శ్రీదేవి యజ్ఞ విధానము
స్వామీ! ఆ పరాదేవీ యజ్ఞవిధానము నాకు చక్కగ నెఱిగింపుము. దానిని విని యథాశక్తిగ నిశ్చలమతితో యాగమొనరింపగలను. శ్రీ మహాదేవీ యాగమునకు పూజా విధానమెట్టిది? ఏ మంత్రములు పఠించవలయును? ఏయే ద్రవ్యములావశ్యములు? ఎందఱు విప్రులు గావలయును. ఎంత దక్షిణలీయవలయును? ఇదంతయును నాకు సవిస్తరముగ దెలుపుము అని జనమేజయుడడుగ
వ్యాసుడిట్లనెను: భూపతీ! ఆ దేవీ యజ్ఞవిధానము దెలుపు ఆలకింపుము! ఇది వేదోక్తమును విధ్యుక్తమునగు యాగము. సాత్త్వికము మునులకును రాజసము రాజులకును తామసము రాక్షసులకును సంబంధించినవి. ఆత్మానాత్మ వివేకముగల జ్ఞానులు చేయు యాగము నిర్గుణ మైనది. అనగా అట్టి విముక్తుల యాగము పరిపూర్ణ జ్ఞానమయమై యొప్పారును. వానినన్నిటిని తేటతెల్లముగ వివరింతును వినుము. దేశకాలమంత్ర ద్రవ్యములలో బ్రాహ్మణులతో గూడి సాత్త్వికశ్రద్ధతో వెలయు యాగము సాత్త్విక యజ్ఞము. మంత్ర ద్రవ్యక్రియా శుద్ధులతో జరుగు యాగము సంపూర్ణఫలప్రదమగును. అన్యాయముగ సంపాదించిన డబ్బుతో చేసిన యాగమువలన నీ లోకమున కీర్తియు పరలోకమున సౌఖ్యమును గలుగజాలవు. కావున న్యాయధర్మములతో గడించిన ద్రవ్యములతో యాగ మొనరించినచో నిహమందు కీర్తియు పరమందు సుఖశాంతులను గల్గును.
పాండవులు భూరిదక్షిణలతో రాజసూయమను మహాయాగమొనరించుటెల్ల నీవెఱింగినదే కదా! అందు మహామనస్వియు యదువంశ తిలకుడునగు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగ నుండెను. సకల విద్యాపారంగతులగు భారద్వాజాది బ్రాహ్మణులు నుండిరి. ఆ యజ్ఞము పురిపూర్ణమైన పిదప నొక నెలకే వారు దారుణమైన వనవాస క్లేశము లనుభవించిరి. జూదమునందోటమి ద్రౌపది పరాభవము దుర్గమ వనవాస క్లేశములు వారనుభవించిరి గదా! మఱి వారి యాగఫలిత మేమైనట్లు? మహోర్జితులు మానధనులు ద్రౌపదీసహితులగు పాండవులు విరాటుని చెంత దాస్యమొనర్చిరే! రూపాభిమాని దుర్విదగ్ధుడు బలగర్వితుడునగు కీచకాధమునిచేత నారీమణి ద్రౌపది లాగబడినదే! అట్టి సంకటపరిస్థితులలో నెల్ల బ్రాహ్మణుల యాశీర్వచన బలము లేమయ్యెను? వాసుదేవునందలి వారి నిశ్చల భక్తికి ఫలిత మేమయ్యెను? ఆ సాధ్వీమతల్లియగు ద్రౌపదిని రక్షించువారే సభలో లేకపోయిరే! అయ్యో! ఆ పతివ్రతాతిలకము తలవెంట్రుకలు పట్టి నిండుకొలువులో నేలవడనీడ్చిరి గదా! సర్వభూతాత్మకుడగు వాసుదేవుడును ధర్మసుతుడగు ధర్మరాజును బ్రదికియుండగనే ధర్మమునకు గ్లాని యేర్పడెను గద! దీని కంతటికిని కారణమేమో విచారింపవలసి యున్నది. దీనికంతటికిని భవితవ్యతయే కారణ మందుమా! అది సరిగాదు. అట్లన్నచో ఆగమములు నిష్ఫలములగును. వేద మంత్రములు పొల్లుమాటలగును. ఇది నిజము. ఇంతేకాక ఇతరోపాయములన్నియు సాధనములన్నియు నిరర్థకములు నిష్పలములు నగును. కేవలము భవితవ్యతకే బలము చేకూరును. అత్తరినెల్ల యాగమములు నర్థవాదములగును. కర్మములు నిరర్థకములగును. స్వర్గ నిమిత్తమైన తపము వ్యర్థమగును. వర్ణాశ్రమ ధర్మములు వ్యర్థములగును. భవితవ్యత యొకటే హృదయములలో బలపడినచో దైవమును సర్వప్రమాణములు నుపాయములును వ్యర్థములగును. మన మొనరించిన మంచిపనికేదైన వైపరీత్యము జరిగినచో నందేదియో దోషమున్నదని విజ్ఞులు పండితులు భావింపవలయును. కర్మ బహువిధములుగ నుండునని కర్మవిదులగువారందురు. ప్రతి కర్మమును కర్తృభేదమున మంత్రభేదమున ద్రవ్యభేదమున ననేకభేదముల నొప్పుచుండును.
ఎట్లన - తొల్లి యింద్రుడు విశ్వరూపుడనువానిని తన గురువుగ వరించెను. కాని యా గురువు తన తల్లి పక్షమువారగు రాక్షసుల హితమునుకోరి విపరీతకార్యమొనరించెను. ఆ గురువు దేవతలకు (ప్రత్యక్షముగ) రాక్షసులకు (పరోక్షముగ) స్వస్తియగుగాక యని మాటమాటకు పలికెను. మాతృపక్షమువారగు రాక్షసులు కూడ రక్షణ చేసెను. మంత్రబలమున పుష్టిజెందిన దానవులగని యింద్రుడు కోపించి తన వజ్రముతో విశ్వరూపుని శిరములను శీఘ్రముగ ఖండించెను. ఇట్లిచట కర్తృభేదమున నిస్సంశయముగ క్రియలో దోషము సంభవించినది. కర్మ వైగుణ్యము లేనిచో నధికఫలము కలుగును. ఎట్లనగా-పాంచాల రాజగు ద్రుపదుడు రోషముతో యాగమొనర్చినను ద్రోణాచార్యుని నాశము చేయగల పుత్త్రుడు గలుగవలయునని మాత్రమే భావించి యాగము చేసినను ఫలితముగ యజ్ఞవేదినుండి ధృష్టద్యుమ్నుడుదయించుటయేకాక అధికముగ ద్రౌపదియును యాగమున సంభవించినదిగదా! తొల్లి యపుత్త్రకుడగు దశరథుడు ఒక్క కుమారుని కొఱకు పుత్త్రకామేష్టి యొనరింపగ యజ్ఞాగ్ని నుండి నలువురు కుమారులుద్భవించిరి. కాననోమహీశా! యుక్తితో చేసిన ప్రతి పనియు సిద్ధించును. అయుక్తితో చేసిన ప్రతి పనియు విపరీతఫలమొసంగును. యాగమందలి కొలది దోషమువలన పాండవులు జూదమందోడుట మున్నగు వ్యతిరేక ఫలములందిరి. సత్యవాదియు ధర్మసుతుడునగు యుధిష్ఠిరుడు నతని తమ్ములును ద్రాపదియు నిందఱుండియు శుభులైనవారు ఇందఱున్నను పాపద్రవ్యము వలనో సాభిమానత్వము కారణముననో వారుచేసిన యాగమునందు వైగుణ్యమును దానివలన విపరీత ఫలమును ప్రాప్తించినవి. రాజవర్యా! సాత్విక యజ్ఞము కడుంగడు దుర్లభమైనది. అది కేవలము వైఖానస వ్రతనిష్ఠులగు మునివర్యులకే విధింపబడినది.
అట్టి తాపసోత్తములు న్యాయార్జితము వన్యము ఋషిహితకరము సుసంస్కృతమునగు స్తాత్విక భోజనము చేయుదురు. అదే మేలైనది. పురోడాశములు మాత్రము గలిగియూ పరహితమై శ్రద్ధాభక్తులతో పరమ సంయమముతో సమంత్రకముగ నొనర్పబడు యజ్ఞములు సాత్త్విక యజ్ఞములనబడును. ఇక రాజస యజ్ఞములు ద్రవ్యబహుళమై యూపస్తంభము గలిగి అభిమాన సహితములై యుండును. అవి క్షత్త్రియులకు వైశ్యులకు విహితములు. కామక్రోధములను మదలోభములను నినుమడింప జేయునని సంస్కారము గలవి క్రూరములునగు యాగములు తామసయాగములు. అవి రాక్షసులకు మహాత్ములచే ప్రోక్తములు. ముముక్షులు విరక్తులు మహాత్ములునైన మునులకు సర్వసాధనసహితమైన మానస యజ్ఞము చెప్పబడినది. ఇతర యాగములందు కొంచెము లోపమున్నను నది పూర్ణము కాదు. బ్రాహ్మణుల శ్రద్థ ద్రవ్యము క్రియ మున్నగు వాని విషయమున లోపములుండవచ్చును. అటులే దేశకాల సాధనములందును లోటుపాటులుండవచ్చును. అట్టియెడ అవి మానస యాగమువలె పరిపూర్ణములును దోషరహితములును గావు. మానసయజ్ఞమొక్కటే దోషరహితమై పూర్ణమై శుద్ధమై వెల్లును. మొదట మన మనస్సు పరిశుద్ధమగును. దాన దేహము గూడ శుద్ధ (పాపరహిత) మగును. విషయరహితమై వృత్తులుబాసి నిర్మలమైన చిత్తముకల యతడే నిజమైన యజ్ఞాధికారి. అట్టి తగిన యాగాధికారి తన హృదయాంతరాళములో చక్కని యజ్ఞ వృక్షముల స్తంభములతో పెక్కు యోజనముల వఱకు చల్లని దేవీ మండపములు కల్పించుకొనవలయును. ఆ మండపమున తన పవిత్రమైన మనసుచే చక్కని యజ్ఞవేదికను కల్పించుకొని యందగ్నులను విధివిధానముగ తన మనసుచే ప్రతిష్టింపవలయును.
