సత్యవ్రతుని చరితము
జనమేజయు డిట్లనియె : ఆ సత్యవ్రత బ్రాహ్మణు డెవడు? అతడే దేశమందు జన్మించెను? అత డెట్టివాడు? ఇదంతయు నాకు విశదపఱచుము. అతడు ''ఐ'' కారము నెవనివలన వినెను? దాని నతడే విధముగ నుచ్చరించెను? అతనికి వెంటనే కల్గిన సిద్ధి యెట్టిది? ఆతని వలన సర్వాంతర్యామిని పరిపూర్ణ సర్వజ్ఞ యగు భగవతి యెట్లు సంతుష్టి జెందెను? ఆతని చమత్కారజనకమైన గాధను విస్తారముగ తెలుపుము అని రాజు ప్రశ్నింపగ సత్యవతీ సుతుడగు వ్యాసుడు తన రసభరితమైన వాక్కులతో నతని కిట్లనెను:
"జనమేజయా! ఒకప్పుడు నేనొక ముని సమాజములో నొక పరమ పౌరాణిక దివ్యగాథ వింటిని. దానిని వినపింతును, సావధానుడవై యాలకింపుము. నే నొకప్పుడు పావనతీర్థాటన మొనరించుచు మునిసేవితము పరమపవిత్రమునగు నైమిశారణ్యము జేరితిని. ఆ పుణ్యాశ్రమమునందు మహావ్రతులు జీవన్ముక్తులు మునిసత్తములు విధి పుత్త్రులు నివసించుచుండిరి. నేను వారి కెల్లర కభివందనము లాచరించితిని. అపుడా బ్రాహ్మణ సమాజమున సత్కథా కాలక్షేపము సాగుచుండెను.వారిలో జమదగ్ని ముని తక్కిన మునుల నిట్లు ప్రశ్నించెను:
"మహాభాగులగు తాపసులారా! నా మదిలో నొక సందియము గలదు. ఆ సందియమును మీరు దీర్పగలరని నమ్ముచున్నాను. బ్రహ్మ విష్ణువు శివుడు సురపతి వహ్ని వరుణుడు ధనపతి సేనాపతి గణపతి మిత్రుడు పవనుడు త్వష్ట అశ్వినీకుమారులు పూషుడు సర్వగ్రహములు చంద్రుడు అను దేవతలు గలరు గద! వీరందఱిలోను గొప్పగ కోరికలన్ని యొకేసారి త్వరలో తీర్చి పూజలందుకొనగల దేవదేవోత్తము లెవరు? సర్వజ్ఞులు సంశితవ్రతులు నగు మునివరులారా! వీరిలో నతిశీఘ్రముగ సుఖముగ సులభముగ సుప్రసన్నుడగు దేవుడెవడు? నిత్యము సేవనీయు డెవడు?
అను జమదగ్ని ప్రశ్న విని మునులలో లోమశముని యిట్లు పలికెను; ఓ జమదగ్ని మునీ! నీ వడిగిన ప్రశ్నకు సమాధాన మాలకింపుము. శ్రేయము ప్రేయము గోరుకొనువారు ఏకైకతత్త్వమగు పరాభట్టారికను లలితాదేవి నారాధింపవలయును. ఆమె సర్వమూల మూలము. పరాప్రకృతి. ఆద్య-శివ-సర్వద-సర్వగయని ప్రసిద్ధి కెక్కినది. ఆ తల్లి బ్రహ్మాది దేవతల కందఱకు మహాత్ములకు జనని. ఈ సంసార మహావృక్షమునకు మూలబీజము. ఆ శ్రీమాతృదేవీ నామ మమృత మధురము. ఆ మధురాతిమధురనామ ముచ్చిరించినంతనే లోకుల మనోరథము లీడేరును. నిరంతరము వరము లొసంగుట కా వరదాయిని దయార్ద్ర హృదయమున వరదహస్తయై సంసేవింపబడుచుండును. ఈ విషయమున నే నొక సుంద రేతిహాసము వినిపింతును. వినుము. మును పొక బ్రాహ్మణు డొక దివ్యాక్షర ముచ్చరించిన మాత్రన పరమసిద్ధి గాంచెను.
