శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 40
త్రిగుణ స్వరూప వివరణము
బ్రహ్మ యిట్లనియె: నారదా! ఈ ప్రకారముగ సృష్టి క్రమమును గుఱించి నీవడుగగా జెప్పితిని. ఇపుడు త్రిగుణముల స్వరూపమును వాని యవస్థలును వెల్లడింతును, ఏకాగ్ర మనస్కుడవై యాలకింపుము. సత్వము ప్రీత్యాత్మకమని యెఱుగుము. ఆర్జవము-సత్యము-శౌచము-శ్రద్ధ-క్షమ-ధైర్యము-దయ-లజ్జ-శాంతి-సంతోషము అనునవి సత్త్వగుణము యొక్క లక్షణములు. ఇది తెల్లని వర్ణము గలది. ఇది ధర్మమునందు ప్రీతిని సచ్ఛ్రద్ధను నివారించును. తత్వదర్శనులగు మునులీ శ్రద్ధను సత్వరజస్తమో భేదములచే ముత్తెఱంగుల బేర్కొనిరి. రజోగుణము రక్తవర్ణమున చెన్నొందును. ఇది దుఃఖ సంయోగమున గల్గును. ఇది అద్భుత శక్తి గలది. దుఃఖరూపమైనది. ఈ రజోగుణమునకు ప్రద్వేషము ద్రోహచింత మచ్చరము స్తంభముఉత్కంఠ నిద్ర అనునవి గల్గును. ఇది రాజసశ్రద్ధ. మదము-గర్వము ఇవి రజో గుణ లక్షణములు. తమోగుణమునల్లనివన్నె గలది. మోహము-విషాదము-అజ్ఞానము-ఆలస్యము-నిద్ర-ధైన్యము-భయము- వివాదము-కృపణత్వము కుటిలత్వము - వైషమ్యము - అతినాస్తికత - పరదోషదర్శనము వీటన్నిటిని బుధులు తమోలక్షనములుగ నెఱుగవలయును. ఈ తామసశ్రద్ధవలన తనకును పరులకును మనోవ్యథ గలుగును. తనకు శుభము గోరుకొను మనుజుడు సత్వగుణము ప్రకాశింపజేయవలయును. రజోగుణము నట్టడుగున నణచిపెట్ట వలయును. తమమును సంహరించవలయును.
ఈ త్రిగుణములందు ప్రతిది రెండవదానిని గడ్డిపోచగ కించపరచుచు వ్యతిరేకించుచుండును. ఐననునివి స్వతంత్రముగనుండక పరస్పర మాశ్రయించుకొనియే యుండును. కేవలము సత్త్వముగాని రజముగాని తమముగాని నిలువజాలదు. ఇవెల్ల యెల్లవేళల కలిసి అన్యోన్యపూరకములై ముందునకు సాగుచుండును. ఇవి పరస్పర సమ్మేళనమున తమకు తాము వ్యాపించియుండును.
వీని వివరింతును వినుము. దానినెఱిగినచో భవబంధము తీరిపోవును. ఇదేదో నా మాటయే గదయని సందేహింపకుము. ఏదైన ఫలమనుభవమునకు వచ్చినప్పుడే దాని వాస్తవికత బట్టబయలగును. ఏదైననొక విషయము చూచుటవలనను వినికిడివలనను స్వానుభవమునను తెలియును. కానిదాని ఫలితమెఱుగనిచో నది వ్యర్థమేయగును. ఎట్లన నొకడొక పుణ్యతీర్థ కథ వినెను. కాని దాని ఫలితమతడు తెలిసికొనలేదు. అందువలన నతనిలో రాజసశ్రద్ధ పెచ్చు పెరిగెను. అతడేది వినెనో దానినే కనెను. తీర్థమందు స్నానమాడెను. రజోగుణముతో దానము లొసంగెను. అతడు కొంతకాలము రజోగుణముతో నచ్చటనే కడపెను. అతని యెడద రజోగుణఫలితముగ కామ క్రోధములతో కన్నుమిన్ను గానకుండెను. అతని గుండెలోని రాగద్వేషములా మంటలు గ్రక్కుచుండెను. అతడు తీర్థముగూర్చి వినెనుగాని దాని ఫలితము గూర్చి వినలేదు. కాన నతడు తీర్థ సంసేవన ఫలితమందలేదు. అతడు వినియు విననివాడేయయ్యెను. అతడనుభవశూన్యుడని యెఱుగము.
