దేవదానవుల యుద్ధము
జనమేజయు డిట్లనెను : పారాశర్యా! మీరు చెప్పిన మాటలు విని నాకు గొప్ప సందియము గలుగుచున్నది. ఏమన, ఆ నరనారాయణులు వైష్ణవాంశ సంజాతులు - తపోధనులు - శాంతులు - తీర్థాశ్రయులు - సాత్త్వికులు - వన్యఫలాశనులు - సత్యసంగరులు - మహామునులు - ధర్మపుత్త్రులు గదా! అట్టివారు రాగయుక్తు లేలయైరి? శుభము లొనగూర్చు తపము నేల మాని సంగరమునకు గడంగిరి? శాంతి సౌఖ్యప్రదమైన యాత్మానందమును వదలి దివ్య సహస్రవర్షము లెట్టు పోరగలిగిరి? ఆ మునులు ప్రహ్లాదునితో నెట్లుపోరిరి? వారికి పరస్పరము విరోధము గలుగుటకు కారణమేమి? నాకిదంతయును విశద పఱచుము.
సామాన్యముగ కామినీ కాంచనములగూర్చి వైరము గలుగుచుండును. కాని, అట్టి హేతువు లేకయే వీతరాగులై తీవ్రతప మొనర్చు వారికి యుద్ధబుద్ధి యేల కలిగెను? వారు సర్వఫలప్రదమైన అట్టి తపమేల చేసిరి? సుఖభోగములకా? ఇతరులను మోహములో ముంచుటకా? కాక స్వర్గభోగార్థమా? వారు శాంతచిత్తులు గాద! తుదకు వారికెట్టి ఫలము ప్రాప్తించెను? వారి శరీరములు తపముచే కృశించినవి. రణముచే క్షీణించినవి. వారు దివ్య వర్షములు శ్రమ కోర్చి పోరుటచే పీడ నందిరి.
వారు రాజ్యములు కోరికాని ధనముకోరికాని భార్యా పుత్త్రుల గోరికాని సంగర మొనరింప లేదుగదా! మఱి మహాత్ముడగు ప్రహ్లాదునితో కయ్యమునకు కాలు ద్రవ్విరి. నిష్కాముడైన వాడెవ్వడైన శాంతి రహితమైన యుద్ధ మొనర్చునా? వారికి సనాతన ధర్మ తత్త్వము తెలియునుగదా! మఱి వారు మేనులకు దుఃఖకరమైన రణమేల యొనరించిరి? బుద్ధిమంతు డెల్ల వేళల సుఖములు గూర్చు శుభకర్మలే యాచరించును గాని దుఃఖదములగు పనులు చేయడు. ఇది సనాతన ధర్మము.
ధర్మజ్ఞా! ఆ ధర్మపుత్రులు విష్ణ్వంశజులు - సర్వకళాకోవిదులు - సర్వగుణవిభూషితులు. అట్టివారు సుఖైక నిలయము శాంతిఫలప్రదమునైన తపము మాని ధర్మనాశకము దుఃఖకరమునైన కదనమున కేల తలపడిరి?
ఇంతటి దారుణ రణము మూర్ఖుడుగూడ చేయడు. తొల్లి యయాతి భూపతి స్వర్గచ్యుతుడయ్యెనని వింటిని. ఆ పుడమిఱేడు ఘనముగ దానధర్మములు యాగములు నాచరించెను. కాని, దురహంకారమున గల్గిన పాపఫలితముగ దివినుండి భువిపై పడిపోయెను. నేను పెక్కు జన్నము లొనరించితినని యన్నంతమాత్రమున నింద్రు డతనిని పతితునిగ జేసెను. దురహంకృతి లేనిచో పోరు గలుగదని తలతును. పుణ్య వినాశకమైన యుద్ధము వలన గలుగు ఫలిత మేమి? అనగా
ఇంతటి దారుణ రణము మూర్ఖుడుగూడ చేయడు. తొల్లి యయాతి భూపతి స్వర్గచ్యుతుడయ్యెనని వింటిని. ఆ పుడమిఱేడు ఘనముగ దానధర్మములు యాగములు నాచరించెను. కాని, దురహంకారమున గల్గిన పాపఫలితముగ దివినుండి భువిపై పడిపోయెను. నేను పెక్కు జన్నము లొనరించితినని యన్నంతమాత్రమున నింద్రు డతనిని పతితునిగ జేసెను. దురహంకృతి లేనిచో పోరు గలుగదని తలతును. పుణ్య వినాశకమైన యుద్ధము వలన గలుగు ఫలిత మేమి? అనగా
మునివరు డిట్లనెను: రాజా! ఈ సంసారమునకు మూలము మువ్విధములుగ నుండునని పెద్దలందురు. ధర్మనిర్ణేతలు సర్వవిధులునైన మును లీ మాయాకృత సంసారమునకు త్రిగుణముల సమ్మేళనమైన యహంకారము కారణమని పేర్కొందురు. దేహధారియగు ముని యట్టి యహంకారము నెట్లు విడిచి యుండజాలును? కారణము లేక కార్యము ఘటిల్లదు. ఇది తిరుగులేని నిజము.
సత్త్వముచే తపము - దానము - యాగము గల్గును. అహంకారమున రజస్తమస్సుల తీవ్రతచే కలహ ముత్పన్నమగును. ఎంత కొలది పనియైన చెడుగైన ఈ పుడమిపై నహంకారము లేనిదేదియును కలుగదు. అహంకారము మూలముననే యీ విశ్వసృష్టి సంభవించినది. అది లేనిచో జగమే లేదు. బ్రహ్మ-విష్ణువు-శివుడు సైతము అహంకారయుతులే. మఱి ఇతర మునుల విషయము చెప్పనేల?
ఈ సకల చరాచర జగ మహంకారమయమై పరిభ్రమించుచుండును. కర్మము మూలమున మాటి మాటికి పుట్టిగిట్టుటలు సాగుచుండును. దేవ మనుజ తిర్యక్కులు సర్వమును సంసారమందు రథచక్రములవలె నిరంతరాయముగ తిరుగుచుందురు. ఆ శ్రీమన్నారాయణు నవతారముల సంఖ్య నెవడు లెక్కింపగలడు?
అ శ్రీహరి జనార్దనుడు జగన్నాథుడు నగు వాసుదేవుడు యుగయుగములందును ఈ విశాల ప్రపంచమందలి యుత్తమాధమ యోనులందు పెక్కుమారులు జన్మములెత్తి కూర్మ వరాహ వామన నరసింహాద్యవతారములు దాల్చెను.
అ శ్రీహరి జనార్దనుడు జగన్నాథుడు నగు వాసుదేవుడు యుగయుగములందును ఈ విశాల ప్రపంచమందలి యుత్తమాధమ యోనులందు పెక్కుమారులు జన్మములెత్తి కూర్మ వరాహ వామన నరసింహాద్యవతారములు దాల్చెను.
ఇట్లే హరి విధిప్రేరితుడై ప్రతి యుగమునందును లెక్కకు మిక్కిలిగ నవతారము లెత్తుచుండును. ఏడవదియగు వైవస్వత మన్వంతరమందును విష్ణువు పెక్కవతారములు దాల్చెను. ఈ యవతారముల తత్త్వము తెలుపుదును, వినుము :
"తొల్లి భృగు మహర్షి వలన హరి పలుశాపములనుభవించి తత్ఫలితముగ నతడు పెక్కవతారములు దాల్చెను అన విని
రాజిట్లనెను : ఓ మహామతీ! నా యెడదలో మరొక్క సందియము గలుగుచున్నది. భృగుమహర్షి శ్రీ విష్ణువు నేల శపించెను? హరి ముని కేమి యప్రియ మాచరించెను? అమరవందితుడైన శ్రీహరిపై భృగు ఋషి యేల కోపించెను? ఏల శపించెను? అన
వ్యాసుడిట్లనెను : ఆ భృగుశాపమునకు కారణము వచింతును. వినుము :
మున్ను కశ్యపుని దాయాదుడగు హిరణ్య కశిపుడను దానవుడు గలడు. అతడు దానవులంగూడి తలచినపుడెల్ల దేవతలతో పోరుచుండెను. ఇట్టి పోరాటమున జగములు తల్లడమందుచుండెను. అపుడు శ్రీహరి శ్రీనరహరి రూపమున దనుజపతిని దెగటార్చెను. అంత నతని కుమారుడు ప్రహ్లాదుడు దానవరాజయ్యెను. మహావిక్రమి యగు ప్రహ్లాదుడు దేవతలను మిక్కిలిగ బాధించెను. ఇట్లు దేవదానవపతులకు ఘోరసమరము సంఘటిల్లెను. ఇట్లు వారికి నూఱండ్లు యుద్ధము జరిగెను. అందు తుద కమరపతియే గెలుపొందెను.
అంత ప్రహ్లాదుడు వైరాగ్యోపరతుల వలన సనాతన ధర్మమందెఱుకగలిగియుండి తుదకు తన రాజ్యమును విరోచనుని తనయుడగు బలి కప్పగించి తాను తపమాచరింప గంధమాదన గిరి కరిగెను. ఇట బలి రాజై సురలతోడ పగపూనెను.
అంత వారు పరస్పరము ఘోరముగ పోరు సల్పిరి. అం దమిత తేజోవంతుడగు నింద్రుడు రాక్షసుల నోడించెను. ఇంద్రుడు శ్రీ మహావిష్ణుని సాయమున బలిని రాజ్యభ్రష్టు నొనరించెను. ఓడిన దనుజుల శుక్రాచార్యుని శరణుజొచ్చి
అంత వారు పరస్పరము ఘోరముగ పోరు సల్పిరి. అం దమిత తేజోవంతుడగు నింద్రుడు రాక్షసుల నోడించెను. ఇంద్రుడు శ్రీ మహావిష్ణుని సాయమున బలిని రాజ్యభ్రష్టు నొనరించెను. ఓడిన దనుజుల శుక్రాచార్యుని శరణుజొచ్చి
"ఓ మహాభాగా! నీవు తపోబలవంతుడవు. మాకు సాయమొనర్చుము. లేనిచో మేమిట నిలువ నోపము-రసాతల మేగుదుము. సర్వమంత్ర శాస్త్రవేత్తవగు నీవే మాకు సాహాయ్య మొనర్పవలయును" అనిన వారి మాటలకు దయార్ద్ర హృదయుడైన శుక్రాచార్యుడు వారితో నీ రీతిగ బలికెను మీరు భయపడకుడు. నేను నా తేజమున మీకు సాహాయ్య మొనరించి మిమ్ము కాపాడుదును. మీరుత్సాహవంతులై సంతాపరహితులగునట్లు చేయుదును.''
అపుడు దేవతలుగూడ చారుల వలన వృత్తాంతమంతయు నెఱింగిరి. వారింద్రుని గూడి రహస్య మంత్రణములు జరిపిరి. తుదకు వారొక నిర్ణయమునకు వచ్చిరి. ఆ శుక్రుని మంత్ర ప్రభావమున దనుజులు మనలను పదవీభ్రష్టులుగ జేయకమున్నే మనము వారినెదిరింతము. మనము హతశేషులను పాతాళమున కంపుదము అని తలంచి దేవతలు శస్త్రపాణులై రోషాతిరేకమున రాక్షసులపై కురికిరి.
వారు హరిప్రేరితులై హరిసాయమున దనుజుల యుక్కడగింప గడంగిరి. దానవులు బాధితులై భయపీడుతు లైకకావికలైరి. దనుజులు వెంటనే శుక్రుని శరణుజొచ్చి త్రాహిత్రాహి అని మొఱపెట్టుకొనిరి. అపుడు శుక్రుడు దేవపీడితులు - బలరహితులునైన రాక్షసులతో మనకు మంత్రౌషధముల బలముగలదు. భీతిల్లవలదు' అని పలికి వారినూరడించెను. దేవతలెల్లరును శుక్రునిగాంచి యసురులను వదలి వెడలిపోయిరి.
అధ్యాయము 73 శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట
అధ్యాయము 73 శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట
No comments:
Post a Comment