ఆ మానసయాగమును బ్రహ్మ-అధ్వర్యుడు-హోత-ప్రస్తోత ఉద్గాత-ప్రతిహర్త యితర సభ్యులు మున్నగు బ్రాహ్మణోత్తములను యథావిధిగ ఋత్విక్కులుగ వరించవలయును. మఱియు నా యాగమందు ఆ ఋత్విక్కులను మనస్సుతోనే విధ్యుక్తముగ పూజింపవలయును. ఆ యజ్ఞవేదికయందు ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము-సమానము అను పంచప్రాణములను పంచాగ్నులను స్థాపింపవలయును. వానిలో ప్రాణమును గార్హపత్యాగ్నిగ అపానము నాహవనీయముగ వ్యానమును దక్షిణాగ్నిగ సమానము నావసథ్యాగ్నిగను ఉదానమును సభ్యాగ్నిగను నీ పంచాగ్నులు పరమోత్కృష్టములుగ చెప్పబడినవి. ఈ పావకులు కామప్రదులు-మహాశ్రేష్ఠులు. ఆ పిదప నంతరంగమందు పరమపావనమైన నిర్గుణ ద్రవ్యములను భావించి సమకూర్పవలయును. ఆ మానసయజ్ఞమందు మనస్సును హోతగ యజమానునిగ నెన్నవలయును. యజ్ఞాధి దేవతగ నిర్గుణ సనాతన పరబ్రహ్మమే యుండవలయును. నిర్గుణ శివాశక్తి మోక్షఫలప్రదాయిని-బ్రహ్మవిద్య-సదాధార-సర్వవ్యాపినియై యంతట జ్యోతిర్మయియై వెలుగొందును. ఆ తరువాత శ్రీ నిర్గుణ జగదంబ నుద్దేశించి కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నిలో వేయవలయును. పిదప చిత్తప్రాణముల నేకగ్రీవముగ నిరాధారముగ సంకల్పరహితముగ నొనరింపవయలును. ప్రాణములను కుండలీ ముఖమార్గమున పరబ్రహ్మమందు లగ్న మొనరింపవలయును. అట్టి స్థితిలో సంకల్పవికల్పములు బ్రహ్మసమాధిలో నశించును. ఆత్మసాధకుడు స్వాత్మానుభవముతో సర్వాత్మభూతయగు మహేశ్వరిని స్వయముగ సమాధియోగమున నిర్వికల్పుడై ధ్యానింపవలయును. అపుడా యోగి సర్వభూతములను తన యాత్మలోను తన్ను సర్వభూతాత్మలోనూ నున్నట్లు తెలివివెలుగుతో దెలిసికొనగలుగును. అపుడా విధేయాత్ముడు పరమదివ్యమంగళ విగ్రహ శివ యగు శ్రీదేవి సందర్శనభాగ్య మనుభవించగలడు. ఆ పరమయోగి సచ్చిదానందస్వరూపిణిలో లీనమై బ్రహ్మానంద భూయము నందును. దాన ఆ నాడీ హృదయ దౌర్బల్యములు దగ్ధమైపోవును. తనువు మాత్రము ప్రారబ్ధమనుభవించుటకు నిలుచును. ఇట్లా జగదంబను మానసయాగమున నెవడు ధ్యానించునో వాడు సోమపానము చేసినవాడగును. కృతకృత్యుడు-జీవన్ముక్తుడు నగును. వాని యెల్ల కాలమములు ఫలించును. అతడు పరమ నిఃశ్రేయసమందగలడు. ఇది నిజము.
కనుక శ్రీభువనేశ్వరీదేవిని గురు వాక్యములను బట్టి ప్రయత్నించి తెలిసికొని ధ్యానించవలయును. ఇట్లు నిశ్చలముగ నొనరించిన మానసయజ్ఞము నిస్సంశయముగ పరమపద సౌఖ్య మొనగూర్చగలదు. ఇతర యాగములు సకామములై క్షణఫలము లగును. స్వర్గకాములు విధిగా నగ్నిష్టోమయాగ మొనర్పవలయునని వేదములు శాసించుచున్నవని మనీషులందురు. కాని వారును క్షీణపుణ్యులై తిరిగి మర్త్యలోకమునకు వత్తురు. కనుక నక్షయ ఫలప్రదమైన మానసయజ్ఞమే యెల్ల విధముల సర్వశ్రేష్ఠమైనది. జయకాంక్షులగు రాజుల కీ మానసయాగము సాధ్యముగాదు. నీవును తొల్లి తామస చిత్తవృత్తితో సర్పయాగ మొనరించితివి. నీవు నీ శత్రువగు తక్షకునితో పగ సాధించుట కనేక సర్పముల నిండుప్రాణముల నగ్ని కాహుతి యొనర్చితివి. కనుక నీ విపుడు భవ్యమైన శ్రీదేవీ మహాయజ్ఞము విధిప్రకార మాచరింపుము. పూర్వము సృష్టి ప్రారంభమునందా యజ్ఞమును శ్రీమహావిష్ణు వాచరించెను. అదే విధముగ నీవును శ్రీదేవీయాగ మొనరింపుము. నీ కా యజ్ఞ విధానము తెలియపఱచెదను. వేదవిదులగు బ్రాహ్మణులు యజ్ఞ విధానము సమగ్రముగ నెఱిగినవారు గలరు. వారు మంత్రశాస్త్రవేత్తలు. సమయమార్గ విచక్షణులు. శ్రీకామరాజ బీజ విధానజ్ఞులు. అట్టి వారు యాజకులుగ నుందురు. నీవు యజమానుడవు కమ్ము. నీవు విధిగ శ్రీదేవీ యజ్ఞ మాచరించి యాగఫలమును నీ పితరుల కొసంగి వారిని దుర్గతులనుండి సముద్ధరింపుము. ఏ విప్రునైన నిందించిన దోషము దుర్భరమును నరకప్రదము నగును. నీ తండ్రి కట్టి విప్రనిందవలన దోషము సంప్రాప్తమైనది.
నీ తండ్రి పాముకాటుచే నంతరాళమున దుర్మరణ మొందెను. ఆతడు దర్భలపైగాని భూమిపైగాని చావలేదు. ఓ కురువరా! ఓ తండ్రి చావు రణమునగాని పావనగంగానదిలోగాని జరుగలేదు. ఆతని భవనమందే స్నాన దాన రహితముగ సంభవించినది. ఓ నరవరా! కుత్సితమైన పనులన్నియు నరకమునకై దారి తీయును. వానిలో నే యొక్కటియు జీవుల నుద్ధరింపజాలదు. కావున ప్రతి ప్రాణియు నెచ్చటనైన నెప్పుడైన తనకు కాలము మూడినచో తాను సాధనరహితుడైనను సంకటములలో బడియున్నను నిర్మలచిత్తముతో వైరాగ్యసంపన్నుడై యిట్లు చింతింపవలయును: ''ఈ దేహము పాంచ భౌతికము; దుఃఖదాయకము; నాకేదియులేదు. ఈ శరీరము నేడు పడిపోయినపోవుగాక! ఆత్మస్వరూపుడనగు నేను శాశ్వతుడను; ముక్తుడను; నిర్గుణుడను. ఈ భౌతిక పదార్థములు నశ్వరములు. ఇక వీనికొఱకు శోకింపనేల? నేనే సనాతనుడను; నేనే సదాముక్తుడను; నేనే బ్రహ్మమను; నేనే సంసారముక్తుడను; నా కీ శరీరముతో నెట్టి సంబంధమును లేదు. కర్మలవలననే నా కీ తనువుతో సంబంధ మేర్పడినది. మానవుడీ దేహసంబంధమువలన సుఖదుఃఖ సాధనములను శుభాశుభములను ననుభవించును. నేను భయంకరము-ఘోరము-దుఃఖదమునైన సంసారసాగర మందుండి విముక్తుడనైతిని'' అని యిట్లు చింతించువాడు. స్నానదానములు చేయనవసరములేదు. అతడు మరణించి జన్మమరణ దుఃఖములనుండి విడువబడును. ఇది పరమయోగులకును దుర్లభమైన పరకాష్ఠాగతి. ఓ నరశార్దూలా! నీ తండ్రి విప్రశాపము విని గూడ తన శరీరమందలి మమకారము వదలుకొనలేకపోయెను. వైరాగ్యభాగ్య మందలేక చిక్కులోబడి ఈ చెప్పబోవు విధమున పలుకుచుండెను:
'నే నెట్లు రోగముక్తుడ నగుదును? నా రాజ్య మెట్లు నిష్కంటకముగ నుండగలదు? నే నెట్లు జీవింపగలను? మంత్ర విదులను రావింపుడు' అని పలికెను. ఇట్లు నీ తండ్రి మణిమంత్రౌషధములతో యంత్రములతో తన చావును బాపుకొనుటకు సౌధోపరిభాగమున తలదాచుకొనెను. అట్టి చావుదశలోగూడ నీ తండ్రి శ్రీదేవి నొక్కసారియైన భక్తితో నమ్మా! యని నోరార పిలిచి యెఱుగడు. స్నానదానములు చేసికొనలేదు. దైవము బలవత్తరమైనదని నేల పై నైనను శయనింపలేదు. తుదకు కలి ప్రభావమున తాప సోత్తము నవమానించిన ఫలముగ మోహార్ణవమందు మునిగి నీ తండ్రి మేడపై ఘోర దుర్మరణమునకు బలియయ్యెను. ఇట్టి వానివలన తప్పక నరకము ప్రాప్తమగును. కాన నీ విపుడు నీ పితరుని పాపకూపము నుండి సముద్ధరింపుము. అమితతేజస్వి యగు వ్యాసుని యీ వచనము లాలకించి జనమేజయుడు కనులనిండ దుఃఖాశ్రులు నిండగ రుద్ధకంఠముతో విలపించుచు నా తండ్రికి సద్గతి గల్గనిచో నా జీవితము వ్యర్థము. కాన నా తండ్రికి సద్గతులు గల్గునట్టు లొనర్తును అని పలికెను.
