శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 25
ఋషు లిట్లడిగిరి : సూతమహామునీ! శాపకారణమున వసువు గాంగేయుడుగా నుద్భవించెనంటివి. శ్రీ వ్యాసుని తల్లియు గంధవతియని ప్రసిద్ధయునగు సత్యవతి శంతనుకు భార్య యెట్లయ్యెనో - ధర్మవరిష్ఠుడగు శంతను డా దాశపుత్త్రినెట్లు వరించెనో విపులీకరించి తెలిపి మా సందియము బాపుము.
సూతు డిట్లనియెను : రాజర్షియగు శంతనుడు గాంగేయుడగు తన కుమారునితో నా పరమశివుడు కైలాసమున తన కుమారునితోవలెనే సుఖముండెను. మృగయారతుడై వనముల కేగి మహిషరురు మృగములను జెండాడుచు వినోదించుచుండెను. ఆ రాజొకనాడు ఖడ్గసూకరములపై వాడి బాణములు ఏయుచు కాళిందీ నదీతీరమందలి వనముల కేగెను. అంతలో నతడచట నలౌకికమైన దివ్య పరిమళ మాఘ్రాణించి యా నెత్తావికెరటములు వీచు దిక్కు మొగమై దాని కారణ మారయుచుండెను. ఇది మందార పరిమళముగాని కస్తూరి సౌరభముగాని చంపక మాలతీ కేతక సుమముల నెత్తావిగాని కాదు. ఈ కమ్మతెమ్మెర యచ్చటినుండి వచ్చిననేమి! ఇది నా నాసికను తృప్తిపఱచుచున్నది? అని తలంచుచు ఆ సుగంధమునకు ముగ్ధుడై రాజావన సీమయంతయును కలయ దిరిగెను. అంతలో రాజొక యేకాంత ప్రదేశము మలిన వస్త్రములు ధరించియు మేని సొబగులు సింగారించుకొనిన ఒక రమణీయ కాంతను చూచెను. నల్లని కడకంటి చూపులుకల ఆమెను చూచి ఆ రాజు ఆశ్చర్యపడి ఈ తానాఘ్రాణించిన సుగంధ మామె దేహమునుడి బయలు వెడలినదే యని నిశ్చయించెను. మిగుల సుందరమును ఆద్భుతమును అగు ఆ రూపమును సర్వప్రాణులకు రంజకమగు ఆ సుగంధమును శుభమగు ఆ లేజవ్వనమును చూచి రాజు మిగుల నాశ్చర్యపడి ఇట్లు భావించెను: ఈమె ఎవరై యుండును. ఎక్కడినుండి ఇప్పుడు వచ్చి యుండును? దేవాంగనయో? మానవస్త్రీయో! గంధర్వ కన్యయో! నాగకన్యయో! ఈ గంధవతియగు కామిని ఎవరనునది ఎట్లు గుర్తింపగలను? అని రాజు తన లోలోన తలపోయుచు తానై స్వయముగ నిదమిత్థమని నిర్ణయింప లేకుండెను. ఈమె నాటి గంగయేమో! అనుకొనుచు నతడు కామవశుడై యా నదీతీరమున నున్న యా కాంతచెంత కేగి యామె నిట్లు ప్రశ్నింపసాగెను:
"ఓ ప్రియరూపా! నీవు ఎవ్వరి పుత్త్రివి? ఏల ఈ విజన ప్రదేశమునందు ఒంటిగా నున్నావు? చారునేత్రా! నీవు వివాహితవా? అవివాహితవా? నా మనస్సును రంజింపజేయు సుందరివగు వంపులు తీరిన కనుగొనలు కల నిన్నుచూచి కామవశుడనయితిని. నీవు ఎవరవు? ఏమి చేయుదానవు? అను విషయములను నీవు నాకు వివరముగా తెలుపుము "అని ఆ సుందరితో రాజు పలుకగనే ఆ పద్మాక్షి రాజుతో చిరునగవున నిట్లు పలికెను :
"ఓ నరాధినాథా! నేను దాశపుత్త్రిని. తండ్రియాజ్ఞలో మెలగు కన్నియనని తెలియుము. ఓ నృపేంద్రా! ధర్మనిమిత్తముగ నేనీ నీటిలో ఈ నావ నడుపుదును. నా తండ్రి యిపుడే యింటికేగెను. అర్థపతీ! నీతో నిది పూర్ణముగా సత్యము పల్కుచున్నాను.
అని కామిని పలుకగనే కామాతురుడగు ఆ శంతను రాజు ఆమెతో నిట్లనెను : కురుప్రవీరుడనగు నన్ను నీ పతిగ జేసికొనుము. నీ యీ జవ్వనము వ్యర్థమయిపోరాదు గదా? నాకు ప్రకృతము మరియొక భార్యలేదు. మృగాక్షీ! నీవు నా ధర్మపత్నివి కమ్ము. నేను నీకు దాసుడనై సర్వదా నీకు వశవర్తినై యుండగలను. ఓ ప్రియా! నీయం దనురక్తుడనగు నన్ను మన్మథుడు సంతాపింపజేయుచున్నాడు. నా భార్య నన్ను వీడిపోయినది. పిమ్మట ఇంతవరకు వేరొకర్తుకను వివాహమాడలేదు. నేనిపుడు విధురుడను. రమ్యములగు సర్వావయవములు గల నిన్ను చూచిన నా మనస్సు వివశమయినది.
దాశకన్యయగు ఆ గంధవతి అతి రమ్యమును అమృతమువలె మాధుర్యము కలదియునగు రాజు పలుకు విని తానును సాత్త్వికభావయుక్తురాలై శంతనునకు ధైర్యము కలిగించుచు ఇట్లు పలికెను: రాజా! నీవు నా విషయమున పలికినదంతయు యథార్థమే యని భావించుచున్నాను. కాని నేను స్వతంత్రురాలను కానని గ్రహించి మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను నీకు ఇచ్చునట్లు అడుగగోరెదను. దాశకుమారికనగు నేను స్వేచ్ఛ కలదానగాను. నా తండ్రి యానతి జవదాటను. నా తండ్రి నన్ను నీకు దానము చేసినచో మీరు నన్ను చేపట్టవచ్చును. నేను నీ వశవర్తినగుదును. రాజా! నిన్ను మాత్రమే ఏమి, నవ¸యవనమందున్న నన్నును మన్మథుడట్లే వేధించుచున్నాడు. ఎట్టి స్థితియందును కులాచార పరంపరా వ్యవస్థచే సాగవలసిన నిలుకడలను కాపాడుట న్యాయ్యముగదా!
ఆ వనిత వాక్కులు విని కామాయత్తచిత్తుడగు శంతనుడు దాశరాజు నింటికి ఆ కన్యను తన కిమ్మని కోరుట కేగెను దాశరాజు తన చెంతకువచ్చు భూపతిని చూచి విస్మయమందెను. అతడు రాజునకు నమస్కరించి దోయిలి పట్టి ఇట్లు పలికెను:
దాశరాజిట్లనెను: భూపాలకా! నేను మీ దాసుడను. మీ శుభాగమనమున ధన్యజీవుడనైతిని. ఏ యర్థము గోరి వచ్చితిరో నన్నాజ్ఞాపింపుడు.
అని కామిని పలుకగనే కామాతురుడగు ఆ శంతను రాజు ఆమెతో నిట్లనెను : కురుప్రవీరుడనగు నన్ను నీ పతిగ జేసికొనుము. నీ యీ జవ్వనము వ్యర్థమయిపోరాదు గదా? నాకు ప్రకృతము మరియొక భార్యలేదు. మృగాక్షీ! నీవు నా ధర్మపత్నివి కమ్ము. నేను నీకు దాసుడనై సర్వదా నీకు వశవర్తినై యుండగలను. ఓ ప్రియా! నీయం దనురక్తుడనగు నన్ను మన్మథుడు సంతాపింపజేయుచున్నాడు. నా భార్య నన్ను వీడిపోయినది. పిమ్మట ఇంతవరకు వేరొకర్తుకను వివాహమాడలేదు. నేనిపుడు విధురుడను. రమ్యములగు సర్వావయవములు గల నిన్ను చూచిన నా మనస్సు వివశమయినది.
దాశకన్యయగు ఆ గంధవతి అతి రమ్యమును అమృతమువలె మాధుర్యము కలదియునగు రాజు పలుకు విని తానును సాత్త్వికభావయుక్తురాలై శంతనునకు ధైర్యము కలిగించుచు ఇట్లు పలికెను: రాజా! నీవు నా విషయమున పలికినదంతయు యథార్థమే యని భావించుచున్నాను. కాని నేను స్వతంత్రురాలను కానని గ్రహించి మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను నీకు ఇచ్చునట్లు అడుగగోరెదను. దాశకుమారికనగు నేను స్వేచ్ఛ కలదానగాను. నా తండ్రి యానతి జవదాటను. నా తండ్రి నన్ను నీకు దానము చేసినచో మీరు నన్ను చేపట్టవచ్చును. నేను నీ వశవర్తినగుదును. రాజా! నిన్ను మాత్రమే ఏమి, నవ¸యవనమందున్న నన్నును మన్మథుడట్లే వేధించుచున్నాడు. ఎట్టి స్థితియందును కులాచార పరంపరా వ్యవస్థచే సాగవలసిన నిలుకడలను కాపాడుట న్యాయ్యముగదా!
ఆ వనిత వాక్కులు విని కామాయత్తచిత్తుడగు శంతనుడు దాశరాజు నింటికి ఆ కన్యను తన కిమ్మని కోరుట కేగెను దాశరాజు తన చెంతకువచ్చు భూపతిని చూచి విస్మయమందెను. అతడు రాజునకు నమస్కరించి దోయిలి పట్టి ఇట్లు పలికెను:
దాశరాజిట్లనెను: భూపాలకా! నేను మీ దాసుడను. మీ శుభాగమనమున ధన్యజీవుడనైతిని. ఏ యర్థము గోరి వచ్చితిరో నన్నాజ్ఞాపింపుడు.
రాజిట్లనియెను: అనఘా! నీ వామోదించి ఇచ్చినచో నీ కూతును నా ధర్మపత్నిగ పరిగ్రహింతును. నా మాట నిజము.'
దాశరాజిట్లనియె: రాజేంద్రా! నా కన్యారత్నమును మీరు ప్రార్థించుట మంచిదే. ఆమె ఒక యోగ్యుడైన యయ్యచేతిలో పెట్టదగినదే కదా! అపాత్రునకెన్నడు నీయను. రాజా! నాకూతునకు బుట్టుకొడుకే నీ తరువాత నీ గద్దెనెక్కవలయును. కాని నీ యితర కుమారులెక్కరాదు.'
సూతుడిట్లనియె: దాశరాజు పల్కులువిని రాజు చింతాతురుడయ్యెను. గాంగేయునిదలచి దాశరాజునకు రాజేమియు మారు పలుకక మిన్నకుండెను. అంత రాజు కామార్తుడై తన యింటి కేగెను. చెప్పరాని దిగులుతో నతడు మజ్జనభోజనములు నిద్ర విడనాడెను. అట్లు చింతాతురుడైయున్న తన తండ్రినిగాంచి యతని దరిజేరి గాంగేయుడు అతని అసంతోష కారణ మడిగెను.
నీకెవడైన నలవిగాని వాడున్నచో చెప్పుము. ఆ శత్రువును పట్టితెచ్చి నీ పాదాలమీద పడవైతును. నీ చింతయేమో తెల్పుము. తన తండ్రి దుఃఖమెఱిగి దానిని బాపని కొడుకొక కొడుకేనా? వాడు పుట్టియేమి ఫలము? అట్టివాడు వెనుకటి జన్మల ఋణము దీర్చుకొనుటకు పుట్టిన వాడగును. ఇందు సందేహము లేదు. అలనాడు తన తండ్రి మాట నెరవేర్చుటకే కదా జన మనోనయనాభిరాముడగు శ్రీరాముడు రాజ్యమువదలి జానకీలక్ష్మణులుతోడురాగా వనములకేగి చిత్రకూటగిరులపై వసించెను. ఆనాడు హరిశ్చంద్ర మహారాజు కొడుకు రోహితుడను నతడు తన తండ్రి మాట మేరమీరకయే గదా యొక బాపని కమ్ముడుపోయి యతని యింట దాస్యమునకుండెను. మున్నొకనా డజీగర్తుని కొడుకు శునశ్శేపు డనువాడు తన తండ్రి చేత నమ్మబడి యూప స్తంభమునకు గట్టబడెను. అపు డతనిని విశ్వామిత్రుడు వచ్చి విడిపించెను గదా! మునుపొకనాడు పరశురాముడు తన పితృనానతిచేత తన తల్లి తల ఖండించి పేరు వడసెను. అత డపుడు తన గురు నాజ్ఞ తలదాల్చుటే తన గురు కర్తవ్యముగనెంచి చేయరాని పనియైనను చేసెను గదా! ఈ నా మేను మీది. నేను సమర్థుడనై యున్నాను. మీరు చెప్పినది తు-చ-తప్పక పాటింతును. నేనుండగ శోకింపనేల? ఎంత యసాధ్యకార్యమైనను సాధించి తీరుదును. నీ మదిలోని దిగులేమో తెలుపుము. ఈ క్షణమే విల్లు చేబూని నీ కోర్కి దీర్తును. నీ వాంఛితము నెఱవేఱినచో నా బ్రతుకు చరితార్థమగును. తన తండ్రి కామితము దీర్పజాలియుండియు నే కొడుకు దానిని దీర్పకుండునో వాడు వట్టి పనికిమాలినవాడు. తన తండ్రి చింత బాపి యతని నుద్ధరింపని కొడుకు పుట్టి యేమి ప్రయోజనము?'
సూతు డిట్లనియెను: తన తనయుని సాంత్వవచనము లాలకించి శంతను మహారాజు నెమ్మదిగ మోమున దోచు సిగ్గుచు లోన నడచుకొని యతని కిట్లు పలికెను:
నీకెవడైన నలవిగాని వాడున్నచో చెప్పుము. ఆ శత్రువును పట్టితెచ్చి నీ పాదాలమీద పడవైతును. నీ చింతయేమో తెల్పుము. తన తండ్రి దుఃఖమెఱిగి దానిని బాపని కొడుకొక కొడుకేనా? వాడు పుట్టియేమి ఫలము? అట్టివాడు వెనుకటి జన్మల ఋణము దీర్చుకొనుటకు పుట్టిన వాడగును. ఇందు సందేహము లేదు. అలనాడు తన తండ్రి మాట నెరవేర్చుటకే కదా జన మనోనయనాభిరాముడగు శ్రీరాముడు రాజ్యమువదలి జానకీలక్ష్మణులుతోడురాగా వనములకేగి చిత్రకూటగిరులపై వసించెను. ఆనాడు హరిశ్చంద్ర మహారాజు కొడుకు రోహితుడను నతడు తన తండ్రి మాట మేరమీరకయే గదా యొక బాపని కమ్ముడుపోయి యతని యింట దాస్యమునకుండెను. మున్నొకనా డజీగర్తుని కొడుకు శునశ్శేపు డనువాడు తన తండ్రి చేత నమ్మబడి యూప స్తంభమునకు గట్టబడెను. అపు డతనిని విశ్వామిత్రుడు వచ్చి విడిపించెను గదా! మునుపొకనాడు పరశురాముడు తన పితృనానతిచేత తన తల్లి తల ఖండించి పేరు వడసెను. అత డపుడు తన గురు నాజ్ఞ తలదాల్చుటే తన గురు కర్తవ్యముగనెంచి చేయరాని పనియైనను చేసెను గదా! ఈ నా మేను మీది. నేను సమర్థుడనై యున్నాను. మీరు చెప్పినది తు-చ-తప్పక పాటింతును. నేనుండగ శోకింపనేల? ఎంత యసాధ్యకార్యమైనను సాధించి తీరుదును. నీ మదిలోని దిగులేమో తెలుపుము. ఈ క్షణమే విల్లు చేబూని నీ కోర్కి దీర్తును. నీ వాంఛితము నెఱవేఱినచో నా బ్రతుకు చరితార్థమగును. తన తండ్రి కామితము దీర్పజాలియుండియు నే కొడుకు దానిని దీర్పకుండునో వాడు వట్టి పనికిమాలినవాడు. తన తండ్రి చింత బాపి యతని నుద్ధరింపని కొడుకు పుట్టి యేమి ప్రయోజనము?'
సూతు డిట్లనియెను: తన తనయుని సాంత్వవచనము లాలకించి శంతను మహారాజు నెమ్మదిగ మోమున దోచు సిగ్గుచు లోన నడచుకొని యతని కిట్లు పలికెను:
శంతనుడిట్లనియెను: నీవు మహాశూరుడవు-బలశాలివి-అభిమానివి. రణరంగధీరుడవు. ఇట్టి నీవొక్కడవే నాకు సుతుడవు గదాయని నాలోన తీరని చింత వేధించుచున్నది. కుమారా! నాకు నీవొక్కడవే సంతగుట చేత నొకవేళ నీవు యుద్ధమున మరణించినచో నాకిక ఆశ్రయముండదు. ఇంకేమి చేయగలను? ఇదొక్కటే నాకున్న చింత. నీముందు చెప్పుకొనదగిన చింత నాకు వేరేదియును లేదు. దీనికొఱకే నేనింతగ బాధపడుచున్నాను. తన తండ్రి మాట లాలకించి గాంగేయు డమాత్యవృద్ధులతో నిట్లనియెను:
గాంగేయు డిట్లనియె: ఏదో సిగ్గువలన భూపతి నాతో సరిగ విడమఱచి పల్కుటలేదు. కనుక మీరతని చిత్తవర్తనమెఱిగి నాకంతయు నున్నదున్నట్లు దెల్పుడు. ఏ కలతయులేక వెంటనే యన్నిపనులు చక్కపెట్టి తండ్రి మదికి శాంతి చేకూర్చగలను. వారా మాటలువిని రాజు చెంతకేగి యతని చింతాకారణము దెలిసికొనిరి. వారా విషయముగూర్చి గాంగేయునకంతయు జెప్పిరి. విశేషజ్ఞుడగు గాంగేయుడు దానిగూర్చి యాలోచించెను. అపుడు వేగిరమే గంగాసుతుడు మంత్రులను వెంటనిడుకొని దాశరాజు నింటికేగి సవినయముగా నెమ్మిగదుర నతని కిట్లనియెను :
గాంగేయు డిట్లనియెను: పరంతపా! నా తండ్రికి నీ కూతు నిమ్మని నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమె నాకు తల్లి యగుగాక! ఆమెకు దాసుడనై యుందును.
దాశరాజిట్లనియెను: రాజా! నీవే నా కూతును భార్యగ గ్రహింపుము. ఏలయన, నీవుండగ నీమెకు పుట్టినవాడు రాజు గాజాలడు గదా?
గాంగేయు డిట్లనియెను: ఈ దాశపుత్త్రి నా తల్లి. ఈమెకు గల్గు కుమారుడే యెల్లభంగుల రాజు గాగలడు. నేను రాజ్యము నేలను. ఇందు సుంతయు సందేహము లేదు.
దాశరాజిట్లనియెః నీ వాక్యము సత్యమని నేనెఱుంగుదును. కాని నీకు గలుగు కుమారుడు బలవంతుడై బలిమితో నిశ్చయముగ రాజ్య మపహరించవచ్చును గదా?
గాంగేయుడిట్లనియెను: అట్లయిన నేను పెండ్లియే చేసికొనను. నేనిదే భీష్మమగు ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా యీ మాట నిజము అను భీష్మ ప్రతిజ్ఞ విని దాశరాజు శోభనాంగియగు సత్యవతిని శంతనునకు ప్రదానమొనరించెను. అతడు సత్యవతిని విధివిధానమున వివాహము చేసికొనెను. ఈమెకే మున్ను వ్యాసుడు జన్మించెననుట శంతను డెఱుగడు.
అధ్యాయము 26 పాండవుల జన్మవృత్తాంతము
శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము
పంచాంగం
అధ్యాయము 26 పాండవుల జన్మవృత్తాంతము
No comments:
Post a Comment