వ్యవసాయము చేసినందులకు ఫలితముగ లోకమున పుష్కలముగ నన్నము దొరకును. అటులే తీర్థసంసేవనకు ఫలముగ పాపనాశమగునని తెలిసికొనుము. ఈ దేహ వికారములగు కామక్రోధములు లోభమోహములు తృష్ణామదములు రాగద్వేషములు ఘోరపాతకములు అసూయ ఈర్ష్య అసహనము అశాంతి యనునవన్నియు పాప ఫలితములని తెలిసికొనుము. ఇవి యీ పాపిష్ఠతనువున గూడుకట్టుకొని పేరుకొని యుండును. వీనిమూలమున నరుడు పాపాత్ముడగును. ఆ నరుడెంతటి మహాపుణ్యతీర్థములో గ్రుంకినప్పటికి నీద్వంద్వ శత్రువులతని గుండెలో చోటుచేసికొని బయలువెడలకుండును. అపుడు జాగరూకత లేని కర్షకుని పగిది నతని శ్రమయంతయు వ్యర్థమగును. ఒక సేద్యగాడు పనికిమాలిన శ్రమయనుకొనక దుక్కిదున్ని పారవంతమొనర్చును. అతడందులో మేలైన విత్తనములు వేయును. ఈరీతిగ శ్రమించి వ్యవసాయము చేసిన కర్షకునకు మంచి ఫలము చేతికందును. ఇట్లాతడెక్కువ దిగుబడి నాశించి రేయింబవళ్లెండయనక వానయనక కష్టించి తన పొలమును కంటికిరెప్పగా జూచికొనును. కాని చలికాలమున పంటసిద్ధమైనపుడతడు నిదురించినచో పొలములో పులులుచేరి పంట చెఱచును. మిడుతలదండు వచ్చి పంట పొలమును తినివేయును. అపుడు రైతు హతాశుడై మిక్కిలిగ వగచును. అట్లే గుండెనిండ పాపరాసులు విషమువలె బాధలు పెట్టు చుండగ నెన్ని తీర్థములందు గ్రుంకిడిన నేమి ఫలితము? ఫలము సున్న; శ్రమ మిన్న.
ఉత్తమశాస్త్ర మెఱుగుటవలన సత్త్వము తేజరిల్లి వర్ధిల్లును. అపుడు తమము విరియును. వైరాగ్యము రూపుదాల్చిన బ్రహ్మజ్యోతిగ వెలుగొందును. ఇది సత్త్వగుణ ప్రకాశమునకు దృష్టాంతము ఇక రజస్తమస్సులు బలిమిని నరుని గుండెలో సులువుగచోటు చేసికొనును. ఈ రజము లోభముతో చేతులు గలిపి నాయంతవాడు లేడని మిట్టిపడును. అపుడా రజము సత్వతమోగుణముల రెంటిని మించి యెసంగును. తమస్సు ప్రమోహముతో బాసచేసి గ్రుడ్డి దగును. అది సత్త్వరజోగుణముల నతిక్రమించి మైమఱచియుండును. ఈ తమోగుణ ప్రాబల్యముగూర్చి విపులీకరింతును. వినుము: సత్వతేజమందు నెలకొన్నవాని కెల్లెడల నిర్మలసత్త్వమే వెలుగుబాట చూపుచుండును. అతడు సత్యధర్మమందే తన యమరజీవనము సాగించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సుభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజ ముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సులభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. ఇట్టి పుణ్యాత్ము డెల్లవేళల సర్వసంగపరిత్యాగ ధర్మమును పాటించును. ఇతరుల సుఖదుఃఖములను తనవిగ భావించును. మోక్షార్థియైన సాత్త్వికుడు రజోగుణమునకు