది. వాటి నిర్వహణ, విద్యార్ధుల వసతి, భోజనాలన్నీ రాజులే ఏర్పాటు చేయించారు. తర్వాత ధాన్యకటకం నుంచి శ్రీ కొండకి విద్యాపీఠాన్ని మార్చి ఆ కొండకు నాగార్జున కొండ అని, ఆవిద్యా పీఠానికి నాగార్జున విద్యాపీఠమని పేరు పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి అనేక కానుకలు ఇచ్చారు.

స్థల పురాణం
పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఈ దేవాలయంలోని శివలింగాని దేవతలరాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. 

ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.

త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. 

పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం.

శివలింగం: ఇక్కడి శివలింగం చాలా ఎత్తుగా (సుమారు 15 అడుగులు) ఉంటుంది. లింగం పైభాగం వద్ద ఉన్న శిలా ముక్కను రాక్షస రాజు తారకాసురుడు విరగ్గొట్టడంతో, ఆ ముక్కపై ఆత్మలింగం ఆవిర్భవించిందని ఇంకో పురాణ కథనం.

అమ్మవారు: స్వామివారికి ఇక్కడ బాలా చాముండికా దేవి అమ్మవారిగా కొలువై ఉన్నారు.

ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా వుండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి, ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూవుంటారు. ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రనిరంగు మరక ఉంది. ఆ మరకే రక్తపు మరక శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలమీద కొట్టడంజరిగింది.

శివలింగంపైభాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికీ ఆ రక్తపు మరక ఉంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించాడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

ఆలయ విశేషాలు
ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నాయి. 

రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. 

మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. 

భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.


పర్యాటకం: అమరావతిలో అమరేశ్వరాలయంతో పాటు పురాతన బౌద్ధ స్థూపాలు, కృష్ణా నది ఘాట్‌లు కూడా ఉన్నాయి.

సందర్శనకు ఉత్తమ సమయం: మహాశివరాత్రి (ఫిబ్రవరి/మార్చి) మరియు నవరాత్రి ఉత్సవాలు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

No comments:

Post a Comment

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను...