ఓ పరీక్షిన్మహారాజా! అష్టవసువులలో ముఖ్యుడైనవాడు ద్రోణుడు, అతని భార్య ధర. బ్రహ్మ వారిద్దరినీ భూలోకంలో జన్మించండి అంటే వారు బ్రహ్మతో మాకు భూలోకంలో విష్ణుభక్తితో శ్రీహరిని సేవించేలా అనుగ్రహిస్తేనే మేము భూలోకంలో పుడతాం అనగానే అలాగే అవుతుంది అని బ్రహ్మ చెప్పగా వారిద్దరూ నందయశోదలుగా జన్మించారు. విష్ణుమూర్తి బ్రహ్మామాట ప్రకారం గోకులంలో యశోదానందులను తల్లిదండ్రులుగా గౌరవిస్తూవుంటే, వారిద్దరూ ఎంతో ఆనందంతో ఒప్పారు - అని శుకమహర్షి యశోదానందుల పూర్వజన్మవృత్తాంతాన్ని పరీక్షిత్తుకు తెలియజేశాడు.
కృష్ణునినోటిలో విశ్వాన్ని చూచి ఆశ్చర్యపడి, కృష్ణుని మాయచే మరల సామాన్యయశోద రూపంలోనికి వచ్చిన యశోద ఒకనాడు తనఇంటివద్దగల యువతులందరూ వాళ్లకు నిర్దేశించిన పనులకు వెళ్ళిపోగా, వెంటనే పెరుగు చిలకాలనే భావంతో ఒక పెరుగు కుండను కుదురుగా వుంచి, అందులో మెరిసిపోయే మీగడ పెరుగును పోసి, పెరుగు చిలికేలా కవ్వాన్ని ఆ స్తంభానికి తాడుతో బిగించింది.
No comments:
Post a Comment