Saturday, April 4, 2026

killing of Vatsasura and Bakasura - వత్పాసుర బకాసురులవధ

వత్పాసుర బకాసురులవధ

అలా దూడరూపంలో వచ్చిన రాక్షసుడు మిగిలినమందలోని దూడల మెడలు నాకుతూ దూడల్లో కెల్లా ఇదే మంచి దూడ అనుకునేలా కనబడుతూ, భక్తజనాలవెంట దూడై సంచరించే శ్రీకృష్ణుని ఎదుట దూడగా తిరిగాడు.

శ్రీకృష్ణుడు దూడరూపంలో వచ్చినవాణ్ణి రాక్షసుడుగా గుర్తించి బలరామునికి ఆ విషయం చెప్పి,

శ్రీకృష్ణుడు - దూడరూపంగా వత్సాసురుడు వచ్చాడని బలరామునితో చెప్పాడు. గోపబాలురతో చూడండి ఇదొక మంచిదూడ, ఎంతోబాగుంది అంటూ దానికాళ్ళు తోక పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఒక్క దెబ్బకొట్టి, కదిలిపోయేలా వెలగచెట్టుకు కొట్టి, గోపబాలురు కోయంటూ కేకలు వేస్తుండగా అవలీలగా ఆ వత్సాసురుణ్ణి చంపాడు.

శ్రీకృష్ణు డెప్పుడైతే దాని కాళ్ళు, తోక పట్టుకొని గట్టిగా వెలగచెట్టుకు వేసి కొట్టాడో ఆ దెబ్బతో వత్సాసురుడు ఆ చెట్టుతో సహా నేలమీద కూలిపోయేడు. ఆ సమయంలో

రాక్షసుడు చనిపోవడంతో, కంబళ్ళు ఎగురవేసుకుంటూ, చెంగున ఎగురుతూ, చప్పట్లు కొడుతూ, పొంగిపోతూ శ్రీకృష్ణుణ్ణి పొగడుతూ, చచ్చిన రాక్షసుణ్ణి చూస్తూ గోపకుమారులు గెంతులు వేశారు.

ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు. ఈ విధంగా

ఓ పరీక్షిన్మహారాజా! భక్తుల విషయంలో ఎంతో వాత్సల్యంగల శ్రీకృష్ణుడు, లోకంలో ఎల్లజనులను ఆవు దూడలను కాపాడేలా కాపాడుతూ, దూడలను మేపుకుంటూ, దూడరూపంలో వచ్చిన వత్సాసురుని సంహరించాడు.

వత్సాసురుణ్ణి సంహరించిన తరువాత, ఒకనాడు పొద్దున్నే గొల్లబాలురు దూడలతో అడవికి వెళ్లారు. ఎండ తీవ్రం కావడంతో దాహం ఎక్కువయింది. దాహంతో నీరసించిన తమతమ దూడలను విడివిడిగా నిలిపి, నిర్మలమైన ఒక సరస్సులోని నీటిని తాగించారు. వారుకూడా దాహం తీర్చుకొని వస్తుండగా అక్కడ

ఆ గోపబాలురు ఒక తెల్లకొంగను చూశారు. అదెలా ఉందంటే పదునైన అంచులుగల వజ్రాయుధంతో కొట్టిన వెండికొండ శిఖరమో అన్నట్లుంది. పెద్దగా భయంకలిగించే కళ్ళతో కృష్ణుణ్ణి హింసించే ప్రయత్నంతో ఉన్నట్లుంది.

ఆ కొంగను చూశారు. ఎంతో పొడవైన దాని శరీరాన్ని చూచి, ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండగా

మునీశ్వరు లెలాగైతే పనులన్నీ విడిచి, ధ్యానమార్గమందే మనసుంచి, ఇతరమైన కోరికలులేకుండా, భగవంతునిమీదే దృష్టితో ఉంటారో, అలాగే బకాసురుడుకూడా ఇంకే పనీ ఆలోచించకుండా, కృష్ణుణ్ణి హింసించే దృష్టితో మరో అభిమానం లేక, నీటి ఒడ్డున నిలిచి, పద్మదళాయతనేత్రుడైన శ్రీకృష్ణునిమీదే చూపుంచి ఒక తాపసివలె ఉన్నాడు.

పై రీతిని తపస్విగా నిలిచి పొంచి ఉన్నవాడై సమయంకోసం కనిపెట్టుకొని

బకాసురుడు ఒకసారి ముక్కును సరిచేసి, రెక్కలు విప్పి, కాళ్ళెత్తి నేలపైనుండి శరీరాన్ని కుదిపి, ఆకాశంమీదికి ఎగిరాడు. భయంకరంగా ధ్వనిచేస్తూ నోరువిప్పి, తన రెక్కల గాలికి చెట్లు విరిగి వరుసగా నేలకూలగా, ఏ పనైనా ఓర్మితో భరించే ఆ చిన్ని కృష్ణుణ్ణి లాగిపట్టి మింగేశాడు.

రాజా! లోకాలన్నింటినీ ఒకటిగా చేర్చి, వాటిల్ని లయంచేస్తూ, సృష్టిస్తూ, బాహ్యంగా సంచరించేలా చేస్తూ సంతోషించే లీలావిలాసరూపుడైన శ్రీకృష్ణపరమాత్మ ముందు ఏం జరుగుతుందో ఊహించి అలా బకాసురునిచేత మింగబడ్డాడు.

ఆ విధంగా బకాసురుడు కృష్ణుణ్ణి మింగేసరికి, బలరామునితోపాటు ఆ గోపబాలురంతా కృష్ణుణ్ణి కానకపోవడంతో ఒక్కసారిగా చేష్టలులేనివారై, జీవంలేని ఇంద్రియాలవలె నిశ్చేష్టులయ్యారు.

కృష్ణుణ్ణి బకాసురుడు మింగాడు. అయినా కృష్ణుడు బకుని కడుపులోకి వెళ్లకుండా

బకుడు కృష్ణుణ్ణి మింగేసరికి అతని అంగిలి దవడలు అటూ ఇటూ మెదుపుతూ ప్రళయకాలంలో అగ్నిలా శ్రీకృష్ణుడు మొక్కవోని పరాక్రమంతో తీవ్రతాపాన్ని కలుగజేస్తూవుంటే అలా విజయం పొందాలనుకుంటున్న బ్రహ్మకే తండ్రియైన అణిమాదిమహిమలతో నిండియున్న ఆ బాలకృష్ణుణ్ణి మింగడం సాధ్యంకాదని తలచి, కృష్ణుణ్ణి నిందిస్తూ లోకాన్ని సుఖమయం చేసేలా బకుడు కృష్ణుణ్ణి బయటికి కక్కాడు.

గొంతుకలో ఉన్న కృష్ణుణ్ణి భరించలేక బయటికి కక్కి పెద్దగా అరుస్తూ కృష్ణుణ్ణి ముక్కుతో పొడుద్దామని వస్తున్న ఆ కొక్కెర రక్కసియొక్క ముక్కుపుటాలు రెండూ ముడుచుకొనేట్లుగా పట్టుకొని, కృష్ణుడు గడ్దిపోచను నిలువునా చీల్చినట్లు తనపై కయ్యానికి కాలు దువ్వేలా వస్తున్న ఆ రక్కసుణ్ణి రెండుగా చీల్చివేశాడు.

ఇలా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు బకాసురుణ్ణి చీల్చి చంపాడో, అప్పుడు దేవతలు కృష్ణునిమీద పంక్తులు పంక్తులుగా నందన వనంలోని మల్లెలు మొదలగు పూలవానలు కురిపించారు. దేవ దుందుభులు మ్రోగాయి. బకాసురుడు కృష్ణుని మింగడం చూచి, ప్రాణంలేని ఇంద్రియాలతో అచేతనులైపోయిన బలరామాదులు మళ్ళీ జీవం నిండిన ఇంద్రియాలతో కృష్ణుణ్ణి దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. అందరూ దూడలగుంపులు తోలుకుంటూ తిన్నని నడకలు నడుస్తూ బృందావనానికి వచ్చి, అక్కడి గోపకులకు, గొల్లస్త్రీలకు అందరికీ విషయమంతా చెప్పగా, విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.

ఆ గోపాలురు గోపకాంతలు ఇలా అనుకుంటున్నారు. ఈ చిన్నికృష్ణునికి ఆపదల మీద ఆపదలు వచ్చిపడి తప్పుతున్నాయి. ఈ బాలుడిపై వరుసగా పడ్డ దుర్జనులందరూ అగ్నిమీదకి వెళ్ళి మాడి రాలిన మిడతల్లా భూమ్మీద పడిపోతున్నారు.

ఇలా వారంతా అన్నారు. ఆ పై రామకృష్ణులు దూడలను మేపుకుంటూ ఉన్న సమయంలో

మనం వానరుల్లా సముద్రానికి సేతువు కడదామా అంటూ అక్కడున్న కాలువలపై అడ్డకట్టలు కడతారు. మునీశ్వరుల్లా తపస్సు చేసుకుందామా అంటూ, మాటలు మాని, మౌనుల్లా ఉంటారు. గానం చేసే గంధర్వుల్లా మనంకూడా పాడుదామా అంటూ పాడడం ప్రారంభిస్తారు. అచ్చరకాంతల్లా మనంకూడా నృత్యం చేద్దామా అంటూ ఆడవేషం ధరించి నర్తిస్తారు. దేవతలు, రాక్షసులు ఎలాగైతే సముద్రాన్ని చిలికారో మనమూ అలాచేద్దాం అంటూ తమ ఈడుగల గోపబాలురంతా కలిసిరాగా ఎంతో అందంగా తమ చేతులనే కర్రలుగా భావించి, అక్కడిసరస్సులను చిలుకుతారు.

శ్రీకృష్ణుడు గోపకులతో బంతి చల్దులు గుడువ వనమున కేగుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను...