ఊర్వశీ పురూరవుల చరిత్ర
ఆ విదముగ సుద్యుమ్నుడు దివికేగెను. ఇటు భువిపై సుగుణవంతుడు ప్రజారంజకుడు సుందరుడునగు పురూరవుడు రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్ఠాన పురమందు సర్వసమ్మానితుడై రాజ్యమేలు చుండెను. అతడు ధర్మజ్ఞుడు. ప్రజా పాలన దక్షుడు. అతని మంత్రశక్తి ఇతరుల కెఱుక పడక రహస్యముగ నుండెను. అతని యుత్సాహ ప్రభుశక్తులును శ్రేష్ఠములైనవి. సామదానాదులారాజు వశమందుండెను. అతడు చక్కగ వర్ణాశ్రమ ధర్మములు పాటించుచు ఏలుబడి సాగించు చుండెను. ఆ నరపతి యొక్క నిరూప సుగుణ సందలను విక్రమౌదార్యములను గుఱించి ఊర్వశి విని రాజునందు అనురక్త యయ్యెను. బ్రహ్మశాపమున మనుజ రూపమున భువికి దిగివచ్చి ఆ నరపతి సుగుణాలగని యని యెఱింగిన యూర్వశి అతనితో ఇట్లు పలికెను :
"ఈ మేకల జంట నీయొద్దనుంతును. నీవు దీనిని కాపాడుము. నేను నిన్నుచేరి వర్తింతును. నాకాహారము నేయి మాత్రమే, ఇంకేదియు నారగించను. మైథున సమయమున గాక మరెప్పుడు నిన్ను దిసమొలతో నుండగ చూడను. ఇది నా నియమము. నా యీ నియమమును భంగమొనర్చినప్పుడు నేను నిన్ను వదలి వెళ్ళుదును." రాజా కామిని పలుకుల నొప్పుకొనెను. ఆ యూర్వశియు తన శాపము దీఱునందాక నతనిని గూడి విహరించు చుండెను. రాజును తొంటి ధర్మకర్మముకు స్వస్తి చెప్పి ఊర్వశీ మద మోహితుడై పెక్కులేండ్లూర్వశితో నుండెను. ఆ పుడమిఱడట్లు తీరని మోహాతిరేకమున నొక్క నిముసమేని వదలిపెట్టక యావరారోహ మీద మరులు గొని యుండెను.
ఇట్లు పెక్కులేండ్లు గడచెను. ఎంతకునూర్వశి స్వర్గసీమను జేరుటలేదు. అంత దేవరాజింద్రుడు గంధర్వులతో నిట్లు పలికెను :
ఇట్లు పెక్కులేండ్లు గడచెను. ఎంతకునూర్వశి స్వర్గసీమను జేరుటలేదు. అంత దేవరాజింద్రుడు గంధర్వులతో నిట్లు పలికెను :
"ఓ గంధర్వులారా! మీరు రాజునింట గల మేకల జంటను అపహరించుటద్వారా ఊర్వశిని తీసికొనిరండు. ఊర్వశి లేని యింద్ర సభ ఏమియు శోభించుట లేదు. కావున నెటులేని ఊర్వశినిటకు కొనిరండు. ఇంద్రుని వాక్యములు విని విశ్వావసువు మున్నగు గంధర్వులు కటిక చీకటిలో రాజున్నచోటి కరిగిరి. ఊర్వశి పురూరవునితో కూడి యుండగా గంధర్వులు మేకలనుగొని నింకికెగసిరి. ఆ మేకలు మేమే యని యరచినవి. వాని యర వూర్వశికి తన కొమరుల యేడ్పువలె వినబడెను. అపుడామె కోపమున రాజుతో రాజా! నీతో మున్ను నేను ప్రతిన జేసితిని. ఆ ప్రతిన నేడు భగ్నమైనది. నీయందు నాకు నమ్మకము దొలగినది. ఈ మేకలు నాకు పుత్ర సమములు. వానిని దొంగ లపహరించిరి. ఐనను నీవు స్త్రీవలె నిద్రించుచున్నావు. నీవు శూరమానివి. కునాథుడవు. నీచేత నేను వంచింపబడితిని. నాకు ప్రాణ నమములగు మేకలు పోయినవి అని వాపోవుచు పలుకుచు వెడలి పోవుచుండెను. రాజోపలేని మోహావేశమున దిగంబరముగ నామెను వెనుదగిలెను. అదే సమయమని గంధర్వులా రాజమందిరమున తళుక్కను మెఱుపు మెఱసిరి. అపుడూర్వశి దినమొలతో నరుగుదెంచు రాజును జూచినది. గంధర్వులా మేకలను త్రోవలోనే వదలి వెళ్ళిరి. దిగంబరుడగు ఆ చక్రవర్తి యా మేకలను గొని తన యింటి మొగము పట్టెను. తన పతి నగ్నుడుగ నుండగగాంచి యావరవర్ణిని రాజును వీడ్కొనినది. తన్ను విడనాడి వెళ్ళిన యూర్వశీ మోహమున పరవశుడై రాజు బిట్టు వలవరించెను. రాజు నూర్వశి మీది ప్రకామమోహమున విహ్వలుడై దిగులొందుచు రోదించుచు దేశ దేశములు గుమ్మరు చుండెను.
ఇట్లా భూపతి భూమియందెల్లెడల పరిభ్రమించుచు తుదకు కురుక్షేత్రమునందు మరల నూర్వశిని గాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో నామెకిట్లనియెను :
ఇట్లా భూపతి భూమియందెల్లెడల పరిభ్రమించుచు తుదకు కురుక్షేత్రమునందు మరల నూర్వశిని గాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో నామెకిట్లనియెను :
'కఠినురాలా ! కాంతా ! నిలునిలుము. నేను పాపమెఱుగని వాడనే! నీ ప్రియకాంతుడనే! ఏనీకు వశ్యుడనే! నిన్నే నమ్ముకొని యున్నాడనే! నన్ను నీవు విడనాడి యెట్లు వెళ్ళితివి? నీవే నన్ను వదలి వెళ్ళినచో నా మేనిచ్చోటనే పడిపోగలదు. కాకులు, తోడేళ్ళు నన్ను కడుపార నారగించును,'
ఈ రీతిగ రాజ కామార్తుడై కృపణుడై వివశుడై శ్రాంతుడై దిక్కులేని పక్కిచందమున బావురుమని యేడ్చెను. అపుడూర్వశి రాజుతో నిట్లనెను :
"ఓ నృపశార్దూలా! నీవు మూఢుడవైతివి. నీ జ్ఞానమేమైనది? స్త్రీలతోడి చెలిమి తోడేళ్ళతోడి చెలిమియే. అది తగదు. రాజెప్పుడును దొంగలను స్త్రీలను నమ్మియుండరాదు. కనుక నీవిక నింటికేగి దిగులుమాని సుఖముండుము," అని యిట్లెంతగ నూర్వశి యూరడించినను రాజు మోహాతిరేకమును వదలకుండెను. ఆ స్వైరిణి యొక్క వలపు తమిన రాజు కట్టుబడెను. కాన నతిశోకార్తుడయ్యెను. ఈ విధముగ మీకూర్వశీ పురూరవుల చరిత్ర సంక్షేపముగ చెప్పితిని. ఇది వేములందు విస్తరించి యభివర్ణింపబడినది.
అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము
పంచాంగం
అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము
No comments:
Post a Comment