అధ్యాయము 45 శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
పాండవులు భూరిదక్షిణలతో రాజసూయమను మహాయాగమొనరించుటెల్ల నీవెఱింగినదే కదా! అందు మహామనస్వియు యదువంశ తిలకుడునగు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగ నుండెను. సకల విద్యాపారంగతులగు భారద్వాజాది బ్రాహ్మణులు నుండిరి. ఆ యజ్ఞము పురిపూర్ణమైన పిదప నొక నెలకే వారు దారుణమైన వనవాస క్లేశము లనుభవించిరి. జూదమునందోటమి ద్రౌపది పరాభవము దుర్గమ వనవాస క్లేశములు వారనుభవించిరి గదా! మఱి వారి యాగఫలిత మేమైనట్లు? మహోర్జితులు మానధనులు ద్రౌపదీసహితులగు పాండవులు విరాటుని చెంత దాస్యమొనర్చిరే! రూపాభిమాని దుర్విదగ్ధుడు బలగర్వితుడునగు కీచకాధమునిచేత నారీమణి ద్రౌపది లాగబడినదే! అట్టి సంకటపరిస్థితులలో నెల్ల బ్రాహ్మణుల యాశీర్వచన బలము లేమయ్యెను? వాసుదేవునందలి వారి నిశ్చల భక్తికి ఫలిత మేమయ్యెను? ఆ సాధ్వీమతల్లియగు ద్రౌపదిని రక్షించువారే సభలో లేకపోయిరే! అయ్యో! ఆ పతివ్రతాతిలకము తలవెంట్రుకలు పట్టి నిండుకొలువులో నేలవడనీడ్చిరి గదా! సర్వభూతాత్మకుడగు వాసుదేవుడును ధర్మసుతుడగు ధర్మరాజును బ్రదికియుండగనే ధర్మమునకు గ్లాని యేర్పడెను గద! దీని కంతటికిని కారణమేమో విచారింపవలసి యున్నది. దీనికంతటికిని భవితవ్యతయే కారణ మందుమా! అది సరిగాదు. అట్లన్నచో ఆగమములు నిష్ఫలములగును. వేద మంత్రములు పొల్లుమాటలగును. ఇది నిజము. ఇంతేకాక ఇతరోపాయములన్నియు సాధనములన్నియు నిరర్థకములు నిష్పలములు నగును. కేవలము భవితవ్యతకే బలము చేకూరును. అత్తరినెల్ల యాగమములు నర్థవాదములగును. కర్మములు నిరర్థకములగును. స్వర్గ నిమిత్తమైన తపము వ్యర్థమగును. వర్ణాశ్రమ ధర్మములు వ్యర్థములగును. భవితవ్యత యొకటే హృదయములలో బలపడినచో దైవమును సర్వప్రమాణములు నుపాయములును వ్యర్థములగును. మన మొనరించిన మంచిపనికేదైన వైపరీత్యము జరిగినచో నందేదియో దోషమున్నదని విజ్ఞులు పండితులు భావింపవలయును. కర్మ బహువిధములుగ నుండునని కర్మవిదులగువారందురు. ప్రతి కర్మమును కర్తృభేదమున మంత్రభేదమున ద్రవ్యభేదమున ననేకభేదముల నొప్పుచుండును.
ఎట్లన - తొల్లి యింద్రుడు విశ్వరూపుడనువానిని తన గురువుగ వరించెను. కాని యా గురువు తన తల్లి పక్షమువారగు రాక్షసుల హితమునుకోరి విపరీతకార్యమొనరించెను. ఆ గురువు దేవతలకు (ప్రత్యక్షముగ) రాక్షసులకు (పరోక్షముగ) స్వస్తియగుగాక యని మాటమాటకు పలికెను. మాతృపక్షమువారగు రాక్షసులు కూడ రక్షణ చేసెను. మంత్రబలమున పుష్టిజెందిన దానవులగని యింద్రుడు కోపించి తన వజ్రముతో విశ్వరూపుని శిరములను శీఘ్రముగ ఖండించెను. ఇట్లిచట కర్తృభేదమున నిస్సంశయముగ క్రియలో దోషము సంభవించినది. కర్మ వైగుణ్యము లేనిచో నధికఫలము కలుగును. ఎట్లనగా-పాంచాల రాజగు ద్రుపదుడు రోషముతో యాగమొనర్చినను ద్రోణాచార్యుని నాశము చేయగల పుత్త్రుడు గలుగవలయునని మాత్రమే భావించి యాగము చేసినను ఫలితముగ యజ్ఞవేదినుండి ధృష్టద్యుమ్నుడుదయించుటయేకాక అధికముగ ద్రౌపదియును యాగమున సంభవించినదిగదా! తొల్లి యపుత్త్రకుడగు దశరథుడు ఒక్క కుమారుని కొఱకు పుత్త్రకామేష్టి యొనరింపగ యజ్ఞాగ్ని నుండి నలువురు కుమారులుద్భవించిరి. కాననోమహీశా! యుక్తితో చేసిన ప్రతి పనియు సిద్ధించును. అయుక్తితో చేసిన ప్రతి పనియు విపరీతఫలమొసంగును. యాగమందలి కొలది దోషమువలన పాండవులు జూదమందోడుట మున్నగు వ్యతిరేక ఫలములందిరి. సత్యవాదియు ధర్మసుతుడునగు యుధిష్ఠిరుడు నతని తమ్ములును ద్రాపదియు నిందఱుండియు శుభులైనవారు ఇందఱున్నను పాపద్రవ్యము వలనో సాభిమానత్వము కారణముననో వారుచేసిన యాగమునందు వైగుణ్యమును దానివలన విపరీత ఫలమును ప్రాప్తించినవి. రాజవర్యా! సాత్విక యజ్ఞము కడుంగడు దుర్లభమైనది. అది కేవలము వైఖానస వ్రతనిష్ఠులగు మునివర్యులకే విధింపబడినది.
అట్టి తాపసోత్తములు న్యాయార్జితము వన్యము ఋషిహితకరము సుసంస్కృతమునగు స్తాత్విక భోజనము చేయుదురు. అదే మేలైనది. పురోడాశములు మాత్రము గలిగియూ పరహితమై శ్రద్ధాభక్తులతో పరమ సంయమముతో సమంత్రకముగ నొనర్పబడు యజ్ఞములు సాత్త్విక యజ్ఞములనబడును. ఇక రాజస యజ్ఞములు ద్రవ్యబహుళమై యూపస్తంభము గలిగి అభిమాన సహితములై యుండును. అవి క్షత్త్రియులకు వైశ్యులకు విహితములు. కామక్రోధములను మదలోభములను నినుమడింప జేయునని సంస్కారము గలవి క్రూరములునగు యాగములు తామసయాగములు. అవి రాక్షసులకు మహాత్ములచే ప్రోక్తములు. ముముక్షులు విరక్తులు మహాత్ములునైన మునులకు సర్వసాధనసహితమైన మానస యజ్ఞము చెప్పబడినది. ఇతర యాగములందు కొంచెము లోపమున్నను నది పూర్ణము కాదు. బ్రాహ్మణుల శ్రద్థ ద్రవ్యము క్రియ మున్నగు వాని విషయమున లోపములుండవచ్చును. అటులే దేశకాల సాధనములందును లోటుపాటులుండవచ్చును. అట్టియెడ అవి మానస యాగమువలె పరిపూర్ణములును దోషరహితములును గావు. మానసయజ్ఞమొక్కటే దోషరహితమై పూర్ణమై శుద్ధమై వెల్లును. మొదట మన మనస్సు పరిశుద్ధమగును. దాన దేహము గూడ శుద్ధ (పాపరహిత) మగును. విషయరహితమై వృత్తులుబాసి నిర్మలమైన చిత్తముకల యతడే నిజమైన యజ్ఞాధికారి. అట్టి తగిన యాగాధికారి తన హృదయాంతరాళములో చక్కని యజ్ఞ వృక్షముల స్తంభములతో పెక్కు యోజనముల వఱకు చల్లని దేవీ మండపములు కల్పించుకొనవలయును. ఆ మండపమున తన పవిత్రమైన మనసుచే చక్కని యజ్ఞవేదికను కల్పించుకొని యందగ్నులను విధివిధానముగ తన మనసుచే ప్రతిష్టింపవలయును.
ఆ మానసయాగమును బ్రహ్మ-అధ్వర్యుడు-హోత-ప్రస్తోత ఉద్గాత-ప్రతిహర్త యితర సభ్యులు మున్నగు బ్రాహ్మణోత్తములను యథావిధిగ ఋత్విక్కులుగ వరించవలయును. మఱియు నా యాగమందు ఆ ఋత్విక్కులను మనస్సుతోనే విధ్యుక్తముగ పూజింపవలయును. ఆ యజ్ఞవేదికయందు ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము-సమానము అను పంచప్రాణములను పంచాగ్నులను స్థాపింపవలయును. వానిలో ప్రాణమును గార్హపత్యాగ్నిగ అపానము నాహవనీయముగ వ్యానమును దక్షిణాగ్నిగ సమానము నావసథ్యాగ్నిగను ఉదానమును సభ్యాగ్నిగను నీ పంచాగ్నులు పరమోత్కృష్టములుగ చెప్పబడినవి. ఈ పావకులు కామప్రదులు-మహాశ్రేష్ఠులు. ఆ పిదప నంతరంగమందు పరమపావనమైన నిర్గుణ ద్రవ్యములను భావించి సమకూర్పవలయును. ఆ మానసయజ్ఞమందు మనస్సును హోతగ యజమానునిగ నెన్నవలయును. యజ్ఞాధి దేవతగ నిర్గుణ సనాతన పరబ్రహ్మమే యుండవలయును. నిర్గుణ శివాశక్తి మోక్షఫలప్రదాయిని-బ్రహ్మవిద్య-సదాధార-సర్వవ్యాపినియై యంతట జ్యోతిర్మయియై వెలుగొందును. ఆ తరువాత శ్రీ నిర్గుణ జగదంబ నుద్దేశించి కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నిలో వేయవలయును. పిదప చిత్తప్రాణముల నేకగ్రీవముగ నిరాధారముగ సంకల్పరహితముగ నొనరింపవయలును. ప్రాణములను కుండలీ ముఖమార్గమున పరబ్రహ్మమందు లగ్న మొనరింపవలయును. అట్టి స్థితిలో సంకల్పవికల్పములు బ్రహ్మసమాధిలో నశించును. ఆత్మసాధకుడు స్వాత్మానుభవముతో సర్వాత్మభూతయగు మహేశ్వరిని స్వయముగ సమాధియోగమున నిర్వికల్పుడై ధ్యానింపవలయును. అపుడా యోగి సర్వభూతములను తన యాత్మలోను తన్ను సర్వభూతాత్మలోనూ నున్నట్లు తెలివివెలుగుతో దెలిసికొనగలుగును. అపుడా విధేయాత్ముడు పరమదివ్యమంగళ విగ్రహ శివ యగు శ్రీదేవి సందర్శనభాగ్య మనుభవించగలడు. ఆ పరమయోగి సచ్చిదానందస్వరూపిణిలో లీనమై బ్రహ్మానంద భూయము నందును. దాన ఆ నాడీ హృదయ దౌర్బల్యములు దగ్ధమైపోవును. తనువు మాత్రము ప్రారబ్ధమనుభవించుటకు నిలుచును. ఇట్లా జగదంబను మానసయాగమున నెవడు ధ్యానించునో వాడు సోమపానము చేసినవాడగును. కృతకృత్యుడు-జీవన్ముక్తుడు నగును. వాని యెల్ల కాలమములు ఫలించును. అతడు పరమ నిఃశ్రేయసమందగలడు. ఇది నిజము.
కనుక శ్రీభువనేశ్వరీదేవిని గురు వాక్యములను బట్టి ప్రయత్నించి తెలిసికొని ధ్యానించవలయును. ఇట్లు నిశ్చలముగ నొనరించిన మానసయజ్ఞము నిస్సంశయముగ పరమపద సౌఖ్య మొనగూర్చగలదు. ఇతర యాగములు సకామములై క్షణఫలము లగును. స్వర్గకాములు విధిగా నగ్నిష్టోమయాగ మొనర్పవలయునని వేదములు శాసించుచున్నవని మనీషులందురు. కాని వారును క్షీణపుణ్యులై తిరిగి మర్త్యలోకమునకు వత్తురు. కనుక నక్షయ ఫలప్రదమైన మానసయజ్ఞమే యెల్ల విధముల సర్వశ్రేష్ఠమైనది. జయకాంక్షులగు రాజుల కీ మానసయాగము సాధ్యముగాదు. నీవును తొల్లి తామస చిత్తవృత్తితో సర్పయాగ మొనరించితివి. నీవు నీ శత్రువగు తక్షకునితో పగ సాధించుట కనేక సర్పముల నిండుప్రాణముల నగ్ని కాహుతి యొనర్చితివి. కనుక నీ విపుడు భవ్యమైన శ్రీదేవీ మహాయజ్ఞము విధిప్రకార మాచరింపుము. పూర్వము సృష్టి ప్రారంభమునందా యజ్ఞమును శ్రీమహావిష్ణు వాచరించెను. అదే విధముగ నీవును శ్రీదేవీయాగ మొనరింపుము. నీ కా యజ్ఞ విధానము తెలియపఱచెదను. వేదవిదులగు బ్రాహ్మణులు యజ్ఞ విధానము సమగ్రముగ నెఱిగినవారు గలరు. వారు మంత్రశాస్త్రవేత్తలు. సమయమార్గ విచక్షణులు. శ్రీకామరాజ బీజ విధానజ్ఞులు. అట్టి వారు యాజకులుగ నుందురు. నీవు యజమానుడవు కమ్ము. నీవు విధిగ శ్రీదేవీ యజ్ఞ మాచరించి యాగఫలమును నీ పితరుల కొసంగి వారిని దుర్గతులనుండి సముద్ధరింపుము. ఏ విప్రునైన నిందించిన దోషము దుర్భరమును నరకప్రదము నగును. నీ తండ్రి కట్టి విప్రనిందవలన దోషము సంప్రాప్తమైనది.
నీ తండ్రి పాముకాటుచే నంతరాళమున దుర్మరణ మొందెను. ఆతడు దర్భలపైగాని భూమిపైగాని చావలేదు. ఓ కురువరా! ఓ తండ్రి చావు రణమునగాని పావనగంగానదిలోగాని జరుగలేదు. ఆతని భవనమందే స్నాన దాన రహితముగ సంభవించినది. ఓ నరవరా! కుత్సితమైన పనులన్నియు నరకమునకై దారి తీయును. వానిలో నే యొక్కటియు జీవుల నుద్ధరింపజాలదు. కావున ప్రతి ప్రాణియు నెచ్చటనైన నెప్పుడైన తనకు కాలము మూడినచో తాను సాధనరహితుడైనను సంకటములలో బడియున్నను నిర్మలచిత్తముతో వైరాగ్యసంపన్నుడై యిట్లు చింతింపవలయును: ''ఈ దేహము పాంచ భౌతికము; దుఃఖదాయకము; నాకేదియులేదు. ఈ శరీరము నేడు పడిపోయినపోవుగాక! ఆత్మస్వరూపుడనగు నేను శాశ్వతుడను; ముక్తుడను; నిర్గుణుడను. ఈ భౌతిక పదార్థములు నశ్వరములు. ఇక వీనికొఱకు శోకింపనేల? నేనే సనాతనుడను; నేనే సదాముక్తుడను; నేనే బ్రహ్మమను; నేనే సంసారముక్తుడను; నా కీ శరీరముతో నెట్టి సంబంధమును లేదు. కర్మలవలననే నా కీ తనువుతో సంబంధ మేర్పడినది. మానవుడీ దేహసంబంధమువలన సుఖదుఃఖ సాధనములను శుభాశుభములను ననుభవించును. నేను భయంకరము-ఘోరము-దుఃఖదమునైన సంసారసాగర మందుండి విముక్తుడనైతిని'' అని యిట్లు చింతించువాడు. స్నానదానములు చేయనవసరములేదు. అతడు మరణించి జన్మమరణ దుఃఖములనుండి విడువబడును. ఇది పరమయోగులకును దుర్లభమైన పరకాష్ఠాగతి. ఓ నరశార్దూలా! నీ తండ్రి విప్రశాపము విని గూడ తన శరీరమందలి మమకారము వదలుకొనలేకపోయెను. వైరాగ్యభాగ్య మందలేక చిక్కులోబడి ఈ చెప్పబోవు విధమున పలుకుచుండెను:
'నే నెట్లు రోగముక్తుడ నగుదును? నా రాజ్య మెట్లు నిష్కంటకముగ నుండగలదు? నే నెట్లు జీవింపగలను? మంత్ర విదులను రావింపుడు' అని పలికెను. ఇట్లు నీ తండ్రి మణిమంత్రౌషధములతో యంత్రములతో తన చావును బాపుకొనుటకు సౌధోపరిభాగమున తలదాచుకొనెను. అట్టి చావుదశలోగూడ నీ తండ్రి శ్రీదేవి నొక్కసారియైన భక్తితో నమ్మా! యని నోరార పిలిచి యెఱుగడు. స్నానదానములు చేసికొనలేదు. దైవము బలవత్తరమైనదని నేల పై నైనను శయనింపలేదు. తుదకు కలి ప్రభావమున తాప సోత్తము నవమానించిన ఫలముగ మోహార్ణవమందు మునిగి నీ తండ్రి మేడపై ఘోర దుర్మరణమునకు బలియయ్యెను. ఇట్టి వానివలన తప్పక నరకము ప్రాప్తమగును. కాన నీ విపుడు నీ పితరుని పాపకూపము నుండి సముద్ధరింపుము. అమితతేజస్వి యగు వ్యాసుని యీ వచనము లాలకించి జనమేజయుడు కనులనిండ దుఃఖాశ్రులు నిండగ రుద్ధకంఠముతో విలపించుచు నా తండ్రికి సద్గతి గల్గనిచో నా జీవితము వ్యర్థము. కాన నా తండ్రికి సద్గతులు గల్గునట్టు లొనర్తును అని పలికెను.
అధ్యాయము 45 శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment