పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట
సూతు డిట్లనెను : ఆనాటికి మూడవనాడు ధృతరాష్ట్రుడు గాంధారీకుంతీసహితుడై వనమందు దావాగ్నిలోబడి దగ్ధుడయ్యెను. సంజయు డంతకుముందే దర్మజుని ధృతరాష్ట్రుని వదలి తీర్థయాత్రకు వెడలెను. ఇదంతయును నారదుని వలన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లకు యాదవు లెల్లరును ప్రభాసతీర్థమున నశించిరి. వారు మదిరాపానమత్తులై రామకృష్ణులు చూచుచుండగనే తమలో తాము కయ్యాలు పెట్టుకొని సమసిరి. బలరాముడు మేను చాలించెను. కమలాక్షుడగు శ్రీకృష్ణుడును శాపానుసారముగ వ్యాధుని బాణమున నిహతుడయ్యెను. అట్లు కృష్ణుడు తన యవతారము చాలించెనని విని వసుదేవుడు తన హృదయమందు శ్రీ భువనేశ్వరీదేవిని నిలిపి ప్రాణములు వదలెను. అంతట అర్జును డతి దుఃఖితుడై ప్రభాసతీర్థమునకేగి వారి వారికి దగినట్లుగ సంస్కారము లొనరించెను. అర్జునుడు హరి మృతశరీరముగాంచి చితిపేర్చి యందతనితో నతని యష్టమహిషులనుజేర్చి దహనసంస్కారము లొనర్చెను. రేవతితోడి బలరాముని దేహ మగ్నిలో దహింపజేసెను. పిమ్మట నతడు ద్వారకకుజని యచటి జనులను దోడుకొని పురమును వెడలించి నడచెను. వెంటనే సముద్ర ముప్పొంగి వాసుదేవుని పురమును నీటముంచెను. అంతట కిరీటి ప్రజలను వెంటనిడుకొని నిర్గమించెను. తేజస్వియగు నర్జును డనిరుద్దుని కొడుకు నింద్రప్రస్థపురికి రాజుగ జేసెను. పిమ్మట నర్జునుడు తన పడిన పాటులన్ని యును వ్యాసునకు చెప్పి రోదించెను.
వ్యాసుడు అర్జునితో మహామతీ ! శ్రీహరి మరల నవతరించునపుడు నీవు నతని వెంటవత్తు వనెను. అటు తరువాత చోరులును అభీరులును కృష్ణుని తక్కిన భార్యలమీద స్త్రీలమీదపడి దోచిరి. స్త్రీల యొంటిమీది సొమ్ములన్నియు నొలుచుకొని పోయిరి. అర్జునుడుగూడ తేజోహీనుడయ్యెను. వజ్రనామకు డింద్రప్రస్థమున యాదవులకు రాజుగ జేయబడెను. రాబోవు యుగమున నీవు మరల పూర్ణతేజస్కుడవు గాగలవని వ్యాసుడు చెప్పగ నర్జునుడువిని ముదమంది కరిపురమున కేగెను. అచట జరిగిన వృత్తాంతమంతయు నర్జునుడు ధర్మరాజాదులకు దెలిపెను. ధర్మజుడు శ్రీహరి దేహత్యాగము యాదవ వంశక్షయము అంతయువినెను. అంతట ధర్మరాజు హిమాచలమునకేగ సంకల్పించెను. అతడు ముప్పదియాన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్ల ప్రాయముగల పరీక్షిత్తునకు బట్టము గట్టెను. ఆ ప్రకారముగ ధర్మనందనుడు కరిపురమును ముప్పదియాన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లు చక్కగ పరిపాలించి పిదప తన తమ్ములతో ద్రౌపదితో బయలుదేరెను.
ఆ విధముగ నారుగురును హిమగిరికేగి యందే ప్రాణములు వదలిరి. ఇట పరీక్షిత్తు పరమ ధార్మికుడు - రాజర్షి - రాజేంద్రుడు- చక్కగ నరువదేండ్లు పరిపాలించెను. ఒకనాడత డడవికి వేటకేగెను. ఆ రాజు దెబ్బతిన్న మృగాదులను పట్టుకొనుటలో మట్టమధ్యాహ్నమయ్యెను. ఆ పట్టపగటి వేడిమి కత డాకలిదప్పికలచే నలమటించెను. అతడా వడదెబ్బకు తాళలేక చేరువలో ధ్యానమగ్నుడైయున్న యొక మునివరునిగాంచి జలమిమ్మని యడిగెను. ఆ ముని నిర్మలనిశ్చలసమాధిలో నుంటచే మాటాడలేదు. పరీక్షిత్తు దప్పికచే కలిమాయచే కుపితుడై తన వింటికొనచే నచట చచ్చిపడియున్న పామును పైకెత్తెను. అతడు కలి ప్రభావమున దాని నా ముని మెడలో వేసెను. పామును తన మెడలో వైచినను ముని మాటాడకుండెను. ముని నిర్వికల్పుడై యుండెను. పిదప రాజు తన గృహమున కేగెను. ఆ ముని కుమారుడు గవిజాతుడు మహా తపస్వి. మహాతేజస్వి, మహాశక్తుడు. ఆ బాలుడు వన ప్రాంతమున తోడి మిత్రులతోడ నాడుకొనుచుండెను. అంతలో నతని మిత్రులెవరో యతనితో 'నీ తండ్రి మెడలో ఎవరో చచ్చిన పాము వేసి'రనిరి. ఆ మాటలు వినగనే యతుడు క్రుద్ధుడైవేగిరమే దోసిట జలముగొని నాతండ్రి మెడలో చచ్చినపాము వేసిన రాజు-పాపి యేడునాళ్లలో తక్షకునిచే కాటువేయబడి చచ్చునుగాత' మని శపించెను. అపుడు కొందఱు ముని కుమారకులు రాజభవనమందున్న పరీక్షిత్తుకడ కేగిరి. వారు రాజుతో నతనికి ముని బాలుడిచ్చిన శాపమును దెలిపిరి. అట్లు రాజు తనకు ముని బాలు డిచ్చిన శాపము తెలసికొనెను.
అంత పరీక్షిత్తు శాపము తప్పదని యెఱింగి వెంటనే వృద్ధామాత్యులను రావించి వారి కిట్లనియెను: ''నా ద్వేషకారణముగ నొక ముని బాలునిచేత శపింపబడితిని. కాన నో మంత్రులారా! ఇపుడు నే జేయదగిన యుపాయమేదేని నున్నచో నాలోచింపుడు. ఎట్టివానికేని చావు తప్పింపరాదని వేదవిదులందురు గదా! ఐనను తెలిసినవారు శాస్త్రోక్తపద్ధతులాచరింతురు. ఉపాయజ్ఞులగు - బుద్ధిమంతులు కొంద ఱిట్లు వచింతురు. ఎల్ల కార్యములు విజ్ఞుల యుపాయములవలన తప్ప మరిదేనివలనను నెఱవేరవు. మణి మంత్రౌషధముల ప్రభావము దుస్తరము. వాటి సిద్ధులవలన కార్యములు సిద్ధించును. తొల్లి యొక ముని తన భార్య పాముకాటునకు చనిపోగా నత డామెను మరల బ్రతికించుకొనెను. ఆ ముని తన భార్యకు తన యాయువులోని సగపాలిచ్చి యామెను మరల బ్రతికించుకొనెను. పండితులగు వారు భవితవ్యమును విశ్వసింతురు. మంత్రులారా! ఇందులకు ప్రత్యక్ష దృష్టాంతము ఇది:
"ఈ భువిపైగాని దివిపైగాని యే పురుషుడైనను దైవముపై భారము వైచి నిరుద్యోగమున నూరక కూరుచుండునా? విరక్తుడగు యతికి సైతము బిచ్చమెత్తుకొనక పొట్టగడువదు గదా ! అతడు గృహస్థులు పిలిచినను పిలువకున్నను నింటింటికి వెళ్ళుచుండును. కాని యూరక గోళ్ళుగిల్లుకొనుచు కూరుచుండునా? కూరుచున్నచో నతని నోటిముందునకు పట్టెడు మెదుకులు తెచ్చి పెట్టువాడెవడు? తినకున్నచో నన్నము పొట్టలోనికి పోవుటెట్లు? కావున కార్యము నెఱవేరినను ప్రయత్నము మాత్రము చేసి తీరవలయును. ఒకవేళ కార్యము సాధ్యముగానిచో మాత్రమే మదిలో దైవమునే దిక్కుగ నమ్ముకొన వలయును.''
రాజు మాటలువిని మంత్రులనిరి: 'తన ప్రియురాలికై తన ఆయురర్ధ మిచ్చి బ్రతికించికొన్న యా ముని యెవరో యాతనిభార్య యెట్లు మరణించెనో విశదముగ దెలుపుడు.
రాజిట్లనియెను: ''భృగుమహర్షి భార్య పులోమ. ఆమె చాల సౌందర్యరాశి. ఆమెకు చ్యవనుడను ప్రసిద్ధికెక్కిన ముని సంభవించెను. ఆ చ్యవనునకు శర్యాతికూతురు సుకన్యయను నామె భార్య యయ్యెను. ఆ సుకన్య సుందరాంగి. వారికి ప్రమతియను ప్రఖ్యాత సుతుడు గలిగెను. ఆ ప్రమతి భార్య ప్రతాపి యనబరగెను. ఆమెకు రురువను సుతుడు జనియించెను. ఆనాళ్లలో స్థూలకేశుడను తపస్వి యుండెను. ఆ తాపసుడు ధర్మాత్ముడు. సత్యసమ్మతుడు. త్రిలోకసుందరి మేనక విశ్వావసువువలన గర్భము దాల్చెను. ఆమె యొకనాడు నదీతీరమున విహరించుచుండగా నిది జరిగెను. ఆ మేనక స్థూలకేశు నాశ్రమమున నొక యందాలపాపను గనెను. ఆ బాలనదీతటమున నొప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ ముని యాదిక్కు లేని బాలను చేరదీసి ప్రమద్వరయను పేరిడి ముద్దుగ పెంచుకొనుచుండెను. కొంతకాలమున కా కన్నియ సర్వలక్షణశోభితయై పడుచుదనమున నెసగుచుండెను. ఒకనాడా పడుచుకన్నెను రురుమహర్షికన్నారగాంచెను. ఆతని హృదయమున పూవుముల్కుల కైపైక్కెను.
అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట
శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము
పంచాంగం
రాజిట్లనియెను: ''భృగుమహర్షి భార్య పులోమ. ఆమె చాల సౌందర్యరాశి. ఆమెకు చ్యవనుడను ప్రసిద్ధికెక్కిన ముని సంభవించెను. ఆ చ్యవనునకు శర్యాతికూతురు సుకన్యయను నామె భార్య యయ్యెను. ఆ సుకన్య సుందరాంగి. వారికి ప్రమతియను ప్రఖ్యాత సుతుడు గలిగెను. ఆ ప్రమతి భార్య ప్రతాపి యనబరగెను. ఆమెకు రురువను సుతుడు జనియించెను. ఆనాళ్లలో స్థూలకేశుడను తపస్వి యుండెను. ఆ తాపసుడు ధర్మాత్ముడు. సత్యసమ్మతుడు. త్రిలోకసుందరి మేనక విశ్వావసువువలన గర్భము దాల్చెను. ఆమె యొకనాడు నదీతీరమున విహరించుచుండగా నిది జరిగెను. ఆ మేనక స్థూలకేశు నాశ్రమమున నొక యందాలపాపను గనెను. ఆ బాలనదీతటమున నొప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ ముని యాదిక్కు లేని బాలను చేరదీసి ప్రమద్వరయను పేరిడి ముద్దుగ పెంచుకొనుచుండెను. కొంతకాలమున కా కన్నియ సర్వలక్షణశోభితయై పడుచుదనమున నెసగుచుండెను. ఒకనాడా పడుచుకన్నెను రురుమహర్షికన్నారగాంచెను. ఆతని హృదయమున పూవుముల్కుల కైపైక్కెను.
అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట
No comments:
Post a Comment