గోపకాంతలు తాను చేసిన పనులన్నీ తల్లితో చెప్పేసరికి భయపడిన చిన్ని కృష్ణుడు ఏమీ ఎరుగనట్లు ఎంతో శాంతమూర్తిలా సత్ప్రవర్తనతో సాధువులా, అమాయకునిలా, తనపై చెప్పినవన్నీ అసత్యాలన్నట్లు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడైనవాడిలా, మొహం పెట్టి, కేవలం తల్లిని తప్ప మరేవిధమైన విషయం తెలియనివాడిలా అమ్మవక్షఃస్థలం పై తలపెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు.
ఒక రోజు బలరాముడు, మరికొంతమంది గోపబాలురు కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పగా ఆమె కృష్ణుని చెయ్యిపట్టుకొని ఇలా అంటోంది.
యశోద కృష్ణుణ్ణి చేరదీసి, "నాన్నా! మన్నెందుకురా తింటావు? నే చెప్పినవన్నీ ఎందుకు పాటించవు? మీ అన్నయ్య, మీ చెలికాండ్రు వచ్చి నువ్వు మన్ను తిన్నావని చెప్పారు. మన్నెందుకురా తినడం! తినడానికి మనింట వేరే వస్తువులు లేవా?" అంటూ అడిగింది.
ఎంతో అమాయకంగా ఓ సామాన్యస్త్రీలా, మన్నెందుకు తిన్నావని అడిగిన తల్లి అయిన యశోదతో నేర్పరితనంలో ఎంతో దిట్ట అయిన కృష్ణుడు ఇలా అంటున్నాడు.
అమ్మా! మన్ను తినడానికి నేనేమైనా పసివాడినా? మరి నేనేమైనా ఆకలితో వున్నానా? లేదా తెలివిలేనివాడనా? అన్నయ్య, ఈ గోపబాలురు నీతో చెప్పిన ఈ మాటలను నమ్మకమ్మా! నన్ను నీవు కొట్టాలని వాళ్లలా చెప్పారు. ఒకవేళనా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడమ్మా! అప్పుడు నేననింది తప్పైతే తప్పకుండా శిక్షించవచ్చు.
పయి రీతిని అమ్మతో అని, ఆమెకు తనపై ప్రేమ పుట్టేలా మెల్లగా తల్లిని తానన్నమాట నిజమని నమ్మేలా చేసి, సామాన్య మనిషిలా కాకుండా, లోక కల్యాణార్థం విలాసంగా, చిన్ని కృష్ణుడుగా పుట్టిన ఆ కృష్ణపరమాత్మ తల్లికి తన నోరు తెరచి ముఖాన్ని చూపగానే
తల్లితో తననోరు చూడమని చెప్పగా చూసిన యశోద ఆ బాలకృష్ణుని నోట్లో కొండలు, అడవులు, భూగోళం, అగ్ని సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు ఇలా అన్నింటికి ఆధారమైన ఒక బరణి పెట్టెలావుండే బ్రహ్మాండ స్పరూపాన్నంతా దర్శించింది.
చిన్నికృష్ణుని నోట్లో బ్రహ్మాండాన్ని చూచిన యశోద పరిపరివిధాల ఆలోచనలకు గురి అయింది. నేనేమైనా కలగన్నానా? లేదా ఇది విష్ణమాయా? మరి ఇందులో వేరే సంకల్పాలవల్ల ఏర్పడిన విషయమైందేదైనా ఉందా? నిజమేనా? ఇదీ అని ఊహించలేక పోతున్నాను. అసలు నేను యశోదనేనా? ఇది మేమున్న ప్రదేశంకాక వేరే చోటా? ఈ పసిబాలుడెంతటివాడు? ఇతనిముఖంలో కన్పించి, ప్రకాశిస్తున్న బ్రహ్మాండం ఉండడానికి కారణం ఏమో ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యంగా ఉంది.
సామాన్యమైన గోపబాలుడుగా లీలారూపంలో ఉండే ఇతనిముఖంలో సమస్త చరాచర ప్రపంచం ఎలా ఇమిడి ఉంటుంది? కాబట్టి ఇతడు పసివాడులా కనబడుతున్నాడు కానీ విశాల విశ్వాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్న పురాణ పురుషుడైన విష్ణుమూర్తి అయి ఉంటాడు. ఇదే వాస్తవం!
ఏ మహిమగలవానిచే ఈ విశాలవిశ్వం కన్నించి, నా బుద్ధి భ్రమించిందో అట్టి సకల లోకాధారుడైన, మహా మహిమాన్వితుడైన, విశ్వవ్యాపకుడైన, ఆ విష్ణుమూర్తినే నా బాధలన్నీ పోవడానికి ఆశ్రయిస్తాను, సేవిస్తాను.
నేనూ, నాతో పాటు నా పెనిమిటి, ఆవులు, గొల్లపల్లె, గోపాలకులు అందరూ ఈ చిన్న బాలుని అందమైన ముఖాన్ని చూస్తూ, అసలు విషయం తెలుసుకోలేక మోహంలో పడ్డాము కానీ మాకు ఇతడే ప్రభువు!
అలా యశోద యథార్థం గుర్తించి, చిన్నికృష్ణుణ్ణి జగన్నాటక సూత్రధారియెన శ్రీ మహావిష్ణువుగా ఎప్పుడైతే భావించిందో, అందులోంచి ఆమెను మళ్లీ సామాన్యలోకంలోకి మళ్ళించడానికి మళ్లీ వైష్ణవమాయను ప్రసరింపజేయగా
పరీక్షిన్మహారాజా! యశోద జడత్వం పొంది, జ్ఞానం కోల్పోయి విశ్వాధారుడు అతడని చెప్పక, ఆ కృష్ణుణ్ణి తన చిన్న కొడుకే అంటూ తొడపై కూర్చోపెట్టుకొని, ఎంతో కుతూహలంతో ముద్దులాడింది.
అని చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.
నిత్యానందాన్ని అనుభవించే శుకమహర్షీ! విశ్వాధారుడైన ఈ విష్ణుమూర్తికి తన చనుబాలిచ్చే తల్లిగా యశోద ఎలాంటి పుణ్యవ్రతాలు ఆచరించిందో! అలాగే ఆ కృష్ణుణ్ణి పోషించి పెద్దజేసేతండ్రిగా ఈ నందుడు ఏ తపస్సు చేశాడో!
ఓ మహర్షీ! లోకంలో ఆ విష్ణుభక్తితో శ్రీహరిపై కవులు కావ్యరచనలు చేసి, మోక్షలక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతారట! మరి అట్టి శ్రీహరిని పోషించే తల్లిదండ్రులుగావున్న ఈ యశోదానందులకు ఇంకెంతటి మహోన్నత స్థితి కలుగుతుందో కదా?
ఎంతో అమాయకంగా ఓ సామాన్యస్త్రీలా, మన్నెందుకు తిన్నావని అడిగిన తల్లి అయిన యశోదతో నేర్పరితనంలో ఎంతో దిట్ట అయిన కృష్ణుడు ఇలా అంటున్నాడు.
అమ్మా! మన్ను తినడానికి నేనేమైనా పసివాడినా? మరి నేనేమైనా ఆకలితో వున్నానా? లేదా తెలివిలేనివాడనా? అన్నయ్య, ఈ గోపబాలురు నీతో చెప్పిన ఈ మాటలను నమ్మకమ్మా! నన్ను నీవు కొట్టాలని వాళ్లలా చెప్పారు. ఒకవేళనా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడమ్మా! అప్పుడు నేననింది తప్పైతే తప్పకుండా శిక్షించవచ్చు.
పయి రీతిని అమ్మతో అని, ఆమెకు తనపై ప్రేమ పుట్టేలా మెల్లగా తల్లిని తానన్నమాట నిజమని నమ్మేలా చేసి, సామాన్య మనిషిలా కాకుండా, లోక కల్యాణార్థం విలాసంగా, చిన్ని కృష్ణుడుగా పుట్టిన ఆ కృష్ణపరమాత్మ తల్లికి తన నోరు తెరచి ముఖాన్ని చూపగానే
తల్లితో తననోరు చూడమని చెప్పగా చూసిన యశోద ఆ బాలకృష్ణుని నోట్లో కొండలు, అడవులు, భూగోళం, అగ్ని సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు ఇలా అన్నింటికి ఆధారమైన ఒక బరణి పెట్టెలావుండే బ్రహ్మాండ స్పరూపాన్నంతా దర్శించింది.
చిన్నికృష్ణుని నోట్లో బ్రహ్మాండాన్ని చూచిన యశోద పరిపరివిధాల ఆలోచనలకు గురి అయింది. నేనేమైనా కలగన్నానా? లేదా ఇది విష్ణమాయా? మరి ఇందులో వేరే సంకల్పాలవల్ల ఏర్పడిన విషయమైందేదైనా ఉందా? నిజమేనా? ఇదీ అని ఊహించలేక పోతున్నాను. అసలు నేను యశోదనేనా? ఇది మేమున్న ప్రదేశంకాక వేరే చోటా? ఈ పసిబాలుడెంతటివాడు? ఇతనిముఖంలో కన్పించి, ప్రకాశిస్తున్న బ్రహ్మాండం ఉండడానికి కారణం ఏమో ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యంగా ఉంది.
సామాన్యమైన గోపబాలుడుగా లీలారూపంలో ఉండే ఇతనిముఖంలో సమస్త చరాచర ప్రపంచం ఎలా ఇమిడి ఉంటుంది? కాబట్టి ఇతడు పసివాడులా కనబడుతున్నాడు కానీ విశాల విశ్వాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్న పురాణ పురుషుడైన విష్ణుమూర్తి అయి ఉంటాడు. ఇదే వాస్తవం!
ఏ మహిమగలవానిచే ఈ విశాలవిశ్వం కన్నించి, నా బుద్ధి భ్రమించిందో అట్టి సకల లోకాధారుడైన, మహా మహిమాన్వితుడైన, విశ్వవ్యాపకుడైన, ఆ విష్ణుమూర్తినే నా బాధలన్నీ పోవడానికి ఆశ్రయిస్తాను, సేవిస్తాను.
నేనూ, నాతో పాటు నా పెనిమిటి, ఆవులు, గొల్లపల్లె, గోపాలకులు అందరూ ఈ చిన్న బాలుని అందమైన ముఖాన్ని చూస్తూ, అసలు విషయం తెలుసుకోలేక మోహంలో పడ్డాము కానీ మాకు ఇతడే ప్రభువు!
అలా యశోద యథార్థం గుర్తించి, చిన్నికృష్ణుణ్ణి జగన్నాటక సూత్రధారియెన శ్రీ మహావిష్ణువుగా ఎప్పుడైతే భావించిందో, అందులోంచి ఆమెను మళ్లీ సామాన్యలోకంలోకి మళ్ళించడానికి మళ్లీ వైష్ణవమాయను ప్రసరింపజేయగా
పరీక్షిన్మహారాజా! యశోద జడత్వం పొంది, జ్ఞానం కోల్పోయి విశ్వాధారుడు అతడని చెప్పక, ఆ కృష్ణుణ్ణి తన చిన్న కొడుకే అంటూ తొడపై కూర్చోపెట్టుకొని, ఎంతో కుతూహలంతో ముద్దులాడింది.
అని చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.
నిత్యానందాన్ని అనుభవించే శుకమహర్షీ! విశ్వాధారుడైన ఈ విష్ణుమూర్తికి తన చనుబాలిచ్చే తల్లిగా యశోద ఎలాంటి పుణ్యవ్రతాలు ఆచరించిందో! అలాగే ఆ కృష్ణుణ్ణి పోషించి పెద్దజేసేతండ్రిగా ఈ నందుడు ఏ తపస్సు చేశాడో!
ఓ మహర్షీ! లోకంలో ఆ విష్ణుభక్తితో శ్రీహరిపై కవులు కావ్యరచనలు చేసి, మోక్షలక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతారట! మరి అట్టి శ్రీహరిని పోషించే తల్లిదండ్రులుగావున్న ఈ యశోదానందులకు ఇంకెంతటి మహోన్నత స్థితి కలుగుతుందో కదా?
No comments:
Post a Comment