పూర్వము కోసలదేశమున దేవదత్తుడను బ్రాహ్మణుడు వాసి కెక్కెను. ఆతడు సంతాన హీను డగుటచే పుత్రార్థము విధిపూర్వకముగ యాగ మొనరించెను. ఆతడు తమసానదీతీరమునం దొక విశాలమండప మేర్పరచెను; వేదవిదులును యాగకర్మ కుశలురునైన బ్రాహ్మణోత్తముల నాహ్వానించెను. ఆత డచట విధి ప్రకారముగ యజ్ఞవేదిక నిర్మించి యందగ్నిని ప్రతిష్టించి యథావిధిగ పుత్రకామేష్టి జరిపెను. ఆ జన్నమునందు సుహోత్రుని బ్రహ్మగ యాజ్ఞవల్క్యు నధ్వర్యునిగ బృహస్పతిని హోతగ-పైలుని ప్రస్తోతగ గోభిలుని నుద్గాతగ నితరమునులను సదస్యులుగ నియమించి యథావిధిగ విస్తారముగ దానదక్షిణ లొసంగెను. అపుడు సామగుడగు నుద్గాత సప్తస్వరములు మేళవింప స్వరిత ప్రధానముగ రథంతర సామగాన మొనరించెను. అతడు మాటామాటికెగశ్వాస పీల్చుకొనుటలో గానమునందు స్వరభంగము జరిగెను. వెంటనే దేవదత్తుడు కుపితుడై గోభిలునితో నేను పుత్రార్థము కామ్యకర్మ చేయుచు జన్న మొనర్చుచుండగ నీవు మూర్ఖుడవై స్వరభంగ మొనర్చి యపశ్రుతి పల్కితివేమి? అనెను. అపుడు గోభిలుడును గినుకబూని దేవదత్తున కిట్లనియెను:
అను జమదగ్ని ప్రశ్న విని మునులలో లోమశముని యిట్లు పలికెను; ఓ జమదగ్ని మునీ! నీ వడిగిన ప్రశ్నకు సమాధాన మాలకింపుము. శ్రేయము ప్రేయము గోరుకొనువారు ఏకైకతత్త్వమగు పరాభట్టారికను లలితాదేవి నారాధింపవలయును. ఆమె సర్వమూల మూలము. పరాప్రకృతి. ఆద్య-శివ-సర్వద-సర్వగయని ప్రసిద్ధి కెక్కినది. ఆ తల్లి బ్రహ్మాది దేవతల కందఱకు మహాత్ములకు జనని. ఈ సంసార మహావృక్షమునకు మూలబీజము. ఆ శ్రీమాతృదేవీ నామ మమృత మధురము. ఆ మధురాతిమధురనామ ముచ్చిరించినంతనే లోకుల మనోరథము లీడేరును. నిరంతరము వరము లొసంగుట కా వరదాయిని దయార్ద్ర హృదయమున వరదహస్తయై సంసేవింపబడుచుండును. ఈ విషయమున నే నొక సుంద రేతిహాసము వినిపింతును. వినుము. మును పొక బ్రాహ్మణు డొక దివ్యాక్షర ముచ్చరించిన మాత్రన పరమసిద్ధి గాంచెను.
పూర్వము కోసలదేశమున దేవదత్తుడను బ్రాహ్మణుడు వాసి కెక్కెను. ఆతడు సంతాన హీను డగుటచే పుత్రార్థము విధిపూర్వకముగ యాగ మొనరించెను. ఆతడు తమసానదీతీరమునం దొక విశాలమండప మేర్పరచెను; వేదవిదులును యాగకర్మ కుశలురునైన బ్రాహ్మణోత్తముల నాహ్వానించెను. ఆత డచట విధి ప్రకారముగ యజ్ఞవేదిక నిర్మించి యందగ్నిని ప్రతిష్టించి యథావిధిగ పుత్రకామేష్టి జరిపెను. ఆ జన్నమునందు సుహోత్రుని బ్రహ్మగ యాజ్ఞవల్క్యు నధ్వర్యునిగ బృహస్పతిని హోతగ-పైలుని ప్రస్తోతగ గోభిలుని నుద్గాతగ నితరమునులను సదస్యులుగ నియమించి యథావిధిగ విస్తారముగ దానదక్షిణ లొసంగెను. అపుడు సామగుడగు నుద్గాత సప్తస్వరములు మేళవింప స్వరిత ప్రధానముగ రథంతర సామగాన మొనరించెను. అతడు మాటామాటికెగశ్వాస పీల్చుకొనుటలో గానమునందు స్వరభంగము జరిగెను. వెంటనే దేవదత్తుడు కుపితుడై గోభిలునితో నేను పుత్రార్థము కామ్యకర్మ చేయుచు జన్న మొనర్చుచుండగ నీవు మూర్ఖుడవై స్వరభంగ మొనర్చి యపశ్రుతి పల్కితివేమి? అనెను. అపుడు గోభిలుడును గినుకబూని దేవదత్తున కిట్లనియెను:
'నన్ను నీవు మూర్ఖుడ వంటివి. కనుక నీకు గల్గు కొడుకు మూర్ఖుడు శఠుడు శబ్దము నుచ్చరింపజాలనివాడుగ నగును గాక! ప్రాణులందఱిలోని యుచ్ఛ్వాస నిఃశ్వాసములు దుర్గ్రాహములై యుండును. కాన నో మహామతీ! స్వరభంగమునకు నన్ను దూషింప బనిలేదు.'
అను గోభిలముని వాక్కు వినగనే దేవదత్తుడు శాపభీతిచే దుఃఖితుడై యతనికిట్లనియెను:
అను గోభిలముని వాక్కు వినగనే దేవదత్తుడు శాపభీతిచే దుఃఖితుడై యతనికిట్లనియెను:
"ఓ విప్రోత్తమ! నిరపరాధుడనైన నాపై నీకింతకోపమేల? మునులు క్రోధరహితులు. పరమశాంతులు. సుఖము కలుగజేయువారు. ఓ బ్రాహ్మణోత్తమ! ఈపాటి కొద్ది తప్పునకే నన్నింతగ శపింపనేల? నేను మొదలే పుత్త్రులులేక దుఃఖించుచుండగ వ్రణములో కారము జల్లినట్లు నన్నింకను సంతాప మొందింపజేసితివేల? మూర్ఖపుత్రునికన్న అపుత్త్రత్వంబు మేలని వేదవిదులు వక్కాణింతురు. అందునను బ్రాహ్మణుడు మూర్ఖుడైనచో నతనిని ప్రతివాడు తెగనిందించును. అట్టి వాడెల్ల కార్యములందు పశువువలె శూద్రునివలె పనికిమాలిన వాడగును. నాకట్టి మూర్ఖ పుత్రునివలన ప్రయోజనమేముండును? మూర్ఖ విప్రుడు శూద్రతుల్యుడు. అతడెల్ల శుభకర్మలందు పూజకు అనర్హుడు. దానమునకు అయోగ్యుడు, నిందాపాత్రుడు అగును. ఇందు నెంతమాత్రము సందేహము లేదు. తన దేశమందు వేదబాహ్యుడై వసించు విప్రుని నుండి శూద్రునినుండివలె రాజు పన్నులు గ్రహింపవచ్చును. ఆ మూర్ఖుడు దేవపితృ కార్యములకు యోగ్యుడుకాడు. శుభములు కాంక్షించువాడు మూర్ఖ విప్రున కాసనాదులొసంగడు.
