శ్రీదేవీ నవరాత్రవ్రత మాహాత్మ్యము
వ్యాసు డింకను నిట్లనియెను : కన్యకలలో మంచి కులమున బుట్టినదైనను కుష్ఠరోగము గలది - వ్రణములతో గూడినది. దుర్గంధముతో రోగ పుట్టించునది - వికల హీనాంగములు గలది పూజకు దగదు. పుట్టు గ్రుడ్డి మెల్లకన్ను గలది మిక్కిలి రోమములు గలది దీర్ఘ రోగగ్రస్తు రజస్సు మున్నగు యవన చిహ్నములు గలదియగు స్త్రీ పూజాది కర్మలకు బనికి రాదు. కృశాంగి - మిక్కిలి శిశువు - విధవాసంజాత - కన్యకకు బుట్టినది పూజాది సర్వ కర్మలందు బనికిరాదు. ఏ రోగములును లేనిది - యేక వంశసంజాత - వ్రణములు లేనిది - అందకత్తె - సురూప అగు కన్నియగు చక్కగ పూజింపవలయును.
ఎల్ల కార్యములందు బ్రాహ్మణకన్యను భయమునకు రాచకన్నెను లాభమునకు వైశ్య కన్యనుగాని శూద్రకన్యనుగాని పూజింపవలయును. బ్రాహ్మణులు బ్రాహ్మణకన్యను క్షత్రియులు బ్రాహ్మణకన్యను వైశ్యులు త్రివర్ణముల కుమారికలను శూద్రులు చతుర్వర్ణముల కన్నెలను పూజింపవచ్చును. శిల్పులు తమ కొలమున బుట్టిన కన్నెలనే తగినట్లు బూజింపవలయును. ఈ విధముగ నవరాత్ర వ్రతమునందు భక్తి పూర్వకముగ కన్యలను దేవీభావమున బూజింపవలయును. ఈ నవరాత్రములందును నిత్యము నియతితో పూజింప శక్తి జాలనివారొక్క యష్టమినాడైన విశేషించి యెల్లప్పుడును శ్రద్ధాభక్తులతో దేవి నర్చింపవలయును.
ఎందులకనగా, పూర్వము దక్షయాగ విధ్వంస కాలమునందు శ్రీ భద్రకాళి మహాభీకర స్వరూపముతో యోగినీగణ కోటులతో నష్టమినాడే ప్రాదుర్భవించినది. కావున అష్టమినాడు శ్రీ పరమేశ్వరిని నానావిధములగు నుపాహారములతో గంధమాల్యాను లేపనములతో నర్చింపవలయును. పాయసములతోను క్షత్రియాదులు మాంసములతోను బ్రాహ్మణ భోజనములతోను ఫలపుష్ఫోపహారములతోను జగజ్జననిని సంతోష పెట్టవలయును.
ఓ రాజా! నవరాత్రములు పూర్తిగా నుపవసింప జాలనివాడు మూడునాళ్ళు మాత్రముపవసించిన జాలును; నవరాత్రముల ఉపవాస ఫలితమంతయు లభించును.
సప్తమి - అష్టమి - నవమి - యీ మూడు దినము లైకాంతిక భక్తితో శ్రీదేవిని బూజించిన సర్వ ఫలములును సంప్రాప్తమగును. ఈ దేవీ నవరాత్ర వ్రతము దేవీపూజలు హోమములు కుమారికాపూజలు బ్రాహ్మణ సంతర్పణములు వీనితో సంపూర్ణమగును. ఈ భూమండలమందు నితరములగు నానావిధ వ్రతములును దానములును దేవీ నవరాత్ర వ్రతముతో సరిపోలజాలవు. ఈ శ్రీదేవీ నవరాత్ర వ్రతము నిత్యము ధనధాన్యముల నిచ్చును. సుఖ సంతాన వృద్ధికరము. ఆయురారోగ్య ప్రదము, స్వర్గమోక్షదాయకము.
సప్తమి - అష్టమి - నవమి - యీ మూడు దినము లైకాంతిక భక్తితో శ్రీదేవిని బూజించిన సర్వ ఫలములును సంప్రాప్తమగును. ఈ దేవీ నవరాత్ర వ్రతము దేవీపూజలు హోమములు కుమారికాపూజలు బ్రాహ్మణ సంతర్పణములు వీనితో సంపూర్ణమగును. ఈ భూమండలమందు నితరములగు నానావిధ వ్రతములును దానములును దేవీ నవరాత్ర వ్రతముతో సరిపోలజాలవు. ఈ శ్రీదేవీ నవరాత్ర వ్రతము నిత్యము ధనధాన్యముల నిచ్చును. సుఖ సంతాన వృద్ధికరము. ఆయురారోగ్య ప్రదము, స్వర్గమోక్షదాయకము.
విద్యార్థిగాని విత్తార్థిగాని పుత్రార్థిగాని యథావిధిగ మంగళకరమగు సౌభాగ్య సంపత్కరమగు ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరింపవలయును. ఈ వ్రత సాధనము వలన విద్యార్థి సకల విద్యలు పడయును. రాజ్యభ్రష్టుడు మరల రాజ్యము పొందును.
పూర్వజన్మమున దేవీవ్రత మాచరింపనివారు నేడు వ్యాధిగ్రస్తులు దరిద్రులు పుత్రహీనులై పుట్టుదురు. వంధ్య విధవ నిఱుపేదరాలునగు స్త్రీ వెనుకటి జన్మలో దేవీవ్రతము చేయలేదని ఊహించవలయును. ఈ దేవీ నవరాత్ర వ్రతమును భూతలమున చక్కగ నాచరింపనివారు స్వర్గ సుఖవైభవములు పడయజాలరు. రక్త చందన మలందిన సుకుమారములగు మారేడు దళములతో శ్రీ జగన్మాతను బూజించినవాడు తప్పక రాజు గాగలడు. దుఃఖార్తినాశని సిద్ధికరి జగద్వర యగు శివనుగొలువనివాడు భూమిపై దుఃఖ భాజనుడు నిఱుపేద శత్రుయుతుడు గాగలడు. హరిహర హిరణ్య గర్భులు ఇంద్రుడు మిత్రాగ్ని వరుణులు కుబేరుడును సైతము సర్వార్థ సిద్ధుల నంది ముదితాత్ములై యే దేవి నారాధింతురో యా చండికను నరులేల గొల్వరు?
ఎల్లయాగములందును స్వాహా స్వధారూప మంత్రములతో వేల్చగ సర్వదేవతలు పరితృప్తులగుదురు. కావున మునీంద్రులు సంతోషముతో సర్వ యజ్ఞములందును దేనియొక్క ఏ స్వాహాస్వధా రూపమంత్రములను వేదమంత్రాంతమున నుచ్చరించుచు వేల్తురో ఏ దేవియొక్క కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగములు సృజించునో వారి పెక్కవతారము లెత్తి వానిని బ్రోచునో హరుడు లయకాలమున నంతమొందించునో అట్టి యాత్మ శాంతిదాయినియగు జగదంబను నరుడేల భజింపడు!
ఎల్లయాగములందును స్వాహా స్వధారూప మంత్రములతో వేల్చగ సర్వదేవతలు పరితృప్తులగుదురు. కావున మునీంద్రులు సంతోషముతో సర్వ యజ్ఞములందును దేనియొక్క ఏ స్వాహాస్వధా రూపమంత్రములను వేదమంత్రాంతమున నుచ్చరించుచు వేల్తురో ఏ దేవియొక్క కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగములు సృజించునో వారి పెక్కవతారము లెత్తి వానిని బ్రోచునో హరుడు లయకాలమున నంతమొందించునో అట్టి యాత్మ శాంతిదాయినియగు జగదంబను నరుడేల భజింపడు!
ఆదేవీ చైతన్యశక్తి లేనిచో నీ విశ్వభువనము లందలి సుర-నర-దనుజ-గంధర్వ-పక్షి-పన్నగ-పిశాచ వృక్షము లందెవ్వ డైనను కదలుటకును శక్తుడు గాడు. పురుషార్థములు గోరువాడు సకల కామార్థదాయిని - శివ - చండి యగు దేవినేల సంసేవింపడు? మహాపాపియైనను దేవీ నవరాత్ర వ్రత మాచరించినచో నతడు సకల దురితముల నుండి తప్పక ముక్తుడగును.
రాజా! తొల్లి యొక వర్తకుడు దనహీనుడగుటచేత దుఃఖార్తుడగుచు సకుటుంబముగ కోసల దేశమున వసించుచుండెను. అతనికి పెక్కురు సంతానము కలరు. వా రాకటిచే నకనకలాడుచు సాయంకాలమునందు దొరకు నన్నముతో కాలము గడుపుచుండిరి. ఆ కోమటియు ఇతరులకడ పని చేయుచు నాకలితో బాధ పడుచునే ఎటులో కుటుంబమును పోషించు కొనుచు కలవరపాటు మాత్ర మందక కాలము గడుపుచుండెను.
రాజా! తొల్లి యొక వర్తకుడు దనహీనుడగుటచేత దుఃఖార్తుడగుచు సకుటుంబముగ కోసల దేశమున వసించుచుండెను. అతనికి పెక్కురు సంతానము కలరు. వా రాకటిచే నకనకలాడుచు సాయంకాలమునందు దొరకు నన్నముతో కాలము గడుపుచుండిరి. ఆ కోమటియు ఇతరులకడ పని చేయుచు నాకలితో బాధ పడుచునే ఎటులో కుటుంబమును పోషించు కొనుచు కలవరపాటు మాత్ర మందక కాలము గడుపుచుండెను.
అతడు ధర్మనిరతుడు - సదాచార సంపన్నుడు - సత్యధైర్యవంతుడు - శాంతుడు - క్రోధమద రహితుడు. అతడు నిత్యమును దేవతలను బూజించి పితరులను తనిపి యున్నంతలో నతిథుల కన్నమిడి తన కుటుంబమువారు తిన్న పదిప తాను తినుచుండెడివాడు.
ఇట్లు చాలాకాలము గడచుచుండగా ఒకనాడు పేరుచేతను గుణము చేతను సుశీలుడగు నత(వైశ్యు) డాకట మలమల మాడుచు శాంతుడగు నొక ద్విజునితో నిట్లనెను:
ఇట్లు చాలాకాలము గడచుచుండగా ఒకనాడు పేరుచేతను గుణము చేతను సుశీలుడగు నత(వైశ్యు) డాకట మలమల మాడుచు శాంతుడగు నొక ద్విజునితో నిట్లనెను:
"ఓ భూదేవా! మహామతీ! నా యీ దుర్భరమైన దారిద్య్ర బాధ తొలగు నుపాయమును దయతో సెలవిమ్ము. నేను గొప్ప ధనవంతుడను గావలయునన్న ధనాశ నాకు లేదు. నేను తిని నా కుటుంబము కింత పెట్టగలిగినంత యున్న చాలును. నా బిడ్డ లాకటిమంటకు నకనకలాడుచున్నారు. అక్కటా! దానము సేయుటకు గూడ పట్టెడన్నమైనను లేదు గదా!
ఒక బాలుని ఇల్లు వెడలగొట్టితిని. అతడు మోము నిండ కన్నీరు నిండగ నిల్లు వెడలెను. అపుడది చూచి నా నిఱుపేద గుండె కరగి చెఱువైనది. ఒక కన్నె పెండ్లి కెదుగుచున్నది. ఆమె కెప్పుడో పదేండ్లు నిండుటచే కన్యాదాన కాలము దాటుచున్నది. అందువలన దుఃఖించుచున్నాను. విప్రవర్యా! సర్వజ్ఞుడవు. దయామయుడవు. నా కేదేని తపమో జపమో మంత్రమో దానమో వ్రతమో యేదేని నుపాయము చూపింపుము. దానిచే పోష్యవర్గ పోషణము చేసెదను. నీ దయవలన నా కుటుంబము సుఖముండు గాక! అందుకై తెలివి వెల్గుతో విచారించి యేదేని వెల్గుబాట చూపుము.
ఆ కోమటి మాటలు విని సంశితవ్రతు డగు విప్రుడతనికి పరమప్రీతితో నిట్లు పలికెను: "వైశ్యోత్తమా ! శుభకరమైన దేవీ నవరాత్ర వ్రత మాచరింపుము. భగవతీ పూజా హోమములు జరుపుము. దేవికి భక్తితో నైవేద్యము సమర్పింపుము. యథాశక్తిగ దేవీ పూజా జపహోమములు బ్రాహ్మణ భోజనము జరిపింపుము. వేదపారాయణము చేయింపుము. నీ వాంఛితము లెల్ల సఫలము లగును.
ఈ భూమండల మంతటను దీనిని మించిన వ్రతము మరేదియును లేదు. ఈ నవరాత్ర వ్రతము పావనము, సుఖసంతోషప్రదము. ఇది సుఖసంతాన వర్ధకము. జ్ఞాన మోక్షప్రదము. శత్రు నాశకము. మున్ను రాజ్యభ్రష్టుడై సీతా వియోగమున విలవించు శ్రీరాముడు కిష్కింధలో దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. అపుడు సీతా విరహానలమున తపించు రామభద్రుడు యథావిధిగ దేవీ నవరాత్ర వ్రతము చక్కగ నాచరించెను. ఈ వ్రత ప్రభావముననే శ్రీరాముడు జలధిపై సేతువు గట్టి రావణ కుంభకర్ణాదులను దనుమాడెను; మేఘనాథుని వధించి విభీషణుని లంకాపతిగ జేసి పిమ్మట నయోధ్యకేగి నిష్కంటముగ రాజ్య మేలెను.
ఈ భూమండల మంతటను దీనిని మించిన వ్రతము మరేదియును లేదు. ఈ నవరాత్ర వ్రతము పావనము, సుఖసంతోషప్రదము. ఇది సుఖసంతాన వర్ధకము. జ్ఞాన మోక్షప్రదము. శత్రు నాశకము. మున్ను రాజ్యభ్రష్టుడై సీతా వియోగమున విలవించు శ్రీరాముడు కిష్కింధలో దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. అపుడు సీతా విరహానలమున తపించు రామభద్రుడు యథావిధిగ దేవీ నవరాత్ర వ్రతము చక్కగ నాచరించెను. ఈ వ్రత ప్రభావముననే శ్రీరాముడు జలధిపై సేతువు గట్టి రావణ కుంభకర్ణాదులను దనుమాడెను; మేఘనాథుని వధించి విభీషణుని లంకాపతిగ జేసి పిమ్మట నయోధ్యకేగి నిష్కంటముగ రాజ్య మేలెను.
ఈ దేవీ వ్రత మహత్త్వమువలన నమిత విక్రముడగు రఘురాము డమితానందభరితు డయ్యెను. విప్రుని పలుకులు విని వైశ్యు డతనిని తన గురునిగ భావిచి మాయా బీజ (భువనేశ్వరీ) మంత్రము గ్రహించి ఆ మంత్రము నతడు దేవీ నవరాత్రములందు నిశ్చలభక్తితో జపించుచు నానా విధోపహారములతో భక్తితో దేవి నారాధించెను. ఇట్లతడు తొమ్మిదేండ్లు మాయా బీజ జప పరాయణుడై యుండి తొమ్మిదవ యేడు చివర నొక మహాష్టమినాడు శ్రీమహేశ్వరి యతనికి నడురేయి ప్రత్యక్షమై నానా వరము లొసగి యతనిని ధన్యుని జేసెను అని శ్రీవ్యాసముని జనమేజయునకు తెలిపెను.
అధ్యాయము 60 శ్రీసీతారామ చరిత్ర
అధ్యాయము 60 శ్రీసీతారామ చరిత్ర
No comments:
Post a Comment