స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు
వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను : ఈ విధముగ కేరళాధిపతి వాదింపగా యుధాజిత్తు మరల నిట్లనియెను :
"ఓ భూపాలా! ఈ రాజ సమాజమునందు సత్యవాది జితేంద్రియుడు అని పేరొందిన నీవు పలుకునది నీతియేనా? యోగ్యులైన నరపతు లిందఱుండగ కన్యారత్నము విషయమున అయోగ్యుడు తగియుండునా? ఇట్టి న్యాయము నీకు రుచించును. మఱి యితరులకు రుచించదు. సింహము పాలి సొమ్ము నక్క యెట్లనుభవించగలదు? రాజులపాలి యీ కన్యారత్నమును సుదర్శను డెట్లనుభవింపగలడు? విప్రులకు వేదము బలము. క్షత్రియులకు చాపము బలము. కాన నిట నేను అన్యాయ మేమి చెప్పుదును? వివాహముందు రాజులకు వీర్యమే శుల్క మగుట ప్రసిద్ధమేగద! బలవంతుడే కన్యను గ్రహింపవలెను. బలహీనుడెప్పుడును గ్రహింపరాదు. కాన నిపుడు కన్యను పణముగ నుంచుటయే నీతి. కాదేని రాజలోకమున పెద్ద కలవరము బయలుదేరును. ఈ విధముగ రాజుల మధ్య వాద వివాదములు చెలరేగగా నృపోత్తముడగు సుబాహు నృపతి సభామధ్యమునకు బిలువబడెను. తత్త్వవిదులగు రాజులెల్లరు సుబాహుని బిలిచి, ఓ రాజా! నీ వీ వివాహమున జక్కని నీతి పాటింపవలయును. నీవు చేయదలచిన కార్యము మాకు సమాహిత మతితో దెలుపుము. నీ మదిలో నీ పుత్రిక నెవ్వని కీయదలంచితివో నిక్కము బలుకుమనిరి. నా కూతురు తన మదిలో సుదర్శనునే పతిగ వరించినది. నేను వలదని యెంత చెప్పినను నా మాట వినుటలేదు. ఇంక నేనేమి చేతును? నా కూతురు మనసు నా వశమందు లేదు. సుదర్శనుడొంటరిగ నిరాకులుడై యేతెంచెను అని సుబాహుడనెను.
అపుడు శిష్టులైన రాజులందఱు సుదర్శనుని రావించిరి. అతడేకాకియై శాంతుడై రాగా వారతని కిట్లు నెమ్మదిగా బలికిరి :
అపుడు శిష్టులైన రాజులందఱు సుదర్శనుని రావించిరి. అతడేకాకియై శాంతుడై రాగా వారతని కిట్లు నెమ్మదిగా బలికిరి :
"మహాభాగా! రాకుమారా! సువ్రతా! నిన్నెవరు పిలువగ నీ రాజుల సమాజమున కొంటరిగ నురుగుదెంచితివి? నీ చెంత సైన్యముగాని సచివులుగాని కోశముగాని మహాబలముగాని లేదే? మరియేల వచ్చితివో యథార్థము తెల్పుము. ఎల్లరాజులును యుద్ధకాములై సేనాసమేతులై కన్యకార్థము వచ్చిరి. నీవొక్కడవిక్కడ వట్టిచేతుల నేమి చేయవచ్చితివి? నీ సోదరుడు మహాసైన్యము వెంటబెట్టుకొని నిన్ను హతమార్చ వచ్చియున్నాడు. అతనికి యుధాజిత్తు సాయము చేయ వచ్చియున్నాడు. నీవున్న నుండుము. పోయిన పొమ్ము. నిజము చెప్పుము. నీవు బలహీనుడవై యున్నావు. కాన నీకు తగినొట్లనరింపుము.
సుదర్శుడిట్లు పలికెను : ఇపుడు నా చెంత సుహృన్మిత్రులుగాని రాజభటులుగాని కోశముగాని దుర్గబలముగాని సాయమొనర్చువారుగాని ఎవ్వరును లేరు. ఇచట జరుగు స్వయంవరమును చూచు వేడుకతో నేతెంచితిని. కలలో భగవతి యగు శ్రీదేవి చేత ప్రేరితుడనైతిని. ఇందు సందియము లేదు. నా మదిలో మరెట్టి కోరికయు లేదు. అన్నియు నా తల్లియే నాకు జెప్పెను. నా తల్లి పలికిన పలుకు అక్షరాల జరిగి తీరును. నాకీ ప్రపంచమందంతట శత్రు వెవ్వడును లేడు - నాకెల్లెడల నెల్ల ప్రాణులందాభవానియే ప్రత్యక్షముగ గనంబడుచున్నది. నృపులారా! నాతో నెవడైన బగబూనినచో వానిని ఆ మహావిద్య దండించి తీరును. నేనుమాత్ర మెవ్వనితోడను శత్రుత్వము బూనను. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. వేరుగ జరుగదు. నేను దైవాధీనుడను - నాకింత చింత యెక్కడిది?
సురనరాది సకల భూతములందు నిరంతర మా దివ్య చైతన్యశక్తి విరాజిల్లుచుండును. ఆ శక్తి తలంపునకు భిన్నముగ నేదియును జరుగుటకు వీలులేదు. ఆ తల్లి తలచుకొన్నచో నెవ్వనినైన నిఱుపేదనైన రాజుగ చేయగలదు. నాకింక లేనిపోని చింతయేల? ఆ పరాశక్తి - జనని - దయలేనిచో దేవతలును హరిహర బ్రహ్మలు కూడ కదలశక్తులుగారు. ఇక నాకీ చింత యేటికి? నేనశక్తుడనో సుశక్తుడనో యెట్టివాడనో యట్టివాడను. నేనీ స్వయంవరమునకు ఆ జగన్మాతృ నానతి చేత వచ్చితిని. ఆ తల్లి యేది దలచిన నది చేసితీరును. ఇంక నడుమ నాకెందులకు విచారము? ఈ విషయమై శంకింప పనిలేదు. నేను చెప్పినది అంతయును సత్యము. జయాపజయముల విషయమున లేశమైన నాకు లజ్జ గలుగదు. నేనా తల్లి కధీనుడను. నాకేదైన లజ్జ కల్గిన నది ఆమెకే కలుగును. సుదర్శనుని వచనము లాలకించి నరపతు లొండొరుల మొగములు చూచుకొని నిశ్చితమతులై యతని కిట్లనిరి:
సురనరాది సకల భూతములందు నిరంతర మా దివ్య చైతన్యశక్తి విరాజిల్లుచుండును. ఆ శక్తి తలంపునకు భిన్నముగ నేదియును జరుగుటకు వీలులేదు. ఆ తల్లి తలచుకొన్నచో నెవ్వనినైన నిఱుపేదనైన రాజుగ చేయగలదు. నాకింక లేనిపోని చింతయేల? ఆ పరాశక్తి - జనని - దయలేనిచో దేవతలును హరిహర బ్రహ్మలు కూడ కదలశక్తులుగారు. ఇక నాకీ చింత యేటికి? నేనశక్తుడనో సుశక్తుడనో యెట్టివాడనో యట్టివాడను. నేనీ స్వయంవరమునకు ఆ జగన్మాతృ నానతి చేత వచ్చితిని. ఆ తల్లి యేది దలచిన నది చేసితీరును. ఇంక నడుమ నాకెందులకు విచారము? ఈ విషయమై శంకింప పనిలేదు. నేను చెప్పినది అంతయును సత్యము. జయాపజయముల విషయమున లేశమైన నాకు లజ్జ గలుగదు. నేనా తల్లి కధీనుడను. నాకేదైన లజ్జ కల్గిన నది ఆమెకే కలుగును. సుదర్శనుని వచనము లాలకించి నరపతు లొండొరుల మొగములు చూచుకొని నిశ్చితమతులై యతని కిట్లనిరి:
"ఓ సాధూ! నీ పలికినదంతయు నిజమే. అందులో సందేహమేమియు లేదు. కాని యుజ్జయినీపతి నిన్ను చంపుటకు చూచుచున్నాడు. నీ ఆచరణ చూచి నీమీది దయకొలది చెప్పుచున్నాము. నీకేది యుక్తమని తోచునో యది మనస్సులో చక్కగ విచారించి యాచరింపుము.