రాజు వేదమురాని మూర్ఖువిప్రుని శూద్రునిగ భావించి యతనిచేత వ్యవసాయపు పనులు చేయించవచ్చును. శుభ కార్యములందతనిని నియోగింపకూడదు. మూర్ఖవిప్రుని శ్రాద్ధభోక్తగ నిమంత్రణము చేయరాదు. అట్టిస్థితిలో దర్భలపై నన్నముంచి యైన కార్యము జరుపుకొనవలయును. ఆ వేదమునేర్వని మూర్ఖున కతనికివలసిన ఆహారముకంటె నెక్కువ అన్నము నీయరాదు. అట్లిచ్చినచో నిచ్చినవాడును తిన్నవాడును అధికముగ నరకముల పాలగుదురు. ఎచ్చోట వేదవిహీనులైను మూర్ఖద్విజులు దానసత్కారమయులతోడ పూజింపబడుదురో యారాజ్యము వ్యర్థము. ఆ రాజును వ్యర్థుడే. వేద పండితులకు మూర్ఖులకు మధ్య నాసన పూజాదానములందు భేదముండి తీరవలయును. విబుధులు వీరిర్వురియంతరము గుర్తించి వర్తింపవలయును. దానమాన పరిగ్రహముల కారణముగ మూర్ఖుడెచ్చోట గర్విష్ఠుడై యుండునో యాదేశమందు పండితుడు వసింపరాదు. వేపపండ్లను కాకులే తినునుగాని మేలు జాతిపక్షులు తినవు. అటులే దుష్టులసంపదలు దుష్టులకే పనికివచ్చును. వేదపాఠ నిరతులగు విప్రులు న్యాయార్జితమైన యున్నము భుజించి వేధాభ్యాసమొనర్తురు. అట్టివారి పితరులు స్వర్గముల ప్రమోదమందుదురు. కావున నోగోభిల మునీశ! వేదవేత్త! ఇంతకు మిక్కిలిగ నేను నీకేమిచెప్పగలను? ఈ దురిత సంసారమందు మూర్ఖపుత్రత్వము మరణముకంటె గర్హింప దగినది. ఓ మహానుభావా! శాపము నిగ్రహించుము. నన్ననుగ్రహింపుము. నీ నిండుమనసు వెన్నవంటిది. నీవు దీనుల సముద్ధరింప సమర్థుడవు. నీ పాదములమీద నా తల నుంతును.
లోముశు డిట్లనియె: అట్లు దేవదత్తుడు గోభిలునికి మ్రొక్కి దీనాశ్రులు కన్నులనిండ నిండగ గుండె దిగులుతో నతనిని సంస్తుతించెను. గోభిలు డా దీనవదనునిగని దయార్ద్రు డయ్యెను. మహాత్ములు క్షణకోపులు, పాపిష్ఠులు కల్పాంత క్రోధనులు గద! జలము సహజముగ చల్లగ నుండును. కాని యది యగ్నితాపమున వేడిగ నుండును. వేడిమిలేనిచో వెంటనే చల్లబడును. అంతట గోభిలుడు దయాళువై దుఃఖితుడగు దేవదత్తుని నీ పుత్త్రుడు మూఢుడయ్యు విధ్వాంసుడై పేరుగాంచును అని యనుగ్రహించెను. ఇట్లు గోభిలునివలన వరము బడసి దేవదత్తుడు ప్రసన్నుడై తన యాగము పూర్ణము గావించి విప్రులను దనిపి యనిపెను. కొన్ని దినములు గడచిన పిదప దేవదత్తుని భార్య రోహిణియను నామె రోహిణి పగిది గర్భవతి యయ్యెను. అంత దేవదత్తు డామెకు గర్భాదాన పుంసవనాది కర్మలు విధివిదానముగ జరిపించెను. వేదవిధానముగ సీమంతోన్నయనము జరిపించెను. యాగము సఫలముగ పరిసమాప్తమందుటవలన దేవదత్తుడు సంతుష్టుడై దానాది సత్క్రియ లొనరించెను. అంత నొక శుభదినము నందు రోహిణి రోహిణీ నక్షత్రమున శుభలగ్న మందొక చక్కని పుత్త్రుని గనెను. దేవదత్తు డా బాలుని జాతకము దైవజ్ఞులకు చూపి జాతకర్మదులు జరిపించెను. ఆ కుమారుని ముఖలక్షణములు వీక్షించి పూర్వ విదులతనికి 'ఉతథ్యు'డను నామకరణము చేసిరి.
