జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట
సూతుడిట్లనియెను : జనకుడు తన గురుపుత్రుడగు శ్రీ శుకుని రాకవిని శుచియై మంత్రిపురోహితులనుగూడి యతని సన్నిధికేగి అతనికి తగిన యాసనమొసంగి పూజించి పాడియావునొసంగి క్షేమసమాచారము లడిగెను. శుకుడును రాజపూలందుకొని తన కుశలము తెలిపి రాజు క్షేమముగూర్చి యడిగెను. కుశలప్రశ్నల పిదప తన యాసనమున స్మాత్మశాంతితో సుఖముగ గూరుచున్న శుకునికాంచి, మనిసత్తమా! నిష్కాముడగు నీవు మా యింటికేమి కోరి వచ్చితివో సెలవిమ్ము అని రాజు ప్రశ్నించెను.
శ్రీ శుకుడిట్లనియెను : మహీశా! ఆశ్రమములలో గృహస్థాశ్రమ ముత్తమోత్తమమైనది. కనుక భార్యను పరిగ్రహింపుమని మా తండ్రి యనెను. ఇది బంధము గల్గించదని నా తండ్రి యెంతయో చెప్పెను. కాని యతడే సంసార బద్ధుడగుటవలన నేను నా తండ్రి మాట పెడచెవిని బెట్టితిని. ఈ విషయమున నా మనస్సు సందిగ్ధముగ నుండెను. "నీవు విచారింపకుము. మిథిలకు రాజగు జనకుడు విదేహుడు; జీవన్ముక్తుడు; యాజి; లోకవిదితుడు; నిష్కంటకముగ రాజ్యమేలువాడు. ఐనను మాయాపాశబద్ధుడుగాడు. శాంతిగ నేలుబడి సాగించుచున్నాడు. ఆ జనకుని సందర్శించినచో నీ మానసమందలి ప్రమోహము విడివడును. భార్యను జేపట్టుము. నా మాట నమ్ముము. కాదేని రాజునడిగి తెలిసికొనుము. ఆ రాజు నీలోని సందియమును సరిగ దీర్చగలడు. అతని మాటలు విని తిరిగి నన్ను జేరుము." అని పలికెను. నా తండ్రి యాజ్ఞచే నీ పురమునకు వచ్చితిని. నేను మోక్షార్థిని. కర్తవ్య ముపదేశింపుము. ముక్తికి కారణము తపమా? వ్రతమా? యాగమా? స్వాధ్యాయమా? తీర్థసంసేవనమా? ఇందు తగినదేవో తెలుపుము.
జనకుడిట్లనియె: విప్రవర్యా! వినుము. మోక్షకామి ముమ్మెదట నుపనీతుడై వేదాభ్యాసమునకు గురుకులమందు వసింపవలయును. అచట సాంగవేదములను వేదాంతములను చదివి గురుదక్షిణ లొసంగి సమావర్తన సంస్కారమంది కామియై భార్యనుగూడి ప్రజాతంతువును కొనసాగించవలయును. అపుడిత డితర వృత్తులొనర్పరాదు. అగ్ని కార్యములు జరుపవలయును. మితహిత సత్యభాషిగావలయును. నిరాశుడు సదాశుచి సత్యసంతోషి కావలయును. ఆరోగ్యవంతులైన పుత్త్రపౌత్రులతో నభివర్ధిల్లవలయును. కళకళలాడుచుండవలయును. ఆ పిదప తన సర్వస్వమును భార్యను పుత్త్రులకప్పగించి లోని శత్రువుల నరికట్టి తపమునకు వానప్రస్థము స్వీకరించవలయును. పిమ్మట నగ్నుల నాత్మారోహణము చేసికొని పరమవైరాగ్యజ్యోతితో నుద్దీపించుచు శాంతితో సంయమియై తురీయాశ్రమము స్వీకరించవలయును. విరక్తునకు మాత్రమే సంన్యాసాశ్రమమున కధికారము గలదు. ఇది నిజమైన వేదవాక్కు. దీనికిక తిరుగులేదని నా యభిప్రాయము. నరునకు జన్మ మొదలుకొని నలువదియెనిమిది సంస్కారములు గలవని పెద్దలందరు. అందు గృహస్థాశ్రమము నలువదవదని తెలిసినవారందరు. ముముక్షువునకు శమము మున్నగు నెనిమిది సంస్కారములు చెప్పబడినవి. ఒక యాశ్రమమునుండి క్రమముగ రెండవ యాశ్రమము జేరవలయునని శిష్టులందురు.
శుకుడిట్లనియె: జ్ఞానవిజ్ఞానకారణమైన నిర్మలవైరాగ్యతేజము హృదయపూర్వకముగ నిండివెల్గుచుండగ నరుడాశ్రమము లన్నియును క్రమముగ నడుపవలయునా? కాకొకేసారి వనములందుండవచ్చునా?
జనకుడిట్లనియె: విప్రవర్యా! వినుము. మోక్షకామి ముమ్మెదట నుపనీతుడై వేదాభ్యాసమునకు గురుకులమందు వసింపవలయును. అచట సాంగవేదములను వేదాంతములను చదివి గురుదక్షిణ లొసంగి సమావర్తన సంస్కారమంది కామియై భార్యనుగూడి ప్రజాతంతువును కొనసాగించవలయును. అపుడిత డితర వృత్తులొనర్పరాదు. అగ్ని కార్యములు జరుపవలయును. మితహిత సత్యభాషిగావలయును. నిరాశుడు సదాశుచి సత్యసంతోషి కావలయును. ఆరోగ్యవంతులైన పుత్త్రపౌత్రులతో నభివర్ధిల్లవలయును. కళకళలాడుచుండవలయును. ఆ పిదప తన సర్వస్వమును భార్యను పుత్త్రులకప్పగించి లోని శత్రువుల నరికట్టి తపమునకు వానప్రస్థము స్వీకరించవలయును. పిమ్మట నగ్నుల నాత్మారోహణము చేసికొని పరమవైరాగ్యజ్యోతితో నుద్దీపించుచు శాంతితో సంయమియై తురీయాశ్రమము స్వీకరించవలయును. విరక్తునకు మాత్రమే సంన్యాసాశ్రమమున కధికారము గలదు. ఇది నిజమైన వేదవాక్కు. దీనికిక తిరుగులేదని నా యభిప్రాయము. నరునకు జన్మ మొదలుకొని నలువదియెనిమిది సంస్కారములు గలవని పెద్దలందరు. అందు గృహస్థాశ్రమము నలువదవదని తెలిసినవారందరు. ముముక్షువునకు శమము మున్నగు నెనిమిది సంస్కారములు చెప్పబడినవి. ఒక యాశ్రమమునుండి క్రమముగ రెండవ యాశ్రమము జేరవలయునని శిష్టులందురు.
శుకుడిట్లనియె: జ్ఞానవిజ్ఞానకారణమైన నిర్మలవైరాగ్యతేజము హృదయపూర్వకముగ నిండివెల్గుచుండగ నరుడాశ్రమము లన్నియును క్రమముగ నడుపవలయునా? కాకొకేసారి వనములందుండవచ్చునా?
జనకుడిట్లనియెను : "ఇంద్రియ వాసనలు మిక్కిలిగ బలవత్తరములైనవి. అవి దురంతములు. ఒక్క చందాన లొంగవు. అపక్వహృదయుని హృదయమున వికారములు రేకెత్తించుచుండును. ఒకవేళ సంన్యాసాశ్రమమున తుష్టికరభోజనము కమ్మనిసెజ్జ పుత్రోత్సాహము గావలయుననెడు కామము గల్గినచో నదెట్లు తీరును? పూర్వవాసనల జాలము లతి బలవత్తరములైనవి. అవి శాంతిగనుండనీయవు. ఆ వాసనలడగుటకు సక్రమముగ నభ్యాసము సాధన చేయవలయును. పైని నిద్రించువాడు క్రింద పడవచ్చునుగాని క్రిందివాడు పతితుడుగాడు! సంన్యాసియై పతితుడైనవానికి మఱి సద్గతులు లేవు. చీమ వేరునుండి కొమ్మల దనుక మెలమెల్లగ ప్రాకి సుఖముగ ఫలమనుభవించగలదు. పక్షి తన పోవుదారి కడ్డుండదని యెగిరియెగిరి తుదకు శ్రమజెందును. కాని, చీమ నడుమ విశ్రమించుచు సుఖముగ ముందునకు సాగును. మనస్సు బలవత్తరమైనది. విషయలంపటులగు మూర్ఖులకు అది వశము గాదు. వారు కామము నణపజాలరు. కావున ఆశ్రమముల క్రమముననే సంస్కృతిని గెలువవలయును. గృహస్థాశ్రమము నందున్నవాడు సైతమాత్మవంతుడు శాంతుడు సుమతి ధీరుడు హర్షశోకరహితుడు సర్వసముడునై యుండవచ్చును. అతడు దిగులొందక విహితకార్యము లాచరించుచు సర్వారంభములు వదలి కల్గినదానికి సంతసించుచు నిత్యతృప్తుడై యుండవచ్చును. అట్లున్నవాడు నిశ్చయముగ ముక్తుడుగాగలడు. నేను రాజ్యమేలుచున్నను జీవన్ముక్తుడనై యే చింతయు చీకును లేకుందును. నన్నేదియు నంటజాలదు. నేను నానా భోగము లనుభవించుచునే పలు కార్యము లొనర్చుచునేయుందును. నీవు నటులే దేనియందును భ్రాంతి పెట్టుకొనకుండుము. దృశ్యవస్తువులన్నియును మాయచే బంధింపబడును. కాన యదృశ్య వస్తువెన్నడును బంధింపబడదు. పంచభూతములును వాని గుణములును దృశ్యములే.
ఆత్మను జేరలేక మనోవాక్కులు వెనుదిరిగివచ్చును. ఆ యాత్మ ననుమానప్రమాణమున గ్రహించవలయును కాని, యది ప్రత్యక్షముగ గనబడదు. నిర్వికారము నిరంజనము బ్రహ్మమునగు ఆత్మ యెట్లు బాధింపబడగలదు? ఈ మనస్సే సుఖదుఃఖముల కన్నిటికి పాదు. ఇది నిర్మలముగనున్న నంతయు చల్లబడదు. ఎల్ల పుణ్యతీర్థములు దిరుగుచు వానిలో మునుగుచున్నను మానసము పవిత్రము గానంతవఱకన్నియు వ్యర్థములే. మనుజుని బందమోక్షములకు చిత్తమే మూలము. అంతేకాని, దేహము జీవాత్మ ఇంద్రియాలివేవియును గావు. ఆత్మ నిత్యము; శుద్ధము; బుద్ధము; ముక్తము. ఇది దేనిచేతను బంధింపడదు. చిత్తమునందలి బంధమోక్షములడగినచో సకలమును శాంతించును. వీడు మిత్రుడు వీడు శత్రుడు వీ డుదాసీనుడు అను భేదములన్నియు మనోగతములే. ఏకాత్మత్వమునందు భేదమన్నదే లేదు. ద్వైతమందే భేదములన్నియు దోచును. అద్వైతమున నంతయు నొకటే. ఈ జీవరూపుడనగు నేను బ్రహ్మమే. ఇందులకు తిరుగన్నది లేనేలేదు. ఈ మాయసంసారమందు తగుల్కొనుటవలననే క్షుద్రబుద్ధులు పుట్టుచుండును. మహాభాగా! ఇదంతయు నవిద్యయే సుమా! విద్యాజ్యోతిలో మాయలు వ్రీలిపోవును. విచక్షణమతులు విద్యావిద్యల భేదమును చక్కగ గుర్తించవలయును. వేడిమిలేనిచో నీడవలని సౌఖ్యమెట్లు దెలియును? అవిద్యయేలేనిచో విద్యాసౌఖ్యమెట్లు బోధపడును? గుణములు గుణములందు భూతములు భూతములందు ఇంద్రియము లింద్రియములందు ప్రవర్తిల్లుచుండగ నికనాత్మకు దోషమెక్కడిది? ఎల్ల వేదములందును దర్మ సంస్థాననార్థమై లోక కల్యాణమునకు నియమములు గలవు. అవియే లేనిచో బౌద్ధమతమునవలె ధర్మచ్యుతి గలిగి తీరని నష్టము వాటిల్లును. దానిచే వర్ణాచారములు చెడిపోవును. కావున వేదోక్తమార్గ మనుసరించుట శుభప్రదము.
ఆత్మను జేరలేక మనోవాక్కులు వెనుదిరిగివచ్చును. ఆ యాత్మ ననుమానప్రమాణమున గ్రహించవలయును కాని, యది ప్రత్యక్షముగ గనబడదు. నిర్వికారము నిరంజనము బ్రహ్మమునగు ఆత్మ యెట్లు బాధింపబడగలదు? ఈ మనస్సే సుఖదుఃఖముల కన్నిటికి పాదు. ఇది నిర్మలముగనున్న నంతయు చల్లబడదు. ఎల్ల పుణ్యతీర్థములు దిరుగుచు వానిలో మునుగుచున్నను మానసము పవిత్రము గానంతవఱకన్నియు వ్యర్థములే. మనుజుని బందమోక్షములకు చిత్తమే మూలము. అంతేకాని, దేహము జీవాత్మ ఇంద్రియాలివేవియును గావు. ఆత్మ నిత్యము; శుద్ధము; బుద్ధము; ముక్తము. ఇది దేనిచేతను బంధింపడదు. చిత్తమునందలి బంధమోక్షములడగినచో సకలమును శాంతించును. వీడు మిత్రుడు వీడు శత్రుడు వీ డుదాసీనుడు అను భేదములన్నియు మనోగతములే. ఏకాత్మత్వమునందు భేదమన్నదే లేదు. ద్వైతమందే భేదములన్నియు దోచును. అద్వైతమున నంతయు నొకటే. ఈ జీవరూపుడనగు నేను బ్రహ్మమే. ఇందులకు తిరుగన్నది లేనేలేదు. ఈ మాయసంసారమందు తగుల్కొనుటవలననే క్షుద్రబుద్ధులు పుట్టుచుండును. మహాభాగా! ఇదంతయు నవిద్యయే సుమా! విద్యాజ్యోతిలో మాయలు వ్రీలిపోవును. విచక్షణమతులు విద్యావిద్యల భేదమును చక్కగ గుర్తించవలయును. వేడిమిలేనిచో నీడవలని సౌఖ్యమెట్లు దెలియును? అవిద్యయేలేనిచో విద్యాసౌఖ్యమెట్లు బోధపడును? గుణములు గుణములందు భూతములు భూతములందు ఇంద్రియము లింద్రియములందు ప్రవర్తిల్లుచుండగ నికనాత్మకు దోషమెక్కడిది? ఎల్ల వేదములందును దర్మ సంస్థాననార్థమై లోక కల్యాణమునకు నియమములు గలవు. అవియే లేనిచో బౌద్ధమతమునవలె ధర్మచ్యుతి గలిగి తీరని నష్టము వాటిల్లును. దానిచే వర్ణాచారములు చెడిపోవును. కావున వేదోక్తమార్గ మనుసరించుట శుభప్రదము.
శుకుడిట్లనియె: ఓ మనుజేశ్వరా! మీరింతగ ప్రబోధించినను నాసందియమేలొకో తీరుటలేదు.
వేదధర్మములందు హింసయుండును. అది యధర్మము. అట్టి వేదధర్మమెట్లు ముక్తినీయగలదు? సోమపానము పశువధ మాంసభక్షణము ప్రత్యక్షముగ ననాచారములు. సౌత్రామణియజ్ఞమున సురాపానము జూదము నానావ్రతములు ఇవన్నియును చెప్పబడినవి. తొల్లి శశబిందువను రాజు గలడు. అతడు ధర్మిష్ఠుడు; వదాన్యుడు; సత్యవాది; యాజియని వింటిని. అతడు ధర్మసేతు సంరక్షకుడు పెడత్రోవలు బట్టువారిని గట్టిగ శాసించువాడు. భూరిదక్షిణ లొసంగి పెక్కు యాగము లొనరించినవాడు. అతని యాగపశువుల తోళ్లు వింధ్యాచలమట్లు గుట్టగ పెరిగినవి. వానిపై మొయిళ్ళు గురియుటచే నచటినుండి చర్మణ్వతీనది ప్రవహించినది. ఆ రాజు స్వర్గసీమకేగెను. అతని కీర్తి భూమిపై నిలిచినది. కాని యిటువంటి వేదధర్మములు నా మతి కెక్కవు. స్త్రీలతోడి కలయికవలన నరునకు క్షణిక సుఖము గల్గును. ఆ కొలది సుఖమునకే వాడు వెంపరలాడుచుండునతడు జీవన్ముక్తుడగు టెట్లు?
వేదధర్మములందు హింసయుండును. అది యధర్మము. అట్టి వేదధర్మమెట్లు ముక్తినీయగలదు? సోమపానము పశువధ మాంసభక్షణము ప్రత్యక్షముగ ననాచారములు. సౌత్రామణియజ్ఞమున సురాపానము జూదము నానావ్రతములు ఇవన్నియును చెప్పబడినవి. తొల్లి శశబిందువను రాజు గలడు. అతడు ధర్మిష్ఠుడు; వదాన్యుడు; సత్యవాది; యాజియని వింటిని. అతడు ధర్మసేతు సంరక్షకుడు పెడత్రోవలు బట్టువారిని గట్టిగ శాసించువాడు. భూరిదక్షిణ లొసంగి పెక్కు యాగము లొనరించినవాడు. అతని యాగపశువుల తోళ్లు వింధ్యాచలమట్లు గుట్టగ పెరిగినవి. వానిపై మొయిళ్ళు గురియుటచే నచటినుండి చర్మణ్వతీనది ప్రవహించినది. ఆ రాజు స్వర్గసీమకేగెను. అతని కీర్తి భూమిపై నిలిచినది. కాని యిటువంటి వేదధర్మములు నా మతి కెక్కవు. స్త్రీలతోడి కలయికవలన నరునకు క్షణిక సుఖము గల్గును. ఆ కొలది సుఖమునకే వాడు వెంపరలాడుచుండునతడు జీవన్ముక్తుడగు టెట్లు?
జనకుడిట్లనియె: "యాగమందు జరుగు హింస హింసయనబడదు. కామ రాగములతో జేసినచో నదే హింసయగును. నిప్పులో పచ్చి తడి కట్టెలు వేసినచో నిలువరాని పొగ వెలువడును. ఎండుకట్టెలు వేసినచో నవి గనగన మండును. వేదోక్తమగు హింస నహింసగ నెఱుంగుము. రాగులకదే హింసయగును. కాని విరాగులకు గాదు. అహంకార మమకారములు విడనాడి చేసిన పనిని వేదవిదులగు మనీషులు ఆకృతమందురు. రాగముతో కర్తృత్వ బుద్ధి గృహస్థులు చేయు హింస హింసయే అగును. రాగ గర్వములు కర్మసంగము వదలి విజితాత్ములును ముముక్షులునగువారు చేసిన కర్మము హింసయగును. అకర్మయగును."
అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము
పంచాంగం
అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము
No comments:
Post a Comment