రాగిల్లడు. దానికి దాసుడుగాడు. అంధతమస్సులో నేల బాధపడును? ఓ పుత్రా! ఇట్లు తెలివిగలవాడు మొదట రజమును పిదప తమమును త్రోసిరాజన వలయును. అపుడు శుద్ధమగు సత్త్వ మొక్కటియే వెలుగొందును. ఎవనియందు రజోగుణము ప్రబలునో యతడు సనాతన ధర్మములకు స్వస్తి చెప్పును. రాజసశ్రద్ధతో దేహాత్మభ్రాంతితో నధర్మము లొనర్చుచుండును. ఎవ్వనిలో రజోగుణము ప్రబలరూపము దాల్చునో యత డనర్థములవంటి యర్థములను సమకూర్చుకొనును. భోగములకు బానిస యగును. అపుడతనినుండి సత్త్వప్రకాశము చెప్పక పారిపోవును. అతని గుండెనిండ తమములు ముసురును. ఎవని యందు తమోగుణము తీవ్రరూపము దాల్చునో యతనియందు వేదముల-ధర్మముల-విషయమున విశ్వాసము సమసిపోవును. అతడు తామసశ్రద్ధతోకూడి దురభ్యాసములకు లొంగిపోవును. ధనము నిష్టము వచ్చినట్లు దుర్వ్యయము చేయును. ఎల్లెడల ద్రోహచింత దల పెట్టును. అట్టి వాని కాత్మశాంతి కరవగును.
క్రోధము ద్వేషము దుర్మతి శఠత్వముగల తామసుడు సత్త్వరజోగుణములను మంటగలిపి విషయలంపటుడై కామచారుడై తిరుగును. ఎక్కడను సత్త్వముగాని రజముగాని తమముగాని యొక్కటే నిలుకడజెంది యుండజాలదు. ఇవి యొండొంటితో గలిసి మిథునభావముగలవై జంటగ నుండును. సత్త్వమును బాసి రజము రజమునుబాసి సత్త్వము తమమును బాసి యీ రెంటిలోనే యొక్కటియు నెప్పుడును మనజాలవు. అట్లే తమ మీ రెంటినిబాసి యొంటిగ నిలువజాలదు. ఇవన్నియు మిథున ధర్మమున గలిసిననే తమ తమ కార్యప్రభావములు జూపగల్గును. ఈ త్రిగుణములు మూడు నొండొంటి నాశ్రయించుకొనియుండును. విడివిడిగ గడుపజాలవు. ఇవి పరస్పరముకూడి యొకటి రెండవ దానిని ప్రకటించుకొనుచుండును. ఒక్కొక్కప్పుడు సత్త్వమునుండి రజస్తమములు మరొకప్పుడు రజమునుండి సత్త్వతమములు గలుగుచుండును. మరొకప్పుడు తమమునుండి సత్త్వరజములు జనించును. మన్ను నుండి కుండ సిద్ధమగు చందముగ నివి పరస్పర మొకదానినుండి మరియొకటి పుట్టుచుండును. ఈ విధముగ త్రిగుణములును దేవదత్తుడు యజ్ఞదత్తుడు మున్నుగువారి బుద్ధి యందు సమావేశమై జంటలై యుండును. స్త్రీ పురుషులు పరస్పరము కలిసి మిథునధర్మమున లోకప్రవృత్తికి మూలమగునట్లే యీ గుణములు జంటలుగా నేర్పడి లోకప్రవర్తకము లగును. రజముతోగలిసి సత్వము సత్త్వముతోగలిసి రజము ఈ రెంటితోగలిసి తమమును జంటలు జంటలుగ వ్యవహరించునుండును. ఈ విధముగ నా తండ్రియగు బ్రహ్మత్రిగుణ స్వరూపములను తెల్లముగ వెల్లడించెను. అదంతయు విని నేను మరల నా తండ్రి నిట్లు ప్రశ్నించితిని:
అధ్యాయము 41బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
వ్యవసాయము చేసినందులకు ఫలితముగ లోకమున పుష్కలముగ నన్నము దొరకును. అటులే తీర్థసంసేవనకు ఫలముగ పాపనాశమగునని తెలిసికొనుము. ఈ దేహ వికారములగు కామక్రోధములు లోభమోహములు తృష్ణామదములు రాగద్వేషములు ఘోరపాతకములు అసూయ ఈర్ష్య అసహనము అశాంతి యనునవన్నియు పాప ఫలితములని తెలిసికొనుము. ఇవి యీ పాపిష్ఠతనువున గూడుకట్టుకొని పేరుకొని యుండును. వీనిమూలమున నరుడు పాపాత్ముడగును. ఆ నరుడెంతటి మహాపుణ్యతీర్థములో గ్రుంకినప్పటికి నీద్వంద్వ శత్రువులతని గుండెలో చోటుచేసికొని బయలువెడలకుండును. అపుడు జాగరూకత లేని కర్షకుని పగిది నతని శ్రమయంతయు వ్యర్థమగును. ఒక సేద్యగాడు పనికిమాలిన శ్రమయనుకొనక దుక్కిదున్ని పారవంతమొనర్చును. అతడందులో మేలైన విత్తనములు వేయును. ఈరీతిగ శ్రమించి వ్యవసాయము చేసిన కర్షకునకు మంచి ఫలము చేతికందును. ఇట్లాతడెక్కువ దిగుబడి నాశించి రేయింబవళ్లెండయనక వానయనక కష్టించి తన పొలమును కంటికిరెప్పగా జూచికొనును. కాని చలికాలమున పంటసిద్ధమైనపుడతడు నిదురించినచో పొలములో పులులుచేరి పంట చెఱచును. మిడుతలదండు వచ్చి పంట పొలమును తినివేయును. అపుడు రైతు హతాశుడై మిక్కిలిగ వగచును. అట్లే గుండెనిండ పాపరాసులు విషమువలె బాధలు పెట్టు చుండగ నెన్ని తీర్థములందు గ్రుంకిడిన నేమి ఫలితము? ఫలము సున్న; శ్రమ మిన్న.
ఉత్తమశాస్త్ర మెఱుగుటవలన సత్త్వము తేజరిల్లి వర్ధిల్లును. అపుడు తమము విరియును. వైరాగ్యము రూపుదాల్చిన బ్రహ్మజ్యోతిగ వెలుగొందును. ఇది సత్త్వగుణ ప్రకాశమునకు దృష్టాంతము ఇక రజస్తమస్సులు బలిమిని నరుని గుండెలో సులువుగచోటు చేసికొనును. ఈ రజము లోభముతో చేతులు గలిపి నాయంతవాడు లేడని మిట్టిపడును. అపుడా రజము సత్వతమోగుణముల రెంటిని మించి యెసంగును. తమస్సు ప్రమోహముతో బాసచేసి గ్రుడ్డి దగును. అది సత్త్వరజోగుణముల నతిక్రమించి మైమఱచియుండును. ఈ తమోగుణ ప్రాబల్యముగూర్చి విపులీకరింతును. వినుము: సత్వతేజమందు నెలకొన్నవాని కెల్లెడల నిర్మలసత్త్వమే వెలుగుబాట చూపుచుండును. అతడు సత్యధర్మమందే తన యమరజీవనము సాగించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సుభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజ ముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సులభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. ఇట్టి పుణ్యాత్ము డెల్లవేళల సర్వసంగపరిత్యాగ ధర్మమును పాటించును. ఇతరుల సుఖదుఃఖములను తనవిగ భావించును. మోక్షార్థియైన సాత్త్వికుడు రజోగుణమునకు రాగిల్లడు. దానికి దాసుడుగాడు. అంధతమస్సులో నేల బాధపడును? ఓ పుత్రా! ఇట్లు తెలివిగలవాడు మొదట రజమును పిదప తమమును త్రోసిరాజన వలయును. అపుడు శుద్ధమగు సత్త్వ మొక్కటియే వెలుగొందును. ఎవనియందు రజోగుణము ప్రబలునో యతడు సనాతన ధర్మములకు స్వస్తి చెప్పును. రాజసశ్రద్ధతో దేహాత్మభ్రాంతితో నధర్మము లొనర్చుచుండును. ఎవ్వనిలో రజోగుణము ప్రబలరూపము దాల్చునో యత డనర్థములవంటి యర్థములను సమకూర్చుకొనును. భోగములకు బానిస యగును. అపుడతనినుండి సత్త్వప్రకాశము చెప్పక పారిపోవును. అతని గుండెనిండ తమములు ముసురును. ఎవని యందు తమోగుణము తీవ్రరూపము దాల్చునో యతనియందు వేదముల-ధర్మముల-విషయమున విశ్వాసము సమసిపోవును. అతడు తామసశ్రద్ధతోకూడి దురభ్యాసములకు లొంగిపోవును. ధనము నిష్టము వచ్చినట్లు దుర్వ్యయము చేయును. ఎల్లెడల ద్రోహచింత దల పెట్టును. అట్టి వాని కాత్మశాంతి కరవగును.
క్రోధము ద్వేషము దుర్మతి శఠత్వముగల తామసుడు సత్త్వరజోగుణములను మంటగలిపి విషయలంపటుడై కామచారుడై తిరుగును. ఎక్కడను సత్త్వముగాని రజముగాని తమముగాని యొక్కటే నిలుకడజెంది యుండజాలదు. ఇవి యొండొంటితో గలిసి మిథునభావముగలవై జంటగ నుండును. సత్త్వమును బాసి రజము రజమునుబాసి సత్త్వము తమమును బాసి యీ రెంటిలోనే యొక్కటియు నెప్పుడును మనజాలవు. అట్లే తమ మీ రెంటినిబాసి యొంటిగ నిలువజాలదు. ఇవన్నియు మిథున ధర్మమున గలిసిననే తమ తమ కార్యప్రభావములు జూపగల్గును. ఈ త్రిగుణములు మూడు నొండొంటి నాశ్రయించుకొనియుండును. విడివిడిగ గడుపజాలవు. ఇవి పరస్పరముకూడి యొకటి రెండవ దానిని ప్రకటించుకొనుచుండును. ఒక్కొక్కప్పుడు సత్త్వమునుండి రజస్తమములు మరొకప్పుడు రజమునుండి సత్త్వతమములు గలుగుచుండును. మరొకప్పుడు తమమునుండి సత్త్వరజములు జనించును. మన్ను నుండి కుండ సిద్ధమగు చందముగ నివి పరస్పర మొకదానినుండి మరియొకటి పుట్టుచుండును. ఈ విధముగ త్రిగుణములును దేవదత్తుడు యజ్ఞదత్తుడు మున్నుగువారి బుద్ధి యందు సమావేశమై జంటలై యుండును. స్త్రీ పురుషులు పరస్పరము కలిసి మిథునధర్మమున లోకప్రవృత్తికి మూలమగునట్లే యీ గుణములు జంటలుగా నేర్పడి లోకప్రవర్తకము లగును. రజముతోగలిసి సత్వము సత్త్వముతోగలిసి రజము ఈ రెంటితోగలిసి తమమును జంటలు జంటలుగ వ్యవహరించునుండును. ఈ విధముగ నా తండ్రియగు బ్రహ్మత్రిగుణ స్వరూపములను తెల్లముగ వెల్లడించెను. అదంతయు విని నేను మరల నా తండ్రి నిట్లు ప్రశ్నించితిని:
అధ్యాయము 41బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment