జనమేజయుని సంశయములు
జనమేజయు డిట్లనియెను : ఓ మునిముఖ్యా! మత్స్యగంధ పుత్రుడవగు మిమ్ముల నేను మరికొన్ని ప్రశ్నములడుగ కుతూహల మగుచున్నది. శ్రీ శూరసేనుని కుమారుడు వసుదేవుడు. అతడు మహాప్రతాపవంతుడు. ఆ వసుదేవునకు హరి పుత్త్రుడుగ జన్మించెను అని వింటిని. ఆ వసుదేవ డానక దుందుభి యనుపేర విఖ్యాతుడు. అతడు దేవతలకును పూజనీయుడు. అట్టి ధర్మతత్పరుడు కంసుని కారాగారమున ఏల బంధింప బడెను? ఆ వసుదేవుడు తన భార్యయగు దేవకిని గూడి సుఖముండెను. అత్తఱి వారేమి పాపము చేసినందున వారి యార్గురు కొడుకులు చంపబడిరి? కంసుడు యయాతి వంశజుడు. అట్టి వాడారుగురు శిశువుల నేల చంపెను? ఆ వాసుదేవుడగు శ్రీహరి కారాగారమునం దెట్లవతరించెను? ఆ భగవానుడగు శ్రీహరి జన్మాంతర మేల పొందెను? అతడు గొల్లపల్లె కేల కొనిపోబడెను? అతని తల్లిదండ్రు లినుపసంకెళ్ళచే నేల బంధింపబడిరి? ఆ శ్రీకృష్ణుడు అమిత తేజోవంతుడు గదా! మఱి యట్టి శ్రీహరి తన ముదుసలి తల్లిదండ్రులగు దేవకి వసుదేవులను బంధముక్తులగ నేల చేయలేదు? ఎల్ల లోకములను బుట్టించు దిట్టయగు నతడు తన తల్లి గర్భమందుండియు వారినేల చెఱవిడిపంచ లేకుండెను? వారి వెనుకటి కర్మమెంత బలవత్తరమైనదో మహాత్ములకును తెలియనలవికాదు కదా! పరమాత్ముడగు వాసుదేవు డవతరించు చోట గూడ కర్మ బంధమునకు తావుండునా? కంసుని చేతిలో ప్రాణములు గోలుపోయిన యా యార్గురు బాలు రెవరు?
కంసుడొక బాలికను నేలకు వేసి కొట్టబోగా నా బాల నింగిపై కెగసి యష్టభుజ యయ్యెను గదా! ఆ బాల యెవరు? ఆ హరి బహు భార్యావంతుడు గదా! మఱి యాతని గృహస్థ జీవిత మెట్టిది? ఆ కృష్ణు డొనరించిన ఆయా కార్యములను ఆ హరి దేహత్యాగమును గూర్చి నేను కింవదంతిగ వినిన విషయములు నన్ను మోహితుని చేయుచున్నవో అన్నట్లున్నవి. నా కా వాసుదేవుని చరిత మున్నదున్నట్లుగ తెలుపుము.
పూర్వము నరనారాయణులను పురాణ ఋషి శ్రేష్ఠులుండిరి. వార లిరువురును ధర్ముని కుమారులు. శ్రీ మహావిష్ణు వంశమున జన్మించినవారలగు ఆ మహనీయులు పుణ్యబదరి కాశ్రమ మందు పెక్కేండ్లు విజితేంద్రియులు - నిరాహారులు - నిఃస్పృహులు - జితకామక్రోధులు నగుచు విశ్వ కల్యాణము నుద్దేశించి ఉత్తమ తప మొనరించిరి. ఆ నరనారాయణుల దివ్యాంశముల వలన మహావిక్రములగు నర్జునుడును కృష్ణుడును జన్మించిరని సర్వజ్ఞులగు నారదాది మహర్షులనిరి. ఆ నరనారాయణ మహర్షులు సశరీరులైయున్నారు గదా! అట్టివారు మరల కృష్ణార్జునులుగ నెట్లు జన్మాంతర మందిరి? వారు బంధముక్తి కొఱకు కుగ్రతప మొనరించి సర్వసిద్ధులును బడసిరి గదా! అంతటి ముని ముఖ్యులు మరల జన్మము లేల దాల్చిరి? స్వధర్మ నిరతుడగు శూద్రుడు వైశ్యుడు క్షత్రియుడుగను నతడు బ్రాహ్మణుడుగను క్రమమున జన్మించునని నేను వింటిని.
ఉత్తమ బ్రాహ్మణుడు విగతరాగుడై శాంతుడైనచో నతడు తప్పక భవబంధముక్తుడగును. ఈ విషయము నరనారాయణులందు తద్విరుద్ధముగ నున్నది. వారు తపమువలన వశ్యాత్ములైరి గద! వారేకర్మమువలన మరల జన్మమొందిరి? ఆ శాంతచిత్తు లెవరి శాపమున క్షత్రియులై పుట్టిరి? ఆ మహర్షులగు బ్రాహ్మణులు క్షత్రియులగుటకు గల కారణము తెలుపుము. విప్రశాపమున యాదవ వంశము నశించెనని వింటిని. గాంధారీ శాపమున కృష్ణుని వంశ మంతరించెనట. శంబరాసురుడు ప్రద్యుమ్ను నేల యపహరించెను? దేవదేవుడును జనార్దనుడునగు వాసుదేవుడుండగా పురిటింటి నుండి పుత్త్రహరణము జరుగట వింతగ నున్నది. శ్రీహరి భవనము దుర్గమమైన ద్వారకా దుర్గము నడుమ నున్నది. అందుండి శంబరాసురుడు ప్రద్యుమ్నుని గొనిపోవుచుండగా శ్రీహరి దివ్య నేత్రములతో నేల కనలేదు? వాసుదేవుని భార్యలు దస్యులచే దోచుకొనబడుటగూర్చి నాకు సందేహముగ నున్నది. ఆ సందియమును నివారింపుము. ఆ దేవదేవుడగు వాసుదేవుడు పరమ పదము జెందిన వెంటనే యట్టి దుస్సంఘటన జరుగుటవలన నా చిత్తమందు సంశయమును కలతయు కల్గుచున్నవి. ఆ హరి భూభార మణచుట కవతరించినవాడును విష్ణు నంశమున బుట్టినవాడును గదా! అట్టివాడు భయముతో మథురారాజ్యము వదలి ఏల ఏగెను? ఆ భూభార మడప నవతరించిన హరి తన సేనతో మిత్రులతో నేల ద్వారావతి కేగెను? దుష్టశిక్షణము శిష్టరక్షణము ధర్మసంస్థాపనము చేయుట కవతరించిన హరి యా చోరుల నేల చంపలేదు? ఆ వాసుదేవుడు సర్వజ్ఞుడు గదా! అతడు తన భార్యలను దస్యులు దోచుకొనుట ఎఱుగడా?
మహామనీషులైన భీష్మద్రోణాదులు భూమికి భారమని కృష్ణుడు వారిని చంపించెనా? ధర్మారాజాదులు శ్రీకృష్ణుని ప్రియభక్తులు సదాచార సంపన్నులు. వారు యజ్ఞరాజమగు రాజసూయమును యథావిధిగ నాచరించిరి గదా! ఆ యజ్ఞమందు దేవాంశజులును వాసుదేవాశ్రితులు నైన పాండవులు బ్రాహ్మణులకు భూరిగ దానదక్షిణ లొసంగిరి గదా! ఐనను వారేల ఘోర దుఃఖముల పాలైరి? వారి పున్నెమంతయు నేమయ్యెను? వారంతగా దుఃఖములు పొందుటకు తామంతగా చేయరాని దోషమేమి చేసిరి? రమాంశమువలన యజ్ఞవేదికలో నవతరించిన ద్రోపది పరమ సాధ్వియు శ్రీకృష్ణ భక్తురాలును గదా! అట్టి ద్రౌపది తలవెండ్రుకలు బట్టి దుశ్శాసనుడు లాగుచుండగ నామె మిక్కిలి దుఃఖించెను ఆమె యేల అట్టి ఘోరదుఃఖములకు గురికావలసి వచ్చెను? ఆ ద్రోపది రజస్వలము ఏకవస్త్రయు భీతయునై యుండగా నామెను నిండుకొలువున కట్లీడ్చిరే! ఆ పతివ్రత విరటు నగరమున మత్స్యపతికి దాసిగ నయ్యెను కదా! ఆమె కీచకునిచేత అవమానింపబడి కురరివలె పలవరించినదిగదా! ఆమె జయద్రథునిచే నపహరింపబడి బిట్టుగ విలపించినదిగదా! ఆమె మరల విక్రమశాలురగు పాండవులచేత విముక్తురాలయ్యెను అక్కటా! పూర్వ జన్మమున నెట్టి ఘోరదురితము లొనర్చి వారిట్టి యిక్కట్టుల పాలయిరో కదా! నా పూర్వజులు మహాయజ్ఞమగు రాజసూయ మొనరించియు నేల యీ కష్టముల పాలయిరో తెలుపుము. పాండవులు దేవాంశజులు గదా! వారి పూర్వకర్మము ననుసరించి ఇట్టి ఘోర దుస్తర దుఃఖములు గల్గుట నాకు సంశయము గలిగించు చున్నది.