సుదర్శనుడిట్లనియె : ఓ నృపతులారా ! కృపాళురు సుహృజ్జనులునైన మీరు నిజము పల్కితిరి. నేనింక పలుక వలసినది లేదు. ఐనను చెప్పుచున్నాను. ఒకనిచావు మరొకని వలన నెన్నడు సంభవింపదు. స్థావర జంగమాత్మకమగు నీజగమంతయును దైవాధీనమే. ఈ జీవుడు సంతతమును స్వవశమునుండక కర్మ పరాధీనుడై యుండును. తత్త్వవిదులగు విబుధులు కర్మ ముత్తెఱంగుల నుండు నందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధము ననబరగును. ఈ బ్రహ్మాండమంతయును కాలము కర్మము స్వభావము వీనితో నిండి యున్నది. దేవడు గూడ కాలము రాని వానిని చంపజాలడు. కాని సనాతనమైన కాలము నిమిత్త మాత్రమున హతుడైన వానిని చంపివేయును. శత్రునిషూదనుడగు నా తండ్రి సింహము చేత నిహతుడయ్యెను. నా మాతామహుడును యుధాజిత్తు చేత చంపబడెను. కోటి ప్రయత్నములు చేయుచున్న వాడును దైవయోగమున వాయువు మూడిన నాడు చచ్చి తీరును. ఒకడు (నేలపై నూకలున్నవాడు) రక్షణ లేకున్నను దైవేచ్ఛచే వేయేండ్లు జీవింపగలడు. ధర్మిష్ఠులగు నృపులారా! యుధాజిత్తునకు నే నేనాడును భయపడుటలేదు. నేనన్నిటికి ఆ దైవమే పరమమని భావించి నిబ్బరముగ నున్నాను. నేను నిరంతరముగ నిత్య మాపరమ భగవతి మధురనామ సంస్మరణము చేయుచున్నాను. ఆ జగదేకమాత దేవి నాకు తప్పక కళ్యాణము జరుపగలదని దృఢముగ నాశించుచున్నాను. జీవుడు శుభమునుగాని - యశుభమునుగాని తన పూర్వార్జిత కర్మఫలమునే - యనుభవించును. అతడు స్వయంకృతము ననుభవించుచుండును. ఇది యెరిగిన జ్ఞానికి శోకమెట్లు గల్గును? బుద్ధిలేని మూఢుడు తన కర్మఫలానుసారముగ దుఃఖము లనుభవించుచు నల్పబుద్ధియగుటచే నా దుఃఖములకు నిమిత్త కారణమైన పరులతో పగ పెంచుకొనును. నాకు వైరమును శోకమును భయమును లేవు. కనుకనే నేను నిశ్శంకముగ నీ రాజన్యుల నడుమకు రాగలిగితిని. నేనీ యుత్తమ స్వయంవరమును వీక్షించు కాంక్షతో శ్రీ చండికాదేవి యనుమతి బడసి యేతెంచితిని. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. నాకు పరమ భగవతి వచనమే యన్నివిధాల ప్రమాణముగ మదిలో నమ్మియున్నాను. ఇంకెవ్వరిని నమ్ముట లేదు. నా తల్లి నాకు కలుగచేసిన సుఖముగాని దుఃఖముగాని వేఱుగ కాదు. నదియు ఆ యుధాజిత్తునే సుఖము బడయనిండు. నాకు మాత్ర మతని పట్ల ఎట్టి వైరము లేదు. నా యందెవ్వనికైన వైరమున్నచో దాని ఫలము నతడనుభవించి తీరును.
సుదర్శనుని మాటలకు రాజులు సంతసిల్లిరి. అతడును తన యాశ్రమమున కేగి సుఖముండెను. మరునాడు శుభసమయమున రాజులెల్లరును తన సుందర భవనమునకు రావలసినదిగ సుబాహువు ఆహ్వానించెను. రాజులందఱును శుభాలంకారములతోనేతెంచి శుభాసనములతో రచింపబడిన పీఠములపై నాసీనులైరి. వారు దివ్యవేషధారులైన విమానములందలి దేవతలో యన విరాజిల్లుచు స్వయంవరము నవలోకించు వేడుకతో నుండిరి. ఆ రాచకూతు రెప్పుడెప్పుడు వచ్చునో యామె శ్రుతకీర్తి భాగ్యవంతుడునైన యేరాచకుమారుని వరించునో యని యెల్లరును దారితెన్నులు చూచుచుండిరి. ఒకవేళ నామె సుదర్శనునే పూలమాలతో నలంకరించినచో రాజలోకమునందు నిస్సంశయముగ కల్లోలము బయలుదేరును. ఇట్టు లాసనములందున్న నరపతులు తలపోయుచున్నంతలో మంగళవాద్యఘోషములు చెలరేగెను. అంత శుచిస్నాతయై శుభ్ర వసనములును సొమ్ములును దాల్చి మధూక పుష్పమాలిక చేతబూని తన కూతురు రాగా లక్ష్మివలె నొప్పుచు వివాహ యోగ్య లక్షణములు గల్గి సువసనములు దాల్చి చింతలో మునిగిన తన కూతును జూచి నగుచు సుబాహువామె కిట్లనియెను :
సుదర్శనుడిట్లనియె : ఓ నృపతులారా ! కృపాళురు సుహృజ్జనులునైన మీరు నిజము పల్కితిరి. నేనింక పలుక వలసినది లేదు. ఐనను చెప్పుచున్నాను. ఒకనిచావు మరొకని వలన నెన్నడు సంభవింపదు. స్థావర జంగమాత్మకమగు నీజగమంతయును దైవాధీనమే. ఈ జీవుడు సంతతమును స్వవశమునుండక కర్మ పరాధీనుడై యుండును. తత్త్వవిదులగు విబుధులు కర్మ ముత్తెఱంగుల నుండు నందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధము ననబరగును. ఈ బ్రహ్మాండమంతయును కాలము కర్మము స్వభావము వీనితో నిండి యున్నది. దేవడు గూడ కాలము రాని వానిని చంపజాలడు. కాని సనాతనమైన కాలము నిమిత్త మాత్రమున హతుడైన వానిని చంపివేయును. శత్రునిషూదనుడగు నా తండ్రి సింహము చేత నిహతుడయ్యెను. నా మాతామహుడును యుధాజిత్తు చేత చంపబడెను. కోటి ప్రయత్నములు చేయుచున్న వాడును దైవయోగమున వాయువు మూడిన నాడు చచ్చి తీరును. ఒకడు (నేలపై నూకలున్నవాడు) రక్షణ లేకున్నను దైవేచ్ఛచే వేయేండ్లు జీవింపగలడు. ధర్మిష్ఠులగు నృపులారా! యుధాజిత్తునకు నే నేనాడును భయపడుటలేదు. నేనన్నిటికి ఆ దైవమే పరమమని భావించి నిబ్బరముగ నున్నాను. నేను నిరంతరముగ నిత్య మాపరమ భగవతి మధురనామ సంస్మరణము చేయుచున్నాను. ఆ జగదేకమాత దేవి నాకు తప్పక కళ్యాణము జరుపగలదని దృఢముగ నాశించుచున్నాను. జీవుడు శుభమునుగాని - యశుభమునుగాని తన పూర్వార్జిత కర్మఫలమునే - యనుభవించును. అతడు స్వయంకృతము ననుభవించుచుండును. ఇది యెరిగిన జ్ఞానికి శోకమెట్లు గల్గును? బుద్ధిలేని మూఢుడు తన కర్మఫలానుసారముగ దుఃఖము లనుభవించుచు నల్పబుద్ధియగుటచే నా దుఃఖములకు నిమిత్త కారణమైన పరులతో పగ పెంచుకొనును. నాకు వైరమును శోకమును భయమును లేవు. కనుకనే నేను నిశ్శంకముగ నీ రాజన్యుల నడుమకు రాగలిగితిని. నేనీ యుత్తమ స్వయంవరమును వీక్షించు కాంక్షతో శ్రీ చండికాదేవి యనుమతి బడసి యేతెంచితిని. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. నాకు పరమ భగవతి వచనమే యన్నివిధాల ప్రమాణముగ మదిలో నమ్మియున్నాను. ఇంకెవ్వరిని నమ్ముట లేదు. నా తల్లి నాకు కలుగచేసిన సుఖముగాని దుఃఖముగాని వేఱుగ కాదు. నదియు ఆ యుధాజిత్తునే సుఖము బడయనిండు. నాకు మాత్ర మతని పట్ల ఎట్టి వైరము లేదు. నా యందెవ్వనికైన వైరమున్నచో దాని ఫలము నతడనుభవించి తీరును.
సుదర్శనుని మాటలకు రాజులు సంతసిల్లిరి. అతడును తన యాశ్రమమున కేగి సుఖముండెను. మరునాడు శుభసమయమున రాజులెల్లరును తన సుందర భవనమునకు రావలసినదిగ సుబాహువు ఆహ్వానించెను. రాజులందఱును శుభాలంకారములతోనేతెంచి శుభాసనములతో రచింపబడిన పీఠములపై నాసీనులైరి. వారు దివ్యవేషధారులైన విమానములందలి దేవతలో యన విరాజిల్లుచు స్వయంవరము నవలోకించు వేడుకతో నుండిరి. ఆ రాచకూతు రెప్పుడెప్పుడు వచ్చునో యామె శ్రుతకీర్తి భాగ్యవంతుడునైన యేరాచకుమారుని వరించునో యని యెల్లరును దారితెన్నులు చూచుచుండిరి. ఒకవేళ నామె సుదర్శనునే పూలమాలతో నలంకరించినచో రాజలోకమునందు నిస్సంశయముగ కల్లోలము బయలుదేరును. ఇట్టు లాసనములందున్న నరపతులు తలపోయుచున్నంతలో మంగళవాద్యఘోషములు చెలరేగెను. అంత శుచిస్నాతయై శుభ్ర వసనములును సొమ్ములును దాల్చి మధూక పుష్పమాలిక చేతబూని తన కూతురు రాగా లక్ష్మివలె నొప్పుచు వివాహ యోగ్య లక్షణములు గల్గి సువసనములు దాల్చి చింతలో మునిగిన తన కూతును జూచి నగుచు సుబాహువామె కిట్లనియెను :
"పుత్త్రీ! లెమ్ము. శుభసుమమాల చేబూనుము. ఈ రాజుల సమూహము బాగగ పరికించి చూడుము. ముందునకు సాగుము. ఇందఱిలో గుణవంతుడును కులీనుడును రూపసంపన్నుడునగు నే రాకుమారుడు నీ చిత్తమునకు నచ్చునో యతనినే వరింపుము. దేశదేశాలనుండి వచ్చిన రాజు లున్నతాసములం దుపవిష్టులై యున్నారు. వారినందఱిని చక్కగ గాంచి నీ కిష్టమైనవానినే వరింపుము.
తన తండ్రి మాటలు విని మితభాషిణియగు నా కన్య ధర్మసమ్మతమైన లలిత వచనము లిట్లు పలికెను : "తండ్రీ! కాముకులును సామాన్యులునగు పురుషులను కన్నెత్తియైనను జూడను. తండ్రీ! స్త్రీచే నొక్కరుడే చూడదగినవాడుకాని వేరొకరిని చూడగూడదని ధర్మశాస్త్రమున నేను వింటిని. ఎవ్వతె పెక్కుమందితోడ గూడునో దాని సతీత్వము చెడిపోవును. అట్టి దానిని గని యందఱును నిది నాదిగనైన బాగుగనుండునని లోలోన దలంచుదురు. ఒక స్త్రీ తనచేత పూలమాలగొని యెప్పుడు స్వయంవర మంటపమెక్కెనో యప్పుడామె కులటవలె సర్వ సామాన్యగ తలంపబడును. ఒక వారవనిత వీథికేగి యచట గల నరుల జూచి వారి మంచి చెడ్డలను గూర్చి తనలో భావించుకొనుచుండును. కాముకు ననేక భావములతో వ్యర్థముగ గనుచుండు వారకాంతవలె నేను స్వయంవర మండపమునకు వచ్చి వారకాంతా కృత్యమును చేయవలయునా! పెద్దల చేత నిర్ణీతమైన యిట్టి స్వయంవర ధర్మమును నేను పాటింపజాలను. నేను వ్రతనిష్ఠను పూని ఇపుడు పత్నీవ్రత మాచరింపగలను. ఒక సామాన్యకాంత మండపమున కేతెంచి తన మదిలోన పెక్కురీతుల సంకల్పించుకొని యందొక్కని వరించునట్లు నేనిపుడు పతివ్రతనై యెట్లు చేయగలను? పూర్వము సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించితిని. అతనినిగాక యితరుని వరింపజాలను, తండ్రీ! నీవు నా మేలుగోరు దేనియొక శుభముహూర్తమున వివాహ విధిప్రకారముగ నన్ను సుదర్శనునకు కన్యాదాన మొనరింపుము.
అధ్యాయము 53 సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
తన తండ్రి మాటలు విని మితభాషిణియగు నా కన్య ధర్మసమ్మతమైన లలిత వచనము లిట్లు పలికెను : "తండ్రీ! కాముకులును సామాన్యులునగు పురుషులను కన్నెత్తియైనను జూడను. తండ్రీ! స్త్రీచే నొక్కరుడే చూడదగినవాడుకాని వేరొకరిని చూడగూడదని ధర్మశాస్త్రమున నేను వింటిని. ఎవ్వతె పెక్కుమందితోడ గూడునో దాని సతీత్వము చెడిపోవును. అట్టి దానిని గని యందఱును నిది నాదిగనైన బాగుగనుండునని లోలోన దలంచుదురు. ఒక స్త్రీ తనచేత పూలమాలగొని యెప్పుడు స్వయంవర మంటపమెక్కెనో యప్పుడామె కులటవలె సర్వ సామాన్యగ తలంపబడును. ఒక వారవనిత వీథికేగి యచట గల నరుల జూచి వారి మంచి చెడ్డలను గూర్చి తనలో భావించుకొనుచుండును. కాముకు ననేక భావములతో వ్యర్థముగ గనుచుండు వారకాంతవలె నేను స్వయంవర మండపమునకు వచ్చి వారకాంతా కృత్యమును చేయవలయునా! పెద్దల చేత నిర్ణీతమైన యిట్టి స్వయంవర ధర్మమును నేను పాటింపజాలను. నేను వ్రతనిష్ఠను పూని ఇపుడు పత్నీవ్రత మాచరింపగలను. ఒక సామాన్యకాంత మండపమున కేతెంచి తన మదిలోన పెక్కురీతుల సంకల్పించుకొని యందొక్కని వరించునట్లు నేనిపుడు పతివ్రతనై యెట్లు చేయగలను? పూర్వము సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించితిని. అతనినిగాక యితరుని వరింపజాలను, తండ్రీ! నీవు నా మేలుగోరు దేనియొక శుభముహూర్తమున వివాహ విధిప్రకారముగ నన్ను సుదర్శనునకు కన్యాదాన మొనరింపుము.
అధ్యాయము 53 సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment