Tuesday, April 14, 2026

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికొలువై ఉన్న దేవాలయమిది. పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం, తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. అలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారం గా పరిగణించబడుతుంది.

దేశంలోని 18 శక్తి పీఠాలలో జోగులంబ దేవిని 5 వ శక్తి పీఠంగా పరిగణిస్తారు. ఇక్కడ జోగులంబ దేవత శవాలపై తేలు, కప్ప మరియు తలపై బల్లితో కూర్చుని కనిపిస్తుంది. ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతారంలో కనిపిస్తుంది, యోగ విద్య లో సిద్ధిని ఇచ్చే ఉగ్ర దేవత యొక్క అవతారం, అందుకే జోగులంబ అని పిలుస్తారు.

జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు.

ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పాలించాయి. ఆరవ శతాబ్దంలో గొప్ప రస సిద్ధి కలిగిన రాసా అనే సాధువు ఈ నవ బ్రహ్మ ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్తారు. ఈయన చాళుక్య రాజు పులకేసి II కి గురుతుల్యుడు.

ఈ ఆలయం చాళుక్య కళ మరియు సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తుంది. తుంగభద్ర మరియు కృష్ణ ఆలంపూర్ సమీపంలో సంగమం ప్రదేశం. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు.

ఆలంపూర్ లో ఏడవ-ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి తొమ్మిది ప్రత్యేకంగా నవబ్రహ్మ దేవాలయాల కూడి ఈ జోగులాంబ దేవాలయం ఉంది.

పురాణాల ప్రకారం, శివుని యొక్క తొమ్మిది పేర్లు వాస్తవానికి రాసా సిద్ధ యోగి నిర్ణయించిన పేర్లు అని చెప్తారు.

అవి 

1. తారక బ్రహ్మేశ్వరాలయం

2. స్వర్గ బ్రహ్మేశ్వరాలయం

3. పద్మ బ్రహ్మేశ్వరాలయం

4. బాల బ్రహ్మేశ్వరాలయం (ప్రధాన ఆలయం)

5. గరుడ బ్రహ్మేశ్వరాలయం

6. కుమార బ్రహ్మేశ్వరాలయం

7. అర్క బ్రహ్మేశ్వరాలయం

8. వీర బ్రహ్మేశ్వరాలయం

9. విశ్వ బ్రహ్మేశ్వరాలయం

వీటిని సాధారణ దేవతా నామాలతో నిర్ణయించారు అని అనుకుంటారు. కానీ లోతుగా పరిశీలించి చూస్తే ఇవి గొప్ప ఓషద నామాలు.

నేటి అలంపూర్‌లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ ఘోర తపస్సు చేశాడని చెబుతారు, అంతేకాక శివుడు సృష్టి కోసం శక్తులను ప్రసాదించినట్టు చెప్తారు. అందువల్ల, ఇక్కడి శివలింగాలను బ్రహ్మేశ్వర లింగాలని అని పిలుస్తారు. 

అంతేకాక ఇక్కడి శక్తి అవతారాన్ని యోగిని లేదా జోగులంబ అని పిలుస్తారు, ఇది మాత పార్వతి యొక్క నామాలలో ఒకటి.

ఆలయ చరిత్ర మరియు ప్రత్యేకత: ఆలయంలో జగద్గురు శాంబికా దేవి లేదా జోగులాంబా అమ్మవారు ప్రధాన దేవతగా ఉన్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క పై దంతాలు ఇక్కడ పడ్డాయని చెప్పబడింది.

సతీదేవికి చెందిన 
పై దంతాలు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం చెప్పబడుతోంది. ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. 

విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. 

ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి, దాచిపెట్టారు. 

అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.

ఈ ఆలయం సమీపంలో నవబ్రహ్మ ఆలయాలు అనే 9 శివాలయాల సముదాయం కూడా ప్రసిద్ధి పొందింది – చాళుక్యుల కాలానికి చెందినవి.

ప్రత్యేకతలు: ఈ స్థలంలో శివ శక్తులు ఒకే ప్రాంగణంలో ఉంటారు – జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వరులు.

ఋణ విమోచనం, శత్రు నివారణ, ఆర్థిక ప్రగతి కోసం జోగులాంబ అమ్మవారిని భక్తులు పూజిస్తారు.

హైదరాబాద్-బెంగళూరు హైవేపై హైదరాబాదుకు దక్షిణాన 200 కి.మీ. దూరంలో ఈ దేవాలయం ఉంది.

రోడ్డు మార్గం: అలంపూర్, హైదరాబాద్ నుండి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు హైదరాబాద్-బెంగళూరు హైవే ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం: అలంపూర్ రోడ్డు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్.

వాయు మార్గం: RGIA- హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇది దాదాపు 200 కి.మీ.

తెలంగాణ టూరిజం: ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని 18 శక్తి పీఠాలలో ఒక‌టైన జోగులాంబ ఆల‌యంతో పాటు బీచ్ పల్లి ఆలయాలను కూడా వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీ వీకెండ్‌లో భాగంగా తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది. ఈ ప్ర‌యాణం హైదరాబాద్ నుంచి మొద‌ల‌వుతుంది.

తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్యాకేజీ ఒకే ఒక్క రోజులోనే ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు ప్రారంభ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత ఉదయం 11. 30 గంటలకు ద‌క్షిణ తెలంగాణ‌లో ప్ర‌సిద్ధిచెందిన హ‌నుమంతుని ఆల‌యం బీచ్ పల్లికి చేరుకుంటారు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే ఉన్న కృష్ణా నదిలో స్నానాలు ఆచ‌రించి ఆంజ‌నేయ స్వామి ద‌ర్శ‌నానికి బ‌య‌లుదేరుతారు. ఇక ఈ ప్రాంతంలో ప్రతి ప‌న్నెండు సంవత్సరాలకు ఒక‌సారి కృష్ణానది పుష్కరాలు జ‌రుగుతాయి. ఈ పుష్క‌రాల‌ను ఎంతో వైభ‌వంగా నిర్వహిస్తారు. కృష్ణానదిపై వంతెన దాటుతున్నప్పుడు ఇక్క‌డి ప్రకృతి అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంతగానో ఆక‌ర్షిస్తాయి.

ఆ త‌ర్వాత మధ్యాహ్నం 1 గంటలకు దేశంలోని 18 శక్తిపీఠాల‌లో ఒక‌టైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ద‌ర్శ‌నం ఉంటుంది. అనంత‌రం స్థానికంగా ఉన్న పలు ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను వీక్షిస్తారు. ఆ త‌ర్వాత హారిత హోటల్ లో మ‌ధ్యాహ్న భోజ‌నం ఉంటుంది. ఇక‌, సాయంత్రం కూడా ఇక్కడే స్నాక్స్ ఇస్తారు. 04.30 PM నిమిషాల‌కు అలంపూర్ నుంచి హైదరాబాద్ కు తిరగు ప్ర‌యాణ‌మ‌వుతారు. రాత్రి 08.00 PM గంటల స‌మ‌యంలో హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టిక్కెట్ ధ‌ర‌లు: తెలంగాణ అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా టిక్కెట్ ధ‌ర‌ల‌ను ఒకసారి ప‌రిశీలిస్తే పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. అదే పిల్లలకయితే రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ - జోగులాంబ - బీచ్ పల్లి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాల‌నుకునేవారు లేదా ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/
 ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం

నిత్య స్తోత్రావళి

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...