కుంతీపుత్రులు సదాచారులుగదా! ఈ జగము నశ్వరమని తెలియును గదా? మఱి వారు భీష్మద్రోణులను మోసముతో నేల చంపిరి? వారు పరమాత్ముడును వాసుదేవుడునగు హరిచే ప్రేరితులై యంతటి ఘోరదురితముల కొడిగట్టిరి. దానిచే చివరకు తమ కులక్షయమును తామే కొనితెచ్చుకొనిరి. ఇట్టు లన్యాయముగ లోభముతో యోధులను చంపుటకన్న బిచ్చమెత్తుకొనుటో నీవారజీవనమో శిల్పజీవనమో శ్రేష్ఠతరము గదా! తొల్లి యీ కురువంశమంతరించ బోవుచుండగ నీవు శత్రునాశకులగు గోలకపుత్రులను బుట్టించి యీ వంశమును నిలువబెట్టితివి. తరువాత కొద్దికాలమునకు ఉత్తరాసుతుడగు నా తండ్రియొక పరమతాపసుని మెడలో పామునేల వేసెనో నాకు వింతగనున్నది. ఓ మునివర! క్షత్రియ కులజుడెవ్వడు గూడ నొక బ్రాహ్మణుని ద్వేషింపడు. అట్లు మౌనముగ తపమొనర్చుకొను మునికి నా తండ్రి యట్లేల చేసెనో కదా! నీవు సర్వజ్ఞుడవు. దయానిధివి. నా యీ సంశయములన్నిటిచే నా మనస్సు వికలమై పరిపరి విధములు కలతజెందుచున్నది. వీనిని వారించి నా మదికి శాంతి చేకూర్చుము.
అధ్యాయము 64 కర్మ ప్రభావము
శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము
ఉత్తమ బ్రాహ్మణుడు విగతరాగుడై శాంతుడైనచో నతడు తప్పక భవబంధముక్తుడగును. ఈ విషయము నరనారాయణులందు తద్విరుద్ధముగ నున్నది. వారు తపమువలన వశ్యాత్ములైరి గద! వారేకర్మమువలన మరల జన్మమొందిరి? ఆ శాంతచిత్తు లెవరి శాపమున క్షత్రియులై పుట్టిరి? ఆ మహర్షులగు బ్రాహ్మణులు క్షత్రియులగుటకు గల కారణము తెలుపుము. విప్రశాపమున యాదవ వంశము నశించెనని వింటిని. గాంధారీ శాపమున కృష్ణుని వంశ మంతరించెనట. శంబరాసురుడు ప్రద్యుమ్ను నేల యపహరించెను? దేవదేవుడును జనార్దనుడునగు వాసుదేవుడుండగా పురిటింటి నుండి పుత్త్రహరణము జరుగట వింతగ నున్నది. శ్రీహరి భవనము దుర్గమమైన ద్వారకా దుర్గము నడుమ నున్నది. అందుండి శంబరాసురుడు ప్రద్యుమ్నుని గొనిపోవుచుండగా శ్రీహరి దివ్య నేత్రములతో నేల కనలేదు? వాసుదేవుని భార్యలు దస్యులచే దోచుకొనబడుటగూర్చి నాకు సందేహముగ నున్నది. ఆ సందియమును నివారింపుము. ఆ దేవదేవుడగు వాసుదేవుడు పరమ పదము జెందిన వెంటనే యట్టి దుస్సంఘటన జరుగుటవలన నా చిత్తమందు సంశయమును కలతయు కల్గుచున్నవి. ఆ హరి భూభార మణచుట కవతరించినవాడును విష్ణు నంశమున బుట్టినవాడును గదా! అట్టివాడు భయముతో మథురారాజ్యము వదలి ఏల ఏగెను? ఆ భూభార మడప నవతరించిన హరి తన సేనతో మిత్రులతో నేల ద్వారావతి కేగెను? దుష్టశిక్షణము శిష్టరక్షణము ధర్మసంస్థాపనము చేయుట కవతరించిన హరి యా చోరుల నేల చంపలేదు? ఆ వాసుదేవుడు సర్వజ్ఞుడు గదా! అతడు తన భార్యలను దస్యులు దోచుకొనుట ఎఱుగడా?
మహామనీషులైన భీష్మద్రోణాదులు భూమికి భారమని కృష్ణుడు వారిని చంపించెనా? ధర్మారాజాదులు శ్రీకృష్ణుని ప్రియభక్తులు సదాచార సంపన్నులు. వారు యజ్ఞరాజమగు రాజసూయమును యథావిధిగ నాచరించిరి గదా! ఆ యజ్ఞమందు దేవాంశజులును వాసుదేవాశ్రితులు నైన పాండవులు బ్రాహ్మణులకు భూరిగ దానదక్షిణ లొసంగిరి గదా! ఐనను వారేల ఘోర దుఃఖముల పాలైరి? వారి పున్నెమంతయు నేమయ్యెను? వారంతగా దుఃఖములు పొందుటకు తామంతగా చేయరాని దోషమేమి చేసిరి? రమాంశమువలన యజ్ఞవేదికలో నవతరించిన ద్రోపది పరమ సాధ్వియు శ్రీకృష్ణ భక్తురాలును గదా! అట్టి ద్రౌపది తలవెండ్రుకలు బట్టి దుశ్శాసనుడు లాగుచుండగ నామె మిక్కిలి దుఃఖించెను ఆమె యేల అట్టి ఘోరదుఃఖములకు గురికావలసి వచ్చెను? ఆ ద్రోపది రజస్వలము ఏకవస్త్రయు భీతయునై యుండగా నామెను నిండుకొలువున కట్లీడ్చిరే! ఆ పతివ్రత విరటు నగరమున మత్స్యపతికి దాసిగ నయ్యెను కదా! ఆమె కీచకునిచేత అవమానింపబడి కురరివలె పలవరించినదిగదా! ఆమె జయద్రథునిచే నపహరింపబడి బిట్టుగ విలపించినదిగదా! ఆమె మరల విక్రమశాలురగు పాండవులచేత విముక్తురాలయ్యెను అక్కటా! పూర్వ జన్మమున నెట్టి ఘోరదురితము లొనర్చి వారిట్టి యిక్కట్టుల పాలయిరో కదా! నా పూర్వజులు మహాయజ్ఞమగు రాజసూయ మొనరించియు నేల యీ కష్టముల పాలయిరో తెలుపుము. పాండవులు దేవాంశజులు గదా! వారి పూర్వకర్మము ననుసరించి ఇట్టి ఘోర దుస్తర దుఃఖములు గల్గుట నాకు సంశయము గలిగించు చున్నది.
కుంతీపుత్రులు సదాచారులుగదా! ఈ జగము నశ్వరమని తెలియును గదా? మఱి వారు భీష్మద్రోణులను మోసముతో నేల చంపిరి? వారు పరమాత్ముడును వాసుదేవుడునగు హరిచే ప్రేరితులై యంతటి ఘోరదురితముల కొడిగట్టిరి. దానిచే చివరకు తమ కులక్షయమును తామే కొనితెచ్చుకొనిరి. ఇట్టు లన్యాయముగ లోభముతో యోధులను చంపుటకన్న బిచ్చమెత్తుకొనుటో నీవారజీవనమో శిల్పజీవనమో శ్రేష్ఠతరము గదా! తొల్లి యీ కురువంశమంతరించ బోవుచుండగ నీవు శత్రునాశకులగు గోలకపుత్రులను బుట్టించి యీ వంశమును నిలువబెట్టితివి. తరువాత కొద్దికాలమునకు ఉత్తరాసుతుడగు నా తండ్రియొక పరమతాపసుని మెడలో పామునేల వేసెనో నాకు వింతగనున్నది. ఓ మునివర! క్షత్రియ కులజుడెవ్వడు గూడ నొక బ్రాహ్మణుని ద్వేషింపడు. అట్లు మౌనముగ తపమొనర్చుకొను మునికి నా తండ్రి యట్లేల చేసెనో కదా! నీవు సర్వజ్ఞుడవు. దయానిధివి. నా యీ సంశయములన్నిటిచే నా మనస్సు వికలమై పరిపరి విధములు కలతజెందుచున్నది. వీనిని వారించి నా మదికి శాంతి చేకూర్చుము.
అధ్యాయము 64 కర్మ ప్రభావము
No comments:
Post a Comment