పాండవుల జన్మవృత్తాంతము
సూతుడిట్లనెను : ఆ ప్రకారముగా శంతనుడు సత్యవతిని పెండ్లి యాడెను. వారి కిరువురు కొమరులు గలిగి కాలవశులై మరణించిరి. ఆ వ్యాసమునితోడ కూడకకేగిన యంబిక మునిమూర్తుని చూడనోపక కన్నులు మూసికొనెను. ఫలితముగ ధృతరాష్ట్రుడు పుట్టుచీకుగ బుట్టెను. మరొకరాచకన్నె మునినిగాంచగానే యామె మొగము వెలవెలబోయెను. అందుచే వ్యాసుని కోపమున నామెకు పాండువర్ణము గలవా డుద్భంచెను. మూడవసారి కామకళావిదురాలగు దాసి వ్యాసుని సంతృప్తిని జేసెను. ఆ కారణమున ధర్మంశమున నామెకు సత్యవాది శుచియగు విదురుడు జన్మించెను. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడగుటవలన మంత్రు లతని కధికార మీయక చిన్నవాడైననను పాండుని రాజుగ నియోగుంచిరి. ఇట్లు బలశాలియగు పాండురాజు భీష్మ ననుమతిచే రాజయ్యెను. మేధావియగు విదురు డతనికి మంత్రిగ నియమింపడెను. ధృతరాష్ట్రునకు నిర్వురు భార్యలు గలరు. మొదటి యామె సుబలుని పుత్రియగు గాంధరి. రెండవ భార్య యింటిపనులు చక్కబెట్టుచుండు వైశ్య. అటులే పాండురాజునకు శూరసేనుని కూతురగు కుంతి, మద్రదేశపు రాజు కూతురు మాద్రియను భార్యలు గలరు. గాంధరి నూర్గురు కొడుకులను గనెను. వైశ్య యుయుత్సుడను నొక ప్రియ సుతుని గనెను. కుంతి తన తండ్రి యింట నుండగ కన్నెప్రాయమునందె సూర్యునివలన కర్ణుని గనెను. తరువాత నామె పాండురాజునకు భార్య యయ్యెను.
ఋషులిట్లనిరి: సూతమునీ, మొదట కుంతికి కొడుకు పుట్టెనంటివి. తరువాత పాండురా జామెను పరిగ్రహించెనంటివి. నీవంతయు వింతగ బలుకుచున్నావు. సూర్యునివలన కన్యకకు కర్ణుడెట్లు గలిగెను? ఆమెకు మరల పాండురాజుతో నెట్లువివాహమైనది?
సూతుడిట్లనెను: శూర సేనుని కుంతి. ఆమెకు చిన్నప్పుడే కుంతిభోజుడను రాజు శూరసేనుని ప్రార్థించి తన కూతురుగ స్వీకరించెను. అట్లు కుంతిభోజు డామెను పుత్త్రిగ స్వీకరించి యామె నగ్నికార్యములందు సేవకు నియోగించెను. అంతనొకనాడు దుర్వాసోమహర్షి యామె పుట్టినింటికి చాతుర్మాస్యదీక్ష జరుపదలచి యేతెంచెను. అపుడు కుంతి యా మునీశ్వరునకు పరిచర్యలు చేయుచుండి నతనిని సంతుష్టునిగ జేసెను. అందుకు ముని యలరి యామె కొక దివ్య మంత్ర ముపదేశించెను. ఆమంత్రప్రభావమున దేవతలే వచ్చి వాంఛితార్థములు లీడెర్చగలరు. ముని వెళ్ళిన పిదప కుంతి మంత్రప్రభావ మెఱుగదలచి యే దేవత నాహ్వానింపవలయునాయని యాలోచించెను. అంతలో అపుడే ఉదయించిన దివాకరుడగు సూర్యుని చూచి యామె మంత్ర ముచ్చరించి రవి నాహ్వానించెను. అపు డాదిత్యుడాకాశమండలమందుండి దివ్యసుందరమైన మానావాకారమున నామె మందిరమం దామె సమీపమున నవతరించెను. అట్లు సూర్యునిగని కుంతి కడు విస్మయమందెను. భయమున కంపించెను. మరుక్షణమే పుష్పవతి యయ్యెను. ఆ చారులోచన కేల్మొగిచి నిలచి రవి కిట్లనియెను:
కుంతి నిట్లనియెను: మీ దర్శనభాగ్యమున నేనిపుడు సంతసిల్లితిని.ఇంక మీరు మీ నిజమండలమున కేగుడు.
సూర్యుడిట్లనియె: కుంతీ| మంత్రబలమున నన్ను నీవు పిలిచితివి. పిలుపుపై వచ్చి నీముందు నిలచిన నన్ను నీవేల పొందకున్నావు? నల్లని కడ కన్నులు గల కుంతీ| నేను కామార్తుడను. నీయం దనురాగభావము కలవాడను.మంత్రాధీనుడనై వచ్చితిని. నీతో విహారించుటకై కొనిపొమ్ము.
కుంతి నిట్లనియెను: ధర్మజ్ఞా| సర్వసాక్షీ| సువత్రా| నీకు నమస్కారము. నేను కన్నియను. కులకన్యనగు నన్నునీవిట్లు పరుషాలు పలపకరాదు.
సూర్యుడిట్లనియెను: నేనిపుడు రిత్తగ వెళ్ళినచో దేవతలందరు నన్ను నిందసేతురు. పరిహసింతురు. నాకు వారిలో దలవంపులగును. ఇది నిజము. నన్ను నీవిపుడు కలియకున్నచో నిపుడే నిన్ను, నీకు మంత్రమొసంగినవిప్రుని శపింతును. వరాననా| జనులు ఇది గుర్తింపకుండునట్లును నీ కన్యాత్వము చెడకుండునట్లు చేయుదును. నావంటి కొడుకును నీకు కలుగును. అని పలికి రవి తనయందు భావముకలదై లజ్జతో కూడియున్న ఆ కుంతి ననుభవించి ఆమెకు వాంఛితమగు వరమునిచ్చి వెడలెను.
సుశ్రోణియగు కుంతి గర్భము ధరించి రహస్య మందిరమందే యుండెను. ఈ జరిగిన కార్యమామె దాదికి తప్పనామెతల్లికిగాని లోకులకుగాని మరెవ్వరకిని తెలియదు. తన రహస్యమందిరమున అతి మనోహరుడును అతిరమ్యములగు కవచకుండలములతో కూడినవాడునగు కుమారుడామెకు గలిగెను. రెండవ సూర్యుని, అపర కుమారస్వామివలె నా శిశువుండెను. ఆ బాలుని దాది యెత్తుకొని సిగ్గులో మునిగిన కుంతితో నిట్లనియెను:
సుశ్రోణియగు కుంతి గర్భము ధరించి రహస్య మందిరమందే యుండెను. ఈ జరిగిన కార్యమామె దాదికి తప్పనామెతల్లికిగాని లోకులకుగాని మరెవ్వరకిని తెలియదు. తన రహస్యమందిరమున అతి మనోహరుడును అతిరమ్యములగు కవచకుండలములతో కూడినవాడునగు కుమారుడామెకు గలిగెను. రెండవ సూర్యుని, అపర కుమారస్వామివలె నా శిశువుండెను. ఆ బాలుని దాది యెత్తుకొని సిగ్గులో మునిగిన కుంతితో నిట్లనియెను:
"నీవేల యిపుడు చింతించుచున్నావు? నేనున్నానుకదా|" కుంతి తన కుమారునొక పెట్టెలో
నుంచుచు నాతనితో నిట్లనెను:
నుంచుచు నాతనితో నిట్లనెను:
"ఓసుతా! ఆర్తనగు నేను నా ప్రాణసముడవగు నిన్ను విడనాడుచున్నాను. ఏమి చేయగలను? ఆ సుగుణనిర్గుణ స్వరూప సర్వేశ్వరి భగవతి నిన్ను కాపాడుగాక! కోరికలదీర్చు ఆ విశ్వమాత నిను పాలించుగావుత! నేను దుష్టురాలగు స్వైరణివలె లోకలోచనుని తనయుడవగు నిన్నొంటిగ వదలుచున్నాను. ప్రాణసముడవగు కుమారా! నీ లలిత ముఖకమలము మరల నెపుడు గాంతునో కదా! వెనుకటి జన్మములందు నేను త్రిలోకమాత నారాధింపలేదేమోకదా! ఓ నందనా! అదృష్టహీనురాలను నేను నిన్ను వనములందు వదలుచున్నాను. నా పాపబుద్ధికి నేనే పరిపరి విధాల పరితపించుచున్నాను ఈ రీతిగ కుంతి పలికి జనదర్శనభయమున తన పట్టిని పెట్టెలో భద్రముగ నుంచి దాదిచేతులో పెట్టెను. ఆ పిదప భయపడుచు స్నానముచేసి కుంతి తన తండ్రి యింట నుండెను. ఆ పెట్టె నదిలో కొట్టుకొని పోయిపోయి యధిరథుడనువానికిదొరకెను. ఆ యధిరథుడొక సూతుడు. అతని భార్య రాధ. ఆమె బాలుని గ్రహించి పెంచెను. ఆ వీరుడు బలశాలి యగు బాలుడే సూతునింట కర్ణుడను పేర విఖ్యాతి గాంచెను.
కొన్నాళ్లకు కుంతీ స్వయంవరము జరిగెను. అందామె పాండురాజును వరించెను. మద్రరాజసుతయగు మాద్రియు నతనికి రెండవ భార్యయయ్యెను. ఒకనాడు పాండురా జు వేటకేగి మృగరూపమున క్రీడించుచున్న మునిని మృగమను భ్రాంతిచే బాణము ఏసి చంపెను. ఆ ముని కోపించి స్త్రీ సంగమము సల్పునపుడు నీవు నిట్లే మరణింతు వని పాండురాజును శపించెను. పాండురాజటుల శపింపబడి శోకమునగుందుచు రాజ్యము వీడి వనవాసము చేయుచుండేను. కుంతీ మాద్రులు తమ సతీధర్మము నెఱపుటకు రాజునకు పరిచర్యలు చేయ నతని వెంట వెడలిరి. పాండురాజు పావన గంగా తీరమందలి మున్యాశ్రమములందుండి ధర్మశాస్త్రములు వినుచు కఠిన తప మాచరించెను. అత డొకసారి యచట జరుగుచున్న ధర్మ విషయకచర్చల ప్రసంగమున ముని భాషణము లిట్లు వినెను. అపుత్త్రకులకు స్వర్గలోక గమనమునకు గతులుండవు.కనుక నే విధముననైన పుత్త్రుని బడయవలయును. అంశజుడు పుత్త్రికాపుత్త్రుడు క్షేత్రజుడు గోలకుడు కుండుడు సహోఢుడు కానీనుడు క్రీతుడు వనప్రాప్తుడు అశక్తులవలన డబ్బునకమ్ముడు పోయినవాడు అను వీరెల్లరును తనయులే యగుదురు. వీరిలో వరుసగ నొకనికన్న మరొకడు తక్కువవాడు. ఇది నిజము. అను ముని మాటలు విని పాండురాజు కుంతితో నిట్లనియెను. నీవు వేగమే యొక మహామునిని గలియుటకు తపోవని కరుగుము. ఆ ముని దయ వలన పుత్త్రుని గనుము. నా యాజ్ఞవలన నీకు దోషమంటదు. మునుపు సౌదాసుడను రాజు వసిష్ఠమహర్షి వలన పుత్త్రుని బడసెనని వింటిని.
అంత కుంతి యిట్లనియెను: 'ఓ కామదా! పూర్వము దుర్వాసో మహర్షి నాకు సిద్ధిప్రదమగు నొక మంత్రముపదేశించెను. అది నాయొద్ద గలదు. ఆ మంత్ర ప్రభావమున నేనే
దేవతనాహ్వానింతునో యా దేవత నా సన్నిధికి రాగలడు'' అపుడు కుంతి తన పతి యనుమతి బడసి ధర్మదేవతను స్మరించినది. ఆమె యతని కలయిక వలన యుధిష్ఠిరుని తొలి పుత్త్రుడగు బడసినది. పిదప నామె వాయుదేవుని దయవలన భీముని ఇంద్రుని యనుగ్రహమున కిరీటిని ప్రతియేట నొక్కొక్కని వంతున వరపుత్త్రులుగ బడిసినది.
కొన్నాళ్లకు కుంతీ స్వయంవరము జరిగెను. అందామె పాండురాజును వరించెను. మద్రరాజసుతయగు మాద్రియు నతనికి రెండవ భార్యయయ్యెను. ఒకనాడు పాండురా జు వేటకేగి మృగరూపమున క్రీడించుచున్న మునిని మృగమను భ్రాంతిచే బాణము ఏసి చంపెను. ఆ ముని కోపించి స్త్రీ సంగమము సల్పునపుడు నీవు నిట్లే మరణింతు వని పాండురాజును శపించెను. పాండురాజటుల శపింపబడి శోకమునగుందుచు రాజ్యము వీడి వనవాసము చేయుచుండేను. కుంతీ మాద్రులు తమ సతీధర్మము నెఱపుటకు రాజునకు పరిచర్యలు చేయ నతని వెంట వెడలిరి. పాండురాజు పావన గంగా తీరమందలి మున్యాశ్రమములందుండి ధర్మశాస్త్రములు వినుచు కఠిన తప మాచరించెను. అత డొకసారి యచట జరుగుచున్న ధర్మ విషయకచర్చల ప్రసంగమున ముని భాషణము లిట్లు వినెను. అపుత్త్రకులకు స్వర్గలోక గమనమునకు గతులుండవు.కనుక నే విధముననైన పుత్త్రుని బడయవలయును. అంశజుడు పుత్త్రికాపుత్త్రుడు క్షేత్రజుడు గోలకుడు కుండుడు సహోఢుడు కానీనుడు క్రీతుడు వనప్రాప్తుడు అశక్తులవలన డబ్బునకమ్ముడు పోయినవాడు అను వీరెల్లరును తనయులే యగుదురు. వీరిలో వరుసగ నొకనికన్న మరొకడు తక్కువవాడు. ఇది నిజము. అను ముని మాటలు విని పాండురాజు కుంతితో నిట్లనియెను. నీవు వేగమే యొక మహామునిని గలియుటకు తపోవని కరుగుము. ఆ ముని దయ వలన పుత్త్రుని గనుము. నా యాజ్ఞవలన నీకు దోషమంటదు. మునుపు సౌదాసుడను రాజు వసిష్ఠమహర్షి వలన పుత్త్రుని బడసెనని వింటిని.
అంత కుంతి యిట్లనియెను: 'ఓ కామదా! పూర్వము దుర్వాసో మహర్షి నాకు సిద్ధిప్రదమగు నొక మంత్రముపదేశించెను. అది నాయొద్ద గలదు. ఆ మంత్ర ప్రభావమున నేనే
దేవతనాహ్వానింతునో యా దేవత నా సన్నిధికి రాగలడు'' అపుడు కుంతి తన పతి యనుమతి బడసి ధర్మదేవతను స్మరించినది. ఆమె యతని కలయిక వలన యుధిష్ఠిరుని తొలి పుత్త్రుడగు బడసినది. పిదప నామె వాయుదేవుని దయవలన భీముని ఇంద్రుని యనుగ్రహమున కిరీటిని ప్రతియేట నొక్కొక్కని వంతున వరపుత్త్రులుగ బడిసినది.
అపుడు మాద్రి పాండురాజుతో నిట్లనియెను:
"ప్రభూ ! నాకును బుత్త్రులను ప్రసాదించుము. నేనేమి చేయుదును ? నా దుఃఖము బాయు నట్లొనరింపుము. పాండురాజా విషయము కుంతితో జెప్పెను. కుంతి దయతో మాద్రికి మంత్రోపదేశము జేసెను. మాద్రికొక్కడే పుత్త్రుడు చాలునని పాండురాచు కట్టడి చేసెను. మాద్రి యశ్వనీదేవతలను మదిలో స్మరించి నకులసహాదేవుల నిర్వురను గనెను. ఈ ప్రకారముగ దేవతలు పాండురాజు క్షేత్రమునందు పంచపాండవులై యుద్భవించిరి. ఓ మునులారా! వారా యడవిలో నొకరి కింకొకరొక యేడు అంతరముగ నుద్భవించిరి.
అంత నొకనాడు పాండురాజు చావుమూడగ కామార్తుడై ఆశ్రమమందు మాద్రిని సమీపించి బలాత్కారముగ నామె చేయి పట్టెను. ఆమె వద్దువద్దనియ యెంతగ మొఱ పెట్టి వారించినను పాండురాజు వినక తన ప్రియను తమిదీర కౌగిలించుకొనెను. వెంటనే యతడు మన్నుగఱచెను. చెట్టు పడినప్పుడు దాని నాశ్రయించియున్న తీవియగూడ పడునట్లు మాద్రి క్రిందబడి వలవల యేడవసాగెను. అపుడు కుంతియు రోదించుచు వచ్చెను. ఆ కోలాహలమును విని మునులును బాలకులును గుమిగూడిరి. అట్లు పాండురాజు దివంగతుడుగాగా మునులును పాండుపుత్త్రులును గలిసి గంగాతీరమున నతనికి దహన సంస్కారము లొనరించిరి. అపుడు మాద్రి తన సుతులను కుంతి కప్పగించినది. పిదప నామె సత్యచింతనతో సతీధర్మము పాటించుచు పాండురాజుతో సహగమించినది. ఆయాచోటుల వసించు మునులు పాండవులచేత దానములు తర్పణములు నాచరింపించిరి. పిదప వారు పాండవులను గొంతిని కరిపురికి గొనిపోయిరి. వారి శుభాగమన మెఱిగి గాంగేయుడు విదురుడు ధృతరాష్ట్రుడు ప్రజానీకము వారి కెదురేగెను. జనమునకు పాండురాజునకు గల శాపము తెలియును. కాన వారు కుంతినీ వరాననా! వీరలెవ్వరి పుత్త్రు'లని యడిగిరి. అపుడు కుంతి దుఃఖాన్వితయై వీరలు కురుకులమున ప్రభవించిన సురకుమారకులు అని నుడివి యామె వారు నమ్ముటకు తిరిగి దేవతలనే యాహ్వానించెను. అంత దేవత లేతెంచి గగనసీమపై వెలుగుమూర్తులై వీరు మా కన్నవారలే' యని వక్కాణించి పలికిరి. దేవవాక్కులకు భీష్ముడు విలువ నిచ్చెను. ఇట్లు భీష్ముడు దేవకుమారకుల గౌరవము నిలువబెట్టెను. అంత నచ్చటివారందఱును బాలకులను కుంతిని వెంట నిడుకొని హస్తినాపురములోని కరిగిరి. భీష్మాదులందరును సంప్రీతి మెఱయ తమ విభవముల కనుగుణముగ వారిని పోషించిరి. ఈ విధముగ కుంతీకుమారులు భీష్ముని చేత పరిరక్షింపబడిరి.
అధ్యాయము 27 శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట
No comments:
Post a Comment