దేవదత్తుడు తన కొడుకున కెనిమిదవయేట శుభముహూర్తమున యథావిథిగ నుపనయన సంస్కారమొనరించెను. బ్రహ్మచర్య వ్రతస్థుడగు వటునకు గురువు వేదము పాఠము చెప్పెను. కాని యుతథ్యుడు ముగ్ధునిపగిదినుండి యేమియునుచ్చరింపలేదు. అతని తండ్రియు నతని నెన్నో రీతుల చదివించిచూచెను. కాని యతడు తన మనసులో చదువు నిల్పుకొనలేక మూఢునివలె తెల్లమొగమున నుండెను. తన కొమరుని దుస్థ్సితికతని తండ్రి మిక్కిలి దురపిల్లెను. ఇట్లు పండ్రెండేండ్లు వచ్చునప్పటి కాబాలుడు యథావిధిగ సంధ్యా వందనాది విధులొనర్చు టెఱుగకుండెను. అతడు మహామూర్ఖుడనువార్తబ్రాహ్మణ తాపసులకు లోకమంతటి కెగబ్రాకెను. అతడెచ్చటికేగినను జనమతనినిగని పరిహసించు చుండెను. అతని తలిదండ్రులు నతనిని బెదరించుచు నిందించుచుండిరి. ఈ విధముగ నా మూర్ఖవిప్రుడు తన తల్లిదండ్రులచే బందుగులచే నిందింపబడి 'కుంటి గ్రుడ్డి కొడుకులున్నచో నేదో కొంతమేలే యగును. కాని మూర్ఖ పుత్త్రుడుండుట నిరర్థక మని తన తలిదండ్రులును పలుకగా విని యతడు వైరాగ్యముతో నడవులు పట్టెను. ఆతడు పావనగంగా నదీతారముననొక పవిత్రస్థలమున పర్ణ కుటీరమేర్పరచుకొని వన్యవృత్తితో నిశ్చలమతితో నందు తన కాలము వెళ్ళబుచ్చుచుండెను. 'నే నేవిధముగనైన నెన్నడైన నసత్యమాడ నని ప్రతిని బూని యతడు తన శుభాశ్రమమున బ్రహ్మచర్యమున గడపుచుండెను.
అధ్యాయము 43 వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
రాజు వేదమురాని మూర్ఖువిప్రుని శూద్రునిగ భావించి యతనిచేత వ్యవసాయపు పనులు చేయించవచ్చును. శుభ కార్యములందతనిని నియోగింపకూడదు. మూర్ఖవిప్రుని శ్రాద్ధభోక్తగ నిమంత్రణము చేయరాదు. అట్టిస్థితిలో దర్భలపై నన్నముంచి యైన కార్యము జరుపుకొనవలయును. ఆ వేదమునేర్వని మూర్ఖున కతనికివలసిన ఆహారముకంటె నెక్కువ అన్నము నీయరాదు. అట్లిచ్చినచో నిచ్చినవాడును తిన్నవాడును అధికముగ నరకముల పాలగుదురు. ఎచ్చోట వేదవిహీనులైను మూర్ఖద్విజులు దానసత్కారమయులతోడ పూజింపబడుదురో యారాజ్యము వ్యర్థము. ఆ రాజును వ్యర్థుడే. వేద పండితులకు మూర్ఖులకు మధ్య నాసన పూజాదానములందు భేదముండి తీరవలయును. విబుధులు వీరిర్వురియంతరము గుర్తించి వర్తింపవలయును. దానమాన పరిగ్రహముల కారణముగ మూర్ఖుడెచ్చోట గర్విష్ఠుడై యుండునో యాదేశమందు పండితుడు వసింపరాదు. వేపపండ్లను కాకులే తినునుగాని మేలు జాతిపక్షులు తినవు. అటులే దుష్టులసంపదలు దుష్టులకే పనికివచ్చును. వేదపాఠ నిరతులగు విప్రులు న్యాయార్జితమైన యున్నము భుజించి వేధాభ్యాసమొనర్తురు. అట్టివారి పితరులు స్వర్గముల ప్రమోదమందుదురు. కావున నోగోభిల మునీశ! వేదవేత్త! ఇంతకు మిక్కిలిగ నేను నీకేమిచెప్పగలను? ఈ దురిత సంసారమందు మూర్ఖపుత్రత్వము మరణముకంటె గర్హింప దగినది. ఓ మహానుభావా! శాపము నిగ్రహించుము. నన్ననుగ్రహింపుము. నీ నిండుమనసు వెన్నవంటిది. నీవు దీనుల సముద్ధరింప సమర్థుడవు. నీ పాదములమీద నా తల నుంతును.
లోముశు డిట్లనియె: అట్లు దేవదత్తుడు గోభిలునికి మ్రొక్కి దీనాశ్రులు కన్నులనిండ నిండగ గుండె దిగులుతో నతనిని సంస్తుతించెను. గోభిలు డా దీనవదనునిగని దయార్ద్రు డయ్యెను. మహాత్ములు క్షణకోపులు, పాపిష్ఠులు కల్పాంత క్రోధనులు గద! జలము సహజముగ చల్లగ నుండును. కాని యది యగ్నితాపమున వేడిగ నుండును. వేడిమిలేనిచో వెంటనే చల్లబడును. అంతట గోభిలుడు దయాళువై దుఃఖితుడగు దేవదత్తుని నీ పుత్త్రుడు మూఢుడయ్యు విధ్వాంసుడై పేరుగాంచును అని యనుగ్రహించెను. ఇట్లు గోభిలునివలన వరము బడసి దేవదత్తుడు ప్రసన్నుడై తన యాగము పూర్ణము గావించి విప్రులను దనిపి యనిపెను. కొన్ని దినములు గడచిన పిదప దేవదత్తుని భార్య రోహిణియను నామె రోహిణి పగిది గర్భవతి యయ్యెను. అంత దేవదత్తు డామెకు గర్భాదాన పుంసవనాది కర్మలు విధివిదానముగ జరిపించెను. వేదవిధానముగ సీమంతోన్నయనము జరిపించెను. యాగము సఫలముగ పరిసమాప్తమందుటవలన దేవదత్తుడు సంతుష్టుడై దానాది సత్క్రియ లొనరించెను. అంత నొక శుభదినము నందు రోహిణి రోహిణీ నక్షత్రమున శుభలగ్న మందొక చక్కని పుత్త్రుని గనెను. దేవదత్తు డా బాలుని జాతకము దైవజ్ఞులకు చూపి జాతకర్మదులు జరిపించెను. ఆ కుమారుని ముఖలక్షణములు వీక్షించి పూర్వ విదులతనికి 'ఉతథ్యు'డను నామకరణము చేసిరి.
దేవదత్తుడు తన కొడుకున కెనిమిదవయేట శుభముహూర్తమున యథావిథిగ నుపనయన సంస్కారమొనరించెను. బ్రహ్మచర్య వ్రతస్థుడగు వటునకు గురువు వేదము పాఠము చెప్పెను. కాని యుతథ్యుడు ముగ్ధునిపగిదినుండి యేమియునుచ్చరింపలేదు. అతని తండ్రియు నతని నెన్నో రీతుల చదివించిచూచెను. కాని యతడు తన మనసులో చదువు నిల్పుకొనలేక మూఢునివలె తెల్లమొగమున నుండెను. తన కొమరుని దుస్థ్సితికతని తండ్రి మిక్కిలి దురపిల్లెను. ఇట్లు పండ్రెండేండ్లు వచ్చునప్పటి కాబాలుడు యథావిధిగ సంధ్యా వందనాది విధులొనర్చు టెఱుగకుండెను. అతడు మహామూర్ఖుడనువార్తబ్రాహ్మణ తాపసులకు లోకమంతటి కెగబ్రాకెను. అతడెచ్చటికేగినను జనమతనినిగని పరిహసించు చుండెను. అతని తలిదండ్రులు నతనిని బెదరించుచు నిందించుచుండిరి. ఈ విధముగ నా మూర్ఖవిప్రుడు తన తల్లిదండ్రులచే బందుగులచే నిందింపబడి 'కుంటి గ్రుడ్డి కొడుకులున్నచో నేదో కొంతమేలే యగును. కాని మూర్ఖ పుత్త్రుడుండుట నిరర్థక మని తన తలిదండ్రులును పలుకగా విని యతడు వైరాగ్యముతో నడవులు పట్టెను. ఆతడు పావనగంగా నదీతారముననొక పవిత్రస్థలమున పర్ణ కుటీరమేర్పరచుకొని వన్యవృత్తితో నిశ్చలమతితో నందు తన కాలము వెళ్ళబుచ్చుచుండెను. 'నే నేవిధముగనైన నెన్నడైన నసత్యమాడ నని ప్రతిని బూని యతడు తన శుభాశ్రమమున బ్రహ్మచర్యమున గడపుచుండెను.
అధ్యాయము 43 వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment